Home

»

Latest News

'బ్రహ్మోత్సవం' ఆడియో వేదిక మళ్లీ మారిందా..?

May 01, 2016


మహేశ్ బాబు, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న 'బ్రహ్మోత్సవం' సినిమా ఆడియో రిలీజ్ మే 7న హైద్రాబాద్‌లోని శిల్ప కళావేదికలో జరగనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆడియో వేడికకు సంబంధించి  పీవీపీ టీమ్ చేపడుతోన్న ప్రచారంతో ఊపందుకుంది. అయితే ఇప్పుడు ఈ వేదిక మారే ఛాన్స్ కనిపిస్తోంది. మొదట్లో తిరుపతిలో అడియో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు, మళ్ళీ హైదరాబాలోని శిల్పకళా వేదిక ఆడిటోరియంలో నిర్వహిస్తారంటూ వార్తలొచ్చాయి. కానీ... ఇప్పుడు మళ్ళీ వేదిక మారింది జె.ఆర్.సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆడియో రిలీజ్‌ను చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇదైనా ఫిక్స్ అవుతుందో..లేదో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com