LATEST NEWS
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ తో దశాబ్దాల నాటి పొత్తును డీఎంకే తెగతెంపులు చేసుకుంది.  టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే..  కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది.  మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినందున, ఇకపై వారితో కలిసి కూర్చోవడం సముచితం కాదని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. డీఎంకే నిర్ణయం జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన పని లేదు.   ఇలా డీఎంకే కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పేసిందో లేదో అలా తమిళనాట ఇరు పార్టీల కార్యకర్తల మధ్యా దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. మైలదుత్తురైలో డీఎంకే మద్దతుదారులు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిన్నటి వరకూ మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ డీఎంకేలు ఇప్పుడు బద్ధ శత్రుపక్షాలుగా మారిపోయి పరస్పర దాడులకుదిగడం  సంచలనంగా మారింది.  
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సందిగ్ధతలు తొలగిపోయాయి. టీవీకే విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైంది.  ఇటీవలి  అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన  తమిళగ వెట్రి కళగం  (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్   అధికార పీఠాన్ని దక్కించుకోనున్నారు. తాజా సమాచారం ప్రకారం..  విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.   తమిళగ వెట్రి కళగం ఎన్నికల బరిలో దిగి 108 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం కొన్ని స్థానాల దూరంలో విజయ్ ఆగిపోయారు. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థులతో పాటు చిన్న పార్టీల మద్దతు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్షాలు, విడుతలై చిరుత్తైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు విజయ్ కు మద్దతు ప్రకటించాయి. ఈ మూడు పార్టీల మద్దతు లేఖలతో విజయ్ నేరుగా గవర్నర్ రాజేంద్ర అక్లేకర్ తో భేటీ అయ్యారు.  భేటీకి ముందే విజయ్   గవర్నర్ కార్యాలయానికి మద్దతు లేఖలు అందజేశారు.  తన వద్ద తగినంత మెజారిటీ ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని విజయ్ ఆ మద్దతు లేఖలతో పాటు గవర్నర్ కు రాసిన మరో లేఖలో కోరారు. దీంతో గవర్నర్ విజయ్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. గవర్నర్ తో భేటీలో విజయ్ తన బలాన్ని నిరూపించుకునేందుకు మూడు పార్టీల మద్దతు లేఖలను గవర్నర్ కు అందజేశారు.  
ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా రాజేంద్ర విశ్వ‌నాథ్ అర్లేక‌ర్ ఉన్నారు. ఈయ‌న గోవాలోని ప‌నాజీలో  1954 ఏప్రిల్ 23,న జన్మించారు. భారతీయ జనతా పార్టీలో  సుదీర్ఘ కాలం పనిచేశారు. గోవా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. గోవా శాసనసభ స్పీకర్‌గా.. 2012-2015 మ‌ధ్య కాలంలో ప‌ని చేశారు. గోవా ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. భారతదేశంలోనే అసెంబ్లీని మొట్టమొదటిసారిగా పేపర్ లెస్ చేసిన ఘనత ఈయనకు దక్కుతుంది. ముందుగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, ఆ తర్వాత బీహార్ గవర్నర్‌గానూ పనిచేశారు.  జనవరి 2025లో కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2026 మార్చి 12 నుంచి ఆయన తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత వివాదం విష‌యానికి వ‌స్తే.. తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.  అయితే  ప్రభుత్వ‌ ఏర్పాటుకు కావాల్సిన 118 మ్యాజిక్ మార్కుకు ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఆ మద్దతును  స్పష్టంగా చూపించాలని గవర్నర్  చెబుతున్నారు. బయటి నుంచి మద్దతు ఇచ్చే పార్టీలైన కాంగ్రెస్ వంటి వాటి నుంచి రాతపూర్వక లేఖలు ఉంటేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తానని ఆయన స్పష్టం చేయడంతో తమిళనాట రాజకీయ హీటెక్కింది.  గోవా నుంచి వచ్చి తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేస్తుండటం వ‌ల్ల‌, గతంలో ఆయనకున్న బీజేపీ నేపథ్యం వల్ల.. స్థానిక నాయకులు, ఇత‌ర‌ సినీ ప్రముఖులు ఆయన తీరును విమర్శిస్తున్నారు. రజనీ, కమల్, ప్రకాష్ రాజ్ ఎందుకు గుర్రుగా ఉన్నారు? అని చూస్తే వీరందరూ గవర్నర్ తీరును విమర్శించడానికి ప్రధాన కారణం రాజ్యాంగ సంక్షోభం. కేంద్రం పంపిన గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజల తీర్పును గౌరవించడం లేద‌ని బాహాటంగానే విమర్శిస్తున్నారు ప్ర‌కాష్ రాజ్. రజనీ, కమల్.. నేరుగా గవర్నర్‌పై యుద్ధం ప్రకటించకపోయినా.. తమిళనాడులో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గవర్నర్ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతోందని వీరి ఆందోళన. గవర్నర్ అర్లేకర్  తీసుకునే నిర్ణయాలు కేంద్రంలోని బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనీ..  అందుకే ఆయన మెజారిటీ విషయంలో అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని స్థానిక పార్టీలు ఆరోపిస్తున్నాయి. విజయ్ కి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా లేదా అనేదే ఇప్పుడు కీలకం. ఒకవేళ ఆయన మద్దతు లేఖలు సమర్పిస్తే, గవర్నర్ తప్పనిసరిగా ప్రమాణ స్వీకారానికి అనుమతించాల్సి ఉంటుంది. ఈ లోపు జరుగుతున్న ఈ తాత్కాలిక అడ్డంకులే ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశమయ్యాయి.
పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జిగా వర్మ తొలగింపు నిజంగా ఒక అనూహ్య పరిణామమే. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను పీఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి నుండి తొలగిస్తూ తెలుగుదేశం హైకమాండ్ తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాలలో పెను సంచలనం రేపింది.  పిఠాపురం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో..  ఇక్కడ జరిగే ప్రతి చిన్న మార్పు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ నేపథ్యంలోనే వర్మను బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ   తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి..  క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం  మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.   గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ సాధించడంలో వర్మదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. పవన్ కల్యాణ్ కోసం తన సీటును వర్మ త్యాగం చేశారు.  వ్యక్తిగత ఆకాంక్షలను పక్కన పెట్టి మరీ  అధిష్టానం ఆదేశాల మేరకు జనసేన అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. అటువంటి నాయకుడిని ఇప్పుడు ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం స్థానిక టీడీపీ శ్రేణులలో కూడా అసంతృప్తికి కారణమైంది.  గత కొద్దిరోజులుగా పిఠాపురంలో జనసేన,  టీడీపీ స్థానిక నాయకుల మధ్య ప్రోటోకాల్ విషయంలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు లేకపోవడంపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నాయకులతో   వాగ్వాదాలకు దిగారు. ఇప్పుడు అవే తెలుగుదేశం అధిష్ఠానం వర్మపై వేటు వేయడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదే విషయంలో వర్మ తనను ఇన్ చార్జిగా తొలగించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ  కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ బలోపేతానికి తన రక్తాన్ని ధారపోశాననీ..  ఏనాడు క్రమశిక్షణ తప్పలేదని చెబుతూ.. అర్ధంతరంగా మీడియా సమావేశాన్ని ముగించి కన్నీటిని ఆపుకుంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి.  తెలుగుదేశం శ్రేణుల్లో వర్మ పట్ల సానుభూతి వ్యక్తం అవుతోంది. అయితే వర్మను  నియోజకవర్గ బాధ్యతల నుంచే తప్పించి ముందు ముందు కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చే ఉద్దేశంతో తెలుగుదేశం హైకమాండ్ ఉందని పార్టీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.   రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో.. ఆ కూటమిలోని ఇద్దరు ప్రధాన భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య కుదర్చడానికే అధిష్టానం ఈ  నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  రాబోయే రోజుల్లో పిఠాపురం టీడీపీలో ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. వర్మ వంటి బలమైన నేతను పక్కన పెట్టడం వల్ల కేడర్‌లో అసమ్మతి రాకుండా చూసుకోవడం ఇప్పుడు టీడీపీ అధిష్టానం ముందు ఉన్న టాస్క్ గా చెబుతున్నారు.  
వ‌ర్మ‌ను పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం ఇన్ ఛార్జ్ అనే ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం వెన‌క గ‌ల కార‌ణం.. ఆయ‌న చేష్ట‌లు, వాద‌న‌లు, విప‌రీత పోక‌డ‌లు ఎక్క‌డ కూట‌మి ధ‌ర్మానికి విఘాతం క‌లిగిస్తాయో అన్న‌ది మెయిన్ రీజ‌న్ గా తెలుస్తోంది. అంటే చంద్రబాబుకు కూటమి  ఎంత  క‌ల‌సికట్టుగా  ఉంటే  మ‌నం అంత బ‌లంగా  ఉండ‌గ‌లం అన్న‌ది    బాగా తెలుస‌న్న‌మాట‌. ఇది వ‌ర‌కు చంద్ర‌బాబు ఇలా ఉండేవారు కాదు. ఇలాంటి సున్నితాంశాల‌కు పెద్ద‌గా  విలువ‌నిచ్చేవారు కాదు.  ఈ విష‌యంపై సాధార‌ణ  కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ఒక ఐడియా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వారు అనుభ‌విస్తున్న‌ది అదే కాబ‌ట్టి.. ఇందులో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు కూడా.  బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా  భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని  కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే  క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న  అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం. ప్ర‌స్తుతం వైసీపీ నేత‌ల‌కు వ‌ర్మ రూపంలో మ‌రో ల‌డ్డూ దొరికింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌ర్మ‌గానీ పిఠాపురంలో ఇండిఎండెంట్ గా నిల‌బ‌డితే  చాలు.. ప‌వ‌న్  క‌ళ్యాణ్ కి డిపాజిట్లు రావ‌ని రెచ్చ‌గొట్టుడు కామెంట్లు చేస్తున్నారు. దానికి తోడు ప‌క్క రాష్ట్రం  విజ‌య్ వ్య‌వ‌హారం ఉండ‌నే ఉంది.  విజ‌య్ ఒంట‌రిగా  నిల‌బ‌డి  గెలిచాడ‌ని..  అదే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అది సాధ్యం కావ‌డం లేద‌ని కావాల‌నే  ఊద‌ర‌గొట్టేస్తున్నారు మ‌రోప‌క్క‌.   ఇదే టైంలో వ‌ర్మ‌ను పిఠాపురం  ఇన్ ఛార్జి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించ‌డంతో.. ఇపుడు ఫ్యాను గాలి ఇటు మ‌ళ్లింది. ఇక దంచి కొట్టుడు మొద‌లు పెట్టారు. ఇక వైసీపీ  ఇన్ ఫ్లూయెన్ష‌ర్ల‌లో కొంద‌రు అనే మాట ఏంటంటే కూట‌మి  నుంచి ప‌వ‌న్ ని అయినా వెళ్ల‌గొట్టండి  లేదా కొత్త కాపునాయ‌క‌త్వ‌మైనా  వైసీపీలోకి వ‌చ్చేలా చేయండ‌ని తెగ  స‌ల‌హాలు ఇచ్చేస్తున్నారు. అదృష్ట‌మో, దుర‌దృష్ట‌మో.. రంగా త‌ర్వాత అంత‌టి కాపు ట‌వ‌రింగ్  ప‌ర్స‌నాల్టీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గానే చెప్పాలి. ఆయ‌న కాకుండా క‌నుచూపు మేర‌లో కూడా ఎవ్వ‌రూ అలాంటి వారు లేనే లేరు. అందుకే విధిలేని ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ త‌మ పార్టీలోని కాపు నాయ‌కుడు అంబ‌టి  రాంబాబును హైలైట్ చేస్తున్నారు. కాపు టైగ‌ర్ అనే బిరుదులివ్వ‌డంతో పాటు కాపు నాయ‌క‌త్వం మొత్తాన్ని ఏకం  చేసి.. వారిలో ఒక చైత‌న్యం తీసుకొచ్చేందుకు తీవ్ర య‌త్నాలు సాగిస్తున్నారు.  దుర‌దృష్ట‌మేంటంటే, కాపు టైగ‌ర్ బిరుదాంకితుడైన  అంబ‌టికి అస‌లు కాపు కులమంటేనే గిట్ట‌దు..  క‌మ్మ‌ల‌ను ఇర‌వై నాలుగు గంట‌లు ఆడిపోసుకునే ఆయ‌న త‌న ముగ్గురు అల్లుళ్ల‌నూ క‌మ్మ‌ల‌నే చేసుకోవ‌డం ఇందులో కొస‌మెరుపు. ఎటు నుంచి ఎటు చూసినా.. జ‌గ‌న్ కి  కూట‌మిని చీల్చ‌డం ఎలాగో పాలు పోక‌, త‌న  పార్టీలోనే  కాపు టైగ‌ర్ ని ఎలా త‌యారు చేయాలో తెలీక..  నానా తంటాలు ప‌డుతున్నారు. స‌రే ఇదంతా ఇలా ఉంటే  కూట‌మి నానాటికీ   అల‌ర్ట్ అయ్యి.. త‌మ పొత్తుకు ఎవ‌రు విఘాతం క‌లిగిస్తున్నారో వారిని ప‌క్కాగా గుర్తించి ఏరిపారేస్తుండ‌టంతో.. దిక్కుతోచ‌ని  ప‌రిస్థితిలో ప‌డుతోంది పాపం వైసీపీ  అధిష్టానం. ఏ  మాట‌కామాట  ఈ  క‌ష్టం  ప‌గ‌వాడికి కూడా రాకూడ‌దు. అంత‌గా విల‌విల‌లాడిపోతోంది. వైసీపీ యంత్రాంగ‌మంతా.  
ALSO ON TELUGUONE N E W S
హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'గోల్డెన్ గ్లోబ్' అవార్డుల నిర్వాహకులు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరిగిపోతున్న తరుణంలో, దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. 2027లో జరగబోయే 84వ ఎడిషన్ అవార్డుల వేడుక కోసం సరికొత్త నిబంధనలను ఖరారు చేస్తూ చిత్ర పరిశ్రమలో చర్చకు తెరలేపారు. ముఖ్యంగా నటన, రచన వంటి ప్రధాన విభాగాల్లో AI ప్రాబల్యం పెరగకుండా అడ్డుకట్ట వేయడమే ఈ కొత్త రూల్స్ ముఖ్య ఉద్దేశం. ఒక నటుడి హావభావాలను లేదా గొంతును పూర్తిగా AI ద్వారా సృష్టించి సినిమా తీస్తే, అటువంటి చిత్రాలు లేదా నటీనటులు అవార్డులకు అనర్హులని నిర్వాహకులు స్పష్టం చేశారు. కేవలం సహాయక సాంకేతికతగా మాత్రమే AIని వాడాలని, అది మానవ సృజనాత్మకతకు ప్రత్యామ్నాయం కాకూడదని పేర్కొన్నారు. నటన విభాగంలో పోటీ పడే ప్రతి అభ్యర్థి ప్రతిభ కూడా సహజసిద్ధంగా ఉండాలని, కేవలం స్క్రీన్ మీద కనిపించే వ్యక్తి నటనలో మెజారిటీ భాగం ఆ నటుడి సొంతమై ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఒకవేళ డీ-ఏజింగ్ (వయస్సు తగ్గించడం) లేదా ఇతర విజువల్ ఎఫెక్ట్స్ కోసం AIని వాడితే, ఆ విషయాన్ని ముందే వెల్లడించాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా ఒక నటుడి డిజిటల్ రూపాన్ని వాడితే అటువంటి ఎంట్రీలను అసలు పరిగణనలోకి తీసుకోరు. గత ఏడాది హాలీవుడ్‌లో జరిగిన రచయితలు, నటీనటుల సమ్మె సమయంలో AI ప్రధాన వివాదంగా మారిన సంగతి తెలిసిందే. సాంకేతికత వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని కళాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అకాడమీ కూడా ఇప్పటికే కొన్ని కఠిన నియమాలను తీసుకొచ్చింది. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్స్ కూడా అదే బాటలో పయనిస్తూ మానవ మేధస్సుకే పెద్దపీట వేస్తోంది.   పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం సినిమాలే కాకుండా మ్యూజిక్, యానిమేషన్ విభాగాల్లో కూడా AI వాడకంపై నిఘా ఉండనుంది. స్క్రిప్ట్ రాయడంలో చాట్ బాట్‌ల సహాయం తీసుకున్నా లేదా సంగీతంలో పూర్తిగా మెషిన్ లెర్నింగ్ వాడినా అవార్డు రేసులో వెనుకబడే అవకాశం ఉంది. హాలీవుడ్ మేకర్స్ ఈ కొత్త నిబంధనలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే ఇది నిజమైన టాలెంట్‌కు ఇచ్చే గౌరవమని వారు భావిస్తున్నారు. మొత్తానికి టెక్నాలజీ పెరుగుతున్నా, కళ అనేది గుండెల్లోంచి రావాలి కానీ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ నుండి కాదని గోల్డెన్ గ్లోబ్స్ గట్టి సందేశాన్ని పంపింది. 2027 జనవరి 10న జరగనున్న ఈ వేడుకలో ఏయే సినిమాలు ఈ కొత్త రూల్స్ దాటుకుని నిలుస్తాయో వేచి చూడాలి. నిక్కీ గ్లేజర్ వరుసగా మూడోసారి ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ (Satyadev), విలక్షణ దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'రావు బహదూర్' (Rao Bahadur). పీరియడ్ డ్రామాగా అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మారుస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. వాయిదాకు కారణం 'పెద్ది' క్రేజ్? నిజానికి ఈ సినిమాను జూన్ 5, 2026న విడుదల చేయాలని ముందుగా నిర్ణయించారు. అయితే, జూన్ 4న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ సినిమా 'పెద్ది' (Peddi) విడుదల కానుంది. థియేటర్ల కొరత, కలెక్షన్లపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో 'రావు బహదూర్' బృందం వెనక్కి తగ్గినట్లు సమాచారం. అందుకే ఈ సినిమాను దాదాపు నెల రోజులు వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీ: 'రావు బహదూర్' మూవీ జూలై 3, 2026న థియేటర్లలో సందడి చేయనుంది. మహేష్ బాబు (GMB Entertainments) ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తుండటం విశేషం. సత్యదేవ్ ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని రీతిలో రాజు గెటప్‌లో కనిపిస్తుండటంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. వెంకటేష్ మహా తనదైన మార్క్ కథనంతో ఈ పీరియడ్ ఫిలింను మలిచినట్లు పోస్టర్లను చూస్తుంటే అర్థమవుతోంది. పెద్ద సినిమాల పోటీ మధ్యలో వచ్చి ఇబ్బంది పడటం కంటే, సోలో రిలీజ్ చూసుకోవడం ఉత్తమమనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారు. జూలైలో పెద్దగా పోటీ లేకపోవడం 'రావు బహదూర్'కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరి సత్యదేవ్ ఈ విభిన్న పాత్రతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.  
కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో నితిన్ (Nithiin), వరుస క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు. ఇటీవల సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. దర్శక ద్వయం నారి సిరిసవాడ, సోమశేఖర్ టి తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పుడు 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ కేవీ(Anudeep KV)తో నితిన్ జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అనుదీప్ తనదైన శైలిలో సిల్లీ అండ్ హిలేరియస్ కామెడీని పండించడంలో దిట్ట. నితిన్ కూడా 'భీష్మ' వంటి సినిమాలతో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుండటంతో వినోదం రెట్టింపు అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' (People Media Factory) నిర్మించనుందని సమాచారం. అనుదీప్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడని, నితిన్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా కథను సిద్ధం చేశాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశముంది. అనుదీప్ గత చిత్రం 'ఫంకీ' నిరాశపరిచింది. ఇప్పుడు ఈ సినిమాతో తాను హిట్ కొట్టడమే కాకుండా, నితిన్‌ ను కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడేమో చూడాలి.  
బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి (Ashu Reddy) ఎప్పుడూ ఏదో ఒక వార్తతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకర్షించే అషు, తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫోటోలను చూస్తుంటే అషు రెడ్డి నిశ్చితార్థం రహస్యంగా జరిగిపోయిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను పంచుకుంది. అందులో ఒక మిస్టరీ మ్యాన్ తో ఆమె చేతులు కలిపి ఉండటం, వేలికి ఉంగరం మార్చుకోవడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో ఉన్న ఒక ఫోటోలో అషు రెడ్డి సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతుండగా, మరో ఫోటోలో ఒక వ్యక్తి ఆమె చేతిని పట్టుకుని ఉండటం చూడవచ్చు. దీంతో అషు రెడ్డికి నిశ్చితార్థం అయిపోయిందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్ళి పేరుతో మోసం చేసిందంటూ ఇటీవల ఓ ఎన్ఆర్ఐ కుటుంబం, అషు రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఇలాంటి సమయంలో అషు రెడ్డి తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే కొందరు నెటిజన్లు ఇది కేవలం ఏదైనా టీవీ షో లేదా వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం చేసిన ఫోటోషూట్ అయి ఉంటుందని కూడా అభిప్రాయపడుతున్నారు. నిజంగానే ఆమె నిశ్చితార్థం చేసుకుందా లేక ఇది కేవలం ప్రాంక్ మాత్రమేనా అన్నది అషు రెడ్డి స్వయంగా చెబితే తప్ప తెలియదు. ఏది ఏమైనా అషు రెడ్డి మరోసారి సోషల్ మీడియాను తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది.   https://www.instagram.com/p/DYEyEr_CXEb/
దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కుటుంబానికి న్యాయస్థానంలో భారీ విజయం లభించింది. చాలా కాలంగా వేధిస్తున్న ఆస్తి వివాదానికి మద్రాస్ హైకోర్టు స్వస్తి పలికింది. చెన్నైలోని శ్రీదేవి ఆస్తులపై సాగుతున్న న్యాయపోరాటంలో బోనీ కపూర్, ఆయన కుమార్తెలకు అనుకూలంగా తీర్పు వెలువడింది. చెన్నైలోని ఈసీఆర్ (ECR) రోడ్డులో శ్రీదేవి కుటుంబానికి 2.7 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో తమకు కూడా వాటా ఉందని పేర్కొంటూ నటరాజన్, శివగామి అనే వ్యక్తులు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు, పిటిషనర్ల వాదనలో బలం లేదని తేల్చి చెప్పింది. గత 37 ఏళ్లుగా సదరు ఆస్తి శ్రీదేవి కుటుంబం ఆధీనంలోనే ఉందని, ఇన్నేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు కోరడం చట్టరీత్యా సమర్థనీయం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిరాటంకంగా అనుభవిస్తున్న ఆస్తిపై ఇప్పుడు వివాదాలు సృష్టించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో బోనీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు పెద్ద ఊరట లభించింది. కొంత కాలంగా ఈ ఆస్తి వివాదం వారిని ఆందోళనకు గురిచేసింది. ఇప్పుడు హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేయడంతో, ఆ 2.7 ఎకరాల భూమిపై శ్రీదేవి కుటుంబానికే పూర్తి హక్కులు ఉన్నాయని న్యాయపరంగా ఖరారైంది. ఈ వివాదం ముగియడంతో శ్రీదేవి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో 'పెద్ది' వంటి భారీ చిత్రాలతో దూసుకుపోతున్న తరుణంలో, ఈ న్యాయపరమైన విజయం ఆమెకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.  
తారాగణం: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, నరేష్, సప్తగిరి, VTV గణేష్, మొట్ట రాజేంద్రన్, జాఫర్ సాదిక్ తదితరులు  సంగీతం: మిక్కీ జె. మేయర్ డీఓపీ: బినేంద్ర మీనన్ ఎడిటింగ్: సతీష్ సూర్య మాటలు: ఉదయ్ పొట్టిపాడు దర్శకత్వం: సత్య తాతినేని నిర్మాతలు: నాగమోహన్ బాబు. ఎమ్, రాజేష్ టి సమర్పణ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లు: దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ విడుదల తేదీ: మే 8, 2026 పెళ్ళి తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన మొదటి మూవీ 'సతీ లీలావతి'. మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా, 'భీమిలి కబడ్డీ జట్టు' ఫేమ్ దర్శకుడు తాతినేని సత్య తెరకెక్కించిన ఈ సినిమా నేడు (మే 8) విడుదలైంది. మరి ఈ భార్యాభర్తల ఫన్నీ పోరాటం ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించింది? లావణ్య సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకుందాం. (Sathi Leelavathi Movie Review) కథ: లీలావతి (లావణ్య త్రిపాఠి) ఒక సినిమా డైరెక్టర్. లీలావతి తన కెరీర్‌తో బిజీగా ఉంటూ తనకు సమయం కేటాయించడం లేదని, విడాకులు కావాలని ఆమె భర్త రామ్ (దేవ్ మోహన్) కోరుతాడు. అంతేకాకుండా తాను నికోలా (మడోన్నా సెబాస్టియన్) అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని షాక్ ఇస్తాడు. భర్తను వదులుకోవడం ఇష్టం లేని లీలావతి, అతన్ని ఇంట్లోనే కట్టేసి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? రామ్ మనసు మారిందా? లీలావతి-రామ్ ఒక్కటయ్యారా లేదా? అనేదే మిగతా కథ. విశ్లేషణ: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన తొలి సినిమా కావడం, పైగా ఇది భార్యాభర్తల మధ్య సాగే ఫ్యామిలీ డ్రామా అని