గోపీచంద్ కు శృతి హాసన్ ' ఆక్సిజన్ '..!
on Apr 28, 2016
.jpg)
సౌఖ్యంలాంటి డిజాస్టర్ తర్వాత గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా ఆక్సిజన్. ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ఈ రోజు సాయంత్రం ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ విడుదల చేస్తోంది. యూట్యూబ్, ట్విట్టర్లలో ఒకేసారి శృతి ఈ సినిమాను రిలీజ్ చేయబోతోంది. ఇప్పటికే శ్రీరామనవమి రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాడు గోపీచంద్. ఈ రోజు విడుదల కాబోయే మోషన్ పోస్టర్ ను కూడా వైవిధ్యంగా ఉండేలా డిజైన్ చేశారని సమాచారం. ఇప్పటికే మూడు మెయిన్ షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది ఆక్సిజన్ టీం. జగపతిబాబు సినిమాలో కీలక పాత్ర పోషించడం విశేషం. గతంలో జగపతిబాబు, గోపీ కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఆక్సిజన్ చాలా వైవిధ్యమైన స్టోరీ పాయింట్ అని చెబుతున్నారు మూవీ టీం. గోపీచంద్ సరసన రాశిఖన్నా రొమాన్స్ చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



