ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న 'రాధే శ్యామ్' షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. సాధ్యమైనంత వేగంగా చిత్రీకరణ పూర్తిచేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇది అందమైన ప్రేమకథాచిత్రమనీ, ప్రభాస్ ఇంతదాకా స్పృశించని కథతో ఈ సినిమా రూపొందుతోందని డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ వెల్లడించాడు. కాగా ఇదివరకు వరుసగా భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చిన ప్రభాస్ 'రాధే శ్యామ్'లో ఆ తరహా ఫైట్లు ఏవీ చేయడని ప్రచారం జరుగుతోంది.
"ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. అదే సమయంలో ఆహ్లాదకరమైన, హృదయాన్ని అలరించే సన్నివేశాలతో కథ నడుస్తుంది. ప్రభాస్ ఇందులో భారీ ఫైట్లు చేయడు. ప్రేమకథలో చిన్న చిన్న ఘర్షణలు తప్పవు కాబట్టి ఆ మేరకు మాత్రమే సన్నవేశాలుంటాయి. లైటర్వీన్ తరహాలో నడిచే కథ కనుక ఫైట్లు ఏవీ ఇందులో కనిపించవు. ఆ రకంగా చూస్తే ప్రభాస్ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడు" అని అంతర్గత వర్గాలు తెలిపాయి.
ప్రభాస్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ 23న మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి, ఫ్యాన్స్ను ఆనందింపజేయనున్నారు. ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రియదర్శి, సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ, సాషా చెత్రి, కునాల్రాయ్ కపూర్ కీలక పాత్రధారులు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్న ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.