LATEST NEWS
బ్యాంకింగ్ నిబంధనలు ప్రజలకు సాయపడాలి కానీ, వారిని క్షోభకు గురిచేయకూడదు. కానీ ఒడిశాలో ఓ బ్యాంకు అధికారుల మొండితనం ఒక వ్యక్తిని తన సోదరి సమాధిని తవ్వి ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకు గడపకు తీసుకువచ్చేలా చేసింది.  అసలేం జరిగిందంటే.. ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై  వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు. అయితే అందుకు అధికారులు అంగీకరించలేదు. బ్యాంకులో సొమ్ము విత్ డ్రా చేయాలంటే.. ఖాతాదారుడు స్వయంగా వచ్చి తీరాలన్నారు. అలా రాలేని పక్షంలో సంతకం, లేదా వేలిముద్రకావాలని చెప్పారు.  తన సోదరి చనిపోయిందని, ఆమె రాలేదని  ఆ వ్యక్తి బ్యాంకు అధికారుల కాళ్లావేళ్లా పడినా ఫలితం లేకపోయింది. డెత్ సర్టిఫికేట్ ఉందని చెప్పినా బ్యాంకు అధికారులు వినకపోవడంతో..  తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకుని అమలు చేశాడు. బ్యాంకు నుంచి నేరుగా తన సోదరిని పూడ్చిపెట్టిన సమాధి వద్దకు వెళ్లాడు. ఆమె సమాధిని తవ్వి ఆమె అవశేషాలను (అస్తిపంజరం) వెలికి తీసి..మోసుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు వచ్చాడు. బ్యాంకు అధికారులకు తన సోదరి అస్తిపంజరాన్ని చూపుతూ.. ఆమె వచ్చింది.. ఇప్పుడు డబ్బులు ఇవ్వండంటూ డిమాండ్ చేశాడు.   ఈ సంఘటన అందరి చేతా కన్నీళ్లు పెట్టించింది.  వివరాలిలా ఉన్నాయి.. కియోన్‌ఝర్‌ జిల్లాలోని దియానాలి గ్రామానికి చెందిన గిరిజనుడు జితు ముండా సోదరి కక్రా ముండా రెండు నెలల క్రితం మరణించింది. ఆమె భర్త, ఏకైక సంతానం కూడా ముందే చనిపోవడంతో జితు ఒక్కడే ఆమెకు దగ్గరి బంధువుగా మిగిలాడు. కక్రా పేరు మీద మల్లీపసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండగా, అందులో రూ.19,300 ఉన్నాయి. ఆ సొమ్ము తీసుకునేందుకు జితు ముండా బ్యాంకుకు వస్తే.. అధికారులు  నిబంధనల ప్రకారం అడ్డు చెప్పారు. ఈ ఘటనపై నెటిజనులు బ్యాంకు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలకే విలువఇస్తూ మానవత్వాన్ని మరిచారని దుమ్మెత్తి పోస్తున్నారు. 
వైసీపీ సోషల్ మీడియా విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా జరిగిన దాడులు, అసభ్యకర పోస్టుల వెనుక ఉన్న ఆర్థిక మూలాల గురించి పోలీసులు సజ్జల భార్గవ్‌రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు. ముఖ్యంగా ఈ కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ నెట్‌వర్క్‌ను నడపడానికి ఎవరెవరు సహకరించారు? అనే కోణంలో దర్యాప్తు సాగింది.  విచారణ సమయంలో పోలీసులు ముఖ్యంగా నిధుల వ్యవహారంపై ఆరా తీశారు. సోషల్ మీడియా వింగ్ నడపడానికి భారీ మొత్తంలో ఖర్చవుతుందని, ఆ నిధులను ఎవరు సమకూర్చారనేది ఇప్పుడు కేసులో కీలకంగా మారింది.  ఏ1 నిందితుడు వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భార్గవ్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే విచారణకు సజ్జల భార్గవ్ రెడ్డి సహకరించలేదనీ, చాలా ప్రశ్నలకు ఆయన  తెలియదు, గుర్తులేదు' అని సమాధానమిచ్చినట్లు సమాచారం.ఈ కేసులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే..  నిందితులు వాడిన పరికరాల గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలు. పోస్టులు పెట్టడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను అప్పగించాలని పోలీసులు కోరగా..  భార్గవ్‌రెడ్డి   నిరాకరించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలు ఉంటేనే వాటిని ఇస్తానని ఆయన స్పష్టం చేశారని అంటున్నారు. రాజకీయ నేతలను, ముఖ్యంగా మహిళా నేతలను లక్ష్యంగా చేసుకుని చేసిన అసభ్యకర పోస్టుల వెనుక ఎవరి ప్రోద్బలం ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షర్మిల, విజయమ్మ వంటి వారిపై జరిగిన వ్యక్తిగత దాడుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ పోస్టుల తయారీ మరియు వ్యాప్తి కోసం ప్రత్యేక టీమ్‌లు పనిచేశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో అన్నమయ్య ప్రాజెక్ట్ వంటి సున్నితమైన అంశాలపై కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసుల దర్యాప్తు కేవలం పోస్టులకే పరిమితం కాకుండా, ఆ వ్యవస్థ వెనుక ఉన్న ఆర్థిక వనరులపై కూడా ఫోకస్ పెట్టింది. తదుపరి విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భార్గవ్‌రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు, తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో మరికొంత మంది వైసీపీ నేతలకు కూడా నోటీసులు అందే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  
  బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నియమించబోయే కమిటీలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ అంతర్గత సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు… తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం పాటించారని విమర్శించారు. “వాళ్లు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ పౌరుషం లేదా?” అని ప్రశ్నించారు.“ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా… క్షమాపణ చెప్పించేవాళ్లం” అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్పందించకపోవడం పౌరుషం లేని వ్యవహారమని విమర్శించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణను వ్యవసాయం సహా అన్ని రంగాల్లో ముందంజలో నిలబెట్టామని… ఇప్పుడు మాత్రం భూముల కబ్జాలు, కూల్చివేతల్లో నెంబర్ వన్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని… రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల తీరు చూస్తే జాలి వేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డిని జనరల్ సెక్రటరీగా ప్రకటించి, కార్యవర్గానికి పరిచయం చేశారు కేసీఆర్.  