ప్రచారం చేయడంతో ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి నెలకొంది. అయితే, సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో తడబడింది. సినిమా ప్రారంభంలో భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల అంశంతో కథ వేగంగానే మొదలవుతుంది. తనను కాదని మరో అమ్మాయి దగ్గరకు వెళ్తున్న భర్తను లీలావతి కొట్టి కట్టేయడం అనే పాయింట్ వినడానికి బాగున్నా, స్క్రీన్ మీద అది పండలేదు. సాగదీత సన్నివేశాలతో కథ నెమ్మదిగా నడుస్తుంది, లీలా తండ్రి (నరేష్), నిర్మాత (మొట్ట రాజేంద్రన్) ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇంటికి రావడం, కట్టేసిన భర్తను వారు చూస్తారేమో అని లీలావతి పడే టెన్షన్ ద్వారా దర్శకుడు కొంత సస్పెన్స్‌ని మెయింటైన్ చేయగలిగారు కానీ, అది కథను ముందుకు నడిపించలేకపోయింది. ఇక లీలా-రామ్ లవ్ స్టోరీకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్లు మరీ సిల్లీగా ఉన్నాయి. సెకండ్ హాఫ్‌లో సినిమా ట్రాక్ తప్పుతుంది. లీల కిడ్నాప్ డ్రామా, దొంగ ఎంట్రీ వంటి ఎపిసోడ్లతో కథను సాగదీశారు. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఎమోషనల్ బాండింగ్ కంటే, అనవసరమైన సన్నివేశాలే ఎక్కువయ్యాయి. అసలు కథ ఎటు వెళ్తుందో అర్థం కాని స్థితిలో చివర్లో ఇచ్చే రెండు ట్విస్టులు కాస్త ఊరటనిస్తాయి తప్ప, సినిమాను నిలబెట్టలేవు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: లీలావతిగా లావణ్య త్రిపాఠి నటన ఆకట్టుకుంది. డైరెక్టర్‌గా, భర్తను ప్రేమించే భార్యగా రెండు షేడ్స్‌లోనూ చక్కగా నటించారు. దేవ్ మోహన్ పాత్రలో కానీ, నటనలో కానీ పెద్దగా మెరుపులు లేవు. ఈ సినిమాలో సప్తగిరి, విటివి గణేష్, మొట్ట రాజేంద్రన్ వంటి భారీ కామెడీ తారాగణం ఉన్నప్పటికీ, సరైన రైటింగ్ లేకపోవడంతో వారు నవ్వించలేకపోయారు. ఏదో ఒకటి రెండు చోట్ల తప్ప, మిగతా సీన్స్ కామెడీ బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. 'భీమిలి కబడ్డీ జట్టు' లాంటి సినిమా చేసిన దర్శకుడు తాతినేని సత్య నుంచి ఇలాంటి సినిమా ఊహించలేం. రచన పూర్తిగా తేలిపోయింది. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. మిక్కీ జె. మేయర్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్: లావణ్య త్రిపాఠి నటన కొన్ని కామెడీ సీన్స్ క్లైమాక్స్‌ ట్విస్టులు మైనస్ పాయింట్స్: కథాకథనాలు మిస్సైన ఎమోషన్ ఫైనల్ గా.. కథాకథనాల్లో బలం లేకపోవడం వల్ల సినిమా తేలిపోయింది. లావణ్య తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, సాగదీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. రేటింగ్: 2/5 Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
1. పెద్ది రికార్డుల వేట మొదలు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న 'పెద్ది' మూవీ ఓవర్సీస్ లో సంచలనం సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన 4 గంటల్లోనే.. ఒక లక్ష డాలర్ల మార్కును దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, జూన్ 3న ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. 2. పవర్ ఫుల్ మ్యూజిక్ తో 'డ్రాగన్' గ్లింప్స్‌ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్'. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇందుకోసం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గత మూడు రోజులుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 'డ్రాగన్' గ్లింప్స్‌కు ఆయన 'పవర్ ఫుల్ అండ్ యూనిక్' మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. 3. 'రేజర్' మూవీ రివ్యూ రవిబాబు స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'రేజర్' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక పవర్ ఫుల్ పొలిటీషియన్ అండ్ క్రిమినల్ గ్యాంగ్ బారి నుండి.. ఒక చిన్న పాప ప్రాణాలను రక్షించే వ్యక్తిగా రవిబాబు ఈ సినిమాలో కనిపించారు. సినిమా అంతా రవిబాబు మార్క్ వైల్డ్ యాక్షన్, హింసతో నిండిపోయింది. కథలో వైవిధ్యం లేకపోవడం, ఎమోషన్స్ పండకపోవడం సినిమాకు మైనస్ గా మారాయి.  4. 'సతీ లీలావతి' మూవీ రివ్యూ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తాతినేని సత్య దర్శకత్వంలో వచ్చిన 'సతీ లీలావతి' ఒక యావరేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మిగిలిపోయింది. విడాకులు కోరిన భర్తను భార్య బంధించి మనసు మార్చే ప్రయత్నం చేయడం అనే పాయింట్ ఆసక్తికరంగా ఉన్నా.. కథనంలో బలం లేకపోవడం వల్ల సినిమా సాగదీతగా అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బలమైన ఎమోషన్ మిస్ అయ్యింది. సిల్లీ డైలాగ్స్, లాజిక్ లేని సీన్స్ బోర్ కొట్టిస్తాయి. 5. 'గోదారి గట్టుపైన' మూవీ రివ్యూ సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'గోదారి గట్టుపైన' నేడు విడుదలైంది. ఒక ఆటో డ్రైవర్, ఇంజనీరింగ్ స్టూడెంట్ మధ్య సాగే ప్రేమకథకు.. గోదావరి నేపథ్యం, నాగవంశీ అందించిన సంగీతం ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే, కథలో కొత్తదనం లేకపోవడం, సాగదీత సన్నివేశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. 