LATEST NEWS
తెలంగాణలో అధికారం కోల్పోయిన షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోని తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ గత కొన్ని రోజులుగా జనంలోకి వచ్చి ఆడుతున్న డ్రామాలు చూస్తూ జనం ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ కొద్దిరోజులు తండ్రి, అన్నలతో కలసి డ్రామాలాడిన బాలనటి కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో రెస్టు తీసుకుంటోంది. ఇప్పుడు ఈ డ్రామా కంపెనీలోకి మరో ఛైల్డ్ ఆర్టిస్టు ఎంటరయ్యాడు. ఆ డ్రామా ఆర్టిస్టు మరెవరో కాదు... కేసీఆర్ ముద్దుల మేనల్లుడు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఫ్యామిలీ ఎన్ని డ్రామాలు ఆడినా, ఉద్యమ స్ఫూర్తితో వున్న జనం నమ్మారు. ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ కోసమే కదా అని క్షమించారు. పదేళ్ళు అధికారంలో అహంకారంతో వ్యహరించినప్పుడు సమయం కోసం వేచి చూశారు. ఆ సమయం రాగానే గద్దె దించారు. అహంకారం, డ్రామాలు ఎప్పుడూ పనికిరావన్న విషయాన్ని తెలుసుకోలేని ఈ కుటుంబం ఇంకా తమ పంథా మార్చుకోకుండా జనంలో పరువు పోగొట్టుకుంటోంది. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ లోపల చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను పట్టుకుని హరీష్ రావు డ్రామా క్రియేట్ చేశాడు. రేవంత్ రెడ్డి తాను చెప్పినట్టు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడు. అయితే రాజీనామా లేఖ రెడీగా పెట్టుకో, ఆగస్టు 15 తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా వుండు అని రేవంత్ రెడ్డి చెప్పడంతో హరీష్ రావు ఆత్మరక్షణలో పడ్డాడు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తే తాను తట్టాబుట్టా సర్దుకోవాల్సి వస్తుందని అర్థం చేసుకుని వెంటనే ప్లేటు తిప్పేశాడు. అయితే, నేను నా రాజీనామా లేఖ అమరవీరుల స్థూపం దగ్గరకి తెస్తా.. నువ్వూ నీ రాజీనామా లేఖ తీసుకుని  శుక్రవారం నాడు అక్కడకి రా అని సవాల్ విసిరాడు. ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి రాజీనామా లేఖ తీసుకుని అమరవీరుల స్థూపం దగ్గరకి వస్తాడా? కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో వున్నప్పుడు అలా ఎప్పుడైనా వచ్చిన దాఖలాలు వున్నాయా? ముఖ్యమంత్రి పరామర్శించాల్సిన సందర్భాల్లో అయినా ఆయన వెళ్ళిన చరిత్ర వుందా? వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి రాజీనామా లేఖ పట్టుకుని వాళ్ళు చెప్పిన దగ్గరకి రావాలి. ముఖ్యమంత్రి ఎలాగూ రాడని తెలుసు, శుక్రవారం నాడు హరీష్ రావు అమరవీరుల స్థూపానికి ఏదో ముక్కుబడిగా నాలుగు పూలు చల్లేసి, ఒక నమస్కారం పారేసి సీఎం అక్కడకి రాలేదని ఫీలయ్యారు. స్పీకర్‌కి రాసిన రాజీనామా లేఖను అక్కడే వున్న మీడియా వాళ్ళకి ఇచ్చారు. రాజీనామా లేఖ అంటే స్పీకర్ ఫార్మాట్లో వుండాలి. తనకు చేతికి వచ్చినట్టు రాసి ఇదే రాజీనామా లేఖ అనుకో అంటే కుదరదు. హరీష్ రావు తన రాజీనామాలో ఏదేదో చేట భారతం అంతా రాశారు. ప్రస్తుతానికి ఇలా చేటభారతం రాజీనామా లేఖ రాశానని, రుణ మాఫీ చేశాక స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ ఇస్తానని, ఆ తర్వాత ఉప ఎన్నికలో పోటీ కూడా చేయనని ప్రకటించారు. ఈ తిరకాసు వ్యవహారమంతా ఎందుకు? ఆ ఇచ్చేదేదో స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖ ఇవ్వచ్చుగా..  మొన్నటి వరకు ‘ఆగస్టు 15 లోగా 2 లక్షల రైతు రుణ మాఫీ’ అనే పాయింట్ మీదే హడావిడి చేసిన హరీష్ రావు.. ఇప్పుడు అమరవీరుల స్థూపం దగ్గర ఇంకా ఏవేవో అంశాలను ప్రస్తావించి ఇవన్నీ నెరవేరిస్తేనే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో ఇస్తా అని మెలిక పెట్టాడు. రాజీనామా చేసే దమ్ము లేనప్పుడు రాజీనామా సవాళ్ళు విసరసం ఎందుకు.. ఇప్పుడు రాజీనామా గండం నుంచి బయటపడటానికి పనికిరాని నాటకాలన్నీ ఆడటం ఎందుకు? రేపు ఆగస్టు 15 లోపు సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీని చేయడంతోపాటు ఇంకెన్ని హామీలను అమలు చేసినా హరీష్ రావు ఏదో మెలికో, తిరకాసో పెట్టి రాజీనామా చేయకుండా తప్పించుకుంటాడని అందరికీ తెలిసిన విషయమే. ఈ మనుషులు ఎప్పటికి మారతారో!
ఎప్పుడైనా ఎన్నికల వేళకి అధికార పార్టీలో  ఒక స్పష్టత ఉంటుంది. అధికారంలో ఉన్న కాలంలో చేసిన అభివృద్ధీ, ప్రజలకు అందించిన సంక్షేమం వివరించి ఓట్లు అడగడానికి వెసులుబాటు ఉంటుంది. అయితే వాస్తవంగా అధికారంలో ఉన్న కాలంలో అభివృద్ధి సంక్షేమాలపై ప్రభుత్వం ప్రజలమెప్పు పొందిందా లేదా అన్నది ఓటర్లు తమ ఓటు ద్వారా తీర్పు ఇస్తారు. అది వేరే సంగతి. కానీ అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం ప్రచారం చేసుకునే విషయంలోనూ, పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ విపక్షం కంటే ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. అలాగే అసమ్మతి బెడదా తక్కువ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి రివర్స్ లో ఉంది. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీలో గాభరా కనిపిస్తోంది. ఓటమి తప్పదన్న బెదురు కానవస్తోంది. అదే సమయంలో విపక్షంలో ధీమా కనిపిస్తోంది. జనం మావైపే ఉన్నారన్న భరోసా కానవస్తోంది. ఇందుకు కారణాల గురించి చెప్పుకునే ముందు విపక్షంగా తెలుగుదేశం ఓంటరిగా పోరు చేయడం లేదు. జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగింది. అలాంటి సమయంలో భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు, ఆ సర్దుబాటు కారణంగా అనివార్యంగా కొన్ని త్యాగాలకు సిద్ధపడటం, అందు వల్ల ఆశించిన సీటు దక్కక నేతల్లో పెచ్చరిల్లే అసంతృప్తి ఇన్నిటిని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఆ ఇబ్బందులు, ఇరకాటాలన్నిటినీ అలవోకగా దాటేసింది. అదే సమయంలో అధికారంలో ఉండటం చేత ఉన్న సానుకూలాలన్నిటినీ వైసీపీ చేజేతులా ప్రతికూలంగా మార్చేసుకుంది.  అందుకే  ఏపీలో  జనసేన, బీజేపీలతో పొత్తు కుదుర్చుకుని, సీట్ల సర్దుబాటు చేసుకుని, ఆ కారణంగా పార్టీలో తలెత్తిన అసమ్మతిని బుజ్జగించి పార్టీలో అసంతృప్తి అనవాలే లేకుండా చేసుకుని ధీమాగా కనిపిస్తుంటే.. అధికార వైసీపీలో  మాత్రం ఆందోళన, గందర గోళం కనిపిస్తోంది.  పార్టీ టికెట్ లభించిన అభ్యర్థులు ధైర్యంగా ప్రజలలోకి వెళ్లి ప్రచారం చేసుకోలేని పరిస్థితి కానవస్తోంది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ బస్సు యాత్రకు సైతం జనం స్పందన కానరాక పార్టీలో  ఓటమి భయం కనిపిస్తోంది.  ఏపీలో పోలింగ్ తేదీ మే 13. అంటే మరో 17 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికీ వైసీపీ ప్రచారం జోరందుకోలేదు. విరామాలతో సాగిన జగన్ బస్సు యాత్ర తప్ప అధికార పార్టీ ప్రచారం జోరు పెంచింది లేదు. మరో వైపు తెలుగుదేశం కూటమి మాత్రం ప్రచారం జోరు పెంచింది. తెలుగుదేశం, జనసేన అధినేతలు ఉమ్మడి ప్రచారంతో పాటుగా ఎవరికి వారుగా కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. వారి ఎన్నికల ప్రచార సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు.  అధికార వైసీపీ మాత్రం ప్రచార వ్యూహం లేక మల్లగుల్లాలు పడుతోంది. పరిస్థితి చూస్తుంటే అధికార పార్టీ అధినేతలో గెలుపు ధీమా కాగడాపెట్టి వెతికినా కూడా కనిపించడం లేదని పరిశీలకలుు విశ్లేషిస్తున్నారు. ఫలితం  తెలిసిపోయిన తరువాత ఇంక చేసేదేముంది అని చేతులెత్తేసినట్లుగా జగన్ తీరు ఉందంటున్నారు. 
