వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవడం, వారాల వ్యవధిలో కొత్త సినిమాలు రిలీజ్ చేసేయడం మంచిదే. కానీ వాటిలో ఒక్కటైనా సూపర్ హిట్ పడితేనే కదా వాల్యూ ఉండేది. ఈ విషయం నారావారబ్బాయి రోహిత్ కు ఇంకా అర్ధం కాలేదు. వరసగా తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే సినిమాల్ని రిలీజ్ చేశాడు. కానీ ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా నారా రోహిత్ ఫిజిక్, ఆడియన్స్ ను ఇబ్బంది పెడుతోంది. పూర్తిగా డ్యాన్స్ స్టెప్ ను కంప్లీట్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న రోహిత్, వరస సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి, తన అప్పియరెన్స్ మీద దృష్టి పెడితే బాగుంటుందనేది సినీజనాల ఒపీనియన్. ఇలా వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవడం వలన, సినిమాల సంఖ్య పెరుగుతుంది తప్ప, వేరే ఎటువంటి లాభమూ ఉండదు. ఇప్పటికే మూడు రిలీజ్ చేసేసిన రోహిత్ జ్యో అచ్యుతానంద, కథలో రాజకుమారి, అప్పట్లో ఒకడుండేవాడు, పండగలా వచ్చాడు అంటూ మరో నాలుగు సినిమాలతో త్వరలోనే మళ్లీ బాక్సాఫీస్ పై దాడి చేయబోతున్నాడు. కానీ తన ఇంప్రూవ్ మెంట్ లేని పెర్ఫామెన్స్ తో, హడావిడిగా తెరకెక్కించేసిన సినిమాలతో, రోహిత్ ఏ మేరకు సక్సెస్ కొడతాడనేది ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా కాస్త గ్యాప్ ఇచ్చి కథ, కథనాలు, బాడీ ఫిజిక్ పై దృష్టి పెడితే బాగుంటుందనేది సినీజనాల అభిప్రాయం.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నారావారబ్బాయి హిట్టు మీద దృష్టి పెడతాడా..?
Apr 30, 2016 11:52AM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com