తెలంగాణ రాజకీయ యవనికపై  భారత రాష్ట్ర సమితి  అధినేత కే. చంద్రశేఖరరావు తనయ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల  ఎంట్రీ సంచలనాలకు వేదికైంది. పార్టీ ప్రకటన సందర్భంగా తన కన్నతండ్రిపై ఆమె చేసిన వ్యాఖ్యలు, విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలలో ఎదిగిన కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు  తండ్రి బాటను వీడి సొంతంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం  చర్చనీయాంశమైంది.  తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో సరికొత్త పార్టీని ప్రకటించిన ఆమె, గతంలో తండ్రి స్థాపించిన పార్టీ పేరులోని అక్షరాలనే మళ్ళీ తెరపైకి తీసుకురావడం ఆసక్తిరేకెత్తిస్తోంది. అన్నిటికీ మించి తన తండ్రిని మరమనిషి, గుంటనక్కల చేతిలో బంది అంటూ ఓ రేంజ్ లో విమర్శించడంతో అంతా దీనిపై బీఆర్ఎస్ రియాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందా అని ఇసక్తిగా ఎదురు చూశారు. బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.   ముఖ్యంగా కేసీఆర్ మౌనం వ్యూహమా? భయమా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ హాట్ గా సాగుతోంది. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కవిత వ్యాఖ్యల వెనుక పటిష్టమైన, పకడ్బందీ వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు.  అయితే కేసీఆర్ మౌనమే ఇప్పుడు అందరికి అర్ధం కాకుండా పోయింది.  తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలపైనే కాదు.. ఆమెను  నుండి కవితను బహిష్కరించిన నాటి నుండి ఇప్పటి  వరకూ కేసీఆర్   ఏ సందర్భంలోనూ తన కుమార్తె గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు.  కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కవిత చేసిన అవినీతి ఆరోపణల నుంచి తనను మరమనిషిగా అభివర్ణించడం వరకూ కవిత ఎంత పరుషంగా మాట్లాడినా కేసీఆర్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించారు.  దీంతో కేసీఆర్ మౌనం వ్యూహాత్మక, కన్నబిడ్డ అన్న మమకారమా? అన్న చర్చ జరుగుతోంది.   కేసీఆర్ మౌనం ఇలాగే కొనసాగితే.. రానున్న రోజులలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కవిత భారీగా చీల్చడం ఖాయమన్న భావన పార్టీ వర్గాలలోనే వ్యక్తమౌతోంది.  
  తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి. ఇక, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.  విజయ్‌ పాపులారిటీ, అనూహ్యంగా పెరిగిన పోలింగ్‌, ప్రశాంతంగా ఎన్నికలు ముగియడం వంటి కారణాలతో.. టీవీకే ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ఇక, విజయ్ తన పార్టీ గెలుపుపై భారీగా ఆశలు పెట్టుకున్నారని.. ఆయన ఏకంగా మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనే జాబితాను సైతం ఆల్రెడీ సిద్ధం చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.  ఇంత‌కీ ఈ జాబితాలో ఎవ‌రి పేర్లు ఉన్నాయి? అని చూస్తే.. బుస్సీ ఆనంద్. ఈయ‌న‌ టీవీకే జనరల్ సెక్రటరీ. ఈయన విజయ్‌కు అత్యంత సన్నిహితుడు, అంతేనా పార్టీ వ్యవహారాలన్నీ చూసుకునే వ్యక్తి. ఈయనకు అత్యంత కీలకమైన శాఖ- బహుశా హోం లేదా మున్సిపల్ శాఖ.. దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఆదవ్ అర్జున. ఈయన ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందారు. ఈయనకు ఆర్థిక లేదా ఐటీ శాఖల బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరుగుతోంది.కె.ఎ. సెంగోట్టయన్. గతంలో ఏఐఏడీఎంకే లో సీనియర్ మంత్రిగా పనిచేసిన ఈయన, విజయ్ పార్టీలో చేరడంతో ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక శాఖ ఇచ్చే అవకాశం ఉంది. వేణుగోపాల్, మాజీ ఎంపీ. ఈయనకు కూడా సీనియారిటీ కోటాలో చోటు దక్కవచ్చని సమాచారం. కె.జి. అరుణ్‌రాజ్. పార్టీ సిద్ధాంతకర్త, ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఈయన పేరు కూడా పరిశీలనలో ఉంది.మహిళా కోటా విష‌యానికి వ‌స్తే.. విజయ్ తన మంత్రివర్గంలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తున్నట్లు, ఇందులో భాగంగా విజయలక్ష్మి వంటి మహిళా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కేవలం అనుభవం ఉన్నవారినే కాకుండా, చదువుకున్న యువతను కూడా తన కేబినెట్‌లోకి తీసుకోవాలని విజయ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పేర్లు కేవలం రాజకీయ విశ్లేషకులు, పార్టీ వర్గాల నుంచి అందుతున్న లీకుల ఆధారంగానే ప్రచారంలో ఉన్నాయి. మే 4వ తేదీన వెలువడే ఫలితాల తర్వాతే ఈ జాబితాపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తొంద‌ర ప‌డి ముందే కూసిన కోయిల‌లు త‌ర్వాత బొక్క బోర్లా ప‌డ్డం  కూడా ఉంది. గ‌త ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్ త‌న పార్టీ వ‌ర్గాల వారిని ఒక హైప్ లో ఉంచ‌డానికిగానూ.. ప్ర‌మాణ స్వీకార వేదిక‌, హోట‌ళ్ల బుకింగ్ వంటి ఎన్నో ముంద‌స్తు ఏర్పాట్లు చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, అది కాస్తా తుస్సు మ‌న‌డంతో వైసీపీ కార్య వ‌ర్గ‌మంతా  డీలా ప‌డిపోయింది.  అన్న‌ట్టు ఎన్డీయే కూట‌మి చంద్ర‌బాబును త‌మ తెలుగు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా చూపితే, విజ‌య్ తాను జ‌గ‌న్ తో క‌ల‌సి దిగిన ఫోటోల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇప్పుడు చూస్తే ఆయ‌న‌లా ముంద‌స్తు జాబితాలు సిద్ధం చేయ‌డం వంటి హంగామా చూస్తుంటే ఇదేదో తేడాగా ఉందే అన్న అనుమానాలు కూడా వ‌స్తున్నాయ్. ఎందుకంటే ఏ స‌ర్వే కూడా విజ‌య్ కి 10- ప‌దిహేను సీట్ల కంటే ఎక్కువ వ‌చ్చేలా చెప్ప‌లేదు. అందుకే ఈ హంగామా చూస్తుంటే డౌట్ గా ఉందంటున్నారు కొంద‌రు.