నిజానిజాల సంగతి పక్కన పెడితే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ప్రచారాలు కోటలు దాటేస్తాయి. పార్టీలు, నేతలు చెప్పేది ఏది నిజం, ఏది అబద్ధం అన్నది వేరే విషయం. ఎవరి మాటలను జనం విశ్వసిస్తున్నారు. ఎవరి మాటలను నమ్మడం లేదు అన్నది జనం ఓటుతో చెప్పే వరకూ అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఎవరికీ తెలియదు.   అయితే  సర్వేలు మాత్రం ప్రజానాడిని పట్టి చూపుతాయి. అందుకే సర్వేల పట్ల అందరిలోనూ సహజంగా ఆసక్తి ఉంటుంది.  అయితే సర్వేలు కూడా నూరు శాతం నిజం అయ్యే అవకాశాలు లేవని ఎన్నికల వ్యూహకర్త, సర్వేలకు పెట్టింది పేరు అయిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే పలు సందర్భాలలో చెప్పారు.    ఎన్నికల వేళ ప్రజల నాడి మారిపోవడానికి ఒక  బలమైన సంఘటన చాలు అని ఆయన గతంలో చెప్పారు.  ఔను నిజమే  రాజకీయాలు ఎప్పుడు చలన రహితంగా, నిశ్చలంగా ఉండవు. అన్నిటికీ మించి రాజకీయ పార్టీల మద్దతు దారులు, కార్యకర్తలు పార్టీల సభ్యులు వారు వారు ప్రాతినిథ్యం వహించే పార్టీలవైపే ఉంటారు అదులో సందేహం లేదు. అయితే ఎన్నికలలో జయాపజయాలను నిర్ణయించేది మాత్రం తటస్థ ఓటర్లు. ఔను న్యూట్రల్ ఓటర్లు ఎటుమొగ్గితే విజయం అటువైపు ఉంటుందన్నది రాజకీయపండితులు చెప్పే మాట.  అయితే ఇప్పుడు వారే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఉందంటున్నారు. ఏపీలో కాగడా పెట్టి వెతికినా తటస్థులు కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు. ఐదేళ్ల జగన్ అస్తవ్యస్త, అరాచక పాలన కారణంగా తటస్థ ఓటరనే వాళ్లు లేకుండా అందరూ జగన్ వ్యతిరేక శిబిరానికి అంటే తెలుగుదేశం కూటమికి జై కొట్టేశారని చెబుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో వెలువడిన ప్రతి సర్వే కూటమి ఘనవిజయాన్నే సూచిస్తోందంటున్నారు.  ఇక  కొద్దో గొప్పో తటస్థ ఓటర్లు ఉన్నా జగన్ వారిని కూడా తెలుగుదేశం కూటమికి చేరువ చేసేశారని తాజాగా ఆయన తన సొంత చెల్లి చీరపై చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ చెబుతున్నారు. పోలింగ్ కు రోజుల ముందు ఆయన కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల కట్టుకున్న చీర రంగుపై చేసిన వ్యాఖ్యలు తటస్థులను జగన్ కు వ్యతిరేకంగా మార్చేశాయని అంటున్నారు.   అంటే జగన్ తన అనుచిత వ్యాఖ్యలతో, అస్తవ్యస్త పాలనతో తటస్థ ఓటర్లను కూడా కూటమికే జై కొట్టేలా మార్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
వైసీపీకి ఇప్పుడు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో అన్నీ కలిసివచ్చి అందలం దక్కింది. ఈ సారి అన్నీ ఎదురుతిరిగి అధికారం దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంగా పార్టీ అధినేత, సీఎం జగన్ రంగంలోకి దిగి బస్సు యాత్ర చేపట్టినా జనంలో స్పందన కనిపించలేదు. చివరాఖరికి సొంత గడ్డ కడపలో కూడా జగన్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కడప జిల్లాలో ఓటర్ మూడ్ ను జగన్ సొంత చెల్లెలు షర్మిల మార్చేశారని అంటున్నారు. అన్న టార్గెట్ గా షర్మిల సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలకు వైసీపీ వద్ద జవాబే లేకుండా పోయిందంటున్నారు.  అదలా ఉంచితే.. వైసీపీ కీలక నేతల నామినేషన్లే తిరస్కరణకు గురయ్యే పరిస్థితి వచ్చింది. విపక్ష నేతలపై అనుచిత భాషా ప్రయోగంతో రెచ్చిపోవడంలో చూపే శ్రద్ధ వైసీపీ నేతలు తమ ఎన్నికల నామినేషన్ల దాఖలుపై చూపలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి బుగ్గన,  మాజీ మంత్రి కొడాలి నాని, పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ దాఖలు చేసిన నామినేషన్ లలో పూర్తి వివరాలు పొందుపరచలేదన్న ఆరోపణలపై వారి నామినేషన్ల ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి బుగ్గన   ఎన్నికల అఫిడవిట్ లో లోపాలు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన డోన్ ఆర్డీవో ఆయన నామినేషన్ ను పెండింగ్ లో పెట్టారు. బుగ్గన తన అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు పొందుపరచలేదంటూ డోన్  తెలుగుదేశం అభ్యర్థి కోట్ల అభ్యంతరం తెలిపారు. దీంతో బుగ్గన నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో పెట్టి పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా సూచించారు. ఇక గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే.. బూతుల ఎక్స్పర్ట్ గా పేరొందిన కొడాలి నాని అయితే తన ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆధారాలతో సహా విపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. కొడాలి తన ఎన్నికల అఫిడవిట్ లో తాను ఎటువంటి ప్రభుత్వ భవనాన్ని వినియోగించలేదని వెల్లడించారు.   అయితే కొడాలి నాని ఎమ్మెల్యే గా  ప్రభుత్వ భవనమైన మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయంగా వినియోగించారంటూ అందుకు తగ్గ సాక్ష్యాధారాలతో గుడివాడ తెలుగుదేశం నేతలు  రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసారు. భవనాన్ని అద్దెకు ఇచ్చినట్లుగా మున్సిపల్ అధికారులు ఇచ్చిన పత్రాలను ఆధారంగా చూపించారు. దీంతో కొడాలి నాని నామినేషన్ వివాదంలో పడింది.   అయితే కొడాలి, బుగ్గన నామినేషన్లను ఆయా ఆర్వోలు చివరి నిముషంలో ఆమోదించారు. నిబంధనలకు విరుద్ధంగా వారి నామినేషన్లను ఆమోదించడంపై తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టపరంగా ముందుకు వెడతామని చెబుతున్నారు. 
