LATEST NEWS
  జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కొందరు గుర్తుతెలియని ఆగంతకులు ఫోన్ చేసి వేధింపులకు గురిచేశారు. ఈ మేరకు ఆమె బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. నాతో పాటు, నా తండ్రి  కే.కేశవరావు అంతు చూస్తా అంటూ బెదిరించడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిడుతున్నారని మేయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బోరబండ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఎండీ సర్దార్‌ సంబంధించిన వ్యక్తులమని అగంతకులు చెబుతున్నారని మేయర్ ఆరోపించారు  
  జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పథకలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కూడా ఈ నెలలోనే అమలు చేస్తామని సీఎం క్లారీటీ ఇచ్చారు.  పంద్రాస్ట్ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు వివరించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చామని.. వీటి ద్వారా 4.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. 2027కి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. అలాగే రాజధాని అమరావతి నిర్మాణం కూడా వేగంగా జరువుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని.. ఈ క్రమంలోనే విశాఖ స్టేల్ ప్లాంట్‌కు రూ.11,400 కోట్ల ప్యాకేజీ, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతోందని చంద్రబాబు పార్టీ శ్రేణులకు తెలిపారు.  
చివరాఖరికి  కాంగ్రెస్ అధిష్టానం  తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్  సిగ్నల్ ఇచ్చింది.  ఇంచు మించుగా ఏడాదికి పైగా సాగుతున్న మంత్రివర్గ విస్తరణ మెగా సీరియల్ కు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెర దించింది. ఆదివారం (జూన్ 8) మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే విస్తరణ పూర్తి స్థాయిలో ఉంటుందా లేక ‘పీస్ మీల్’ లెక్కన ఉంటుదా అనే విషయంలో  మాత్రం స్పష్టత లేకపోయినా విశ్వసనీయ సమాచారం మేరకు, ఈసారికి పీస్ మీలే అంటున్నారు. ఈసారికి ఫిఫ్టీ పెర్సెంట్ ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు చెబుతున్నారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 12 మంది కేబినెట్‌‌లో మంత్రులుగా ఉన్నారు. మరో ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. అయిత అరుకు ఆరు ఒకేసారి భర్తీ చేస్తే  ఎదురయ్యే ఉపద్రవాన్ని ఎదుర్కోవడం కష్టమనే.. ముందు చూపుతో కాంగ్రెస్ అధిష్టానం  ప్రస్తుతానికి ముగ్గురితో సరి పెట్టాలని చూస్తోందని అంటున్నారు.  అయితే.. ఈ సంఖ్య ఇంకొకటి పెరిగినా పెరగ వచ్చని అంటున్నారు. ఇంత వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి మాత్రమే చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు..  ఈ విస్తరణలో  రెడ్డి సామజిక వర్గానికి బెర్త్ దక్కే ఛాన్స్ లేదనీ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న ప్రస్తుత విస్తరణలో  బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చోటు లభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏ కోటాలో ఎవరిని అదృష్టం వరిస్తుందనే విషయంలోనూ ఇంకా పూర్తి క్లారిటీ లేదు. అయితే.. మంత్రివర్గంలో స్థానం కోసం నేరుగా ఢిల్లీ తో డీల్ చేస్తున్న విజయశాంతి, ముఖ్యమంత్రి మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ముచ్చట పడుతున్న అద్దంకి దయాకర్ కు ప్రస్తుత విస్తరణలోనే స్థానం దక్కవచ్చని అంటున్నారు.     అయితే నిజానికి మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు  సామాజిక వర్గాలు, సీనియారిటీ వంటి అంశాలతో సంబంధం లేకుండా  ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా, ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు తెలుస్తోంది. నిజనికి  గాంధీ భవన్  లో వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి ప్రతి ఇద్దరు ఎమ్మెలేలలో ఒకరు వంతున మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎవరి కార్డ్ వారు ప్లే  చేస్తున్నారు. ముఖ్యంగా..  ఎస్సీ,  రెడ్డి సామాజిక వర్గం నేతల నుంచి వత్తిడి ఎక్కువగా  ఉందని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగా రెడ్డి, బహిరంగంగానే బరిలో దిగిన విషయం తెలిసిందే.   అలాగే,ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రి వర్గంలో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మీనాక్షీ నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా వచ్చిన తర్వాత  ఆశావాహులంతా   ఆమె కలిసి మంత్రి పదవి కోసం వినతులు చేశారు. కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్ నేతలు తమకు అవకాశం కల్పించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ సామాజికవర్గానికి కేబినెట్‌లో ప్రాధాన్యత లేదు. ముదిరాజ్‌‌లకు కచ్చితంగా అవకాశం ఇస్తానని గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి  రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా మైనార్టీలకు కూడా కేబినెట్‌లో చోటు లభించ లేదు. ఈ క్రమంలో రేపటి కేబినెట్ విస్తరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చోటు లభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే  చివరకు..  అనే నేను..అనే వరకు ఏమి జరుగుతుంది. ఎన్ని ఖాళీలు భర్తీ అవుతాయి.. ఎవరిని, మంత్రి పదవి వరిస్తుంది అనేది చెప్పడం  క్షేమం కాదు అంటున్నారు. అయితే..  ప్రస్తుత విస్తరణ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే అనే మాట కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల తర్వాత మార్పులు చేర్పులు, ఉద్వాసనలతో పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు.
ALSO ON TELUGUONE N E W S
మహేష్(Mahesh Babu)రాజమౌళి(Ss Rajamouli)కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ, ఇప్పటికే తన మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకొని, త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ని  జరుపుకోనుంది. 'ssmb 29 'అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అమెజాన్ అడవుల నేపథ్యంలో జరిగే  అడ్వెంచర్ థ్రిలర్ గా ఉండనుంది. ప్రియాంక చోప్రా(Priyanka Chopra)హీరోయిన్ గా చేస్తుండగా, సలార్ ఫేమ్ పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో చేస్తున్నాడు. మొదటి షెడ్యూల్ లో మహేష్, ప్రియాంక, పృథ్వీ సుకుమారన్ పై కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ఇప్పుడు ఈ మూవీలో 'మాధవన్' ఒక ముఖ్యమైన క్యారక్టర్ ని పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో జరగబోయే సెకండ్ షెడ్యూల్ లో మాధవన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారని, వీటన్నిటిపై త్వరలోనే అధికార  ప్రకటన రానుందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. సఖి, చెలి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన మాధవన్, సుదీర్ఘ కాలం నుంచి బహుభాషా నటుడుగా రాణిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న పలు చిత్రాలతో పాటు, వెబ్ సిరీస్ లలో కూడా చేస్తు బిజీగా ఉన్నాడు. ssmb 29 లో పలువురు విదేశీ నటులు కూడా నటించనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, మాధవన్ క్యారక్టర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. బాహుబలి, ఆర్ఆర్ ఆర్ ఫేమ్ విజయేంద్రప్రసాద్ కథని అందిస్తుండగా, దుర్గ ఆర్ట్స్ పతాకంపై కె ఎల్ నారాయణ కనివిని ఎరుగని బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కీరవాణి(Keeravani)సంగీత దర్శకుడు కాగా షూటింగ్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.      
