టెన్షన్ లో 'జై లవకుశ' యూనిట్...
on Aug 19, 2017
.jpg)
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా 'జై లవకుశ'. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్రామ్ నిర్మాణంలో వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా యూనిట్ టెన్షన్ లో పడిందటా.. ఎందుకనుకుంటున్నారా..? సినిమా ఎక్కడ వాయిదా వేయాల్సివస్తుందబ్బా అని. ఈ సినిమాను ఎలాగైనా సరే దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. సెప్టెంబర్ 21 న రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందట. దీంతో ఒక్కరోజు షూటింగ్ క్యాన్సిల్ అయినా సినిమా వాయిదా పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే సినిమా యూనిట్ టెన్షన్ లో పడిందట.
కాగా ఈ సినిమాకు సంబంధించి ‘జై లవకుశ’ రెండో టీజర్ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అయ్యింది. ఈ నెల 25న వినాయక చవితి సందర్భంగా లవ కుమార్ టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇప్పటికే ‘జై’ టీజర్ విడుదలై యూ ట్యూబ్ను షేక్ చేసేసింది. ఇప్పుడు లవకుమార్ టీజర్ ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పడింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