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టో కెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 57వేల909 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల 303 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 81లక్షల రూపాయలు వచ్చింది. 
ALSO ON TELUGUONE N E W S
2024 సంక్రాంతికి తన మేజిక్‌తో భారీ విజయాన్ని అందుకున్న ‘హనుమాన్‌’ తెలుగు రాష్ట్రాల్లో 25 సెంటర్లలో విజయవంతంగా 100 రోజులు ప్రదర్శన పూర్తి చేసుకుంది. చిన్న చిత్రం సాధించిన పెద్ద విజయం అని కొన్ని సినిమాల నిర్మాతలు అప్పుడప్పుడు ప్రకటనలు గుప్పిస్తుంటారు. కానీ, ‘హనుమాన్‌’ మాత్రం ఆ క్యాప్షన్‌కి నిజమైన ఉదాహరణగా చెప్పొచ్చు. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే.  తాము ఊహించని విధంగా అంత పెద్ద విజయాన్ని అందుకున్న సందర్భంగా ‘హనుమాన్‌’ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ.. తెలంగాణ గవర్నర్‌ సి.పి. రాధాకృష్ణన్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సాదరంగా ఆహ్వానించిన గవర్నర్‌ వారితో కాసేపు ముచ్చటించారు. ‘హనుమాన్‌’ చిత్రానికి సంబంధించిన పలు విశేషాల గురించి అడిగి తెలుసుకున్నారు గవర్నర్‌. ఈ సినిమా విశేషాలు తెలుసుకున్న గవర్నర్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మను అభినందించారు. ఈ సందర్భంగా తేజ సజ్జా, ప్రశాంత్‌వర్మ గవర్నర్‌కు హనుమాన్‌ ప్రతిమను బహూకరించారు. 
"Family Star," starring Vijay Deverakonda, is set to premiere on Amazon Prime Video yesterday. The film, which released on the 5th of this month, has failed to impress audience. The film became disaster on the 2nd day. Vijay Devarakonda and Mrunal Thakur have received acclaim for their performances, while the production values of Sri Venkateswara Creations and Parasuram Petla's portrayal of family emotions have been lauded by few Telugu audience. As soon as the film arrived on OTT, the Telugu audience began trolling it for multiple reasons, such as the 'CG Dosa', Vijay Deverakonda's cringe-worthy performance, and the depiction of prostitution in Times Square, New York. However, one particularly distasteful scene in the film is receiving even more backlash. In this scene, after a fight, Vijay Deverakonda threatens Ravi Babu with rape in front of children who are made to watch the violence as a lesson in defending themselves. Netizens are posting and discussing this specific scene, expressing their disgust and questioning how director Parasuram Petla could write it, how producer Dilraju could approve it, and why Vijay Deverakonda would enact it without any hesitation. Both Tamil and Malayalam audiences are also brutally trolling this scene and the film. Produced by star producers Dil Raju and Shirish under the banner of Sri Venkateswara Creations. Directed by Parasuram Petla, with Vasu Varma is the creative producer.
Rowdy Vijay Deverakonda is recently came up with Family Star and it disappointed everyone. The actor's much awaited project with Jersey fame Goutam Tinnanuri is also in the production stage.  Tentatively titled VD12, the movie will showcase Vijay as a spy agent. Rockstar Anirudh Ravichander known for instant charbusters is scoring the music. But, unfortunately his work is less. Because, makers decided not to include any songs in the film as it interrupts engaging narrative. There will be no songs in the film directed by Gowtham Tinnanuri. The background score will be the only musical asset, like Lokesh Kanagaraj's Khaidhi. With composer like Anirudh onboard, makers choosing for no songs is a big mistake. It is known that Sree Leela opted out of the film due to excessive glamour dose. The makers looked at set of heroines from Bollywood and south to play the role. The report further suggests that the makers are in talks with the young beauties Mamitha Baiju of recent sensation Premalu fame and Bhagyashree Borse, who is making her debut in Telugu with Raviteja's Mr Bachchan. VD12 is being bankrolled by Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas. Srikara Studios is presenting the movie while Anirudh Ravichander is rendering the tunes.
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు. ఈ డైలాగ్ ఎవరిదీ అంటే చెప్పని వాళ్ళు ఇండియాలోనే ఉండరు. ఇప్పుడు ఇదే డైలాగ్ ని కాస్త అటు ఇటుగా మార్చి  పుష్ప ఫాదర్ అల్లు అరవింద్ (allu aravind) చెప్తున్నాడు.  అల్లు అరవింద్ అంటే ఎవరనుకుంటున్నారు. ఇట్స్ ఏ బ్రాండ్ అని. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిందో చూద్దాం అల్లు అరవింద్ ఇటీవలే ఒక కారు కొన్నాడు. ఇందులో ఏముంది.ఇప్పటీకే అరడజను  దాకా కార్లు  ఉండుంటాయని అనుకుంటున్నారు కదు.. కరెక్టే  చాలా  ఉన్నాయి. కాకపోతే లేటెస్ట్ కారు మాత్రం సంథింగ్ స్పెషల్.ఎందుకంటే ఆయన కొన్నది మామూలు కారుని కాదు. బిఎండబ్ల్యు (bmw)కంపెనీకి చెందిన ఐ 7 బ్రాండ్. అధునాతమైన ఫ్యూచర్లతో కూడిన దాని  ధర అక్షరాలా రెండున్నర కోట్లు. షైనింగ్ కలర్ లో మెరుస్తు  సూపర్ గా ఉంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ కూడా  చేస్తున్నాయి.  అల్లు అరవింద్  గీత ఆర్ట్స్ పై  నిర్మాతగా  ఎన్నో మంచి చిత్రాలని తెరకెక్కించాడు.అందులో ఎక్కువ భాగం  విజయాన్ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్లుగా కూడా నిలిచాయి.చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్,అల్లు అర్జున్,నాగ చైతన్య, విజయ్ దేవరకొండ వంటి హీరోలతో సినిమాలని నిర్మించాడు. ప్రస్తుతం  నాగ చైతన్యతోనే  తండేల్ ని నిర్మిస్తున్నాడు. బాలకృష్ణ బోయపాటి ల అఖండ 2 కి  అరవిందే  నిర్మాత అనే వార్తలు వస్తున్నాయి. గీత ఆర్ట్స్ టూ పై కూడా చిత్రాలని నిర్మిస్తుంటాడు.  