Deepika Padukone and director Sandeep Reddy Vanga had a very ugly fallout with PR fights in media about casting her in Spirit. Many people tried to state that Deepika's open fallout could have affected her relations with Prabhas. As he is the leading man of Spirit, many thought she could be replaced from Kalki 2 as well.  The actress has officially joined AA22 X A6 film, starring Allu Arjun in the direction of Atlee. She is playing a warrior and her character introduction glimpses from the on-boarding video have been highly intriguing. The movie shoot will start soon and the makers are promising huge Pan-World sensation.  Putting an end to the rumors of her relations with Prabhas being also affected due to Spirit fallout in media, producers of Kalki - Priyanka Dutt and Swapna Dutt have confirmed that they have no plans to replace her. They stated that Deepika is part of Kalki 2 and 30-35% shoot for the second part has already been completed.  They did not confirm any deadline for start of the shoot but stated that Kalki 2 pre-production is happening. They have confirmed that they will give an official update when the shoot starts. Amitabh Bachchan, Kamal Haasan will also be integral part of the film. 
విక్టరీ వెంకటేష్(venkatesh)రానా(Rana)ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'రానా నాయుడు పార్ట్  2 (Rana naidu 2)ఈ నెల 13 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలో అందుబాటులోకి  రానుండగా 2023 లో  వచ్చిన రానా నాయుడు మొదటి భాగాన్ని మించి ఉండబోతుందని మేకర్స్ ఇప్పటికే వెల్లడి చేసారు.  ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రానా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు చిత్ర పరిశ్రమకి చెందిన కుటుంబం నుంచి రావడం వల్ల ఇండస్ట్రీ గురించి మరింత ఎక్కువ తెలుసుకునే వెసులుబాటు ఉండటంతో పాటు, అవకాశాలు వెంటనే రావడానికి ఉపయోగపడుతుంది. అంతకు మించి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉపయోగపడదు. ఎందుకంటే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకున్నా నువ్వు మాత్రం కెమెరా ముందుకు నుంచొని యాక్ట్ చెయ్యాల్సిందే. నువ్వు చేసే పని మీదే నీ కెరీర్ ఆధారపడి ఉంటుంది. మా అమ్మ ఫిలిం లేబరేటరీలో వర్క్ చేసారు. నాన్న స్టూడియో నడిపిస్తున్నారు. బాబాయ్ నటుడు. దాని వల్లే నటుడుగా ఆ మూడు విభాగాలపై అవగాహన ఉందని చెప్పుకొచ్చాడు. ఇక రానా నాయుడు 2 లో అర్జున్ రామ్ పాల్, సుర్విన్ చావ్లా, కృతి కర్బందా, అభిషేక్ బెనర్జీ, డినో మారియో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.      
విజయభాను అనే పేరుతో ఒక నటీమణి ఉండేవారని, తెలుగు సినిమా రంగంలో విజయపతాకం ఎగురవేయడమే కాకుండా... తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించారని ఈతరం వారికి తెలియకపోవచ్చు. కానీ 70వ దశకంలో ఒక వెలుగు వెలిగి అప్పటి అగ్ర కథానాయకులందరి సినిమాల్లోనూ నటించారు విజయభాను. ముఖ్యంగా అప్పట్లో రాజబాబు, విజయభాను  జంటకి  ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేదని చెబుతారు. కేవలం పదేళ్ల వ్యవధిలోనే వందకు పైగా సినిమాలు చేసి "విజయభానా మజాకా" అనిపించుకుని తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి  అప్పట్లోనే "పాన్ ఇండియా పాపులర్ యాక్ట్రెస్"గా పేరు గడించిన విజయభాను ఇటీవల ఇండియాకు వచ్చి తిరిగి అమెరికాకు వెళ్లకుండా, తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. ఆమె వయసు 68.. ఆమె ఏకైక కుమార్తె అమెరికాలోని ఓ ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. విజయభాను స్వస్థలం అనంతపురం కాగా, అయితే ఆమె పుట్టింది,పెరిగింది, పేరు తెచ్చుకుంది చెన్నైలోనే! కెరీర్ పీక్స్ లో ఉండగానే ఓ అమెరికన్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయి కెరీర్ తో పాటు ఇండియాని విడిచిపెట్టి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో స్థిరపడిపోయారు. స్వతహా నాట్యకారిణి కావడంతోపాటు "నాట్యమయూరి" బిరుదాంకితురాలైన విజయభాను లాస్ ఏంజెల్స్ లో "శ్రీ శక్తి శారదా నృత్యనికేతన్" పేరుతో నృత్య కళాశాల స్థాపించి, వేలాది మందికి శిక్షణ ఇచ్చారు. మన భారతీయ నాట్యకళలైన "భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకేళి" వంటి అన్ని నృత్యరీతులలోనూ నిష్ణాతురాలైన విజయభాను ప్రపంచవ్యాప్తంగా లెక్కకు మించి నాట్య ప్రదర్శనలు ఇచ్చి ఉండడం విశేషం. మన తెలుగు సినిమా రంగం నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఎవరు వెళ్లినా  విజయ భాను ఎంతో ఆత్మీయంగా ఆతిధ్యమిచ్చేవారు. అమెరికా కోడలుగా మారి, అక్కడే స్థిరపడినప్పటికీ భారతీయ మూలాలు ఎన్నడూ మరువని ఈ భరతమాత