LATEST NEWS
  రాయలసీమ జిల్లాలలో తిరుగులేని హవా నడిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సింగిల్ జిల్లాకు పరిమితం కానున్నారు. అయనకు రాజకీయంగా చెక్ పెట్టడానికి  అన్నిదారులను కూటమి ప్రభుత్వం మూసివేస్తుంది. గతంలో మూడు జిల్లాలకు పరిమితమైన అయన హావాను కేవలం ఓ జిల్లాకు పరిమితం చేయడానికి సిద్దమైంది. అందులో బాగంగానే అయన నియోజకవర్గం పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలపిందంటున్నారు. దాంతో పాటు అయన అస్తులపై విజిలెన్స్ నివేదిక అదారంగా ఎక్కడి కక్కడ చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం దూకుడు పెంచింది. పెద్దిరెడ్డిని ఒక్క జిల్లాకు పరిమితం చేయడంతో టీడీపీ నేతల కంటే వైసీపీ సీనియర్లు తెగ హ్యాపీగా పీలవుతున్నారంట.వైసీసీ ప్రభుత్వంలో జిల్లాలో విభజన జరిగినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తన కుటుంబ ప్రాబల్యం ఉండేట్లు పెద్దిరెడ్డి చక్రం తిప్పారు.   తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్‌లో ఉన్నప్పటికి చాల తెలివిగా తన నియోజకవర్గాన్ని మాత్రం చిత్తూరు జిల్లాలో కలిపించుకున్నారు. ఆయన కూమారుడు మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపి కావడంతో పాటు సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి  ప్రాతినిధ్యం వహిస్తున్న తంబల్లపల్లి నియోజకవర్గం కూడా అన్నమయ్య జిల్లాలో ఉంది. దీనికితోడు అయనకు రాజంపేట నియోజకవర్గంలో దగ్గర బంధువులు ఉన్నారు. మరో వైపు పెద్దిరెడ్డి నివాసం తిరుపతిలో ఉండటంతో అక్కడ కూడా తనకు ప్రోటో‌కాల్ కోసం తన నియోజకవర్గంలోని పులిచెర్లను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ అగిపోయింది.అయితే అయన వ్యాపారాలు అస్తులు తిరుపతిలో ఉండటంతో పాటు అయన అనుంగు శిష్యులు అంతా తిరుపతి జిల్లాలో ఉండటంతో ఇక్కడ కూడా అయన ప్రభ వెలిగిపోయింది అధికారం ఉన్నప్పుడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయన వర్గం 2019-24 మద్య కాలంలో తమ అధికారాన్ని అన్ని విధాలుగా 3 జిల్లాలలో చూపించారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున భూముల అక్రమణ జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులిచెర్ల మండలంలోని మంగళం పెట అటవీ భూముల్లో  సరిహద్దు రాళ్లు నాటిన పెద్దిరెడ్డిపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసింది. పాకాల కోర్టులో దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ మొదలు అయ్యాయి. మదనపల్లి బండమీదామ్మపల్లెలో అయన ఆక్రమించిన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో సీఐడీ కోర్టులో ప్రోసీడింగ్స్ మొదలయ్యాయి.. ఇక తిరుపతిలోని పెద్దిరెడ్డి నివాసం,  పార్టీ కార్యాలయం, గోశాల అన్నీ బుగ్గ మఠానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో ఉన్నాయన్న సర్వే డిపార్ట్ మెంటు నివేదిక అదారంగా అయనను విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు. ఇక ఏపీ లిక్కర్ స్కాంలో పెద్దిరెడ్డి కొడుకు ఎంపీ మిధున్‌రెడ్డి నాలుగో నిందితుడు.  అలా పెద్దిరెడ్డిపై ముప్పేట దాడి మొదలవ్వడంతో కూటమి శ్రేణులతో పాటు వైసీపీ నేతలు కూడా ఖుషీ అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోపెద్దిరెడ్డి చెప్పిందే శాసనం అన్నట్లు నడిచింది. అప్పట్లో అయనను కేవలం అన్నమయ్య జిల్లాకే పరిమితం చేయాలని వైసీపీలోన మిగతా జిల్లా మంత్రులు , సీనియర్లు ప్రయత్నించినప్పటికి ఫలించలేదు. అప్పట్లో డిప్యూటీ సియం గా ఉన్న నారాయణ స్వామి కంటే మాములు మంత్రి అయన పెద్దిరెడ్డికి అధికారిక కార్యక్రమాలలో అధికారులు పెద్దపీట వేసేవారు. చివరకు సియం హాజరైన అధికారిక కార్యక్రమంలో డిప్యూటీ నిలబడి ఉంటే ద్దిరెడ్డి కూర్చున్న పోటోలు అప్పట్లోసోషియల్ మీడియాలో  పెద్దఎత్తున హల్ చల్ చేసాయి. ఇక రోజా సైతం పెద్దిరెడ్డి వైభోగం చూస్తూ తనకు మంత్రి హోదా ఎందుకు అని ఫీలైన సందర్భాలున్నాయంట. ఇలాంటి తరుణంలో అయన నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో ఉండటంతో పుంగనూరుని చిత్తూరులో కలవవద్దని వైసీపీ నేతలు కోరారంట.  కాని అప్పుడు పెద్దిరెడ్డి హావా ముందు వీరి మాటలు సాగలేదంట. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీతో ఇబ్బంది రాకుండా తిరుపతి ,చిత్తూరు జిల్లా నుంచి దూరం చేయడానికి పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలిపేసింది. దాంతో పాటు పుంగనూరు సెగ్మెంట్లోని పులిచెర్ల మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడానికి చర్యలు తీసుకుందంట. పులిచెర్ల మండలం గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేది. పులిచెర్లలో టీడీపీ బలంగా ఉండటంతో ఆ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపి సొంత నియోజకవర్గంలో కూడా పెద్దిరెడ్డికి చెక్ పెట్టడానికి స్కెచ్ గీసిందంటున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై చాలామంది వైసీపీ ముఖ్య నేతలు హ్యాపీగా ఫీలవుతున్నారంట. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైసీపీ నేతలు ఇకపై పెద్దిరెడ్డి పెత్తనం ఉండదని సంబరపడిపోతున్నారంట.
  తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి పురోహిత సంఘం వద్ద  ఉన్న ఖాళీ ప్రదేశంలో ముస్లిం వ్యక్తి నమాజ్  చేయడం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలకి ఎదురుగానే అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. పురోహిత సంఘం వద్దే ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇలా చేయడం ఏంటని.. భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహిస్తున్నారు.  గుర్తు తెలియని వ్యక్తి నమాజ్ చేయడాన్ని అటు స్థానికులు సైతం గమనించారు. వెంటనే టీటీడీకి సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. తిరుమలకు వచ్చిన ఆ వ్యక్తి వాహనం నెంబర్ ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే రూల్ ఉన్నా అతిక్రమించడంపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్యమతస్తులు ప్రార్ధనలు చేయడం శ్రీవారిని అపచారం చేయడమేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పల్గమా దాడి నేపద్యంలో ఇలాంటి ఘటనలో తిరుమలలో జరగడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నరు  
  కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి తెలంగాణ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2017 లో  మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం, గుర్తురులో ఝాన్సీ రెడ్డి రాజేందర్‌రెడ్డి దంపతులు 75 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కోసం ఈ స్థలంలో శంకుస్థాపన చేయడంతో భూమి వ్యవహా రం వెలుగుచూసింది. ఈ స్థలాన్ని విదేశీయురాలైన ఝాన్సీరెడ్డి ఎలా కొనుగో లు చేసిందని వర్ధన్నపేట, ఇల్లంద ప్రాంతానికి చెంది న దామోదర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో భారత పౌరసత్వాన్ని వదిలి అమెరికా పౌరసత్వం స్వీకరించిన ఝాన్సీరెడ్డి, విదేశీ మారక వ్యవహారాల చట్టం ప్రకారం వ్యవసాయ ల్యాండ్ కొనుగోలు చేయడం నేరం. పిటిషనర్ వాదనల ప్రకారం, ఝాన్సీ రెడ్డి భారత పౌరసత్వాన్ని వదులుకుని అమెరికా పౌరసత్వం స్వీకరించారని, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ప్రకారం ఆమె వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించి ఈ భూమిని దక్కించుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం కూడా జారీ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఈ పిటిషన్‌పై మే 1వ తేదీన జస్టిస్ సీవీ భాస్కరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తాజా విచారణలో... ఝాన్సీ రెడ్డి ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో, భూమి కొనుగోలు వ్యవహారంపై జూన్ 19వ తేదీలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆమెకు, ఆమె భర్తకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారితో పాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్‌లకు కూడా న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ ను మోకాళ్లపై నిలబెట్టామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రాజస్థాన్ లోని బికనూర్ ఎయిర్ బేస్ ను గురువారం (మే 22) సందర్శించిన మోడీ ఆ తరువాత ఓ బహిరంగ సభలో మాడారు.   పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందన్నారు. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలను కేవలం 22 నిముషాలలో ధ్వంసం చేశామన్నారు.  గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి మే 7న చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో బదులు తీర్చుకున్నామని వెల్లడించారు. మన ఆడపడుచుల సిందూరం తుడిచిన ఉగ్రవాదులకు సిందూరం తుపాకి తూటాగా మారితే ఏం జరుగుతుందో చూపామన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారనీ, ఆపరేషన్ సిందూర్ తో వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారనీ ప్రధాని మోడీ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడితో తన నరాల్లో రక్తం కాదు సిందూరం మరిగిందన్న ప్రధాని మోడీ.. ఇక ముందు కూడా ప్రతి ఉగ్రదాడిని, ఉగ్ర చర్యనూ యుద్ధంగానే పరిగణిస్తామన్నారు.  
  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక బ్యారేజీలో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. మేడిగడ్డ పగుళ్లకు బహుశా కాంగ్రెస్ నాయకులు బాంబులు పెట్టారని అనుమానం వస్తోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనం సుప్రీంకోర్టుకు అర్ధమైంది. కానీ సీఎం రేవంత్‌రెడ్డికి అర్థం కావట్లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ప్రజాపాలన పర్సంటేజీ పాలనగా మారిందని ఆయన అన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నోటీసులు. కాంగ్రెస్ పార్టీ కమిషన్లు బయటపడుతున్నాయని తెలిశాకే.. ఇప్పుడు నోటీసుల పేరిట తమాషాలు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వ్యాఖ్యానించిందని కేటీఆర్ పేర్కొన్నారు.  జస్టిస్ గోష్ తన నివేదిక పూర్తయిందని, విచారణ పూర్తయిందన్నారు. అయితే కమిషన్‌ గడువు మళ్లీ ఎందుకు పొడిగించారో ప్రభుత్వం చెప్పాలి. కాళేశ్వరం నోటీసులు ఇప్పటిదాకా నేరుగా అందినట్టు సమాచారం లేదు. అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాంమని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గ్లామర్ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు.రేవంత్ రెడ్డి ప్రమాదకరమైన మానసిక స్థితి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారు.  అందుకే ఒకే అంశంపై రోజుకో మాట మాట్లాడుతున్నారు" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 580 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వర్షాలకు వరి ధాన్యం కొట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. "ఇలాంటి సమయంలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి, రేవంత్ రెడ్డి నాలుగుసార్లు మిస్ వరల్డ్ కార్యక్రమాలకు హాజరయ్యారు. తెలంగాణకు ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా?" అని ఆయన ప్రశ్నించారు.రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెబుతూనే, అందాల పోటీల కోసం ప్రభుత్వం రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. "సీపీఐ నేత నారాయణ చెప్పినట్లుగా, మంత్రులు అందాల రాణులకు టూర్ గైడ్‌లుగా మారారు. ఇది పాలనా లేక ఫ్యాషన్ షోనా?" అని కేటీఆర్ నిలదీశారు.
ALSO ON TELUGUONE N E W S
Mega Fans are trending #BoycottBhairavam and they are serious about no one watching the movie. Going into the details, the movie stars Bellamkonda Sai Sreenivas, Manchu Manoj and Nara Rohith. It is directed by Vijay Kanakamedala and fans are so aggressively trending on social media against him.  The director debuted with Allari Naresh's Naandhi and made Ugram with him. During the release both these two films, mega fans did not talk about boycotting or his older posts. The fans are circulating his older posts where he trolled Megastar Chiranjeevi and Ram Charan, politically, using some morphs.    Looking at these posts, we can say that he posted them way back in 2011, during Prajarajyam party merging with Congress. But digging them up now and circulating showcases some sort of negative PR agency looking to provoke fans against the film. We don't know who but that seems apparent.  Well, Vijay Kanakamedala may have to appologise for his posts to calm down the people who are posting them. We have to wait and see, how the team will handle this issue as it is releasing on 30th May. 
  బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారం చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది. పైగా 'భైరవం' విజయం అనేది టీం అందరికీ కీలకం. ఇలాంటి టైంలో మూవీ టీంకి ఊహించని షాక్ తగిలింది. ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది.   సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీ హోదా రాకముందు.. ఎవరైనా స్టార్స్ ని ట్రోల్ చేస్తూ ఏవైనా దారుణ పోస్ట్ లు పెట్టి ఉంటే.. వాటిని డిలీట్ చేయడం మంచిది. అసలు అలాంటి పోస్ట్ లే చేయకపోవడం మరీ మంచిది. కానీ కొందరు తెలిసో తెలియకో ట్రోల్ చేసి.. ఆ తర్వాత వాటిని డిలీట్ చేయక.. ఇరుకున పడతారు. ఇప్పుడు దర్శకుడు విజయ్ కనకమేడల విషయంలో కూడా అదే జరిగింది అంటున్నారు.   2011 లో చిరంజీవి, రామ్ చరణ్ లను ట్రోల్ చేస్తూ విజయ్ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. #BoycottBHAIRAVAM హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.    మరి ఆ పోస్ట్ నిజంగానే విజయ్ కనకమేడల చేశాడా? లేక ఆయన పేరుతో ఎవరైనా ఫేక్ అకౌంట్ తో చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏదైనా ఎప్పుడో 14 ఏళ్ళ క్రితం నాటి పోస్ట్ కారణంగా ఇప్పుడు 'భైరవం' సినిమా వివాదంలో చిక్కుకుంది. మరి దీనిపై విజయ్ కనకమేడల ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.  