కళకి చిన్నాపెద్దా తారతమ్యం ఉండదు. సినిమా నటుల నుంచి సీరియల్స్ నటుల దాక అందరకి ప్రేక్షకాదరణ దక్కేలా చేస్తుంది. దాంతో ఆ రెండు రంగాల్లోని వాళ్ళు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులకి సొంత వాళ్ళలాగా మారిపోతారు. అలా సొంత వాడిగా మారిన ఒక నటుడు ఇప్పుడు కనపడటం లేదు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గురుచరణ్ సింగ్.. హిందీలో ప్రసారమయ్యే తారక్ మెహతా కా ఉల్తా ఛష్మ సీరియల్ లో సోది క్యారక్టర్ ద్వారా అశేష అభిమానులని సంపాదించుకున్నాడు. ఆయన కోసమే సీరియల్ చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. గత నాలుగు రోజులు నుంచి సింగ్  కనిపించడం లేదు. ఢిల్లీలో నివాసం ఉండే సింగ్ మొన్న సోమవారం ఉదయం  ముంబై కి వెళ్తున్నానని చెప్పి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాడు. కానీ ఆయన ముంబై కి వెళ్ళలేదు.  తిరిగి ఢిల్లీలోని ఇంటికి కూడా  రాలేదు. దీంతో అయన తండ్రి సమీప పోలీసుస్టేషన్ లో  ఫిర్యాదు చేసాడు. పోలీసులు మిస్సింగ్ కేసుగా  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సింగ్ గురించి సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన తండ్రికి అనారోగ్య కారణాల వలన హఠాత్తుగా సీరియల్ నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో ఆయనకి రావాల్సిన రెమ్యునరేషన్ కూడా  యాజమాన్యం ఇవ్వలేదు.  మరి ఆ కోణంలో పోలీసులు విచారణ చేస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇక తారక్ మెహతా కా ఉల్తా ఛష్మ 2008 లో ప్రారంభం అయ్యింది. ఇప్పటికి 4064 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది.కామెడీ ప్రధాన కంటెంట్ గా  తెరకెక్కింది  
Pan-India rebel star Prabhas and director Nag Ashwin teamed up for the first time for a massive futuristic sci-fi film titled Kalki 2898AD. Bollywood diva Deepika Padukone is the female lead in this biggie. Amitabh Bachchan is playing key role and Ulaganayagan Kamal Haasan playing prominent role. The anticipation raises peak for the highly awaited sci-fi epic "Kalki 2898 AD," the film's premiere date remains a closely guarded secret, particularly with the recent announcement of the election date adding to the mystery. Fans eagerly await any news about the film about this dystopian adventure. As we've reported the film postponed from May 9th due to elections. The film was planned to release in May but now team is also looking at June 27th as another possibility. Team has plans to promote the film globally. Recently released Ashwatthama glimpse raised expectations on the film, especially Amitabh Bachchan’s de aging look gave a statement that this film is going to.be on international standards. The film's release date announcement will be made today at 5PM. The film will release on Thursday, June 27th. Produced by Ashwini Dutt under the banner of Vyjayanthi Movies.
వెరీ షార్ట్  పీరియడ్ లో  స్టైలిస్ట్ స్టార్ గా, ఆ పై ఐకాన్ స్టార్ గా మారిన హీరో అల్లు అర్జున్ (allu arjun) ఇప్పటికి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ముద్దుగా  బన్నీ అని పిలుచుకుంటారంటే ఆయన యాక్టింగ్  స్టామినా ఏ పాటిదో  అర్ధం చేసుకోవచ్చు.ఈజీ నటనకి, డాన్సులకి  కేర్ ఆఫ్ అడ్రస్స్ కూడా. ఇప్పుడు  బన్నీ రెమ్యునరేషన్ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 (pushpa 2)  తో బిజీగా ఉన్నాడు.  తన బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ తో అందరి మైండ్ లలో తిష్ట వేసాడు. దీంతో అందరు పుష్ప 2 ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని  వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీకి 150 కోట్లు తీసుకుంటున్నాడనే వార్త ఫిలిం సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే అల వైకుంఠపురం, పుష్ప పార్ట్ 1 కే 100 కోట్లు తీసుకున్నాడు. అలాంటిది టూ  కి వన్ ఫిఫ్టీ అనేది నిజమే కావచ్చు. పైగా ఆ విషయంలో  ఆశ్చర్య పడాల్సిన పని కూడా లేదు.  ఎందుకంటే  పార్ట్ 1 తో  పాన్ ఇండియా లెవల్లో రికార్డు కలెక్షన్స్ ని సృష్టించాడు.అధికార లెక్కల ప్రకారం 370 కోట్లు దాకా  రాబట్టింది. అదంతా బన్నీ వల్లనే అనేది జగమెరిగిన సత్యం. సో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న ఇండియన్ యాక్ట్రస్ ల్లో బన్నీ గా చేరినట్టే.  పార్ట్ వన్  ని నిర్మించిన నవీన్ ఎర్నేని ,యలమంచిలి రవిశంకర్ లు  మైత్రి మూవీస్ పై పార్ట్ టూ ని కూడా  అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. సుకుమార్ దర్శకుడు కాగా రష్మిక కధానాయిక.
To the delight of Thalapathy Vijay’s fans, 2004 hit Ghilli had a re-release on April 20. The film, upon its re-release, was received very well by the fans and the public, garnering record numbers on its premiere day.  Consequently, the film is also minting great numbers at the box office. The Thalapathy Vijay and Trisha-starrer re-released in select theatres after 20 years of its original release. The film was shown in 320 theatres in Tamil Nadu, becoming a hit in most regions, as per reports.  This 20 year old industry hit, Ghilli comfortably breaches the 20CR mark at worldwide box office and aims off for 25 crores finish in full run. Ghilli footfalls in TamilNadu are greater than 2024 Tamil new release footfalls and the film collection in france are more than 2024 Tamil new releases. This is unprecedented and phenomenal. According to industry insiders, it is being considered as the highest gross for a re-released film. The film released in Hyderabad and Chittoor areas. The shows getting full in minutes and got decent reception. Ghilli is directed by Dharani, who has also written its screenplay. The film stars Vijay and Trisha as the protagonists, along with Prakash Raj, Ashish Vidyarthi, Tanikella Bharani and many others. It is produced by A M Rathnam under the banner of Sri Surya Movies. The music in the film is composed by Vidyasagar. Ghilli is the remake of Mahesh Babu starrer Telugu film titled Okkadu.
Mogali Rekulu fame RK Sagar who took a break from movies is back with an emotional action thriller THE 100 written and directed by Raghav Omkar Sasidhar. Ramesh Karutoori, Venki Pushadapu, and J Tharak Ram are jointly producing the movie under the banners of KRIA Film Corp and Dhamma Productions. Former Vice President Of India Venkaiah Naidu recently unveiled the first look of the movie which got a tremendous response. The poster introduced RK Sagar as Vikranth IPS. Today, Mega Mother Smt Konidela Anjana Devi launched the film’s teaser. The teaser opens with IPS Officer Vikranth being enquired by Human rights commission for the crimes he committed. Some mass murders happened on the outskirts of the city and all of them were surprisingly rowdy sheeters. The police inquiry is underway. The protagonist who has his own style in dealing with the criminals doesn’t care what the media or others think about his approach. He doesn’t even fear the higher officials or the Human rights commission. The teaser is meant to demonstrate the arrogant nature of the honest IPS Officer who goes to any extent to eradicate crime in his terrain. RK Sagar looked fit in the khaki outfit and his ferocious performance is the major USP. Raghav Omkar Sasidhar presented the character strikingly. As the teaser suggests the movie will be high in action with a gripping narrative. Misha Narang will be seen opposite RK Sagar in the movie which also features Dhanya Balakrishna in a pivotal role. Shyam K Naidu cranks the camera, while Harshavardhan Rameshwar provides the music. Sudheer Varma Pericharla penned the dialogues for the movie which is gearing up for release.
Allari Naresh’s out-and-out family entertainer Aa Okkati Adakku promotional activities are in full swing. The recently released theatrical trailer also got a thumping response. In fact, every promotional material increased the excitement to watch the movie directed by debutant Malli Ankam and produced by Rajiv Chilaka under the banner of Chilaka Productions. Faria Abdullah played the leading lady opposite Allari Naresh. As part of musical promotions, the team unveiled the second single Hammammo, which is a blissful melody with classical beats. It’s a fusion mixed with electronic beats. Bhaskarabhatla portrayed Allari Naresh’s feelings attractively, whereas Yasaswi Kondepudi brought a special charm with his beautiful singing. Allari Naresh and Faria Abdullah who shared a lovely chemistry enacted graceful moves. Vennela Kishore, Jamie Lever, Viva Harsha, and Ariyana Glory are the other prominent cast of the movie. Abburi Ravi is the writer, while cinematography is handled by Suryaa and music is scored by Gopi Sundar. Chota K Prasad is the editor of the movie, while J K Murthy is the art director. As recently announced by the makers, Aa Okkati Adakku will arrive in cinemas on may 3rd, 2024.