ముద్దుబిడ్డ. అనంతపురంలో ఆమె మాతృమూర్తి కట్టించిన "శివ నారాయణ పంచముఖ ఆంజనేయ దేవాలయం" అభివృద్ధికి ఇతోధికంగా సాయం చేశారు. సేవాదృక్పధం, మానవతావాదం మెండుగా కలిగిన ఈ "అనంతపురం ఆడపడుచు" తన సహాయం కోరి వచ్చిన వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. గత నెలలో ఇండియా పర్యటనకు వచ్చి, చెన్నైలోని తన ఇంటిని చూసుకునెందుకు వెళ్లిన విజయభాను... ఎండ వేడి తట్టుకోలేక వడదెబ్బకు లోనై అర్ధాంతరంగా అశువులు బాశారు. "తన ఇంట్లో చనిపోవడం కోసమే ఆమె పనిగట్టుకుని అమెరికా నుంచి ఇండియా వచ్చారా అనిపించే విధంగా, ఎక్కడైతే ఆమె ఒంటరిపోరాటంతో ఒక నటిగా, విరాజిల్లారో, అక్కడే మృత్యువు ఒడిలో ఒంటరిగా ఒదిగిపోయారు. చిరంజీవి, కమల్ హాసన్, జయసుధలతో కె. బాలచందర్ తెరక్కించిన దృశ్యకావ్యం "ఇది కథ కాదు" చిత్రలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల మనసు దోచుకున్న విజయభాను ఆ చిత్రంలో కనబరిచిన అత్యుత్తమ నటనకు "ఉత్తమ సహాయ నటి"గా నంది పురస్కారం అందుకున్నారు. నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతుల మీదుగా "నాట్యమయూరి" బిరుదునూ అందుకున్నారు. "నిప్పులాంటి మనిషి (ఎన్ఠీఆర్), ఇది కథ కాదు (చిరంజీవి - కమల్ హాసన్), కిలాడి బుల్లోడు (శోభన్ బాబు), ఒక నారి వంద తుపాకులు (విజయ లలిత), చందన (హీరోగా రంగనాద్ మొదటి చిత్రం),, ప్రియబాంధవి (శారద), స్త్రీ (కృష్ణంరాజు), శభాష్ పాపన్న (జగ్గయ్య), చిన్నికృష్ణుడు" (జంధ్యాల - ఘట్టమనేని రమేష్ బాబు) తదితర చిత్రాలు విజయభాను పేరు ఆరోజుల్లో మారుమ్రోగేలా చేశాయి!! విజయభాను గురించి అమెరికా లోనే స్థిరపడిన ఆమె సోదరి "కలైమామణి డా. సిందూరి జయసింఘే" మాట్లాడుతు "మా అక్క నిజంగా ఒక దేవత. ఒక పోరాట శక్తి. ఎన్నో కుటుంబాలకు ఆమె జీవనజ్యోతి. ఎందరికో ఆదర్శమూర్తి. ఆమెకు నివాళిగా, అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితంపై ఒక పుస్తకం తీసుకురావాలని మేము సంకల్పించాం. జయప్రదగారు మా అక్కకు చాలా సన్నిహితురాలు. చెన్నైలో నిర్వహించిన మా అక్క దశదినకర్మకి కూడా వారు హాజరయ్యారు. మా అక్క ప్రేరణతోనే నేనూ అమెరికా వచ్చి, ఇక్కడే స్థిరపడి నేను కూడా డాన్స్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్నాను. అక్కతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నవారందర్నీ కలిసి అక్క పుస్తకాన్ని వీలైనంత సమగ్రంగా తీసుకు రావాలని భావిస్తున్నాం" అన్నారు. విజయభాను ఆకస్మిక మృతి పట్ల ప్రముఖ కథానాయకి మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద, ప్రముఖ నటులు సుమన్, ప్రముఖ దర్శకనిర్మాత వై.వి.ఎస్.చౌదరి తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఈ నెల 12 న 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)పార్ట్ 1 తో థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడని అందరు ఫిక్స్ అయ్యారు. అందుకు తగ్గట్టే ప్రచార చిత్రాలు కూడా మొదలవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి. కానీ అనూహ్యంగా మళ్ళీ రిలీజ్ వాయిదా పడింది. ట్రైలర్ రిలీజ్ రోజు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని మేకర్స్ అనౌన్స్ చేసారు. రీసెంట్ గా వీరమల్లు దర్శకుడు జ్యోతికృష్ణ(Jyothikrishna)ఆంధ్రప్రదేశ్ లో బందరు గా పిలవబడే మచిలీపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతు 'పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మనలో దాగి ఉన్న టాలెంట్ ని ఆయన ఎంతగానో గుర్తిస్తారు. ఒక్కసారి మనల్ని నమ్మారంటే  ఎంతగానో గుర్తు పెట్టుకుంటారు. నన్ను నమ్మి నాతో సినిమా చేసారు. ఇప్పటికే ఆయన మూడు సార్లు సినిమా చూసారు. అరగంట సేపు నన్ను మెచ్చుకోవడమే కాకుండా, నాతో మరో సినిమా చెయ్యాలని ఉందని చెప్పారు. ఆయన ఆ మాట అనడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. బందర్ పోర్ట్ కి సంబంధించి వీరమల్లులో భారీ సీక్వెన్స్ ఉంది. కథకి తగిన విధంగా సిజి లో ఆ పోర్ట్ ని రీ క్రియేట్ చెయ్యడానికి రెండు సంవత్సరాలు కష్టపడ్డాం. ఈ బ్యాక్ డ్రాప్ లోనే  వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇందుకోసం పవన్ గారు ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. సుమారు 250 కోట్ల బడ్జెట్ తో వీరమల్లుని తెరకెక్కించామని జ్యోతికృష్ణ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొట్టమొదటి చారిత్రాత్మక మూవీ వీరమల్లులో, నిధి అగర్వాల్(Nidhhi Agerwal)హీరోయిన్ గా చేస్తుంది. ఇటివల నిధికి సంబంధించిన 'తారతార' సాంగ్ ని రిలీజ్ చేసారు. ఇప్పుడు ఆ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది. బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ఔరంగజేబు గా చేస్తుండగా, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, సత్యరాజ్, రఘుబాబు, జిష్ణు సేన్ గుప్తా, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు కాగా, ఈ మూవీ కొంత భాగానికి క్రిష్ దర్శకత్వం వహించిన   విషయం తెలిసిందే.    