Deepika Padukone is one of the biggest powerhouses of Bollywood Cinema and a bonafide star. She made a successful combination with Shah Rukh Khan and more recently, both his 1000 crore blockbusters - Pathaan and Jawan- had her in leading role. So, if she makes unreasonable demands, would Bollywood just accept and tow along?  The rumor mills have been going overboard spreading that Sandeep Reddy Vanga "rejected" her due to her unreasonable demands to be part of Spirit. Conversely, she is said to be cast in Allu Arjun and Atlee's film. Many are asking if she walked out due to "creative differences" about her character or if really director rejected.  Sridevi put forth some exorbitant conditions when Baahubali makers approached her but she did Thalapathy Vijay's Puli, that came out an year later. Now, the makers of Spirit, the next film by Sandeep Reddy Vanga with Prabhas as the main lead, said to have approached Deepika and she put forth unreasonable demands.  Not going into specifics, one wonders, if she is known to put forth any unreasonable demands, she would not have been part of Kalki 2898 AD, with Prabhas in lead role and she will join Kalki 2 sets for sure. She did give lip sync to Telugu lines and she did not dub. So, what changes for Sandeep Reddy Vanga's film? The makers are not in tone with paying Rs.20 crores paycheck and also for 8 hours shift timings. Sandeep Reddy already stated that he has no problem with actors coming at their time but he wants them to inform him beforehand and stick to it.  A 20-crore paycheck is not an unreasonable demand by a successful actress like Deepika Padukone as rumors stated Priyanka Chopra Jonas, asked for close to 25-30 crores paycheck for SSMB29 opposite Mahesh Babu in the direction of SS Rajamouli. Well, Rajamouli did not want to handle demands of Sridevi but he is okay with Priyanka?  The point seems to be simple, Deepika and Sandeep might have had disagreements about script and could have decided to not go forward. But this unreasonable demands rumor doesn't really sync in as she is now said to be a part of "AA22 X A6". Wouldn't Atlee also be afraid to handle all those demands, ask netizens.  Until, we know the real reasons behind anyone's inclusion or exclusion, these rumors can only be seen as mud-slinging activities and nothing much. Even she demands 8-hour shift and a big paycheck, for her stature it should not be a huge problem.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  బయోపిక్ ట్రెండ్ కొంతకాలంగా ఊపందుకుంది. బయోపిక్ లు చేయడానికి స్టార్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒకే బయోపిక్ కోసం ఒకే సమయంలో ఇద్దరు స్టార్స్ పోటీపడటం అనేది ఇటీవల చూస్తున్నాం.    భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ గా 'మేడ్ ఇన్ ఇండియా' ప్రకటన వచ్చింది. రాజమౌళి సమర్పణలో రూపొందనున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తాడని వార్తలొచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ గా మరో సినిమా తెరకెక్కనుందని, ఇందులో ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడని తెలిసి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఈ బయోపిక్ ని ఎన్టీఆరే ముందు చేస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే కన్నడ స్టార్ రిషబ్ శెట్టికి వచ్చింది.     రిషబ్ శెట్టి టైటిల్ రోల్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ ను గతేడాది చివరిలో ప్రకటించారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా.. 2027 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీనికంటే ముందే మరో ఛత్రపతి శివాజీ బయోపిక్ థియేటర్లలో అడుగుపెట్టనుంది.   'రాజా శివాజీ' పేరుతో ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో ఛత్రపతి శివాజీ బయోపిక్ ను తాజాగా అనౌన్స్ చేశాడు. జ్యోతి దేశ్‌పాండే, జెనీలియా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మే 1న మరాఠీ, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇది ఓ రకంగా రిషబ్ శెట్టికి షాక్ అనే చెప్పాలి.     శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఛావా' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో సంచలన వసూళ్లు సాధించింది. ఆ ఉత్సాహంతోనే శివాజీ బయోపిక్ కి రితేష్ శ్రీకారం చుట్టినట్టున్నాడు. ఈ సినిమా కూడా ఛావా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తే.. రిషబ్ శెట్టి ప్రాజెక్ట్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.  
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు(Sri Vishnu)కేతిక శర్మ(Ketika Sharma)ఇవానా(Ivana)వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'సింగిల్'(Single). శ్రీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకెళ్తున్న ఈ మూవీ రెండు వారాలు దాటినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్ళని సాధిస్తుంది.  తాజాగా ఈ మూవీ యుఎస్ లో 700K డాలర్ల క్లబ్ లో చేరి చిన్న సినిమాల్లోనే సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళ్తుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. దీంతో యుఎస్ లో సింగిల్ మూవీ ఫైనల్ గా ఎంత మేర రాబడుతుందనే చర్చ సినీ సర్కిల్స్ లో జరుగుతుంది. సింగిల్ అయిన శ్రీవిష్ణు ఆడ తోడుకోసం తాపత్రయపడుతు, అతి తెలివితో తన లైఫ్ లోకి వచ్చిన ఇద్దరి అందమైన అమ్మాయిలని దూరం చేసుకుంటాడు. ఈ క్రమంలో శ్రీ విష్ణు చేసే కామెడీ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో వచ్చే  కామెడీ సీన్స్ కి రిపీట్ ఆడియెన్స్ కూడా వెళ్తున్నారు. కేతిక శర్మ, ఇవానా కూడా తమ క్యారక్టర్ ల మేరకు అత్యద్భుతంగా నటించి చిత్ర విజయంలో బాగస్వామ్యమయ్యారు.   కార్తీక్ రాజు(Caarthick Raju)రచనా దర్శకత్వంలో తెరకెక్కిన సింగల్ ని గీతా ఆర్ట్స్, కళ్యా ఫిలింస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు. సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలియచేస్తు చిత్ర బృందం రీసెంట్ గా విజయయాత్ర కూడా చేసింది.      