ALSO ON TELUGUONE N E W S
ఈ వీడియో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన సింహ‌బ‌లుడు చిత్రంలోని ప‌వ‌ర్‌ఫుల్ ఇంట‌ర్వెల్ సీన్ ఇది. విలన్ గ్యాంగ్ హీరో తండ్రిని వేధిస్తూ, ఆయుధ పూజలో ఉన్న హీరోను బయటకు రమ్మని సవాలు చేయడంతో ఈ సన్నివేశం మొదలవుతుంది. హీరో జయసింహ తన పూజను పూర్తి చేసుకుని, నరసింహ స్తోత్రం నేపథ్యంగా వినిపిస్తుండగా ఎంతో ఉగ్రంగా ఎంట్రీ ఇచ్చి శత్రువుల ఆట కట్టించే తీరు ఈ వీడియోలో హైలైట్‌గా నిలుస్తుంది. టాలీవుడ్‌లో యాక్షన్ కింగ్ అంటే గుర్తొచ్చే పేరు అర్జున్ సర్జా. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఎమోషన్స్‌ను పండించడంలో కూడా ఆయన స్టైలే వేరు. తాజాగా 'తెలుగువన్' సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సింహ‌బ‌లుడు సినిమాలోని 'ఆయుధ పూజ' ఇంటర్వెల్ సీన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీన్ చూస్తుంటే మాస్ ఆడియన్స్‌కు పూనకాలు రావడం ఖాయమనిపిస్తోంది. ఈ సన్నివేశం విలన్ల అరాచకంతో మొదలవుతుంది. హీరో జయసింహ తండ్రిని బంధించి, ఊరందరి ముందు అవమానిస్తూ హీరోను బయటకు రమ్మని విలన్ గ్యాంగ్ సవాలు చేస్తుంది. "నీ కొడుకు పూజలో ఉన్నాడు, పూజ అయ్యాకే బయటకు వస్తాడు" అని తండ్రి చెబుతున్నా వినకుండా, అతడిని హింసిస్తూ జయసింహను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అయితే, లోపల ఆయుధ పూజలో ఉన్న హీరో, తన తండ్రి పడుతున్న బాధను గమనిస్తాడు. సరిగ్గా అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే "ఉగ్రం వీరం మహావిష్ణుం.." అనే నరసింహ స్తోత్రం సన్నివేశానికి వేరే లెవల్ ఎనర్జీని ఇస్తుంది. పూజ ముగించుకుని రౌద్ర రూపంతో హీరో ఎంట్రీ ఇవ్వడం సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో అర్జున్ తన మార్క్ యాక్షన్ స్కిల్స్‌తో అలరించారు. కత్తులు, గొడ్డళ్లతో శత్రువులను చీల్చి చెండాడుతుంటే చూసే ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కేవలం కండబలమే కాదు, తండ్రిపై ఉన్న ప్రేమను, శత్రువుపై ఉన్న పగను తన కళ్లలోనే చూపించి నటుడిగా అర్జున్ మరోసారి మెప్పించారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్ సాధిస్తోంది. పాత సినిమాల్లోని ఇటువంటి పవర్‌ఫుల్ సీన్స్‌ను మళ్లీ చూస్తుంటే ఆ కిక్కే వేరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయుధ పూజ నేపథ్యంలో వచ్చే ఈ ఫైట్ సీన్ అర్జున్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇలాంటి ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ సీన్స్ కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
దక్షిణాది సినిమాల సత్తా ఇప్పుడు బాలీవుడ్ హద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. మన స్టార్ హీరోలు హిందీ మార్కెట్‌పై కన్నేసి అక్కడ కూడా జెండా పాతేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో తెరకెక్కనున్న ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ మైథలాజికల్ జంగిల్ డ్రామాలో విలక్షణ నటుడు ధనుష్ హీరోగా ఎంపికైనట్లు సమాచారం. నిజానికి ఈ కథ ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. భన్సాలీ కాంబినేషన్‌లో చరణ్ ఒక పీరియడ్ అడ్వెంచర్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, కొన్ని కారణాల వల్ల రామ్ చరణ్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ కథకు ధనుష్ అయితే పర్ఫెక్ట్ అని భావించిన మేకర్స్, ఆయనను సంప్రదించగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహించనున్నారు. 'సర్దార్', 'అభిమన్యుడు' వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిత్రన్, ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తొలుత 'రౌడీ రాథోడ్ 2' కోసం చర్చలు జరిగినా, చివరకు ఒక కొత్త తరహా పౌరాణిక జంగిల్ అడ్వెంచర్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భన్సాలీ నిర్మాణ విలువలకి తోడు మిత్రన్ మేకింగ్ స్టైల్ తోడైతే ఈ సినిమా మరో విజువల్ వండర్ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ధనుష్‌కు బాలీవుడ్‌లో ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన 'రాంఝూనా', 'అత్రంగి రే' చిత్రాలతో హిందీ ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ప్రస్తుతం 'తేరే ఇష్క్ మే' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు భన్సాలీ వంటి పెద్ద నిర్మాణ సంస్థలో ఇలాంటి ఒక భారీ మైథలాజికల్ డ్రామాలో నటించే అవకాశం రావడం ఆయన కెరీర్‌కు మరో కలిసొచ్చే అంశం. అడవి నేపథ్యంలో సాగే పౌరాణిక అంశాలతో ఈ సినిమా కథ ఎంతో వైవిధ్యంగా ఉండబోతోందట. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవ్వడంతో ధనుష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ మిస్ చేసుకున్న ఈ భారీ అవకాశాన్ని ధనుష్ ఏ రేంజ్‌లో ఉపయోగిస్తారో చూడాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అటు చరణ్ కూడా ప్రస్తుతం బుచ్చిబాబు సన మరియు సుకుమార్ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ సర్దుబాటు కాక ఈ సినిమాకు నో చెప్పి ఉండవచ్చని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన నటుడు రిషబ్ శెట్టి, తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏ ఫిల్మ్ బై గిరి’ విడుదలకు సిద్ధమైంది. కన్నడలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 8వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందింది. రిషబ్ శెట్టి తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడానికి సిద్ధమయ్యారు. ఆయన సరసన అందాల భామ రచన ఇందర్ కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ముఖ్యంగా రిషబ్ శెట్టి కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్ మరియు రిషబ్ శెట్టి ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, అచ్చిబాబు ఎం. సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కరణ్ అనంత్ మరియు అనిరుధ్ మహేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒక కొత్త తరహా కథాంశంతో, ఆద్యంతం వినోదాత్మకంగా సాగేలా ఈ చిత్రాన్ని మలిచారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎం.జి. మూవీస్ సంస్థ ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తోంది.   రిషబ్ శెట్టి గత చిత్రాలను గమనిస్తే, ఆయన కేవలం సీరియస్ రోల్స్ మాత్రమే కాకుండా, కామెడీని కూడా అద్భుతంగా పండించగలరని నిరూపించుకున్నారు. ఈ క్రమంలో ‘ఏ ఫిల్మ్ బై గిరి’ సినిమా ఆయన కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రంగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిత్రంలో ప్రమోద్ శెట్టి, హొన్నావల్లి కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వాసుకి వైభవ్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్ కానుంది.  