మే 30, 2025న విశాఖపట్టణంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(Telugu Film Chamber of commerce)ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, ఎగ్జిక్యూటివ్ కమిటీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ ఇలా మూడు రంగాల నుండి   నుండి ప్రాతినిధ్యం వహించే 30 మంది సభ్యులతో కూడిన అంతర్గత కమిటీని నియమించింది.  తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్  ప్రెసిడెంట్ గా ఉన్న పి. భరత్  భూషణ్ కమిటీకి  చైర్మన్ గా వ్యవహరిస్తుండగా,  ఛాంబర్ సెక్రటరీ దామోదర్  ప్రసాద్  కన్వీనర్ గా ఉండనున్నాడు. నిర్మాతల విభాగం నుంచి దిల్ రాజు, దామోదర్  ప్రసాద్, టి . ప్రసన్న  కుమార్,  సి .కళ్యాణ్, రవి కిషోర్,  సూర్యదేవర  నాగవంశీ, డివివి  దానయ్య, స్వప్నదత్, వై, సుప్రియ ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్  సెక్టార్ తరుపున పి భరత్ భూషణ్  సుధాకర్ రెడ్డి, సుధాకర్, శిరీష్ రెడ్డి, శశిధర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, రామ్ దాస్, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరి. ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి టి ఎస్ రామ్ ప్రసాద్,సురేష్ బాబు, సునీల్ నారంగ్, వీర నారాయణ బాబు, పి శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాల గోవింద్ రాజు, మహేశ్వర రెడ్డి, శివప్రసాదరావు, విజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)అట్లీ(Atlee Kumar)కాంబోలో మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా మన సంస్కృతికి అద్ధం పట్టే కథ, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, రొమాలు నిక్కబొడిచే యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్,  గ్లోబల్ లుక్‌తో ప్రేక్షకులను మెప్పించేలా ఉండనుంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ రోజు రిలీజ్ చేసిన అల్లు అర్జున్ కి సంబంధించిన వీడియోనే అందుకు ఉదాహరణ. భారతీయ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా ఈ చిత్రం నిలవనుండగా సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ కనివిని ఎరుగని హై బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.  రీసెంట్ గా చిత్ర బృందం ఈ మూవీలో దీపికా పదుకునే(Deepika Padukone)జాయిన్ అయినట్టు కన్ఫార్మ్ చేసింది. వెల్ కమ్ ఆన్ ది బోర్డ్, రాణి జయించడానికి కవాతు చేస్తుందనే క్యాప్షన్ తో  వీడియోని విడుదల చెయ్యగా, సదరు వీడియో లో దీపికా కి అట్లీ కథని చెప్తుంటే ఆమె ఎంతో ఎగ్జైట్ అవ్వడం, ఆ తర్వాత తన క్యారక్టర్ కి సంబంధించి గుర్రం ఎక్కి కత్తి విన్యాసాలు చేయడం లాంటి వాటితో, ఈ చిత్రానికి సంబంధించిన కథపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మాట్లాడుతు 'జవాన్ సినిమాలో దీపిక మేడమ్‌తో కలిసి పని చేశాను. అదొక అద్భుతమైన అనుభవం. ఆమె నటనకి సంబంధించిన పరిధి, శక్తి, ప్రతి ఫ్రేమ్‌లో ఆమె అందరినీ తనవైపు తిప్పుకునేలా చేసిన గ్రేస్ గొప్పగా ఉంటాయి. ఆ మూవీలో ఆమె క్యారక్టర్ ఎంత కీలకంగా ఉండి కథ ని ముందుకు నడిపించిందో మనకు తెలుసు. ఇప్పుడు అల్లు అర్జున్ గారితో పాటు దీపికా పదుకొనెగారు కలిసి సినిమా చేయటం అనేది దర్శకుడి కల నేరవేరినట్టయ్యింది. మరచిపోలేని ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ ఇందులో సృష్టించబోతున్నాం అని చెప్పుకొచ్చాడు . సన్ పిక్చర్స్(Sun Pictures)స్పందిస్తు 'దీపికా పదుకొనె మా ప్రాజెక్ట్‌లో జాయిన్ కావటం అనేది ప్రాజెక్ట్‌ని మరో రేంజ్‌కి తీసుకెళ్లింది. ఆమె స్టార్ పవర్, భరోసా, ఎవరూ సాటిరాని విధంగా ఉండే ఆమె స్క్రీన్ ప్రెజన్స్ ఈ సినిమాపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందనటంలో సందేహం లేదు. అల్లు అర్జున్ తిరుగులేని ఎనర్జీ, అట్లీ విజన్, దీపిక బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌లతో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఐకానిక్  సినిమాని  రూపొందించబోతున్నామని చెప్పుకొచ్చింది. ఇక ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లకి చోటు ఉందనే కథనాలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీపికా ని ప్రకటించిన నేపథ్యంలో మిగతా ఇద్దరి హీరోయిన్లు ఎవరయ్యి ఉంటారనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. షూటింగ్ ఇయర్ ఎండింగ్ లో ప్రారంభం కానుందనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.    
