
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అభిమానులకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిరంజీవి అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా బాధ్యతలు తీసుకోబోతున్నాడనే న్యూస్ కొన్ని రోజులుగా సోషల్ మీడియా, మీడియా ఛానల్స్ లోను వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
రీసెంట్ గా వినిపిస్తున్న కథనాల ప్రకారం ఆ వార్త నిజమే అని,చిరంజీవితో ఏపి గవర్నమెంట్ పెద్దలు మాట్లాడితే చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే న్యూస్ ఫిలిం, పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. మరి కొద్దీ రోజుల్లో అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.
ఇదే కనుక నిజమైతే ఏపి గవర్నమెంట్ ప్రవేశ పెట్టే పథకాల్ని చిరు నోటి నుంచి మనందరం వింటాం.
Also read: మన వాళ్ళకి బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ కోటి రూపాయల సాయం.. మిగతా హీరోలు ఏం చేస్తున్నారు!
Chiranjeevi, Ap Govt