Social media influencer and actress Ashu Reddy has taken a major legal step by approaching the Telangana High Court to quash the recent FIR filed against her. The Hyderabad Central Crime Station had registered a massive cheating case involving ₹9.35 crore against the actress.   The complaint was originally filed by the family of a UK-based software engineer, YV Dharmendra. They alleged that Ashu took huge amounts of money, gold, and luxury assets from him under the false pretext of marriage before eventually backing out. The controversy gained immense public attention after a private phone call, allegedly discussing a financial settlement, went viral across social media.  Allegedly, she asked for Rs.1.5 crore settlement with Dharmendra stating that she would return this money in May and rest after settling in life. After the phone call was leaked, she went to court and filed a petition against FIR. In her petition to the High Court, Ashu Reddy argued that the police registered the case unilaterally without even recording her version of the events.  She stated that the FIR was filed with the sole intention of damaging her public reputation. She has urged the court to stay the ongoing investigation and stop the police from taking any further action against her. Ashu had previously taken to social media to completely deny all the allegations, calling them false and misleading while warning against the spread of unverified information.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
- బాషా అంటేనే ఒక ప్రభంజనం - ఆ ఐకానిక్ సీన్ వెనుక ఉన్న మ్యాజిక్ ఇదే! - అప్పట్లో సెన్సేషన్.. ఇప్పుడు ఎవర్ గ్రీన్  ఈ వీడియో సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన 'బాషా' చిత్రంలోని ఐకానిక్ ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను చూపుతుంది. తన సోదరిని అవమానించిన రౌడీలకు బుద్ధి చెబుతూ, ఒక సాధారణ ఆటో డ్రైవర్ తనలోని అసలైన డాన్ బాషాను బయటపెట్టే ఈ సీన్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే సినిమా 'బాషా'. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ బ్లాక్, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యుత్తమ మాస్ సీన్లలో ఒకటిగా నిలిచి పోయింది. తాజాగా ఈ సీన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతోంది. సినిమా ప్రారంభం నుండి ఒక సాదాసీదా ఆటో డ్రైవర్‌గా, శాంతమూర్తిగా కనిపించే మాణిక్యం, తన కుటుంబం కోసం ఎంతటి అవమానాలనైనా భరిస్తాడు. కానీ, తన చెల్లెలికి అన్యాయం జరుగుతున్నప్పుడు, ఆమెను నడిరోడ్డుపై అవమానిస్తున్నప్పుడు మాణిక్యం తనలోని మౌనాన్ని వీడుతాడు. ఆ క్షణం వరకు తనలోని గతాన్ని దాచుకున్న సింహం ఒక్కసారిగా గర్జించినట్లు ఉంటుంది ఆ సీన్. రౌడీలు తనను కొడుతున్నా మౌనంగా భరించిన మాణిక్యం, ఒక్కసారిగా తిరగబడటం.. అప్పటివరకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మారిపోయి దేవా అందించిన పవర్ ఫుల్ స్కోర్ వినిపించడం థియేటర్లలో ప్రేక్షకులను సీట్ల నుంచి లేచి గంతులు వేయించేలా చేస్తుంది. "నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు" అనే డైలాగ్ రాకముందే, తన యాక్షన్ తో రజనీకాంత్ చూపించిన విశ్వరూపం ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఈ సీన్ హైలైట్స్ విషయానికి వస్తే.. రజనీకాంత్ మేనరిజమ్స్, ఆ తీవ్రమైన చూపులు మరియు ఫైట్ కంపోజిషన్ అద్భుతంగా ఉంటాయి. కేవలం ఫిజికల్ ఫైట్ మాత్రమే కాకుండా, ఆ సీన్ లో ఉండే ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. తన తమ్ముడికి తన అసలు రూపం తెలియకుండానే శత్రువుల అంతం చూడటం ఒక రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా ఈ వీడియోలో రౌడీలను స్తంభానికి కట్టేసి కొట్టే షాట్స్, రజనీకాంత్ నడక, ఆ బాడీ లాంగ్వేజ్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. కొన్ని దశాబ్దాలు గడిచినా 'బాషా' క్రేజ్ తగ్గకపోవడానికి కారణం ఇలాంటి హై-వోల్టేజ్ సీన్లే. అటు రజనీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, సాధారణ సినిమా ప్రేక్షకులు కూడా ఈ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. నేటి తరం యాక్షన్ సినిమాలకు కూడా ఈ ఇంటర్వెల్ బ్లాక్ ఒక పాఠం లాంటిది. రజనీకాంత్ కెరీర్ లో ఎన్నో హిట్స్ ఉండొచ్చు కానీ, 'బాషా' ఇచ్చే కిక్కే వేరు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు "తలైవా ఈజ్ ఆల్వేస్ ది బాస్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఈ అద్భుత దృశ్యం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ ఫేవరెట్.  ఇలాంటి పవర్ ఫుల్ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పండగ అంటే అది కేవలం సెలవులు మాత్రమే కాదు, అగ్ర హీరోల మధ్య జరిగే అసలైన సమరం. ముఖ్యంగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ అంటే ఒక బలమైన సెంటిమెంట్. తాను తీసే సినిమాలను వీలైనంత వరకు సంక్రాంతి బరిలోనే నిలిపి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం ఆయన స్టైల్. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్‌లతో ప్లాన్ చేసిన భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనిల్ గట్టి ప్లాన్‌లో ఉన్నారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ రేసు నుంచి తప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షాకింగ్ నిర్ణయం వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. అదే విక్టరీ వెంకటేష్ నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదర్శ కుటుంబం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వాస్తవానికి 2026 దసరా సీజన్‌లో విడుదల కావాల్సింది. కానీ, వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో, మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే పండగ సీజన్‌లో రావడం ట్రేడ్ పరంగా ఏమాత్రం శ్రేయస్కరం కాదు కాబట్టి, అనిల్ రావిపూడి తన ప్రాజెక్ట్‌ను వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ సారి వీరిద్దరితో పాటు కళ్యాణ్ రామ్ కూడా తోడవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేసే పనిలో ఉన్నారు. పండగ సీజన్‌ను మిస్ అవ్వడం ఆయనకు ఇష్టం లేకపోయినా, థియేటర్ల సర్దుబాటు మరియు వసూళ్ల లెక్కలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. నిజానికి అనిల్ రావిపూడి తన ప్రతి సినిమాలోనూ కామెడీ మరియు ఎమోషన్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకుంటారు. అందుకే సంక్రాంతి వంటి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే పండగ సమయంలో ఆయన సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మరోవైపు త్రివిక్రమ్ - వెంకీ కాంబోలో రాబోతున్న 'ఆదర్శ కుటుంబం' పై కూడా భారీ హైప్ ఉంది. ఇద్దరు అగ్ర దర్శకులు ఒకే హీరోతో పోటీ పడటం కన్నా, ఒకరు వెనక్కి తగ్గి సోలోగా రావడం మంచిదని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మల్టీస్టారర్ మూవీ వాయిదా పడితే, దానిని 2027 వేసవి కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది. సమ్మర్ హాలిడేస్ కూడా పెద్ద సినిమాలకు కలిసి వచ్చే అంశమే కాబట్టి, నిర్మాతలకు ఇది మేలు చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుండటంతో అటు వెంకీ ఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నా, బాక్సాఫీస్ వద్ద క్లాష్ నివారించడం మంచిదేనని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వడం ఆయన అభిమానులకు కొంత చేదు వార్తే. అయితే, త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్‌ను చూడాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆడియన్స్‌కు మాత్రం 'ఆదర్శ కుటుంబం' పండగ ట్రీట్ ఇవ్వబోతోంది. త్వరలోనే ఈ వాయిదాపై మరియు కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి తన తదుపరి షెడ్యూల్స్‌ను ఏ విధంగా ప్లాన్ చేస్తారో వేచి చూడాలి.