ఇంట్రోవర్ట్.. ఎవ్వరితోనూ ఎక్కువ కలవరు. ఎవరైనా పలకరించినా, మాట్లాడినా ఎప్పుడెప్పుడు అక్కడి నుండి పారిపోదామా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు.  ఒంటరిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఈ కారణంగానే ఇంట్రోవర్ట్ అనే మాట బయటకు తెలిస్తే అదేదో వాళ్లకు ఏదో జబ్బు ఉందన్నట్టు ట్రీట్ చేస్తూ ఉంటుంది సమాజం. అయితే ఇంట్రోవర్ట్ లను తేలిగ్గా తీసిపడేయకూడదని, ఇంట్రోవర్ట్ లు గా ఉండి ప్రపంచాన్ని తమ ప్రతిభ ద్వారా, విజయాల ద్వారా ఆకర్షించిన వారి గురించి తెలిస్తే వాళ్లను తక్కువ అంచనా అస్సలు వేయకూడదని అనిపిస్తుంది. ఇంట్రోవర్ట్ ల గురించి.. మనిషన్నాక సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అయితే అందరూ మాట్లాడటం అస్సలు అవసరం లేదు. కొంతమంది మౌనంగా ఉండి తమ ఎనర్జీ లెవెల్‌ని మెయింటైన్ చేసి దానిని తమ శక్తిగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఏదో మాటవరుసకు చెబుతున్నది కాదు. సాక్షాత్తూ మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్ పరిశోధన ఇలా చెబుతోంది. గ్లోబల్ శాంపిల్‌పై అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని 56.8% మంది వ్యక్తులు అంతర్ముఖులుగా ఉన్నారు.  అంటే తమతో తాము ఉండటానికి  లేదా మౌనంగా ఉండటానికి వీరు ఇష్టపడతారు. బహిర్ముఖ వ్యక్తుల కంటే  అంతర్ముఖులే ఎక్కువ విజయాలు సాధిస్తారని, ప్రపంచ రూపురేఖలను మార్చిన ఎంతో మంది ప్రసిద్ద వ్యక్తులు అంతర్ముఖులే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాట్లాడటం.. సమయానికి మాట్లాడటం.. కొందరు వ్యక్తులు అంతర్ముఖులతో వ్యవహరించడం కొంచెం కష్టమని అంటుంటారు. ఎందుకంటే అంతర్ముఖులు తమ భావాలను ఎవరికీ చెప్పరు. కానీ తక్కువ మాట్లాడటం అంటే ఏదో దాచడం అని కాదు. పరిశోధన ప్రకారం అంతర్ముఖులు ఆలోచనాత్మకంగా మాట్లాడతారు. వారి  మాటలు చాలా విస్తృతంగా సరైన కారణాలతో కూడుకుని ఉంటాయి. వీరు ఎవరికీ త్వరగా స్పందించరు. ఎమోషనల్ అటాచ్మెంట్ తక్కువగా ఉంటుంది.  అందుకే  ఇతర వ్యక్తుల కంటే వీళ్లు   సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వీరు వారికి నచ్చింది మాత్రమే మాట్లాడుతారు. ఒంటరితనమే బలం.. మానసిక  రోగుల వైద్యుల అభిప్రాయం ప్రకారం అంతర్ముఖ వ్యక్తులు బహిర్ముఖుల కంటే బలంగా , శక్తివంతంగా ఉంటారు. ఎందుకంటే వారు ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా, తెలివిగా ఆలోచిస్తారు. దానికి తగినట్టే నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రశాంత స్వభావం కారణంగా ఇంట్రోవర్ట్ లు  ఎప్పుడూ కోపం తెచ్చుకోరు. లేదా దూషించే మాటలు మాట్లాడరు.  సాధారణంగా వీరు ఇతరులకు చాలా పొగరు వ్యక్తులుగా అనిపిస్తారు. కానీ వీరు అర్థమయ్యే కొద్దీ.. వీరి మీద గౌరవం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా.. అంతర్ముఖులు తమ భావోద్వేగాలను బయటకు  వ్యక్తం చేయకపోవచ్చు. కానీ వారు మానసికంగా బలంగా ఉంటారు. వీరు సులభంగా ఎవరికీ  భయపడరు. తక్కువ మాట్లాడటం వల్ల  వీరిని చాలామంది పిరికివాళ్లు అని అంటూ ఉంటారు. కానీ అంతర్ముఖుల శక్తి అసాధ్యం. వారు మానసికంగా దృఢంగా ఉంటారు. జ్ఞాపకశక్తి ఎక్కువ.. 2007లో రష్యాలో అంతర్ముఖులపై నిర్వహించిన పరిశోధనలో   వీరు ఏవైనా సంఘటనలు, విషయాలను చాలా కాలంపాటూ గుర్తుంచుకుంటారని తెలిసింది. ఎందుకంటే ఇంట్రోవర్ట్ వ్యక్తులకు ఫ్రంటల్ లోబ్‌లో ఎక్కువ రక్త ప్రసరణ ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ అనేది మెదడులోని జ్ఞాపకాలను నిల్వ చేసే భాగం. ఇది సమస్యలకు పరిష్కాలు ఆలోచించడం, సరైన ప్రణాళికలు రచించడం వంటి విషయాలలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అంతర్ముఖులు బాగా ప్రణాళిక వేయడంలో ,సమస్యలను పరిష్కరించడంలో కూడా తెలివిగా ఉంటారు.  లాజిక్‌పై దృష్టి పెట్టడంతో పాటు, వీరు  సృజనాత్మకంగా , శక్తివంతంగా ఉంటారు.                                          *నిశ్శబ్ద.