భోళాశంకర్ పరాజయంతో ఈసారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలనే పట్టుదలతో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)'విశ్వంభర'(Vishwambhara)మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి'బింబిసార' ఫేమ్ వశిష్ట(Vasishta)దర్శకుడు కావడంతో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. గత నెలలో 'హనుమాన్ జయంతి' రోజున విడుదలైన 'రామ రామ' సాంగ్  ఆ అంచనాలని రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. యువి క్రియేషన్స్ పై పలు హిట్ చిత్రాలని నిర్మించిన   విక్రమ్ రెడ్డి, ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 'విశ్వంభర' ని నిర్మిస్తున్నారు. ఈ నెల 13 నుంచి 25 వరకు ఫ్రెంచ్ రివేరాలో ఉన్న కేన్స్(Cannes)నగరంలో ప్రతిష్టాత్మకమైన'కేన్స్ ఫిలింఫెస్టివల్(Cannes Film Festival)జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఫెస్టివల్ లో 'విశ్వంభర' కి సంబంధించిన విషయాలు దాగి ఉన్న ఒక పుస్తకాన్ని విక్రమ్ రెడ్డి ఆవిష్కరించాడు. ఈ విషయాన్నీ తెలుపుతూ సోషల్ మీడియాలో  నిర్మాణ సంస్థ ఫోటోలు పంచుకోవడంతో పాటు విశ్వంభర ప్రపంచం త్వరలోనే మీ ముందుకు ఒక అద్భుతాన్ని తీసుకురానుంది. ఈ పుస్తకంలో ఏం ఉందో తెలుసుకోవాలంటే వేచి ఉండండని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ    పుస్తకానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న విశ్వంభరలో త్రిష(Trisha)ఆషికా రంగనాధ్, ఇషాచావ్లా, కునాల్ కపూర్, రావు రమేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి(keeravani)సంగీత సారధ్యం వహించగా త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే  అవకాశం ఉంది.    
Ram Charan joined hands with Buchi Babu Sana to deliver a rural based sports drama Peddi. The makers have promoted the film as a magnum opus that will be a memorable theatrical experience to all. The movie glimpse has gone viral with the huge cricketing shot by Charan. Venkata Satish Kilaru is producing the film.  On the occasion of Hanuman Jayanthi, director Buchi Babu shared a BTS click from the film with Ram Charan and Divyendu Sharma, famous as Guddu Bhai from Mirzapur web series, in get-up between the shots. Buchi Babu stated that the two are working hard and enjoying the process of making the film.  The movie shoot is 30% completed till date and they announced that this huge schedule will continue in a village set, specially built in Hyderabad. Shiv Rajkumar and Janhvi Kapoor are playing prominent roles in the film. AR Rahman is composing music and the movie is set to release all over on 27th March, 2026. 
  పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్. ఆయన నటించిన కొత్త సినిమా "నిశ్శబ్ద ప్రేమ". ఈ చిత్రంలో ప్రియాంక తిమ్మేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సెలబ్రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత కార్తికేయన్.ఎస్ నిర్మించారు. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు రాజ్ దేవ్ రూపొందించారు. "నిశ్శబ్ద ప్రేమ" సినిమా ఈ నెల 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.   ఈ రోజు ఈ సినిమా ట్రైలర్, సాంగ్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్, నిర్మాత చింతపల్లి రామారావు, నిర్మాత  రాజేశ్ పుత్ర, డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ ట్రైలర్ లాంచ్ చేయగా, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ సాంగ్ విడుదల చేశారు.      ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ మాట్లాడుతూ.. "నిశ్శబ్ద ప్రేమ చిత్రంతో మా పరిటాల రాంబాబు డిస్ట్రిబ్యూటర్ గా మారడం సంతోషంగా ఉంది. తమిళంలో ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసింది. లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా. హీరో శ్రీరామ్ మరో మంచి మూవీతో మన ముందుకు రాబోతున్నారు. నిశ్శబ్ద ప్రేమ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా." అన్నారు.   ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. "నిశ్శబ్ద ప్రేమ చాలా మంచి టైటిల్. శ్రీరామ్ గారు మన తెలుగు హీరో. ఆయన రోజాపూలు సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. వయలెన్స్ కంటే సైలెన్స్ శక్తి ఉన్నది. నిశ్శబ్ద ప్రేమ సినిమాలో ఒక మంచి మూవీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. అలాగే నిర్మాత కార్తికేయన్ ఫారెన్ లో జాబ్ చేస్తూ సినిమా మీద ప్యాషన్ తో వచ్చి ఈ సినిమా రూపొందించారు. ఆయన మంచి అభిరుచి గల నిర్మాత అని అర్థమవుతుంది. అటువంటి ఆయన త్వరలో తెలుగులో కూడా సినిమా తీయాలని కోరుకుంటున్నాను. అలాగే డిస్ట్రిబ్యూటర్ గా వస్తున్న మన పరిటాల రాంబాబుకు సక్సెస్ దక్కాలని కోరుకుంటున్నా. సక్సెస్ మీట్ లో మరోసారి మనమంతా కలుద్దాం." అన్నారు.   నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. "నిశ్శబ్ద ప్రేమ సినిమా హీరో శ్రీరామ్ గారికి మంచి సక్సెస్ ఇవ్వాలి. ఆయన తెలుగులో మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. డిఫరెంట్ లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు రాజ్ దేవ్ రూపొందించారు. తమిళంలో ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ కావాలి. కార్తికేయన్. ఎస్. ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సరికొత్త థ్రిల్లర్ లవ్ స్టోరీగా "నిశ్శబ్ద ప్రేమ" సినిమా మీ ముందుకు రాబోతోంది. ఈ నెల 23న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. తెలుగు ఆడియెన్స్ కంటెంట్ ఉన్న చిత్రాలను తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది." అన్నారు.   హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. "నిశ్శబ్ద ప్రేమ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్న ప్రసన్నకుమార్ గారికి, వీరశంకర్ గారికి, రామారావు గారికి ఇతర గెస్ట్ లకు థ్యాంక్స్. లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిపిన గ్రిప్పింగ్ మూవీ ఇది. ఏమాత్రం మిమ్మల్ని నిరాశపర్చదు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇలాంటి టీమ్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. తమిళంలో హిట్ అయిన తర్వాత కూడా ఎంతో ప్రయాసపడి తెలుగులోకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు మా ప్రొడ్యూసర్, డైరెక్టర్. వారికి థ్యాంక్స్ చెబుతున్నా. మంచి సినిమాకు భాషా హద్దులు లేవు. ఏ భాషలోని సినిమా అయినా కంటెంట్ ఉంటే మరో చోట తప్పకుండా ఆదరణ పొందుతుంది. "నిశ్శబ్ద ప్రేమ" సినిమా సక్సెస్ మీద కూడా అలాంటి నమ్మకమే మా అందరికీ ఉంది." అన్నారు.   హీరోయిన్ ప్రియాంక తిమ్మేష్ మాట్లాడుతూ.. "నిశ్శబ్ద ప్రేమ సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామ్ గారికి,  ప్రొడ్యూసర్ కార్తికేయన్, డైరెక్టర్ రాజ్ దేవ్ గారికి థ్యాంక్స్. ఈ నెల 23న మా "నిశ్శబ్ద ప్రేమ" సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా థియేటర్స్ కు వెళ్లి మా మూవీని చూస్తారని కోరుకుంటున్నా." అన్నారు.   డైరెక్టర్ రాజ్ దేవ్ మాట్లాడుతూ.. "నిశ్శబ్ద ప్రేమ ట్రైలర్, సాంగ్ లాంచ్ కు వచ్చిన గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. మా మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. "నిశ్శబ్ద ప్రేమ" సినిమా తమిళంలో మంచి ఆదరణ పొందింది. తెలుగులో ఈ నెల 23న రిలీజ్ కు వస్తోంది. తెలుగు ఆడియెన్స్ కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం." అన్నారు.   నటుడు వియాన్ మాట్లాడుతూ.. "నేను మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చాను. నా ఫస్ట్ తమిళ్ మూవీ ఇది. తెలుగులో నాకు చాలా మంది ఫేవరేట్ హీరోస్ ఉన్నారు. "నిశ్శబ్ద ప్రేమ" చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ గార్లకు థ్యాంక్స్. "నిశ్శబ్ద ప్రేమ" సినిమాకు మీ సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాం." అన్నారు.  
  పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల 'హరి హర వీరమల్లు' షూటింగ్ పూర్తి చేశారు. ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 'ఓజీ' షూట్ కూడా స్టార్ట్ చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా లైన్ లో ఉంది. కానీ, ఆ సినిమాను పవన్ పూర్తి చేస్తాడా లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది.   'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్ మెంట్ తోనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే కొంతభాగం షూట్ చేశారు. గ్లింప్స్ కూడా విడుదలై ఆకట్టుకుంది. అయితే పవన్ పాలిటిక్స్ తో బిజీ అవ్వడం.. 'హరి హర వీరమల్లు', 'ఓజీ' ఆలస్యమవ్వడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉంటుందా లేదా? అనే డౌట్స్ వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ.. తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుపుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది అభిమానులకు, సినీ ప్రియులకు ఫ్యాన్ బాయ్ అందిస్తున్న ఫీస్ట్ అని..సెలెబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి, చాలా ఏళ్ళు గుర్తుండిపోతుంది అని రాసుకొచ్చారు.    మొత్తానికి 'హరి హర వీరమల్లు', 'ఓజీ'తో పాటు 'ఉస్తాద్ భగత్ సింగ్'ను కూడా పవన్ పూర్తి చేయబోతున్నారు. అంటే తక్కువ గ్యాప్ లోనే ఆయన నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి. వీటి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, తన ఫుల్ ఫోకస్ ని పాలిటిక్స్ పై పెట్టే అవకాశముంది.    
Power Star Pawan Kalyan announced two biggies while Hari Hara Veera Mallu in shooting - OG and Ustaad Bhagat Singh. He planned to complete them before 2024 AP elections and both started shooting in 2023. But all three films had to wait for PK to adhere to his political ambitions and commitments before he can join shoots.  Mythri Movie Makers have been patiently waiting for him to join the sets and now, he completed HHVM shoot. He even joined OG shoot and the team is planning to release it by September or October. So, even Mythri also approached him and he accepted to continue shooting for the film from June.  Officially, the makers have made the announcement today, on Hanuman Jayanthi. Well, Pawan Kalyan fans are expecting another huge cult blockbuster from Gabbar Singh combination and Harish is promising another fanboy tribute to the star. But he delivered a disaster like Mr. Bachchan that even earned him huge trolls.  We have to wait and see, what he will deliver this time. Rockstar Devi Sri Prasad is composing music for the film. Sreeleela is playing the leading lady role and Ashutosh Rana, Nawab Shah, KGF Avinash, Gauthami are cast in other prominent roles. The movie shoot will progress at a brisk pace say makers. 
కలలు అందరికీ వస్తాయి. అయితే ప్రతి కలలో ఏదో ఒకటి కనబడుతూ ఉంటుంది అందరికీ. అలా కలలో కనిపించే వస్తువు, ప్రదేశం ఇతరం ఏదైనా సరే.. దాన్ని బట్టి మనిషికి కొన్ని విషయాలను సూచిస్తుంది మనిషి అంతరంగం. మనిషి కలలో ఏమి కనబడితే ఏమవుతుంది?? ఏది దేనికి సంకేతంగా భావించబడుతుంది?? దానికి వివరణలు ఏమిటి?? ఫ్రాయిడ్ తన సిద్ధం ద్వారా నిరూపించిన విషయాలు ఇవీ... దేవదూత : కలగన్నవారు ఆధ్యాత్మిక శక్తి, ఉన్నతాత్మ, దివ్యగుణాలను (దయ, ప్రేమ, కరుణ, పవిత్రత) పొందాలనే ఆకాంక్షలకు ప్రతీక దేవదూత కలలో కనిపించడం. శిశువు: కొత్త జన్మ, కొత్త ఆదర్శాలను గుర్తించడం, చిన్న పిల్లల్లాగా  నిస్సహాయతను వ్యక్తం చేయడం దీనికి సంకేతం. అలాగే పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనే కోరిక, గర్భధారణ విషయంలో భయానికి ప్రతీక. చెంపలు: ఇవి  పిరుదులకు ప్రతీకలు, ఇవి కలలోకి వస్తే లైంగికేచ్చ అంతర్లీనంగా సంఘర్షణలో ఉన్నట్టు అర్థం. చెంపలు ఈ భావాన్ని  వ్యక్తం చేస్తాయి.  కన్ను:  దూరదృష్టిని, ఆప్రమత్తతను సూచిస్తుంది. జరగబోయే వాటి గురించి అప్రమత్తతను తెలియజేయడం దీని అర్ధం.  పెళ్లి కూతురు:  స్త్రీల కలలలో ఎక్కువగా కనిపించేది పెళ్లి కూతురు. మగవాడు పెళ్ళికూతురు గురించి కలగనడు. పెళ్ళికూతురే కలలో పెళ్ళి కూతురిని చూస్తే ప్రేమను వేడుకొందన్న మాట. తల్లిదండ్రుల శృంఖలాల నుంచి బయటికి అడుగుపెట్టడం దీనికి సంకేతం.  దొంగ : విలువైనది దేనినైన తస్కరించేవాడు. స్త్రీల విషయంలో మానాన్ని, కలగన్న వాడే దొంగ అయితే తను చేసిన, చేయనున్న దోషాలను బయటపెట్టడం, దొంగ తండ్రిని సూచించవచ్చు. ఫ్రాయిడ్ ప్రకారం, దొంగల భయం శైశవంలో పాతుకుపోతుంది. మంచం ప్రక్కన నిలబడ్డ తండ్రిని, ఆకస్మికంగా నిద్ర లేచిన బిడ్డ చీకట్లో చూచి దొంగ అనుకొంటాడు.  శవం: ఇది ఎప్పుడూ మనుష్యులు చావడాన్నే సూచించదు. అవాంఛనీయ ఆశ. ప్రేమసంబంధాల అంతాన్ని సూచించవచ్చు. తను కాదనుకొన్నవారిని మరణం ద్వారా తొలగిస్తాడు. తానే శవమైతే అనారోగ్యాన్ని, మృత్యుభయాన్ని, తను అనుభవిస్తున్న రోగబాధను సూచించవచ్చు.  పోలీసు:  అధికారం, శిక్ష, రక్షణ, అంతరాత్మ ఇవన్నీ విడివిడిగా లేదా కలిపి. రాణి: రాణి కలలో కనిపిస్తే తల్లి కాబోతున్నట్టు సంకేతమట. స్నానాల గది : లైంగిక, రుగ్మత, రహస్యకార్యమేదైన ఉంటే దానికి ఇది సంకేతం.  సేతువు : ఒక స్థితి నుంచి మరొక స్థితికి పరివర్తనం చెందటం. సేతువును దాటటమంటే కష్టాలను దాటడం. శ్మశానం : తన లేదా ఇతరుల మరణ వాంఛ. ప్రేమ భంగం లేదా సంబంధం తెగిపోవడం కూడా దీనికి సంకేతం. గుడి: ఆధ్యాత్మికంగా పైకి ఎదగడం, అపరాధాలను ప్రక్షాళనం చేసుకోవడం.  వ్యవసాయ క్షేత్రం : ప్రేమ, పెండ్లి, సంతానాలను సూచిస్తుంది.  హోటలు: హోటల్ కలలోకి రావడం అరుదే. అయితే ఇది పరివర్తన దశ. హోటలు తాత్కాలిక నివాసం. వాటి అంతస్తులు చేతనా చేతనలను సూచిస్తాయి. ద్వీపం : ఏకాంత సూచకం. ఒంటరిగా మౌనంగా ఉండాలని అనుకోవడానికి ఇది సూచన.  ఊబి: పరిస్థితులు తనను ముంచుతున్నాయను కొంటాడు స్వాపి. ఇతరుల సహాయం లేక బయట పడలేననుకొంటాడు. ఊబి ఎలాగైతే మనిషిని తనలోకి లాక్కుని సజీవంగా మరణం తెస్తుందో అలాగే నిజంగా జరుగుతుందని భయాడతారు. ఇలా కలలో కొన్ని విషయాలు కొన్ని సంకేతాలను ఇస్తాయి. అవన్నీ ఫ్రాయిడ్ తన సిద్ధాంత  పరిశీలన ద్వారా  రూపొందించినవి.                                          ◆నిశ్శబ్ద.
