కర్ణాటకలో జనతా గ్యారేజ్ అంత పలికిందా..?
on Jun 6, 2016
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా రాబోతోంది జనతా గ్యారేజ్. కొరటాల డైరెక్ట్ చేసిన మిర్చి, శ్రీమంతుడు రికార్డ్స్ నమోదు చేయడంతో, ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఫ్యాన్స్ లో ఆశలు మరింతగా పెరిగిపోయాయి. తమ హీరో కెరీర్లో జనతా గ్యారేజ్ మూవీ బెస్ట్ ఫిల్మ్ అవుతుందని ఆశిస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఇవే అంచనాలు ప్రీబిజినెస్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కేరళల్లో డిస్ట్రిబ్యూషన్ కు చాలా పోటీ ఉందట. ఇక తాజాగా కర్ణాటక రైట్స్ కూడా 7 కోట్ల భారీ ఎమౌంట్ కు అమ్ముడయ్యాయనే వార్త వినిపిస్తోంది. ఈ సినిమాకున్న క్రేజ్ చూస్తే అంత మొత్తానికి అమ్ముడైతే ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కొన్ని రోజుల క్రితమే చెన్నై లో యాక్షన్ సీక్వెన్సెస్ స్టార్ట్ చేసిన గ్యారేజ్ టీం, త్వరలోనే హైదరాబాద్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత బ్రేక్ లేకుండా షూట్ చేసి మూవీని కంప్లీట్ చేయబోతున్నారు. సినిమా ఎన్టీఆర్ ఐఐటీ స్టూడెంట్ గా కనిపించడం కొసమెరుపు.