The Telugu film industry is currently dealing with a major problem as two of its biggest upcoming movies, Ram Charan's Peddi and Nani's The Paradise, faced unexpected leaks on the exact same day. These back-to-back incidents have left both the fans and the production houses deeply worried.   In the case of Peddi, a massive sports drama, a special dance number featuring Ram Charan and Shruti Haasan was secretly recorded on mobile phones during a rehearsal and leaked online. Similarly, a high-octane action sequence from Nani's pan-Indian film The Paradise has gone completely viral across social media platforms, despite the team's initial efforts to keep things under wraps.   These breaches highlight a serious issue regarding the safety of big-budget projects. When crucial scenes and lavish songs are revealed before the official release, it ruins the theatrical experience for the audience and causes huge setbacks for the creators who spend months working on them. It is high time for producers to implement much stronger security measures on shooting locations. Banning mobile phones and tightening local security must be strictly enforced without exceptions. The makers also need to collaborate closely with cybercrime departments to quickly track down the sources and prevent such damaging leaks in the future.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
  ఇతర భాషా సినీ ప్రేమికులని హిందీ సినీ ప్రేమికులుగా మార్చిన చిత్రం '3 ఇడియట్స్'.(3 idiots) అతను ముందే మరో చిత్రం ఆ ఘనతని సాధించలేదా అంటే చాలా చిత్రాలే సాధించాయి. కానీ సినీ ప్రేమికుల శాతాన్ని పెంచిందని చెప్పవచ్చు. భారతీయ చిత్ర పరిశ్రమకి సరికొత్త స్క్రీన్ ప్లే ని కూడా పరిచయం చేసిన 3 ఇడియట్స్ ఒక తీపికబురుని మోసుకొచ్చింది.    '3 ఇడియట్స్' పార్ట్-2 ఖరారైంది. ఈ విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమిర్ ఖాన్(Aamir Khan)మాట్లాడుతు మేము 3 ఇడియట్స్ సీక్వెల్ కోసం పని చేస్తున్నాం. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ  అద్భుతమైన పాయింట్‌ని సిద్ధం చేశారు. కేవలం మొదటి భాగాన్ని కొనసాగించడం మాత్రమే కాదు. అంతకంటే గొప్పగా ఉండబోతోంది. మొదటి భాగం ముగిసిన 10 ఏళ్ల తర్వాత కథ ప్రారంభమవుతుంది. రాంచో, ఫర్హాన్, రాజుల జీవితాలు ఇప్పుడు ఏ మలుపు తిరిగాయి. వారు ఎంచుకున్న మార్గాల్లో ఎలా స్థిరపడ్డారు అనే అంశాలని రెండవ భాగంలో చూపించబోతున్నామని చెప్పుకొచ్చాడు.  Also read:  The Paradise: లీకుల దెబ్బకు మేకర్స్ విలవిల.. నాని ది ప్యారడైజ్ సీక్రెట్ విజువల్స్ అవుట్ ఇప్పుడు ఈ మాటలు దశాబ్ద కాలంగా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకి  ఆమిర్ ఖాన్ స్వీట్ సుపారీ కంటే తియ్యనైన న్యూస్ చెప్పినట్లయింది. 3 ఇడియట్స్' అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఒక ఎమోషన్. విద్య ఎలా ఉండాలో, ఎలాంటి మార్పులు విద్య వ్యవస్థలో రావాలో అనే పాయింట్ కి ఎంటర్ టైన్ మెంట్ ని జోడించి తెరకెక్కించారు. అప్పట్లోనే హెవీ అడ్వాన్స్డ్ మూవీ. మరి సీక్వెల్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉంటుందో చూడాలి. రాంచో గా అమీర్ ఖాన్,  ఫర్హాన్ గా మాధవన్, రాజు గా షర్మాన్ జోషి మొదటి పార్టుకి వన్నె తెచ్చిన విషయం తెలిసిందే.  సీక్వెల్ వార్తల నేపథ్యంలో  '3 ఇడియట్స్ ఈ ప్రపంచానికి అందించిన దివ్య ఔషధం 'ఆల్ ఈజ్ వెల్’ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది.    
వెంకటేష్ నటించిన హార్ట్ టచింగ్ సినిమా అబ్బాయిగారు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించింది. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తల్లి-కొడుకు సంబంధాలు, కపట ప్రేమ, కుటుంబ విలువలను ఎంతో భావోద్వేగంగా చూపించింది. ముఖ్యంగా తల్లి కొడుక్కి విషం ఇచ్చినట్టు సృష్టించిన సస్పెన్స్ సీన్స్ ఇప్పటికీ అనేక మంది గుండెల్లో రాతి మాదిరి కూరుకుపోయి ఉన్నాయి. దొర‌బాబుకి త‌ల్లంటే ఎంతో గౌర‌వం, ప్రేమ‌. త‌ల్లిని ఒక దేవ‌త‌గా భావిస్తాడు. కానీ, ఆ స‌వ‌తి త‌ల్లి ద్వంద్వ ప్రవర్తన ప్రేక్షకులను ఒక్కసారిగా ఆలోచింపజేస్తుంది. “తల్లే కన్న కొడుక్కి విషం ఇచ్చిందా?” అనే ప్రశ్న చుట్టూ తిరిగే క్లైమాక్స్ సీన్స్ వెంకటేష్ యాక్టింగ్‌కు మరో డైమెన్షన్ ఇచ్చాయి. అతని కళ్లలోని బాధ, ఆశ్చర్యం, కోపం అన్నీ కలిసి ప్రేక్షకులకు క‌న్నీళ్లు తెప్పిస్తాయి.  జ‌య‌చిత్ర ఈ పాత్ర‌లో జీవించింది. సవతి తల్లి పాత్రలో ఆమె చూపించిన భావాలు, ముఖ కవలికలు ఎంతో సహజంగా ఉన్నాయి. జయచిత్ర, శ్రీకాంత్, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం వంటి నటీనటులు కూడా తమ పాత్రలకు బలం చేకూర్చారు. కీర‌వాణి సంగీతం భావోద్వేగ సన్నివేశాలకు జీవం పోసింది. ఈ వీడియోలో చూపించిన అల్టిమేట్ సీన్స్‌లో తల్లి-కొడుకు మధ్య జరిగే ఆ భావోద్వేగ ముహూర్తాలు ఇప్పటికీ సినిమా ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. కుటుంబ విలువలు, నిజాయితీ, ప్రేమ వంటి అంశాలు ఈ చిత్రాన్ని ఒక్కసారి చూస్తే మరచిపోలేని అనుభూతిని ఇస్తాయి. ప్రస్తుతం కూడా అనేక మంది ప్రేక్షకులు ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ చేయాలని కోరుతున్నారు. “ఇలాంటి విలువలు ఉన్న సినిమాలు ఇప్పుడు అరుదుగా వస్తున్నాయి” అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అబ్బాయిగారు ఇప్పటికీ సెంటిమెంటల్ సినిమాల ప్రేమికులకు ఒక గుడ్ ఆప్షన్‌గా నిలుస్తోంది. వెంకటేష్ యాక్టింగ్ కోసం ఈ వీడియో త‌ప్ప‌నిస‌రిగా చూడాలి. ఇలాంటి భావోద్వేగ‌భ‌రిత‌మైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