  వెబ్ సిరీస్ : దేవిక & డానీ నటీనటులు: రీతూ వర్మ, సూర్య వశిష్ట,  శివ కందుకూరి, సుబ్బరాజు, అభినయశ్రీ, సోనియా సింగ్, షణ్ముఖ్, రామరాజు, రజిత, శివన్నారాయణ తదితరులు ఎడిటింగ్: కార్తికేయన్ మ్యూజిక్: జై క్రిష్ సినిమాటోగ్రఫీ: వెంకట్ దిలీప్ నిర్మాతలు: చాగంటి సుధాకర్ దర్శకత్వం: కిశోర్ ఓటీటీ: జియో హాట్ స్టార్ కథ: దేవిక (రీతూ వర్మ) సంప్రదాయ బద్ధమైన కుటుంబానికి చెందిన యువతి. ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామీణ ప్రాంతంలో ఆమె కుటుంబం నివసిస్తూ ఉంటుంది. ఆమె తల్లి కౌసల్య .. (రజిత) తండ్రి స్వామినందన్ (శివన్నారాయణ). ఆమె తాతయ్య యోగి నందన్ (రామరాజు)కి కొన్ని శక్తులు ఉంటాయి. ఆయనకి చనిపోయినవారి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. దేవిక ఒక స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ప్రతిరోజూ బస్సులో ఆ స్కూల్ కి వెళ్లి వస్తూ ఉంటుంది. దేవికకి జగ్గీ (సుబ్బరాజు)తో నిశ్చితార్థం జరుగుతుంది. పెళ్లి ముహూర్తం 3 నెలల వరకూ లేకపోవడంతో, అప్పటివరకూ వెయిట్ చేయవలసి వస్తుంది. ఒక రోజున ఆమె దగ్గరికి డానీ (సూర్య వశిష్ఠ) వచ్చి పరిచయం చేసుకుంటాడు. తాను చూస్తున్నది అతని ఆత్మననీ .. అతను చనిపోయి కొంతకాలమైందని తెలుసుకుని దేవిక షాక్ అవుతుంది. తన వలన 'గాయత్రి' కుటుంబానికి అన్యాయం జరిగిందనీ, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి గాను తనకి సహకరించమని డానీ ఆత్మ కోరుతుంది. గాయత్రి ఎవరు? ఆమెకి డానీ చేసిన అన్యాయం ఎలాంటిది? జగ్గీతో నిశ్చితార్థం చేసుకున్న దేవిక, నిజంగానే వేరొకరితో లవ్ లో పడుతుందా అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే విశ్లేషణ:  ఇది ఓ మధ్యతరగతి కుటుంబంలోని అమ్మాయి కథ. తన లైఫ్ లో జరిగే కొన్ని సంఘటనలకి వాస్తవ రూపాన్నిచ్చిన ఈ సిరీస్ మొత్తంగా ఏడు ఎపిసోడ్ లు ఉంది. ఒక్కో ఎపిసోడ్ ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంది‌. మొదటి ఎపిసోడ్ చూసిన వెంటనే తర్వాత ఏం జరుగుతుందో చెప్పేయొచ్చు. అలా సాదాసీదాగా కథ సాగుతుంది. అయితే దేవికగా రీతూ వర్మ నటన సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచింది.  ఈ సిరీస్ చూస్తున్నప్పుడు ఇప్పటివరకు చూసిన రెండు సినిమాలు గుర్తొస్తాయి. వాటి నుండి ఇన్ స్పైర్ అయ్యారేమోనని ఆ సీన్లని చూస్తుంటే అర్థమవుతుంది. ఇక ప్రేక్షకులకి సూర్య వశిష్ట కాస్త కొత్తగా అనిపించినా నటన పరంగా ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ లో రీతూ వర్మ తర్వాత డానీ పాత్రని చూపించాడు దర్శకుడు. ముఖ్యంగా డానీ గతాన్ని రివీల్ చేసే తీరు ప్రేక్షకుడిని హత్తుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో సీనియర్ నటి కోవై సరళ కనిపించి సర్ ప్రైజ్ చేస్తారు. సీరియస్ రోల్లో ఆకట్టుకుంటారు. డానీ చెప్పిన పని పూర్తి చేసేందుకు దేవిక చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. ఆమెకు సాయం చేసే సుబ్బు పాత్ర నవ్వులు పంచుతుంది. విలన్ గ్యాంగ్ ఎదురెళ్లిన వీరిద్దరూ అసలు ప్రాణాలతో బయటపడతారా లేదా అనే క్యూరియాసిటీ బాగుంది. అయితే అది చివరి వరకు కొనసాగించలేకపోయాడు దర్శకుడు. మొదటి ఎపిసోడ్ క్యారెక్టర్లని పరిచయం చేసిన దర్శకుడు, తర్వాతి మూడు ఎపిసోడ్ లలో కథని సామాన్యుడు ఊహించే విధంగా చూపించాడు. అయితే చివరి మూడు ఎపిసోడ్‌ లు కాస్త బాగుంటాయి. కాబోయే భార్యను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకొస్తానని తండ్రితో సవాలు చేసిన జగ్గీ చివరకు గెలిచాడా లేదా అన్న కోణంలో చివరి ఎపిసోడ్లలో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉంది. అయితే, కొన్ని చోట్ల సీరియస్ వ్యవహారంలో కామెడీ జోడించడంతో అప్పటివరకు ఎంగేజింగ్ గా సాగినా ఆ తర్వాత తేలిపోయింది‌. కమెడియన్ వైవా హర్ష, సోనియా సింగ్ లాంటి వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. క్లైమాక్స్ లో నటి దివి అతిథి పాత్రలో మెరుస్తుంది. 'దేవిక అండ్ డానీ' సీజన్ 2 ఉందని ఆ క్యారెక్టర్ తోనే తెలుస్తుంది. దేవిక తాత పాత్రని అక్కడక్కడ పవర్ఫుల్ గా చూపించి ఆసక్తి రేకెత్తించారు కానీ దానిని పూర్తిస్థాయిలో చూపించలేదు. జై క్రిష్ మ్యూజిక్ ఓకే. కార్తికేయన్ ఎడిటింగ్ పర్వాలేదు. వెంకట్ దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: దేవిక పాత్రలో రీతూ వర్మ ఒదిగిపోయింది. డానీ పాత్రలో సూర్య వశిష్ట, జగ్గీగా సుబ్బరాజు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా : కొత్తదనం లేని కథ.. ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్. రేటింగ్ : 2.5/ 5 ✍️. దాసరి మల్లేష్
జీవితంలో మనకు కావలసిన వాటికోసం, అవసరమైన వాటి కోసం , ప్రయత్నాలు చేయడం సహజం. అయితే వాటిని సాధించుకునే తీరులో తేడాలు ఉంటాయి. మనిషిలో రెండు వ్యతిరేక స్వభావం కలిగిన అంశాలు ఉంటాయి. అవే ఆశయం, అత్యాశ. చాలామంది ఆశయానికి అత్యాశకు మధ్య తేడాను తెలుసుకోలేరు. ఫలితంగా అత్యాశ ద్వారా ఏదైనా సాధించుకుంటే దాన్ని ఆశయంతో సాధించుకున్నట్టు ఫీలైపోతారు.  "ఆశయం అంటే కష్టపడి సాధించుకోవడం అత్యాశ అంటే ఒకరి నుండి లాగేసుకోవడం" ముఖ్యంగా చిన్న పిల్లలకు, ఎదుగుతున్న వారికి ఈ ఆశయం, అత్యాశ మధ్య ఉన్న తేడా ఏంటి?? దాన్ని ఎలా గుర్తించాలి అనే విషయం తెలుసుకోవాలి. ఆశయం!! ఆశయం మనిషిని మానసికంగా, సామాజికంగా ఒక మెట్టు పైకి తీసుకెళ్లే అంశం. ఆశయంలో లక్ష్యాలు ఉంటాయి. ఏదైనా సాధించడానికి అవసరమైన ప్రణాళిక ఉంటుంది, సాధించాలి అనుకున్న విషయం మంచా, చెడా అనే విచక్షణ కలిగి ఉంటుంది. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే అనుభవాలు, గెలుపు, ఓటమి మొదలైనవాటిని తీసుకునే తీరు ఇవన్నీ ఆశయంలో అంతర్భాగంగా ఉంటాయి.  ఒక ఆశయంలో ప్రయోజనం అనేది ఉంటుంది. అది కేవలం ఒక వ్యక్తికా లేక కుటుంబంకా, సమాజనికా అనేది ఆశయంలో ఉన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి ఆశయం అనేది ఒకరికి లేక కొందరికి ప్రయోజనం చేకూర్చే అంశం. దానివల్ల మనిషిలో ఉన్నత విలువలు పెంపొందుతాయి.  ప్రతి మనిషికి ఒక ఆశయం అనేది ఉండాలి. అదే ఆ మనిషిని జీవితంలో ఉన్నతంగా నిలబెడుతుంది. అతని ఎదుగుదలే ఓ కుటుంబాన్ని అన్ని కోణాల్లోనూ ఓ మెట్టు పైకి చేర్చుతుంది.  ఆశయాలు చిన్నవైనా, పెద్దవైనా, జీవితకాల నిర్ణయాలు అయినా వాటితో మనిషి భవిష్యత్తు మెరుగుపడుతుంది.  ఇదీ ఆశయంలో ఉన్న సారం. అత్యాశ!! కావలసింది, అవసరమైనది సాధించుకోవడం ఆశయమైతే, ఆశయంలో ఓటమిని ఎదుర్కోలేక తనకే కావాలనే మూర్ఖత్వాన్ని ప్రదర్శించడం అత్యాశ అవుతుంది. అత్యాశ అనేది మనిషికి ఉండకూడని లక్షణాలతో ఒకటి.  కావలసిన దాన్ని నిజాయితీగా, కష్టపడి సాధించుకుంటే దానిలో అర్థముంటుంది. అదే వక్రమార్గంలో దాన్ని సాధించుకుంటే?? అటువైపు దానికోసం కష్టపడుతున్న వారిని మోసం చేసినట్టు, వారి నుండి దాన్ని లాక్కున్నట్టు, వారికి దక్కాల్సినది దక్కకుండా చేసినట్టు అవుతుంది.  ద్వేషం, అసూయ, మూర్ఖత్వం, మొండితనం, ఓర్పు లేకపోవడం ఇవన్నీ అత్యాశలో నిండిపోయి ఉంటాయి. వీటి వల్ల జరిగేది ఏంటి?? ఇతరులు సంతోషపడితే చూడలేకపోవడం, దానికోసం వారికి దక్కాల్సినవి దక్కకుండా చేయడం, వారు బాధపడుతుంటే చూడటం కోసం వారు నష్టపోయేలా చేయడం. అన్నిటికంటే ముఖ్యంగా తనకు అవసరం లేకపోయినా తనకే దక్కాలి అనే అహంకారం అత్యాశతో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవిధమైన లక్షణం మనిషిని క్రమంగా మృగత్వం వైపుకు లాక్కెళ్తుంది. అత్యాశ నిత్యనాశనం అంటారు. అదెప్పుడూ మనిషిలో మానసిక ప్రశాంతతను లాగేస్తుంది. కాబట్టి అత్యాశ అనేది కేవలం ఇతరులను ఇబ్బందిపెట్టే గుణమే కాదు. అది ఉన్న మనిషిని ప్రశాంతంగా బ్రతకనీయదు. ఆశయానికి, అత్యాశకు మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటే అప్పుడు మనిషి తన జీవితంలో సాధించుకోవలసింది ఏంటి?? వదిలేసుకోవలసింది ఏంటి?? అనే విషయాన్ని నిర్ణయించుకోగలుగుతాడు.  లక్ష్యాలు ఏర్పరుచుకుని, శక్తి సామర్త్యాలు ఉపయోగించి పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సాధించేది ఆశయం.  ఇతరుల సంతోషం నీరుగార్చడం కోసం తనకు అవసరం లేకపోయినా దాన్ని దక్కించుకుని పైశాచిక ఆనందం పొందడం అత్యాశ.  ఈ రెండింటిని తెలుసుకుని ముందుకు సాగితే జీవితానికి ఓ మంచి అర్థముంటుంది.                                      ◆నిశ్శబ్ద.
ప్రతి మనిషి తన జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే కోరుకున్నంత సులభంగా అలాంటి జీవితం లభించదు. నిజానికి ప్రశాంతమైన జీవితం వేరు, సుఖాల మయమైన జీవితం వేరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ముందు. ప్రశాంతమయమైన జీవితం కావాలి అంటే…  ప్రతి నిముషంలోని ఆనందాన్నీ, సంతృప్తినీ వెలికి తీయగల గని కార్మికుడి లాగా పని చేయాలి. మనం ఎంత సాధించినా, ఎంత డబ్బునూ, ఆస్తుల్నీ సంపాదించినా చివరికి మన వెనకున్న ఎవరికో ఒకరికి సర్వం సమర్పించి అంతా వదలి వెళ్ళాలన్న సాధారణ సత్యాన్ని ఆకళింపు చేసుకోవాలి. అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు నిజంగా మనం సంతృప్తికరంగా జీవించగలమా అంటే అవును  జీవించగలం.  కొంతమంది ఏమి చేస్తారంటే… ఎదుటి వాళ్ళు కార్లు, బంగాళాలు కొంటూ విలాసవంతంగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళు ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు అని అంటారు. కానీ ఎలాంటి గొడవలు, చింతలు లేకుండా హాయిగా ఉన్నవారే నిజమైన గొప్ప జీవితం కలిగి ఉన్నవారు అనే విషయాన్ని గ్రహించాలి.  మరికొందరు గొప్పగా బ్రతకడం అంటే అది అదృష్టం వలన లభించేది అని అనుకుంటారు. కానీ అది అదృష్టం వల్ల దొరికేది కాదు. అది మనకు మనంగా ఎంచుకొనే తెలివైన ఎంపిక.  ఇలాంటి ఎంపిక ఎలా సాధ్యం అని ప్రశ్నించుకుంటే.. మనం ఆలోచించడం మొదలు పెట్టాలి ముందు.  ఈ రోజున మనకు తెల్సిన పరిస్థితుల మధ్య, మనం అనుభవిస్తున్న పరిస్థితుల మధ్య, మనం సిద్ధంగా ఉన్న అవకాశం లభించినప్పుడు ఆనందంగా గడపగలమో..... లేక మనకు తెలియని రేపటి పరిస్థితుల మధ్య, మనం చూడలేని పరిస్థితులలో ఆనందంగా గడపగలమో నిర్ణయించుకోవాలి.   భవిష్యత్తు అనేది కేవలం మనం మన ఊహల్లో నిర్మించుకొనే ఒక సామ్రాజ్యం. ఈ వాస్తవమైన ఈ రోజుని ఆనందంగా జీవించలేనపుడు.. రేపటి రోజున ఎలా ఆనందంగా జీవించగలం? కాలం మన మృత్యువునీ ఎన్నటికీ వాయిదా వెయ్యదు, అది దానికి సమయం వచ్చినప్పుడు అట్లా మనల్ని తీసుకుని వెళ్లిపోతుంది. అలాంటప్పుడు మన ఆనందపు సమయాన్ని మాత్రం మనం ఎందుకు వాయిదా వెయ్యడం. మనకు దొరికిన గొప్పవరం ఏదైనా ఉందంటే అది ఈరోజే.., ఇది మళ్ళీరాని అవకాశం, ఈ రోజున మనం అనుభవించిన సంతోషాలూ, గడిపిన క్షణాలు మళ్ళీ అదే విధంగా మరో రోజు ఉండకపోవచ్చు.   