ప్రేమ, స్నేహం రెండు కవలపిల్లల లాంటివి. చూడ్డానికి రెండు ఒకేలా ఉంటాయి. కానీ చాలా సున్నితమైన వ్యత్యాసాలు దాగుంటాయి. స్నేహం ప్రేమ లానూ, ప్రేమ స్నేహం లానూ అనిపించి చాలా మందిని గందరగోళ పెడుతుంది. మరీ ముఖ్యంగా నేటి కాలంలో జెండర్ తో సంబంధం లేకుండా అమ్మాయిలు, అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. అమ్మాయిలు స్నేహం అనుకున్నా. దాన్ని ప్రేమగా భావించే అబ్బాయిలు, అబ్బాయిలు స్నేహం అనుకుంటే దాన్ని ప్రేమగా భ్రమ పడే అమ్మాయిలు బోలెడుమంది ఉన్నారు. నిజానికి ఈ వ్యత్యాసం తెలుసుకోలేక చాలామంది స్నేహాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తమది స్నేహమా?? లేక ప్రేమా?? అనే విషయం గురించి అమ్మాయిలలో ఉండే సందేహాలు క్లియర్ చేసుకుంటే.. అసూయ చూపిస్తున్నారా? ఒక వ్యక్తికి చాలా మంది స్నేహితులు ఉండవచ్చు, కానీ మీరు మీ స్నేహితుడికి దగ్గరగా ఉన్న వారిని చూసి మీకు అసూయగా అనిపించినప్పుడు, లేదా మీరు ఇతరులతో చాలా దగ్గరగా ఉన్నప్పుడు మీ స్నేహితుడు అసూయగా ఫీలవుతుంటే మీ మధ్య స్నేహం ప్రేమగా మారుతుందని అర్థం. ఉదాహరణకు  ఇతరులకు దగ్గర ఉండటం, వారితో సినిమాలు, పార్టీలు, మొదలైన వాటికి ఆసక్తి చూపిస్తూ వెళ్ళడం చేస్తే అవన్నీ చూసి స్నేహితుడు లేదా స్నేహితురాలు చిటపటలాడుతున్నా, కోప్పడుతున్నా, అలుగుతున్నా  వారితో స్నేహం కంటే ఎక్కువ అనుభూతి చెందుతున్నారని అర్థం. ఏకాంతం కోరుకుంటున్నారా? సాధారణంగా స్నేహితులు అంటే ఒక బ్యాచ్ గా ఉంటారు. వీళ్లలో కొందరు అమ్మయిలు, మరికొందరు అబ్బాయిలు కూడా ఉంటారు. అయితే ఇంతమంది స్నేహితులలో కేవలం ఒక్కరితోనే ఏకాంతంగా ఉండాలని అనిపిస్తుంటే అది స్నేహం కంటే ఎక్కువ భావనను సూచిస్తుంది.  పదే పదే గుర్తుచేసుకోవడం.. చాలా వరకు స్నేహితులతో సమయం గడిపిన తరువాత ఇంటి పనుల్లోనూ ఇతర కార్యకలాపాలలోను మునిగిపోతుంటారు. కానీ అలా కాకుండా కేవలం ఒకే ఒక్కరి గురించి పదే పదే ఆలోచిస్తున్నా, వారితో మాట్లాడాలని అనిపిస్తున్నా వారు మిగిలిన వారికంటే చాలా స్పెషల్ అని అర్థం.  ప్రాధాన్యత.. ఎంతమందిలో ఎప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్న తమ స్నేహితుడు లేదా స్నేహితురాలి గురించి ప్రస్తావిస్తూ, తమ మధ్య ఉండే సాన్నిత్యన్ని బయటకు గర్వంగా చెప్పుకుంటున్నా, ఇతరులకంటే వారిని ఎక్కువగా పరిచయం చేస్తున్నా, వారికి అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, వారంటే ప్రత్యేక భావన అని అర్థం. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల మధ్య జెండర్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ కారణంగా చాలామంది తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఈ ఆకర్షణ కారణంగా ఏర్పడే స్నేహం, ఆకర్షణ ఉన్నంత వరకు ఉంటుంది. ఈలోపు నిజంగా స్నేహం వెల్లివిరిస్తే.. అది ప్రత్యేక సాన్నిత్యం కోరుకుండా..  కష్టసుఖాలు చెప్పుకోవడానికి, కష్టసమయంలో సాయం చేసుకోవడానికి తోడుగా ఉండేది అయితే స్నేహమే.. ప్రేమకు, స్నేహానికి  మధ్య సన్నని గీతను గుర్తెరగాలి.                                   *నిశ్శబ్ద.
విజయవంతమైన,  సంతోషకరమైన వివాహా బంధానికి ప్రేమ మాత్రమే ముఖ్యం  కాదు. బంధంలో  భార్యను సంతోషంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం.  ప్రతి భార్యకు తన భర్త నుండి కొన్ని అంచనాలు ఉంటాయి.  అవి నెరవేరితే బంధంలో తగాదాలు తగ్గుతాయి.   బంధం కూడా బలపడుతుంది. అవి నేరవేరకపోతే మాత్రం బంధం బలహీనంగా మారుతుంది. చిన్న ప్రయత్నాలు మానవ సంబంధాలలో దేనినైనా బలోపేతం చేయగలవు.  భార్యాభర్తల సంబంధం విషయానికి వస్తే అది మరింత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వివాహం అనేది ఒక పవిత్ర బంధం. దీనిలో ప్రేమ, గౌరవం,  అవగాహన అనే పునాదిపై కలిసి జీవితాన్నిగడపాల్సి ఉంటుంది.   ఇది పరస్పర అవగాహనతోనూ, బంధంలో పలు విషయాల పట్ల సహనంతో ఉండటం ద్వారా జరుగుతుంది. స్త్రీలు తమ భర్తల గురించి కొన్ని అంచనాలను కలిగి ఉంటారు. వాటిని నెరవేర్చడం ద్వారా ఏ భర్త అయినా తన భార్యను సంతోషంగా ఉంచగలడు. భార్యలు భర్తల నుంచి ఏమి ఆశిస్తారో తెలుసుకుంటే.. ప్రేమ.. ప్రతి స్త్రీ తన భర్త నుండి ప్రేమ,  ఎమోషనల్ సపోర్ట్ ఆశిస్తుంది. ఉద్యోగం చేసే మహిళ అయినా లేదా గృహిణి అయినా.. ఇద్దరూ తమ జీవిత భాగస్వామి అడుగడుగునా తమకు తోడ్పాటు అందించాలని కోరుకుంటారు. ప్రేమను వ్యక్తపరచడం కూడా వారికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా భార్యాభర్తల బంధం లోతుగా, దృఢంగా మారుతుంది. శ్రద్ద..  ఒకరిని ఎంతగా ప్రేమిస్తున్నారో వ్యక్తం చేయడానికి ఉత్తమ మార్గం వారి పట్ల శ్రద్ధ వహించడం.  భార్యకు ఇంటి పనిలో సహాయం చేయడం, ఆమె మానసిక స్థితి సరిగా లేకుంటే ఆమె ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నించడం, ఆమె అనారోగ్యంతో లేదా ఇతర పనులలో బాగా బిజీగా ఉన్నట్లయితే ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని వండడం లేదా ఆర్డర్ చేయడం,  ఆమెకు తినిపించడం, ఆమె చెప్పేది శ్రద్ధగా వినడం, ఆమె కోసం సమయం కేటాయించడం..  ఇవన్నీ చిన్నవి కానీ శ్రద్ధ చూపిస్తున్నామని చెప్పడానికి ఇవి చాలా మంచి మార్గాలు. గౌరవం.. ఏదైనా సంబంధానికి పునాది గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. భార్యలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని భర్తలు ఎందరో ఉన్నారు. వివాహిత సంబంధంలో దీనిని పొందడానికి భార్యలు ఎక్కువగా పోరాడవలసి ఉంటుంది. భార్యలు తమ భర్తలను ప్రేమించడమే కాకుండా వారి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని, సమానంగా చూడాలని,  తమ ఆత్మగౌరవాన్ని తమకు ఇష్టమైనవారి దగ్గర   దెబ్బతీయకూడదని భార్యలు కోరుకుంటారు. భర్త ఇవన్నీ చేస్తే భార్యలు తమను ఎంతగా గౌరవిస్తారో గ్రహించగలుగుతారు కమ్యూనికేషన్.. భార్యాభర్తల మధ్య ఎలాంటి సంకోచం లేకుండా ఓపెన్ కమ్యూనికేషన్ ఉండటం చాలా ముఖ్యం. భార్య తన భర్త తనతో ప్రతిదీ పంచుకోవాలని,  జడ్జ్ చేయకుండా జాగ్రత్తగా వినాలని కోరుకుంటుంది. భార్యాభర్తల బంధంలో  ఒకరికొకరు నిజాయితీగా,  మంచి  నమ్మకంతో  కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ ఫలానా వ్యక్తి వల్ల భార్య అభద్రతా భావంతో బాధపడుతుంటే, భర్త ఆమెను పట్టించుకోకుండా ఉండటం సరికాదు.  ఈ భావాన్ని తొలగించడానికి భర్త ప్రయత్నించాలి. తద్వారా వారి మధ్య నమ్మకం బలపడుతుంది. అవగాహన.. భార్యాభర్తల మధ్య సంబంధాలలో పరస్పర అవగాహన చాలా ముఖ్యం. చాలా మంది మహిళలు తమ భర్తలు తమను అర్థం చేసుకోవడం లేదని భార్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని మనస్తత్వంతో ఉంటారని ఫిర్యాదు చేస్తారు. కానీ ప్రతి భర్త తన భార్య ఇష్టాలు,  అభిరుచులను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే వారి బంధానికి శ్రీరామ రక్ష.                                                             *నిశ్శబ్ద.