ఈ కాలంలో హాయిగా నిద్రపోవడం కూడా అదృష్టమే. ఎంతో మంది నిద్రలేమితో సతమతమవుతుంటారు. నిద్ర పట్టాలని ఎన్నో మార్గాలు అనుసరిస్తుంటారు. కానీ ఏవీ చక్కని పలితాన్ని ఇవ్వవు. కొందరు ధ్యానం అంటారు అయిదు నిమిషాలు స్థిరంగా కూర్చోలేరు. మరికొందరు ఒత్తిడి అంటారు దానివల్ల నిద్రలేమి అంటారు దాని కోసం డాక్టర్లను సంప్రదిస్తారు. మందులు వాడుతూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళు అలా మందుల వల్ల నిద్రకు అలవాటు పడి తరువాత వాటిని వాడటం ఒక్కరోజు ఆయన ఇక నిద్ర ఖరాబ్. మళ్లీ నిద్ర రాదు, పట్టదు. ఇంకొందరికి ఆలోచనలు.  జీవితం గూర్చి, భవిష్యత్తు గూర్చి.మరికొందరికి ఓర్వలేనితనం వల్ల నిద్ర పట్టదు. చెప్పుకోవడానికి, వినడానికి కాస్త ఆస్చశ్రయంగా అనిపించినా ఇది నిజం. ఒకరు ఎదుగుతున్నారంటే భరించలేని వాళ్ళుంటారు. వాళ్ళు ఎప్పుడూ ఇతరులు ఎదిగిపోతున్నారని ఆలోచిస్తూ తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఇదే కోవకు చెందినవాళ్ళు మరికొందరు ఉంటారు. ఇంకొందరు అయితే చాటింగ్ లు, బ్రౌజింగ్ లు, అనవసరపు పనులు చేస్తూ చేతులారా నిద్రను దూరం చేసుకుంటారు. ఇట్లా కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు. నిద్ర పట్టకపోవడానికి కూడా బోలెడు కారణాలు ఉన్నాయి. అయితే నిద్రకు ఒక చక్కని మందు ఉంది. అదేంటో తెలియాలి అంటే కింద విషయం చదవాలి. అనగనగా ఒకరాజు. ఆయన గొప్పవాడు. రాజ్యం ఉంది, సంపదలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. సకల సౌభాగ్యాలు ఉన్నాయి. కానీ ఆయనకు లేనిది ఒకటే నిద్ర. నిద్ర పట్టదు. పరుపు మీద పడుకుని దొర్లి దొర్లి పెడతాడు. కానీ నిద్ర రాదు. ఒకరోజు రాత్రిపూట నిద్రపట్టక తోటలోకి వెళ్ళాడు. ఆ తోటకు ఆనుకుని అడవి ఉంది. ఆ అడవి నుండి ఆ వేళ ఏదో శబ్దం వస్తోంది. ఈ సమయంలో ఎవరో చూడాలి అనుకుని తోట నుండి అడవిలోకి వెళ్ళాడు రాజు. ఆ అడవిలో ఒక వ్యక్తి చెట్టు నరుకుతూ కనిపించాడు. వెన్నెల వెలుగు ఉండటంతో పని జరుగుతోంది.  "నువ్వు రాత్రిపూట నిద్రపోకుండా చెట్టు నరుకుతున్నావు. నీకు నిద్ర పట్టదా" అని అడిగాడు రాజు. రాజు సాధారణ బట్టలు వేసుకుని ఉండటంతో ఆ వ్యక్తి అతన్ని రాజు అనుకోలేదు. "ఎందుకు రాదు అలా పడుకుంటే కొన్ని సెకండ్లలోనే .శవం మాదిరి నిద్రపోతాను. కానీ పని జరిగితేనే డబ్బులొస్తాయి. కాబట్టి తప్పదు పని చేయాలి" అన్నాడు ఆ వ్యక్తి. "ఏంటి సెకండ్లలోనే నిద్ర వచ్చేస్తుందా నేను నమ్మను" అన్నాడు రాజు. "నమ్మకపోతే నేను ఏమి చేయలేను" అన్నాడు ఆ వ్యక్తి. "ఒకపని చేద్దాం. నేను నీ బదులు చెట్టు నరుకుతాను. నువ్వు సెకండ్లలోనే నిద్రపోతా అన్నావుగా నిద్రపో చూద్దాం" అన్నాడు రాజు. ఆ వ్యక్తి సరేనని గొడ్డలి రాజుకు ఇచ్చి చెట్టుకింద అలా పడుకుని నిమిషంలోపలే గురక పెట్టి నిద్రపోయాడు. "పట్టు పరుపులు, మెత్తని దుప్పట్లు అన్ని ఉన్నా నాకు నిద్ర రాదు. వీడు చెట్టు కిందనే ఇట్లా ఎలా నిద్రపోయాడు" అనుకున్నాడు రాజు. ఆ తరువాత వాడికి మాట ఇచ్చాను కాబట్టి చెట్టు నరకాలి అనుకుని చెట్టు నరికేసాడు. అలవాటు లేని పని అవ్వడం వల్ల చేతులు బొబ్బలెక్కాయి. చెమటతో శరీరం తడిసి ముద్దయ్యింది.అలసట కలిగింది. కాళ్ళు, చేతులు లాగేసాయి. మెల్లిగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి అతడి పక్కనే అలా నడుము వాల్చాడు. నిమిషంలోపలే హాయిగా నిద్రపోయాడు. ఉదయాన్నే రాజుకు మెలకువ రాగానే అనుకున్నాడు. మనిషికి శారీరక కష్టమే మంచి నిద్రను ప్రసాదిస్తుంది అని.  కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే మంచి నిద్ర కావాలి అంటే కష్టపడి పనిచేయాలి. దురదృష్టం కొద్దీ ఈ కాలంలోప్రతి ఇంట్లో పని దొంగలు ఎక్కువ ఉంటున్నారు. పని మనుషులను పెట్టుకోవడం కూడా అందుకు ఓ కారణం. మనిషి శరీర ఆరోగ్యానికి, మంచి నిద్రకు ఏ వైద్యుడు ఇవ్వలేని గొప్ప ఔషధం కష్టం. అందుకే కష్టపడాలి. నష్టం ఏమి ఉండదు. ◆ వెంకటేష్ పువ్వాడ  