ఒక వేళ మన ఆయుష్షు లక్ష రోజులైతే... అది ఖచ్చితంగా ప్రతి రోజూ ఓ విలక్షణమైన పుస్తకం లాంటింది.  ఏ పుస్తకమూ మరో పుస్తకంలా ఉండదు. అలాగే  మన అద్భుతమైన రోజు భవిష్యత్తులో మరో రోజు పునరావృతం కాదు. ప్రతి రోజు ఓ సరిక్రొత్త అనుభవం. అందుకే ఏ సరిక్రొత్త అనుభవాన్ని వదులుకోకూడదు. బోటన వ్రేలి గుర్తులు ప్రపంచంలో ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవో అలాగే మన జీవితకాలంలోని ఏ రెండు రోజులూ ఒకేలా వుండవు. సరిక్రొత్త విశేష విజయాలను, అవకాశాలను ఈ రోజే సృష్టించుకోవాలి.  మరో రోజును వేరొక అవకాశాన్ని సృష్టించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మనం గతంలో జరిగిన సంఘటనలనీ, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే ఆలోచనలతో, నిన్నటినీ, రేపటినీ కలిపి ఈ రోజు జీవించడానికి ప్రయత్నిస్తుంటాం. నిన్నటి పాత జీవితాన్ని మళ్ళీ నేడు బ్రతకడం ఎందుకు, వస్తుందో రాదో తెలియని రేపటిని ఈ రోజే జీవించాలన్న తపన ఎందుకు కేవలం నేటిని ప్రశాంతంగా జీవిస్తేచాలాదా!                                     ◆నిశ్శబ్ద.
ఆశనిరాశల్ని..... విజయవైఫల్యాల్ని మైలురాళ్ళుగా మిగిల్చి మరో సంవత్సరం మన కళ్ళముందు నుంచి కనుమరుగయింది. సరికొత్త సవాళ్ళతో మనం ఎంత సాహసి కులమో తేల్చేందుకు కొత్త సంవత్సరం స్వాగతించింది. నిజానికి కాలానికి తరతమ భేదాలుండవు. అందరికీ మంచినే పంచాలనుకుంటుంది. కాని ఎవరి ప్రయత్నాన్ని బట్టి వారికి ఆ యా ఫలితాల్ని ప్రసాదిస్తుంది. అందుకే ఆశావహులకు బృందావనమైతే... నిరాశావాదులకు అదే కాలం కాటేసే కాలనాగవుతుంది.  గతాన్ని గతంలోనే పూడ్చిపెట్టి... సరికొత్త ఆశలతో ముందుకు సాగిపోవాలి. అందుకోసం అందరూ పాటించాల్సిన కొన్ని విషయాలివి. అస్పష్టం... అనాలోచితం ప్రస్తుతం చాలా సందర్భాల్లో విఫలమవడానికి కారణం మన పరిధిని, మన సామర్ధ్యాన్ని మనం సరిగ్గా అంచనా వేసుకోకపోవడం. ఫలితంగా చాలా మంది జీవితాలు అస్పష్టంగా, అనాలోచితంగా సాగిపోతున్నాయి. ఆంగ్ల విద్యావేత్త బ్రెండన్ 'once we accept our limits, we go beyond them' అంటారు. ముందు మన పరిమితుల్ని, వనరుల్ని తెలుసుకోగలగాలి. కాని దురదృష్టవశాత్తూ మనలో చాలామంది వయసు మించిపోతున్నా వారి వారి సామర్ధ్యాల్ని గుర్తించి మసలుకోలేకపోతున్నారు. పరుగులయితే పెడుతున్నాం... కానీ ఎక్కడికో చెప్పలేకపోతున్నాం. అలసిపోతున్నాం.  కాని అసలు ఎందుకో తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ముందు ఈ కొత్త ఏడాది లోనైనా మన గమ్యం పట్ల పూర్తి స్పష్టతను ఏర్పరచుకుంటే మంచిది. దానికి అనుగుణంగా మన గమనాన్ని నిర్దేశించుకావాలి.  ఆధునిక బలహీనతలు.. అష్టకష్టాలు.. సహజంగా మనలో ఉండే బలహీనతలకు తోడు నేడు ఆధునికమైనవి కూడా వచ్చి తోడయ్యాయి. అసలే కోతి, ఆపై పిచ్చి, కల్లు తాగి, నిప్పులు తొక్కి.... అన్నట్లుగా మారిపోయింది ప్రస్తుతం మన మనఃస్థితి. యుక్తవయసులో అసలే కుదురుగా ఉండని మనస్సును సెల్ఫోన్లు, ఇంటర్నెట్లు మరింత ఇరకాటంలో పడేశాయి. ఆధునిక మానవుడికి సెల్ఫోన్ రూపంలో మరో శరీరభాగం వచ్చి చేరినట్లయింది. విలాసాల్ని అవసరాలుగా భ్రమించడం వల్లనే ఈ ప్రమాదమంతా.   ఇవి మానసికంగా, శారీరకంగా ఎంత బలహీనుల్ని చేస్తున్నాయో యువతీయువకులు గమనించడం లేదు. ముఖ్యంగా జీవితానికి పటిష్టమైన మార్గాన్ని నిర్మించుకోవలసిన విలువైన ప్రాయంలో ఇవి  ఏకాగ్రతను ఛిన్నాభిన్నం చేస్తాయి. 'simple living high thinking'  ను  జీవనశైలికి మలచుకోవాలి. అలా చేస్తే ఈ ఆధునిక బలహీనతల నుండి బయటపడవచ్చు. ఆహారాలు... ఆహార్యాలు... భగవద్గీతను చదవడం కన్నా ముందు ఫుట్బాల్ ఆడి శరీరాన్ని దృఢం చేసుకోండి.  మానసికంగా, శారీరకంగా బలహీనపరిచే దేనినయినా విషంలా తిరస్కరించండి అనే వారు స్వామి వివేకానంద. బాణం గురి చేరాలంటే ముందు ధనుస్సు బలంగా ఉండాలి. ధనుస్సే బలహీనంగా ఉంటే, ఇక బాణం గురించి చెప్పేదేముంటుంది. ఆధునికత పేరుతో అస్తవ్యస్తమైన ఆహార, ఆహార్యాల వెంట పరుగులు తీస్తున్నాం. అందుకే మనలో చాలామంది ముఖాల్లో కృత్రిమ కాంతులు.... అద్దకపు అందాలు. వీటన్నింటికీ కారణం మన జీవనంలో సహజత్వం లోపించడం. పసిబిడ్డ ఉగ్గుపాల నుంచి పండ్లరసాల వరకు అన్నింటినీ మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నాం. భారతీయ జీవనవిధానానికి సరిపోలని సంస్కృతుల్ని దిగుమతి చేసుకొని మనకు మనమే కృతకంగా బ్రతుకులీడుస్తున్నాం. ఆహార, ఆహార్యాలనేవి వారి వారి భౌగోళిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వారసత్వంగా సంక్రమిస్తూ ఉంటాయి. ఒకరు ఇంకొకరి ఆహార, ఆహార్య, ఆచారాలను గుడ్డిగా అనుకరించడం వలన పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా మారిపోతుంది. అందుకే భౌతికంగా, బౌద్ధికంగా మనల్ని ధీరోదాత్తులను చేసే జీవనశైలిని అలవరచుకుంటే కొత్త ఏడాదిలో జీవితం విజయానికి చేరువ అవుతుంది.                                              *నిశ్శబ్ద.