అందరినీ వేదించే సమస్య ముఖ్యంగా యువతను వేదిస్తున్న సమస్య ఊబ కాయం అంటే ఒబెసిటీ. దీనికోసం తిరగని చోటంటూ ఉండదు .  వెళ్ళని డాక్టర్ అంటూ లేదు. సక్షన్లు, నాన్ లైపోసక్షన్లు. ప్రత్యేకంగా దీనికోసమే ఉన్న ఆసుపత్రులు. ప్రత్యేక సర్జన్లు. ఇలా ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావడం  గమనించ వచ్చు.చేతి వాడిని ఒదిలి కాలివాడిని పట్టుకున్నట్లు మనం పాటించాల్సిన కనీస  నియమావళిని అమలు చేయకుండా స్వీయ నియంత్రణ  లేకుండా ఊబ కాయాన్ని తగ్గించలేమని అంటున్నారు వైద్యులు.మీ శరీరం బరువు తగ్గాలంటే రాత్రి వేళ ఈ పది సూత్రాలు అమలు చేయండి.మీరు మీ శరీర బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు.ప్రతిరోజూ వర్క్ అవుట్ తప్పని సరిగా  చేస్తూ ఉంటారు. కొన్ని మార్పులు చేసి ప్రయత్నం చేయండి. దీని వల్ల మీరు నాజూకుగా స్లిమ్ముగా కనపడడానికి దోహదం చేస్తాయి. రాత్రి సమయమే సరైన సమయం... మన శరీర బరువు తగ్గించే ప్రయత్నం చేస్తు ఆరోగ్యకర మైన ఆహారం తీసుకుంటూనే వర్క్ అవుట్ చేస్తూ ప్రతిరోజూ ప్రత్యేకమైన  విషయాలు అనుసరించాలి.అందులోను కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ రాత్రివేళ ప్రయత్నించండి మీరు స్లిమ్ గా మారచ్చు .సాయంత్రం వేళ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచండి. సాయంత్రం వేళ మిమ్మల్నిమీరు ఒక వ్యాపకం వైపుకు మళ్లించండి. కొన్ని సందర్భాలలో ప్రజలు చాలా ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. అలా చెయడం బోరింగ్ మీరు ఫిట్ గా ఉండాలంటే నిద్ర పోయే ముందు కొంత పని చేయాల్సి ఉంటుంది. కొంచం సేపు నడవడం, చాట్ చేయడం, వ్యాసాలు రాయడం, మీమిత్రులతో పంచుకోవడం. లేదా కొన్ని పుస్తకాలు చదవడం వల్లమీరు  ఆహారం పెద్దగా తీసుకోరు. ఒక కొత్త అలవాటు ఒక్కొఅంశం పైన ఆశక్తి పెంచుకోడం వల్ల పెయింటింగ్ వేయడం. సంగీతం పాడడం లేదా ఏదైనా వాయిద్యం వాయించడం. అల్లికలు చేయడం వంటి పనుల వల్ల ఆహారం తినాలన్న కోరిక తగ్గిపోతుంది. మళ్ళీ తినా లన్నా కాంక్ష బోర్ గా ఉంటుంది. సరిగా నిద్రపోవాలి... సాయంత్రం వేళలో  కాస్త వ్యాయామం కొంత మేర మీకు సహాయ పడుతుంది. అది ఎక్కువ సేపు వ్యాయామం చేయకూడదు. విరామం లేకుండా చేసే వ్యాయామం చెయడం వల్ల నిద్ర పోవడం కొంచం కష్టంగా ఉంటుంది. మరీ ఆలస్యంగా వర్క్ అవుట్ చేయకండి. నిద్రపోడానికి రాత్రివేళ గంట ముందు  వ్యాయామం ఆపేయండి ఆతరువాతే నిద్రకు ఉపక్రమించండి. నిద్రపోయే ముందు తినకండి... నిద్రపోయే ముందు మీరు డిన్నర్ తీసుకుంటారా? అల్పాహారం అంటే టిఫిన్ తీసుకుంటారా? ఏదైనా మీరు మీఅహారాని నిద్రకు ముందే ముగించేయ్యాలి. అలాకాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీఆహారం తీసుకుంటే అది మీ శరీర బరువును మరింత పెంచుతుంది. అయితే మీరు మీ బరువు తగ్గాలన్న ప్రయత్నం విఫలం కావచ్చు. సరైన సమయం, అంటే ఏ సమయంలో ఆహారం తిన్నారు అన్నది విషయం కాదు. చాలా మంది రాత్రి వేళలో  ఆహారం తీసుకునే వాళ్ళు పైగా ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటారు. అర్ధ రాత్రి భోజనం ,అల్పాహారం తీసుకోడం వల్ల  నిద్రపోలేరు. దీనివల్ల మళ్ళీ బరువు పెరుగుతారు. కొన్ని గంటల పాటు వంట గది నుంచి బయటికి రండి. నిద్రపోయేముందు నుంచి మరుసటి రోజు ముందు వరకు మేల్కుని ఉంటారు. మీ మధ్యాహ్న భోజనాన్ని రేపటికి ప్యాక్ చెయ్యండి... ప్రతి రోజూ మీరు మాధ్యాహ్న భోజనానికి బయటికి వెళ్తున్నారా? అయితే కొంత పొడుపు చేయండి. రాత్రికి ముందే మీ లంచ్ ను ప్యాక్ చెయ్యండి. బయట తినడము అంటే  అందులో ఎక్కువ కొవ్వు పదార్ధాలు, సోడియం ఉంటుంది మీ ఆహారాన్ని మీరే  ప్యాక్ చేసినప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఇచ్చే బాదాం, టర్కీస్లై సెస్, హోల్ గ్రైన్, తక్కువ కొవ్వు ఇచ్చే  పాల ఉత్పత్తులు చాలా రకాల పండ్లు ఫలాలు తీసుకోవచ్చు. మీరు మీ సమయ పాలనకు కట్టుబడి ఉండండి... రాత్రి వేళ మీరు ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారని గమనిస్తే అంటే దాని ఆర్ధం ఉదయం వేళ మీరు సరిపడే ఆహారాన్ని తీసుకోలేదని అర్ధం. దీనిని ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రశ్నకు సమాధానంగా మీ భోజనం మీరు ప్రతిరోజూ తీసుకోవాలి. ఆరకంగా మీ శరీరానికి ఎప్పుడు ఆహారం తీసుకోవాలో  తెలుస్తుంది. మాధ్యాహ్న భోజనం రాత్రి డిన్నర్ మధ్య స్నాక్ తీసుకుంటే మంచిది. అలా ప్రయత్నం చేయడం అది మీరు ఎక్కువగా చేయకండి. టి వి ని కట్టెయ్యండి... రాత్రి వేళ ఆహారం తీసుకుంటూ టివి చూసే అల వాటు మీకు ఉంటె మీరు ఆహారం తీసుకునే సమయం టి వి చూసే సమయం ఆమధ్యలో మీరు ఎక్కువ ఆహారం తీసుకునే అవకాసం ఉంది.రాత్రి ఆహారం తీసుకున్నాక మీ చిగుళ్ళను పళ్ళను బ్రష్ చేయండి. రాత్రి వేళ మీరు తీసుకునే ఆహారాన్నిపూర్తిగా తగ్గించాలంటే మీరు మీపళ్ళను  చిగుళ్ళను శుబ్రం చేసుకోండి. ఒక వేళ మీ పళ్ళు శుభ్రంగా ఉంటె నిద్రపోవడానికి ముందే అల్పాహారం తీసుకునే ముందు రెండు సార్లు ఆలోచించండి. పళ్ళు శుభ్రం చేయడానికి 6౦ నిమిషాలు ఆలోచించండి. ప్రత్యేకంగా మీరు యాసిడ్స్ లాంటివి అంటే నిమ్మరసం, ద్రాక్ష పళ్ళు, సోడా లాంటివి తీసుకుంటే 6౦ నిమిషాలు  ఆగాలి అంటున్నారు నిపుణులు. ఒత్తిడిని సులభంగా జయించవచ్చు... మీరు ఒత్తిడిని ఎదుర్కుంటూ న్నట్లైతే మీ బరువు పెరిగే అవకాశం ఉంది. రాత్రి వేళ కాసేపు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. లోపలి సుదీర్ఘ శ్వాస తీసుకునే పద్దతులు అవలంబించండి. లేదా మెడిటేషన్ ధ్యానం చెయడం ద్వారా ఒత్తిడిని జయించ వచ్చని అలా చేయడం వల్ల నాణ్యతతో కూడుకున్న నిద్ర ను పొందవచ్చు. ఇక చివరగా రాత్రివేళ నిద్ర పోయే ముందు లైట్లు తీసి వేయండి.. చీకాట్లో నిద్రపోవడం చాలా మందికి అల వాటు. అలా చేయడం వల్ల మాంచి నిద్ర పడుతుంది.మీరు బరువు తగ్గించు కోవాలన్న ప్రయత్నాం చేయడం ద్వారా మీ కిటికీలు మూసి వేయండి. కర్టెన్లు వేసుకోండి. ఫోన్లు ల్యాబ్ టాబ్ కు దూరంగా ఉండండి. పడు కునేందుకు ముందు 3౦ నిమిషాలు వాటికి దూరంగా ఉండండి. కంటి మీద మాస్క్ వేసుకుంటే సహాయ పడుతుంది.