పిల్లలను పెంచడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడాలి. ఒక్కోసారి పిల్లలు చేసే అల్లరిని, వారు చెప్పే కట్టు కథలను తెలివిగా ఎదుర్కోవలసి ఉంటుంది. మరికొన్నిసార్లు పిల్లలు చేసే తప్పులను, మోసాన్ని తట్టుకోవలసి వస్తుంది,  కొన్నిసార్లు  పిల్లల డిమాండ్లను నెరవేర్చవలసి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చేస్తున్న ప్రతిదీ వారి మంచికోసమేనని, అది మంచి పనేనని భావిస్తుంటారు. దానికి అనుగుణంగానే నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు తమకు తెలియకుండానే మంచి అనే భ్రమలో పిల్లల జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. దీనికి సంబంధించి విషయాలను పేరెంటింగ్ నిపుణులు, కౌన్సిలర్లు కూడా వెల్లడిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చేస్తున్న తప్పులేంటో తెలుసుకుంటే.. నిర్ణయాలు.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది కావాలంటే అది చేయనివ్వమని నిర్ణయాలు పూర్తీగా పిల్లల చేతుల్లో పెట్టడం  తరచుగా కనిపిస్తుంది. పిల్లలు  తమ కెరీర్‌లో ఏమి కోరుకుంటున్నారు, వారికి ఏమి కావాలి, పిల్లలు కోరుకుంటున్నది ఏంటి?  ఈ విషయాలన్నింటికి సంబంధించి  తల్లిదండ్రులు చాలావరకు పిల్లల ఇష్టానికి వదిలేశాం అని చెబుతూ ఉంటారు.  పిల్లల ఇష్టమే మా ఇష్టం, మేము మా అభిప్రాయాలు పిల్లల మీద రుద్దడం లేదు. అని చెప్పుకుంటూంటారు కూడా.   ఈ కారణంగానే పిల్లల కెరీర్, వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు వారి చేతుల్లోనే పెడుతుంటారు. కానీ ఇది సరైన పద్దతి కాదని పేరెంటింగ్ నిపుణులు, కౌన్సిలర్లు అంటున్నారు. తల్లిదండ్రుల తప్పేంటి? చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏది అడిగినా దానికి నో చెప్పరు. దీనికి కారణం పిల్లలు ఇష్టమైన రంగంలో చాలా ఆసక్తి చూపిస్తారని దీని వల్ల వారు సులువుగా కెరీర్ లో విజయం సాధించి సెటిల్ అవుతారని నమ్మడం. కొందరు తల్లిదండ్రలు అయితే తమ పిల్లలు ఆసక్తి చూపించిన రంగంలో వారిని చేర్చి ప్రోత్సహించడానికి లక్షలాది రూపాయలు పోయడానికి అయినా సిద్దంగా ఉంటారు. కానీ పిల్లలు కెరీర్ లో విజయం సాదించలేకపోతారు. దీనికి కారణాన్ని పేరెంటింగ్ నిపుణులు కింది విధంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికాలం తల్లిదండ్రులు  చాలా బిజీ జీవితాలు గడుపుతున్నారు. పిల్లలకు ఏ లోటూ రాకూడదని లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టడానికి అయినా సిద్దమవుతారు. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం లేదు. ఆ లోటు భర్తీ చేయడానికి, అది బయటకు కనిపించకుండా ఉండటానికి వారు డబ్బును అడ్డు పెట్టుకుంటున్నారు. డబ్బుతో పిల్లలు విజయం సాధిస్తారని అనుకుంటున్నారు. కానీ ఇది చాలా పెద్జ తప్పు. చిన్న తనం నుండే తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన మార్గనిర్దేశకత్వం చేస్తూంటే అది వారి జీవితాన్నిసరైన దిశలో తీసుకెళ్తుంది. కేవలం డబ్బు వెచ్చింది పిల్లల బాగోగులను చూడటం అంటే అది కృత్రిమంగా పిల్లలను పెంచడం లాంటిది. అదే పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పటి నుండి వారి జీవితాన్ని  తోడ్పాటు ఇస్తూ వారి ఆలోచనలు సరైనవా కాదా అని వారితోనే చర్చింది ఆ తరువాత నిర్ణయం తీసుకునే అదికారం పిల్లలకు ఇస్తే అప్పుడు పిల్లలకు తమ జీవితంలో సాధించాల్సింది ఏంటి అనే విషయం మీద స్పష్టత వస్తుంది. అలా కాకుండా పిల్లల జీవితం ఎదగడానికి కేవలం డబ్బు సరిపోతుందని తల్లిదండ్రులు బావిస్తే అది చాలా పొరపాటు అవుతుంది.                                              *నిశ్శబ్ద.  