  'ది ప్యారడైజ్(The Paradise)కోసం నాచురల్ స్టార్  నాని(Nani)అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆ ఎదురుచూపుల విషయంలో ఆ ముగ్గురి హార్ట్ బీట్ ఒకే రేంజ్ లో కూడా ఉంటుంది. దీన్ని బట్టి  ప్యారడైజ్ పై ఉన్న అంచనాలు ఏ పాటివో అర్ధం చేసుకోవచ్చు.  రీసెంట్ గా ఈ చిత్రం నుంచి ఒక ఫైట్ సీన్ లీక్ అయ్యింది. సదరు సీన్ యూ ట్యూబ్ లో ప్రత్యక్షంగా కనపడే సరికి ఫ్యాన్స్ షాక్ అవుతు సెట్‌లో భద్రత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై  నిర్మాణ సంస్థ కూడా స్పందిస్తు సెట్స్ వద్ద మొబైల్ ఫోన్లని పూర్తిగా నిషేధించడంతో పాటు, లీక్ చేసిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసుల సహకారం కోరుతున్నామని, ఇప్పటికే వైరల్ అయిన లింకులను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. Also read: RC16 లీక్ కలకలం: రామ్ చరణ్ పెద్ది స్పెషల్ సాంగ్ విజువల్స్ అవుట్ పెద్ది(Peddi)నుంచి కూడా శృతి హాసన్ స్పెషల్ సాంగ్ కి సంబంధించిన విజువల్స్ లీక్ అయ్యాయి. ఇక ఒకే రోజు పెద్ది, ప్యారడైజ్ లీక్ ల బారిన పడటం వైరల్ గా మారింది.   . "ఒక సినిమా నిర్మాణం వెనుక వేల మంది శ్రమ ఉంటుంది. ఇలాంటి లీకుల వల్ల వారి కష్టం వృధా అయ్యే అవకాశాలకి ఎక్కువ స్కోప్ ఉంది  
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో 'ఫ్రోజెన్ షోల్డర్' (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో 'అడెసివ్ క్యాప్సులైటిస్' అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి, కనీసం చేయి పైకి ఎత్తడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడి దైనందిన జీవితం స్తంభించిపోతుంది. దీనిని కేవలం సాధారణ నొప్పి అని సరిపెట్టుకొని నిర్లక్ష్యం చేస్తే మున్ముందు కదలికలు మరింత కష్టతరంగా మారుతాయి. ఆధునిక వైద్యంలోని పెయిన్ కిల్లర్స్ కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుండగా, ఆయుర్వేదం ఈ వ్యాధిని మూలాల నుండి నయం చేసే అద్భుతమైన మార్గాలను చూపుతోంది. ఈ క్రమంలో ఫ్రోజెన్ షోల్డర్ లక్షణాలు, కారణాలు మరియు దీనిని శాశ్వతంగా నయం చేసే ఆయుర్వేద చికిత్సా పద్ధతుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రోజెన్ షోల్డర్ అంటే ఏమిటి? మన భుజంలోని కీలు చుట్టూ ఉండే కణజాలం (Capsule) వాపునకు గురై, మందంగా మారడం వల్ల భుజం కదలికలు తగ్గిపోతాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి మరియు బిగుతుగా ఉన్న భావన కలుగుతుంది. ప్రధాన కారణాలు: మధుమేహం (Diabetes): షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  గాయాలు: భుజానికి తగిలిన పాత గాయాలు లేదా శస్త్రచికిత్సల వల్ల.  థైరాయిడ్ సమస్యలు: హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా భుజం కండరాలు దెబ్బతినవచ్చు.  కదలిక లేకపోవడం: ఎక్కువ కాలం చేతికి పని చెప్పకపోవడం వల్ల కీళ్లు బిగుసుకుపోతాయి. ఆయుర్వేద చికిత్స - సహజ సిద్ధమైన పరిష్కారం: ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో 'వాత దోషం' పెరగడం వల్ల కీళ్లలో ద్రవాలు తగ్గి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఆయుర్వేదంలో ఫ్రోజెన్ షోల్డర్‌ను 'అవబాహుక' అని అంటారు. దీనికి అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన చికిత్సలు: అభ్యంగనం (Abhyangam): వేడి చేసిన ఆయుర్వేద తైలాలతో (మహానారాయణ తైలం వంటివి) మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది.   స్వేదనం (Swedanam): మూలికల ఆవిరి పట్టడం ద్వారా బిగుసుకుపోయిన కండరాలు వదులవుతాయి.   గ్రీవ వస్తి / పీచు: నొప్పి ఉన్న భాగంలో ప్రత్యేకమైన నూనెను నిల్వ ఉంచే ప్రక్రియ.   పౌష్టిక ఆహారం: వాతాన్ని తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవడం మరియు శొంఠి, గుగ్గులు వంటి మూలికలను వాడటం. ఫ్రోజెన్ షోల్డర్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీ మరియు ఆయుర్వేద చికిత్సలతో సులభంగా నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చేతి కదలికలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు ఆయుర్వేద జీవనశైలితో మీ భుజం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది,  ఇష్టంగా అనిపిస్తుంది,  తమ చుట్టూ ఒక కొత్త ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కాలంతో పాటు ప్రేమ కూడా మారుతూ ఉంటుంది.  ముఖ్యంగా పరీక్షలు పెడుతూ ఉంటుంది.  ఇద్దరు వ్యక్తులు సిన్సియర్ గా ఉన్నారా లేదా అనేది కూడా కాలమే డిసైడ్ చేస్తుంది. అయితే ప్రేమించిన చాలా మంది సంతోషం కంటే ఎక్కువ బాధపడిన సందర్బాలే ఉంటాయి.  పదే పదే మనోవేదనకు గురవుతూ ఉంటారు.  ప్రేమ అనేది కేవలం ఒక్కరితో అగేది కూడా కాదు.. చాలామంది ప్రేమలో ఫెయిల్యూర్ వచ్చాక లేదా బ్రేకప్ అయ్యాక.. మళ్లీ ఇంకొకరితో ప్రేమలో పడతారు. కానీ అక్కడ కూడా మళ్లీ బాధ.. పదే పదే మానసిక వేధన బహుమానంలా లభిస్తాయి.  