6. 'పెద్ది' సెట్స్‌లో మెగాస్టార్ సందడి రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్ సెట్స్‌ను మెగాస్టార్ చిరంజీవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దర్శకులు బుచ్చిబాబు, సుకుమార్‌లతో కలిసి సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "ది బాస్, మై గురు 'పెద్ది' సెట్స్‌లో అడుగుపెట్టడం నా జీవితంలో మధుర జ్ఞాపకం" అని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 7. నెవర్ బిఫోర్ లుక్ లో తారక్ జూనియర్ ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సంగీత దర్శకుడు థమన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఎన్టీఆర్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో.. గుబురు గడ్డం, నోటిలో టూత్ పిక్ తో ఎన్టీఆర్ చూపించిన యాటిట్యూడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ లుక్ తో ఒక్క సినిమా పడితే బాక్సాఫీస్ రికార్డులు గల్లంతేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 8. శ్రీదేవి కుటుంబానికి హైకోర్టులో ఊరట దివంగత నటి శ్రీదేవి కుటుంబానికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెన్నై ఈసీఆర్ రోడ్డులోని 27 ఎకరాల భూమిపై వాటా కోరుతూ నటరాజన్, శివగామి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 37 ఏళ్లుగా శ్రీదేవి కుటుంబం ఆధీనంలో ఉన్న ఆస్తిపై ఇప్పుడు యాజమాన్య హక్కులు కోరడం తగదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో బోనీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు ఆస్తి వివాదం నుండి విముక్తి లభించింది. 9. శక్తి కపూర్ ఆరోగ్యంగానే ఉన్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ తన మరణం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తాను పూర్తి ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని, ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా శక్తి కపూర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని, మరణించారని జరుగుతున్న ప్రచారానికి ఈ వీడియోతో చెక్ పడింది.  10. ఓటీటీలోకి 'ధురందర్ 2' రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురందర్ 2: ది రివేంజ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. మే 14 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇండియాలో జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుండగా.. ఓవర్సీస్ ప్రేక్షకులకు Netflix లో అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.  
హారర్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. వెన్నులో వణుకు పుట్టించే విజువల్స్, అడ్రినలిన్ పెంచే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో రూపొందిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'సతన్: ది డార్క్' (Satan: The Dark) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేస్తోంది. థియేటర్లలో విడుదలైనప్పుడు తనదైన ముద్ర వేసిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.   ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మంత్ర తంత్రాలు, క్షుద్ర పూజల నేపథ్యంలో సాగే ఒక మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. హస్తినాపురం అనే కొండ ప్రాంతం చుట్టూ తిరిగే ఈ కథలో.. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో జరిగిన ఒక క్షుద్ర పూజ వికటించి, ఒక దుష్టశక్తి బయటకు వస్తుంది. ఆ ప్రభావం ప్రస్తుత కాలంలో ఒక కుటుంబంపై ఎలా పడింది? మార్సెలిన్ అనే మహిళ ప్రవర్తన హఠాత్తుగా ఎందుకు మారింది? అనే ఆసక్తికర అంశాలతో దర్శకుడు మణికందన్ రామలింగం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రధాన పాత్రల్లో ఫ్రెడరిక్ జాన్ (FJ), అయిరా పాలక్, చాందిని తమిళరసన్, మోనా బెడ్రే తదితరులు నటించారు. ముఖ్యంగా చాందిని తమిళరసన్ చేసిన ఒక విలక్షణమైన పాత్ర ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తుంది. తన నాలుకను తనే కోసుకునే ఒక భయంకరమైన సీన్‌లో ఆమె నటన హైలైట్‌గా నిలుస్తుంది. భయం, ఆందోళన కలిగించే సన్నివేశాల్లో అయిరా పాలక్, ఫ్రెడరిక్ జాన్ తమ నటనతో మెప్పించారు.   సాంకేతికంగా చూస్తే.. బాలా జి. రామస్వామి అందించిన ఛాయాగ్రహణం, అశ్విన్ కృష్ణ అందించిన సంగీతం సినిమాలోని హారర్ మూడ్‌ను రెట్టింపు చేశాయి. సౌండ్ డిజైన్ భయపెట్టేలా ఉండటంతో పాటు హారర్ లవర్స్‌కు కావాల్సిన కిక్‌ను అందిస్తుంది. గతంలో వచ్చిన హారర్ చిత్రాలతో పోలిస్తే, ఇందులో చూపించిన క్షుద్ర పూజల సీక్వెన్స్ కాస్త కొత్తగా ఉండటంతో సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై పాజిటివ్ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సమ్మర్ సెలవులు కావడంతో ఇంట్లోనే ఉండి థ్రిల్లింగ్ సినిమాలను ఎంజాయ్ చేయాలనుకునే వారికి 'సతన్: ది డార్క్' ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. హారర్ చిత్రాలను ఇష్టపడేవారు వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూసి ఆ థ్రిల్‌ను ఫీల్ అవ్వండి. 