  సరైన విధంగా తింటే శాకాహారం ఇచ్చినంత గొప్ప ఆరోగ్యం ఇంకేదీ ఇవ్వగదనేది వైద్యుల మాట. కూరగాయలలో కూడా ప్రాంతీయతను బట్టి వివిధ రకాలుంటాయి. వీటిలో కొన్ని చూడడానికి కొన్ని వింతగా ఉంటే మరికొన్ని తిన్నప్పుడు ఆశ్చర్యకరమైన రుచి కలిగుంటాయి. అలాంటి వాటిలో కూర పనస కూడా ఒకటి. రూపంలో అచ్చం పనస పండును పోలి ఉండే కూర పనస రుచిలో మాత్రం అందరికీ షాకిస్తుంది. ఇది అచ్చం బ్రెడ్ రుచిని పోలి ఉంటుంది. అందుకే దీన్ని బ్రెడ్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఈ కూర పనస తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుంటే.. పోషకాలు.. కూర విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. అదనంగా, ఇందులో విటమిన్ ఎ, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఉన్నాయి, ఇది మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. జీర్ణ ఆరోగ్యం.. అధిక ఫైబర్ కంటెంట్‌ ఉన్న కారణంగా, కూర పనసప్రేగు కదలికలను నియంత్రించడం, మలబద్ధకాన్ని నివారించడం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఫైబర్ ప్రీబయోటిక్‌గా కూడా పనిచేస్తుంది.  గట్‌లోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పోషించడం, జీర్ణక్రియ, పోషకాల శోషణకు అవసరమైన ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుంది. బరువు నిర్వహణ.. కూర పనసను ఆహారంలో చేర్చుకోవడం వల్ల  తక్కువ కేలరీలు,  అధిక ఫైబర్ కంటెంట్ లభిస్తాయి. బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువ కాలం కడుపు  నిండిన అనుభూతిని కలిగిస్తుంది, మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది.  అతిగా తినకుండా చేస్తుంది. అదనంగా, దాని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు స్థిరమైన శక్తిని అందిస్తాయి, రోజంతా సంతృప్తిగా, ఉత్సాహంగా ఉంచుతాయి.                    *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  పసుపులో ఉన్న ఔషద గుణాలు మరిదేనిలోను లేవని అంటున్నారు యు నాని వైద్యులు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ పసుపు లోనే కాదు పసుపు చెట్టు ఆకుల లోను ఔషద గుణాలు ఉన్నాయని అంటున్నారు సత్య. సహజంగా అందరికి తెలిసింది పసుపు కేవలం కూరలలోనే వాడతారని, లేదా సంప్రదాయంగా  పసుపు ను పూజా కార్య క్రమాలలో వాడతారు. సంప్రదాయ పద్దతిలో జరిగే  పెళ్లి లోను పసుపుదే కీలక పాత్ర,సహజంగా గ్రా మీణ ప్రాంతాలలో చిన్న పాటి గాయం అయితే రక్త శ్రావం ఆగడానికి ముందుగా వాడేది పసుపే అని అంటారు యునాని వైద్యురాలుఅక్కడ పసుపు యాంటి బాయిటిక్  గా పనిచేస్తుందని అన్నారు.   ఎస్ జి వి సత్య. ముఖ్యంగా పసుపు మొక్క నుండి తీసిన పసుపు కొమ్ము ను ఆరగ దీసి పెట్టుకుంటే దద్దుర్లు వాపులు  తగ్గుతాయి. పసుపు ఆకును డికాక్షిన్  తో స్నానం చేస్తే దద్దుర్లు తగ్గుతాయి. పసుపును డ వేడి వేడి పాలలో వేసి తీసుకుంటే జలుబు దగ్గు తగ్గుముఖం పడుతుంది. పసుపు ఆకుల రసాన్ని  డికాక్షిన్ రూపం లో తీసుకుంటే శరీరం లో ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. ఇక సాంప్రదాయానికి వస్తే వివాహానికి సంబంధించి పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు కి సంబంధించి చేసే మంగళ స్నానాలలో పసుపు వాడడం అనావాయితిగా వస్తుంది. పసుపు కాళ్ళకు రాసుకుంటే  యాంటీ బాయిటిక్ గా పనిచేస్తుంది. కాళ్ళ పగుళ్ళు ఉన్న వారికి పసుపు రాసుకుంటే పగుళ్ళు తగ్గుతాయి.  ఇక ముఖం పై పసుపు రాసుకుంటే ముఖం పై వచ్చే ముడతలు తగ్గి ముఖం లో  గ్లౌ వస్తుంది.అలాగీ మీ ముఖం మరింత సౌందర్యం కావాలంటే తేనె, పసుపు ఆకు రసం కలిపిన  లేపనాన్ని కలిపి రాస్తే ముఖం మరింత కాంతి వంతంగా మెరుస్తుందని యునాని హెల్త్ క్లినిక్  కు చెందిన డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. పసుపు ఆకు ఇమ్యునిటీ  బూస్టర్ గా పని చేస్తుంది.పసుపు ఆకు డికాక్షిన్ ను క్యాన్సర్ వచ్చిన రోగులకు వారానికి ఒక సారి ఇస్తే  నీరసం తగ్గి కొంచం కోలుకుంటారని డాక్టర్ ఎస్ జి వి సత్య వివరించారు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఉదయం లేవగానే రోజు మొదలుపెట్టాలంటే టీ కావాలి. డ్యూటీ మధ్యలో కాస్త బయటకు వెళ్ళాలంటే టీ బెస్ట్ సాకు, సాయంత్రం స్నేహితులతో కలసి టీ కొట్టు దగ్గర కబుర్లు చెబుతూ చాయ్ తాగితే ఆ ఫీల్ వేరు.  టైమ్ పాడు లేకుండా టీ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీ కొట్టు ఓపెన్ చేశాక కట్టేసేవరకు స్టౌ మీద టీ ఉడుకుతూనే ఉంటుందంటే టీ కి ఉన్న గిరాకీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టీ కహానీ ఎందుకంటారా? టీ అంటే అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా వేడి వేడి టీలో బిస్కెట్లు ముంచుకుని తింటే మరీ ఇష్టం. ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు, అప్పటికప్పుడు హాట్ హాట్ గా బేక్ చేసిన బిస్కెట్లు.. ఓయబ్బో టీ పక్కనే వయ్యారాలు పోతాయి బిస్కెట్లు. కానీ టీతో బిస్కెట్లు తినడం మహా ఇష్టమైన వారికి బ్యాడ్ న్యూస్.. దీని వల్ల బోలెడు నష్టాలున్నాయి. టీతో బిస్కెట్ తింటే కలిగే నష్టాలేంటి? టీ తో ఏం తింటే ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి? పూర్తీగా తెలుసుకుంటే.. భారతదేశంలో టీ తాగేవారు ఎక్కువ. ఇక టీ బిస్కెట్ కాంబినేషన్ కు ఫ్యాన్స్ ఎక్కువ. అయితే టీ బిస్కెట్ వల్ల ఆరోగ్య నష్టాలున్నాయి. యువతలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి  టీ తో బిస్కెట్ తినడం ఒక కారణంగా తెలుస్తోంది. టీ బిస్కెట్ కాంబినేషన్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. బిస్కెట్లలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెజబ్బులకు ప్రధానకారణం అవుతుంది. బిస్కెట్ల తయారీకి శుద్ది చేసిన పిండి, శుద్ది చేసిన పంచదార ఉపయోగిస్తారు. ఇది శరీరంలో ఇన్సులిన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. మరొకవైపు ఇది జీర్ణక్రియను కూడా దెబ్బతీస్తుంది. దీని వల్ల మలబద్దకం వస్తుంది. బిస్కెట్లు ఎక్కువగా ప్రాసెస్ చేయబడే ఆహారం. ఇందులో  BHA (butylated hydroxyanisole),  BHT (butylated hydroxytoluene) ఉంటాయి. ఇవి మానవ శరీరంలో ఉండే DNA ను దెబ్బతీస్తాయి. మరీ ముఖ్యంగా బిస్కెట్లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్  ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్లను డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. టీతో వేయించిన శనగలు తింటే.. వేయించిన శనగలు ఆరోగ్యానికి చాలా మంచిదం. టీ టైమ్ లో స్నాక్ గా వేయించిన శనగలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. వేయించిన శనగలు ఇన్సులిన్ ను కంట్రోల్ చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే బి-కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది కాబట్టి బి-విటమిన్ లోపాన్ని జయించవచ్చు. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, మెగ్నీషియం శనగలలో పుష్కలంగా ఉంటుంది. శనగలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అయిన కోలిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లకు బదులు వేయించిన శనగలు తింటే మంచిది.                                          *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...