అసలు ప్రేమించేవారికి పదే పదే మానసిక వేధన ఎందుకు ఎదురవుతోంది? ఇందులో తప్పు ఎవరిది? తెలుసుకుంటే.. బాధ కలిగినా అదే మార్గంలో ప్రయాణం.. చాలామంది ప్రేమలో ఉన్నప్పుడు అయినా జీవితంలో వేరే బంధంలో అయినా.. తమకు బాధ కలిగినా సరే.. అదే జోన్ లోనే ఉండటానికి ఇష్టపడతారు. చిన్నతనంలోని అనుభవాలు,  పెరిగిన వాతావరణం,  గతంలో ఏర్పడిన బందాల వల్ల కలిగిన బాధ.. బందంలో గౌరవం లేకపోవడం వంటివి మనిషిని మారేలా చేయాలి. కానీ చాలామంది కొత్తగా ఏర్పడే ప్రతి బందంలోనూ అవే తప్పులు పదే పదే చేస్తుంటారు. అందుకే పదే పదే మనోవేధన కూడా ఎదురవుతూ ఉంటుంది. ఎమోషన్స్ నుండి బయట పడలేకపోవడం.. చాలా మంది తమకు తెలియకుండానే తమలాంటి భాగస్వాములనే ఎంచుకుంటారు. ఇది వారి సబ్ కాన్షియస్ మైండ్  చేసే ఒక ప్రయోగం.  గతంలో విషపూరితమైన సంబంధాలను అనుభవించి ఉంటే  మనస్సు వాటిని సాధారణమైనవిగా అంగీకరిస్తుంది. అందుకే పదే పదే అలాంటి రిలేషన్స్ వైపుకే  ఆకర్షితులు అవుతుంటారు. తమను తాము తక్కువగా  అంచనా వేసుకోవడం.. ఒక వ్యక్తి తమను తాము తక్కువగా అంచనా వేసుకున్నప్పుడు, వారు తరచుగా సంబంధాలలో తాము తక్కువ అన్నట్టు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి మనిషి వ్యక్తిత్వం గురించి పెద్దగా పట్టించుకోకుండా  పదే పదే తప్పుడు భాగస్వామిని ఎంచుకుంటారు. మార్పు పట్ల భయం.. చాలా మంది తాము తప్పులు చేస్తున్నామని తెలిసినా, మారడం వల్ల ఎదురయ్యే నష్టాలు,  ప్రమాదాలను చూసుకుని మారడానికి భయపడతారు.  అందుకే వారు అవే పాత పద్ధతులలో చిక్కుకుపోయి ఉంటారు. గత గాయాల ప్రబావం.. గత సంబంధాల వల్ల కలిగిన గాయం, పూర్తిగా మానకపోవడం వంటివి చాలామంది పదే పదే అవే తప్పులు చేసేలా చేస్తాయి.  ఇలాంటి వారు  భావోద్వేగపరంగా కోలుకునేంత వరకు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. గందరగోళం.. చాలా మంది ప్రేమకు , భావోద్వేగ అనుబంధానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోరు. వారు తప్పుడు వ్యక్తికి దగ్గరై, దానినే ప్రేమగా పొరబడతారు, తద్వారా అవే తప్పులను రిపీట్ చేస్తూ ఉంటారు.   ప్రేమలో లేదా రిలేషన్ లో  అవే తప్పులను పదే పదే చేయడం అనేది విధి రాసే రాత కాదు.. అది మనిషి  అలవాట్లు,  ఆలోచనా విధానం ఇచ్చే  ఫలితం. ప్రతి వ్యక్తి తన  పద్ధతులను గుర్తించి, తమను తాము  సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే ఇలా పదే పదే బాధపడే బంధంలో చిక్కుకోవడాన్ని నివారించగలుగుతారు. సింపుల్ గా చెప్పాలంటే.. ప్రతి మనిషి ప్రేమలో లేదా రెలేషన్ లో.. పదే పదే మానసిక వేదనకు అనుభవించడానికి అక్షరాలా ఆ మనిషి చేతులారా చేసుకునే తప్పులు,  పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం,  పాత ఆలోచనలు, సిద్దాంతాలలో  చిక్కుకుని ఉండటం వంటివి కారణం అవుతాయి.                                    *రూపశ్రీ.
మలబద్ధకం (Constipation) సమస్యకు ప్రధాన కారణాలు, లక్షణాలు మరియు సులభమైన ఆయుర్వేద గృహ చిట్కాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). దీనినే తెలుగులో 'మలబద్ధకం' అని కూడా అంటారు. ఇది కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, సకాలంలో దీనిని నివారించకపోతే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వీడియోలో మలబద్ధకం గురించి పూర్తి సమాచారాన్ని నిపుణులు వివరించారు: మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు: ఆహారంలో పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉండటం. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం.  శారీరక శ్రమ లేకపోవడం లేదా రోజంతా కూర్చుని పనిచేయడం. మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి. లక్షణాలు: వారానికి మూడు సార్లు కంటే తక్కువ మలవిసర్జన జరగడం. కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు గ్యాస్ సమస్యలు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా ఇబ్బంది కలగడం. ఆకలి మందగించడం. ఆయుర్వేద గృహ చిట్కాలు (Home Remedies): మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఈ వీడియోలో సూచించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు: త్రిఫల చూర్ణం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆముదం (Castor Oil): తక్కువ మోతాదులో ఆముదాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  పండ్లు మరియు కూరగాయలు: పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బొప్పాయి మరియు అరటిపండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.  నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.  మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంపొందించుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన సూచనలను తప్పక పాటించండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్, మధుమేహం, PCOD వంటి సమస్యలు మన జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. మందులు వాడుతున్నా పూర్తి ఉపశమనం లభించడం లేదా? అయితే మీకు 'థెరప్యూటిక్ యోగా' ఒక అద్భుతమైన మార్గం. ఇది కేవలం శరీరాన్ని కదిలించడం మాత్రమే కాదు, మీ మనస్సును మరియు ఆత్మను పునరుజ్జీవింపజేసే ఒక దివ్యౌషధం. మనం థెరప్యూటిక్ యోగాను ఎందుకు ఎంచుకోవాలి? (Why Should We?) రోజంతా ఉత్సాహం: మీరు రోజుకు కేవలం గంటన్నర సమయం యోగాకు కేటాయిస్తే, మిగిలిన 22.5 గంటల సమయం ఎంతో శక్తివంతంగా మరియు ఆనందంగా గడుస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి: థైరాయిడ్ సమస్య ఉన్నవారు కేవలం 3 నెలల్లో మార్పును గమనించవచ్చు, అలాగే PCOD సమస్యలు 4 నుండి 5 నెలల్లో నయమయ్యే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత: ఈ ప్రపంచంలో మానసిక సమస్యలను సమూలంగా నయం చేసే శక్తి కేవలం యోగాకు మాత్రమే ఉంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, బద్ధకాన్ని వదిలిస్తుంది. అంతర్గత మార్పు: యోగా మిమ్మల్ని లోపలి నుండి