భారతీయుల ఆహారం చాలా విశిష్టమైనది. ఇందులో పేర్కొన్న ప్రతి ఆహారం వెనుకా  ఒక ప్రత్యేక కారణం, బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. చాలామంది ఆరోగ్య స్పృహతో తినే ధాన్యాలలో పెసరపప్పు కూడా ఒకటి. పెసరపప్పు ఆహారంగానే కాకుండా ఆయుర్వేదంలోనూ, వైద్యంలోనూ మంచి ఔషదంగా కూడా పరిగణిస్తారు. అయితే  చాలామంది ధాన్యాలను మొలకెత్తించి తినడం చూస్తుంటాం. శనగలు, పెసలు, బొబ్బర్లు వంటి ధాన్యాలు తరచుగా తింటూ ఉంటారు. అయితే మొలకెత్తిన పెసలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆహార నిపుణులు అంటున్నారు.  ఈ లాభాలేంటో తెలుసుకుంటే.. మొలకెత్తిన పెసలు  బరువు తగ్గించడంలో  సహాయపడుతాయి.  రోజూ ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది తొందరగా ఆకలి వేయకుండా కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.  ఇది మాత్రమే కాదు.. మొలకెత్తిన పెసలలో కేలరీలు చాలా తక్కువ ఉంటాయి. ఈ కారణంగా ఇవి బరువు పెరగనీయవు. ఇక మొలకెత్తిన పెసలు  కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి ఎందుకంటే ఇందులో విటమిన్ 'A' ఉంటుంది. ఇది కాకుండా  ఉబ్బరం,  కడుపులో యాసిడ్లు ఏర్పడటం వంటి సమస్యలలో  కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో  మొలకెత్తిన పెసలు  సహాయపడుతాయి.  అధిక గ్యాస్, అజీర్ణం,  ఉబ్బరంతో బాధపడేవారు మొలకెత్తిన  పెసలను  తినవచ్చు. ఇది  బలహీనమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.  మొలకెత్తిన పెసలను  తీసుకోవడం వల్ల రోజంతా  శక్తివంతంగా ఉండచ్చు.  దీన్ని తినడం వల్ల సోమరితనం లేదా బద్దకం దరిచేరదు. మరీ ముఖ్యంగా మొలకెత్తిన పెసలు  శరీరానికి చలువ చేస్తాయి. దీని కారణంగా వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తాయి. వేసవి తాపం నుండి శరీరాన్ని రక్షిస్తాయి.                                                  *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ లో ఒక  భాగం. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి.  ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస సమయంలో  ఖర్జూరం తినడం తోనే ఆ రోజు ఉపవాసాన్ని విరమిస్తారు. పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరాలు ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి.  ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన 2 ఖర్జూరాలు తింటూ ఉంటే కలిగే మ్యాజిక్ ఫలితాలేంటో తెలుసుకుంటే తప్పకుండా ప్రతిరోజూ ఖర్జూరాలు తినడం మొదలుపెడతారు.. ఫైబర్.. నానబెట్టిన ఖర్జూరంలో అధికమొత్తంలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణవ్యవస్థను బలంగా మారుస్తుంది.  జీవక్రియను మెరుగుపరుస్తుంది.  మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.  పేగు  ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎనర్జీ.. నానబెట్టిన ఖర్జూరాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి గొప్ప శక్తి అందుతుంది.  ఇది రోజును ఉత్సాహంగా ప్రారంభించేందుకు తోడ్పడుతుంది. రోజంతా చురుగ్గా ఉండాల్సి న వ్యక్తులు నానబెట్టిన ఖర్జూరం తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. స్కిన్.. చర్మం ఆరోగ్యం మీద దృష్టి ఉన్నవారు నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా అవసరం.  ఎందుకంటే నానబెట్టిన ఖర్జూరం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.  ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె.. ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.   ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.  అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తింటే చాలా మంచిది. ఎముకలు.. ఖర్జూరంలో ఐరన్, కాల్షియం,  విటమిన్లు మంచి మొత్తంలో ఉంటాయి.  ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి.  ఎముకలు బలహీనంగా ఉన్నవారు ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా మంచిది. మధుమేహం.. ఖర్జూరం తీపి ఎక్కువగా ఉన్నా నానబెట్టిన తరువాత వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఈ కారణంగా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునే వారు నానబెట్టిన ఖర్జూరం తింటే చక్కెర స్థాయిలు ఆరోగ్యంగానే ఉంటాయి. రక్తహీనత.. భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు రక్తహీనత తో బాధపడుతున్నారు.  ఖర్జూరంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల నానబెట్టిన ఖర్జూరాలు రోజూ ఉదయమే తింటూ ఉంటే హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. ఒత్తిడి.. ఖర్జూరాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  ఒత్తిడితో పోరాడేవారు రోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఒత్తిడి తగ్గుతుంది. తల్లిపాలు.. పరిశోధనల ప్రకారం పిల్లలకు పాలిచ్చే తల్లులు ఉదయాన్నే నానబెట్తిన ఖర్జూరం తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.                                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...