ENGLISH | TELUGU  

హీరోయిన్ ప్రైవేట్ ఫొటోలు బట్టబయలు.. కేసు నమోదు

on Jul 25, 2017

నటి భావన గొడవ మలయాళ చిత్ర పరిశ్రమలో భూకంపం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ అల్లరి సద్దుమణగకుండానే... మలయాళ పరిశ్రమలో మరో గొడవ రాజుకుంది. మలయాళ నటి మైథిలీ బాలచంద్రన్ కు సంబంధించిన ప్రైవేటు ఫొటోలు ఆన్ లైన్ లో ప్రత్యక్ష్యం అవ్వడమే ఈ గొడవకు కారణం. వివరాల్లోకెళ్తే... 

రంజిత్ కథానాయకునిగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘పాలెరి మాణిక్యం’చిత్రం ద్వారా తెరకు పరిచయమైన మైథిలి...మంచి గాయని కూడా. ఈమెకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కిరణ్ కుమార్ తో 2008లో పరిచయం ఏర్పడింది.  ఆ పరిచయం... ప్రేమగా మారింది. ఇద్దరూ చేరువగా ఉన్న సమయంలో... ‘నిన్ను పెళ్లి చేసుకుంటాను’ అని మాయ మాటలు చెప్పి ఫొటోలను సెల్ ఫోన్తో తీశాడు కిరణ్ కుమార్ . 

ఇదిలావుంటే... కిరణ్ కుమార్ కి అప్పటికే పెళ్లి అయిన విషయం తెలుసుకున్న మైథిలి... అతడ్ని దూరంగా పెట్టడం మొదలుపెట్టింది. అప్పట్నుంచి కిరణ్ కుమార్ లో రాక్షసత్వం వెలుగు చూసింది. ‘మర్యాదగా డబ్బై లక్షలు ఇస్తావా.. లేక నీ ఫొటోలను ఆన్ లైన్ లో పెట్టమంటావా?’అని బెదిరించడం మొదలుపెట్టాడు. 

తన దగ్గర అంత డబ్బు లేదని తెగేసి చెప్పేసింది మైథిలి. దాంతో కిరణ్ కుమార్ ఆమె ఫొటోలను వెంటనే... ఆన్ లైన్ లో పెట్టేశాడు. ఇక ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ బాధ భరించలేక వెంటనే మైథిలి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు... కిరణ్ కుమార్ పై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఇంకా ఇందులో ఎవరెవరి ప్రమేయముంది? అనే విషయంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

‘మైథిలికి సంబంధించిన ఫొటోలను ఎవరు షేర్ చేసినా... వారిపై కేసు నమోదు చేస్తాం’ అని కేరళ పోలీసులు ప్రకటించారు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.