మారుస్తుంది. అది ఒక చిన్న పిల్లవాడి నవ్వులో ఉండే స్వచ్ఛతను మీ జీవితంలోకి తీసుకువస్తుంది. ఏం చేయకూడదు? (What Not to Do) నియమాలను విస్మరించవద్దు: మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు యోగా చేస్తున్నాం కదా అని ఆహార నియమాలను పూర్తిగా వదిలేయకూడదు. వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తక్షణ ఫలితాల కోసం ఆరాటపడవద్దు: యోగా అనేది ఏటీఎం మిషన్ నుండి డబ్బులు వచ్చినట్లు తక్షణమే రాదు, కానీ సాధన మొదలుపెట్టిన కొద్దిసేపటికే మీరు ఆ మార్పును అనుభూతి చెందుతారు. ఆనందాన్ని వదులుకోవద్దు: జీవితంలో దేనికైనా రాజీ పడండి కానీ మీ సంతోషం విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడకండి. ప్రారంభించడం ఎలా? (How to Start) శ్వాసపై ధ్యాస: మన శ్వాస మరియు మనస్సు భార్యాభర్తల వంటివి. శ్వాస దీర్ఘంగా, ప్రశాంతంగా ఉంటే మనస్సు కూడా అంతే ప్రశాంతంగా మారుతుంది. సరైన భంగిమలు: 'సుప్త ఆసనం' (Subtasana) వంటి భంగిమలు కేవలం 10 నిమిషాల్లోనే మిమ్మల్ని ఎంతో రిలాక్స్‌గా మరియు శక్తివంతంగా మారుస్తాయి. ఆధారాలతో సాధన (Props): శారీరక ఇబ్బందుల వల్ల ఆసనాలు వేయలేకపోయేవారు రకరకాల ప్రాప్స్ (Props) సహాయంతో సులభంగా యోగా చేయవచ్చు. ఇది క్యాన్సర్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: థైరాయిడ్ సమస్య యోగాతో నయమవుతుందా?  జ: అవును, క్రమం తప్పకుండా థెరప్యూటిక్ యోగా చేయడం ద్వారా 3 నెలల్లో థైరాయిడ్ మందుల మోతాదును తగ్గించుకోవచ్చు. ప్ర: క్యాన్సర్ రోగులకు యోగా ఎలా సహాయపడుతుంది?  జ: యోగా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయకపోవచ్చు, కానీ రోగిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శరీరంలో ప్రాణవాయువును (Oxygenation) పెంచి మనశ్శాంతిని చేకూరుస్తుంది. ప్ర: వ్యాయామం చేయడానికి సమయం లేని వారి పరిస్థితి ఏంటి?  జ: మీ శరీరం కోసం మీరు రోజుకు కనీసం గంటన్నర కేటాయించలేకపోతే, అనారోగ్యం పాలైనప్పుడు అంతకంటే ఎక్కువ సమయాన్ని ఆసుపత్రుల్లో గడపాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. మీరు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలన్నా, ఆత్మవిశ్వాసంతో మెరవాలన్నా యోగా ఒక్కటే మార్గం. మాటల కంటే సాధన ద్వారానే మీరు ఆ వ్యత్యాసాన్ని గమనించగలరు. ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు యోగా ప్రాక్టికల్ వీడియోల కోసం మా యూట్యూబ్ (YouTube) ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి మరియు ఆరోగ్యవంతులుగా మారండి.
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో తీసుకునే ఆహారాలు కేవలం కడుపు నిండినట్టు లేదా రుచి కోసం తీసుకుంటూ ఉంటారు. కానీ శరీరంలో ఎంతో ముఖ్యమైన భాగమైన పేగు ఆరోగ్యం బాగుండటం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చాలామందికి తెలియదు. ఉదయాన్నే తీసుకునే ఆహారమే పేగు ఆరోగ్యాన్ని, రోజు మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  పేగు ఆరోగ్యాన్ని ఎంతో సేఫ్ గా ఉంచే కొన్ని బ్రేక్ ఫాస్ట్ లు ఉన్నాయి.  ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ ఆహారాలు తీసుకుంటే రోజు మొత్తం హాయిగా గడిచిపోతుంది. అవేంటో తెలుసుకుంటే.. ఓట్స్, చియా సీడ్స్ స్మూతీ.. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది,  మెరుగుపరుస్తుంది. ఓట్స్ ను  చియా విత్తనాలతో కలిపితే, ఫైబర్ కంటెంట్ రెట్టింపు అవుతుంది. చియా విత్తనాలు నీటిని గ్రహిస్తాయి,  జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి, ఇది ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. వెజిటబుల్ రాగి ఇడ్లీ లేదా దోశ.. రాగులు ఫైబర్,  కాల్షియం పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇతర ధాన్యాలతో పోలిస్తే, రాగులలో  ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. తురిమిన క్యారెట్లు, బీన్స్,  పాలకూరను రాగి పిండిలో కలపాలి. ఆవిరి మీద ఉడికించి ఇడ్లీగా తినవచ్చు.  లేదంటే దీంతో దోశ కూడా ట్రై చేయవచ్చు. . ఇది తేలికగా ఉంటూనే  జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉంటుంది. మొలకెత్తిన ధాన్యాలు.. పెసలు, శనగలు లేదా బొబ్బర్లు వంటివి  మొలకెత్తడం వల్ల వాటి ఫైబర్,  ఎంజైమ్ కంటెంట్ పెరుగుతుంది. మొలకెత్తిన ధాన్యాలు ప్రీబయోటిక్స్‌గా పనిచేస్తాయి. మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మొలకెత్తిన పెసలను దోసకాయ, టమోటా, నిమ్మరసం,  కొద్దిగా ఉప్పుతో కలపాలి. ఇది ఫైబర్‌ను అందించడమే కాకుండా ప్రోటీన్ కూడా పుష్కలంగా అందిస్తుంది. మల్టీగ్రెయిన్ వెజిటబుల్ ఉప్మా.. సెమోలినాకు బదులుగా మల్టీగ్రెయిన్ గంజి లేదా ఓట్ ఉప్మా తయారు చేయడం వల్ల ఫైబర్  మరింత మెరుగవుతుంది. బఠానీలు, కాలీఫ్లవర్,  బీన్స్ వంటి కూరగాయలను జోడించడం వల్ల ఫైబర్ కంటెంట్ మరింత పెరుగుతుంది. తక్కువ నూనె,  ఆకుపచ్చ కూరగాయలను పుష్కలంగా జోడిండం వల్ల దీనిలో హెల్తీ బెనిఫిట్స్ మెరుగవుతాయి. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా భావించే కరివేపాకును జోడిస్తే మరీ మంచిది. జొన్న రోటీ, పెరుగు.. చిరు ధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చిరు ధాన్యాలు,  జొన్నలు గ్లూటెన్ రహితంగా ఉండటమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. పెరుగు అనేది పేగులో మంచి బ్యాక్టీరియాను పెంచే ప్రోబయోటిక్. చిరు ధాన్యాల రోటీతో ఒక గిన్నెడు తాజా పెరుగు కలిపి తింటే చాలా మంచిది. ఈ కాంబో ఫైబర్,  ప్రోబయోటిక్స్ రెండూ కలిగి ఉంటుంది.                            *రూపశ్రీ.