వేసవి కాలంలో అందరూ ఎం ఇష్టంగా తినే ఖర్భుజాను స్వీట్ మెలోన్ లేదా రాక్ మెలోన్ అని అంటారు. హిందీ, మరాఠీ, తెలుగులో దీనిని 'ఖర్బూజా' అని పిలుస్తారు, తమిళంలో దీనిని 'ములం పజం' అని పిలుస్తారు. బెంగాలీలు దీనిని 'ఖర్ముజ్' అని పిలుస్తారు, గుజరాతీలు దీనిని షకర్టెట్టి అని పిలుస్తారు. ప్రాంతాలు, పేర్లు ఎన్ని మారినా ఈ ఖర్భూజా మాత్రం మ్యాజిక్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వేసవిలో దొరికే అన్ని పండ్లలోకి ఇది చాలా అద్బుతమైనది అని అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఈ ఖర్భూజా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే..  ఖర్భూజాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మన రోగనిరోధక కణాలైన తెల్ల రక్త కణాలను (WBC) బిల్డ్ చేస్తుంది. తద్వారా మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది . ఇవి సాధారణంగా మూసుకుపోయిన రంధ్రాల్లో పెరిగిమొటిమలుగా కనిపించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణలో కూడా సహాయపడుతుంది. మెరిసే చర్మం కోసం, ఖర్భూజా, పుదీనా కాంబినేషన్ గా జ్యూస్ ప్రయత్నించవచ్చు. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది చక్కెర లేకుండా ఈ జ్యుస్ తీసుకుంటే కేలరీలు బెడద ఉండదు.  బరువు తగ్గించే ఆహారం తీసుకునే వారు ఎప్పుడూ రుచినిచ్చే పదార్థాల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ ఖర్భూజా బెస్ట్ ఆప్షన్. ఇది నోటికి, కడుపుకు కూడా తృప్తిని ఇస్తుంది. దీనివల్ల బరువు పెరగరు.  కేవలం ఇదొక్కటే కాకుండా దీనితో పాటు ఇతర పండ్లను భాగం చేసుకుని ఫ్రూట్ సలాడ్ తీసుకోవచ్చు. ఖర్భూజాలో ఉండే విటమిన్ సి క్యాన్సర్ను నిరోధించడంలో, క్యాన్సర్ తో పోరాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది.  తరచుగా నోటి పుండ్లు మరియు నమలడంలో ఇబ్బంది ఉన్నవారు క్యాన్సర్ రోగులు ఖచ్చితంగా ఖర్భుజా తీసుకోవాలి.  ఖర్భూజా పండులో కొవ్వులు ఉండవు.  ఇందులో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో మంటను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణంగా  ధమనులను ఆరోగ్యంగా ఉంచి గుండెను కాపాడుతుంది. శరీరానికి  సరిపడామెగ్నీషియం ఉందులో లభిస్తుంది.  ఇది హృదయ స్పందనను సక్రమంగా ఉంచుతుంది.  ఇందులో ఉండే  పొటాషియం  రక్తపోటును నిర్వహించడానికి పని చేస్తుంది. ఎక్కువ శాతం నీటితో నిండిన పండ్లలో ఖర్భూజా ఒకటి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.  జీర్ణశయానికి చాలా మంచిది. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి, నిర్విషీకరణకు సహాయపడుతుంది.  చాలామందిలో తరచుగా వచ్చే  ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) తగ్గించండంలో సహాయపడుతుంది.  అసిడిటీ సమస్య ఉన్నవారికి ఖర్భూజా చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఖర్భూజా కడుపులోని ఆమ్లాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఖర్భూజా తీసుకుంటే చాలా సేపటి వరకు ఆకలిని నియంత్రించుకోవచ్చు.  ◆నిశ్శబ్ద.
రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదన్నది చాలా పాపులర్ అయిన మాట. యాపిల్ లో ఉండే పోషకాలే దీనికి కారణం. అయితే ఈ మధ్య యాపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా పాపులర్ అయింది. దీన్ని తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.  ఎవరైనా కొత్తగా యాపిల్ సైడర్ వెనిగర్ వాడే ఆలోచనలో ఉన్నా, దీని గురించి పూర్తీగా తెలియకున్నా ... దీని గురించి తప్పక తెలుసుకుని వాడాలి. యాపిల్ సైడర్ వెనిగర్ వాడటానికి ముందు అందరూ తెలుసుకోవలసిన విషయాలేంటో.. దీన్ని వాడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. మధుమేహ రోగులకు.. యాపిల్ సైడర్ వెనిగర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది.  మధుమేహం ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్ ను వైద్యుల సలహా తీసుకుంటే రెగ్యులర్ గా వాడుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. బరువు.. యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గాలని అనుకునేవారికి  ఔషధం కంటే తక్కువ కాదు. దీన్ని రోజువారీ వాడుతుంటే  ఆకలి నియంత్రణలో ఉంటుంది.  ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.   ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. గుండె ఆరోగ్యం.. చెడు కొలెస్ట్రాల్ సమస్య అయినా,  రక్తపోటును నియంత్రించడం అయినా..  ఆపిల్ సైడర్ వెనిగర్ సమర్థవంతంగా పనిచేస్తుంది. గుండెకు సంబంధించిన చాలా  సమస్యలలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.   ఇందులో ఉండే మూలకాలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యం.. యాపిల్ సైడర్ వెనిగర్ చర్మం pH స్థాయిని నిర్వహించడానికి  ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా చర్మం  దురద, ఎరుపు,  చర్మ అంటువ్యాధులు మొదలైన  సమస్యలలో  బ్యాక్టీరియాను చంపడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా తీసుకోవాలి.. యాపిల్ సైడర్ వెనిగర్ వినియోగించడానికి ఒక కరెక్ట్ కొలత వాడాలి. ప్రతిరోజూ ఇంతే మోతాదులో తీసుకోవాలి.  5-10 ml మోతాదుతో మాత్రమే ప్రారంభించాలి.  ఒక గ్లాసు తీసుకుని అందులో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేయాలి. గ్లాసు నిండుగా నీరు తీసుకోవాలి.  దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో  తాగాలి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు,  చిగుళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.  కాబట్టి దీన్ని మొదలుపెట్టే ముందు   వైద్యుడిని సంప్రదించడం మంచిది.                                         *రూపశ్రీ.