వేరొకరి బాయ్ ఫ్రెండ్ ను బుట్టలో వేసిన కత్రినా కైఫ్..!
on May 16, 2016
బాలీవుడ్ లో ఎప్పుడు ఎందుకు ఎవరు ఎవర్ని తగులుకుంటారో గెస్ చేయడం చాలా కష్టం. ఈ మధ్య అందరికంటే ఎక్కువగా వినబడిన బ్రేకప్ పక్షులు రణ్ బీర్, కత్రినా కైఫ్. ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్ తీసుకుని కలిసి జీవించే వరకూ వీరిద్దరి రిలేషన్ షిప్ వెళ్లింది. అయితే బ్రేకప్ అయిపోవడం, ఆ తర్వాత ఉప్పు నిప్పులా మసలడం తెలిసిందే. తాజాగా కత్రినా అలియాభట్ బాయ్ ఫ్రెండ్ సిద్ధార్ధ్ మల్హోత్రాను తగులుకుందని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బార్ బార్ దేఖో అని సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఆ సినిమా టైంలోనే ఇద్దరికీ బాగా సింక్ అయిందని, ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగిందని అంటున్నారు. అంతకు ముందు రణ్ బీర్ కపూర్ కొన్న లవ్ నెస్ట్ అనే ఇంటినుంచి బయటికొచ్చేసిన కత్రినా కొత్తగా తీసుకున్న ఫ్లాట్ సిద్ధార్ధ్ మల్హోత్రా ఫ్లాట్ కు చాలా దగ్గరగా ఉండటం కూడా ఈ పుకార్లకు ఊతమిస్తోంది. బార్ బార్ దేఖో సినిమా రొమాన్స్ సీన్లలో కూడా ఇద్దరూ నటించడం మానేసి, జీవించేస్తున్నారట. వీటికి తోడు, ఎప్పుడూ కలిసే కనిపించే అలియా సిద్దార్ధ్ ల మధ్య కూడా పాత క్లోజ్ నెస్ పూర్తిగా కనుమరుగైపోయిందని అక్కడి జనాలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ న్యూసే టాక్ ఆఫ్ ది బీటౌన్ గా మారింది.