Cast: Ravi Babu, Tanish, Inaya Sultana, Banerjee Crew: Music Director: S.S. Rajesh Cinematography: Charan Madhavaneni Editing: Ramakrishna Writer-Director: Ravi Babu Producer: Ravi Babu   Razor Movie starring Ravi Babu, who also directed the film, released today in theatres. Tanish, Inaya Sultana, and Banerjee are playing prominent roles. Let's discuss about the film in detail. Plot: Rudra Pratap (Ravi Babu) runs a pet dog cleaning service, but finds himself fiercely protecting a six-year-old girl, Teju, from the ruthless politician Kanakaraju. The criminal politician wants the child dead before taking his oath as Chief Minister. Why is Rudra taking such massive risks to protect her? What is the true story behind his cleaning agency? Watch the movie to know more. Analysis: Ravi Babu delivers a very strong performance and precise direction. Satyanand's screenplay ensures the narrative logic remains gripping from the start. The first half sets a great tempo with engaging introduction scenes and a mind-blowing interval twist. Ravi Babu did give a good performance apt to the story and character. The girl also did well. But the typical Ravi Babu style performances from all other actors slightly makes it monotonous. Still, with several fights that tend to stick to awe factor do work. Not a different story but execution makes it engaging enough.  The second half reveals an emotional backstory that tries to justify Rudra's violent rampage against anti-social elements, which works in parts. Technical aspects shine throughout the film. The background score and cinematography are significant assets that elevate the mood. While the pacing and emotions work well, a few of the action sequences feel slightly over-the-top. Overall, movie is a decent watch.  Positives: Engaging story and screenplay Ravi Babu's performance Excellent background score Thrilling climax Negatives: Excessive action sequences   Bottomline: A simple story elevated by good execution   Rating: 2.5/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన నారా లోకేష్ గురించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లోకేష్ కేవలం రాజకీయాల్లోనే కాకుండా, ఒకప్పుడు టాలీవుడ్ వెండితెరపై హీరోగా మెరిసేందుకు సిద్ధమయ్యారన్న వార్త నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించి గతంలో వచ్చిన ఒక పాత పత్రికా ప్రకటన ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళితే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం దర్శకుడు తేజ టాలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్స్ అందుకుంటున్న సమయం అది. 'చిత్రం', 'నువ్వు నేను', 'జయం' వంటి సినిమాలతో యూత్ పల్స్ పట్టుకున్న తేజ, అప్పట్లో నారా లోకేష్‌ను టాలీవుడ్‌కి పరిచయం చేయాలని ప్లాన్ చేశారట. ఈ మేరకు లోకేష్ హీరోగా ఒక సినిమాను పట్టాలెక్కించేందుకు స్క్రీన్ టెస్టులు కూడా నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా 'జయం' వంటి భారీ హిట్ తర్వాత తేజ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. సరిగ్గా అదే సమయంలో లోకేష్ ఫోటోలు కూడా కొన్ని సినీ మ్యాగజైన్లలో దర్శనమిచ్చాయి. ఆ కాలంలో వచ్చిన ‘సంతోషం’ వంటి పత్రికల కవర్ పేజీలపై లోకేష్ ఫోటోలు ఉండటంతో, ఖచ్చితంగా ఆయన సినిమాల్లోకి వస్తున్నారని అందరూ భావించారు. అయితే షూటింగ్ దశ వరకు వెళ్లిన ఈ ప్రాజెక్ట్ కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలోనే నిలిచిపోయిందట. సాధారణంగా రాజకీయ కుటుంబాల నుంచి వారసులు సినిమా రంగంలోకి రావడం మనం చూస్తూనే ఉంటాం. అప్పట్లో నందమూరి, నారా కుటుంబాల మధ్య ఉన్న అనుబంధంతో పాటు, లోకేష్ కూడా సినిమాలపై ఆసక్తి చూపడంతో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది. కానీ, ఆ తర్వాత ఆయన విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం, అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడంతో ఆ సినిమా ముచ్చట కేవలం రూమర్‌గానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఏపీ ఐటీ శాఖ మంత్రిగా బిజీగా ఉన్న లోకేష్‌కు సంబంధించిన ఈ పాత ఫోటోలు చూసి ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఒకవేళ లోకేష్ హీరో అయి ఉంటే, టాలీవుడ్‌లో మరో స్టార్ హీరో ఉండేవారు" అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం "రాజకీయాల్లోనే ఆయన సరిగ్గా సెట్ అయ్యారు" అని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం నాటి ఈ వార్త ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చి సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు తేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, లోకేష్ మాత్రం ప్రజా సేవలో తనదైన ముద్ర వేస్తున్నారు. అటు సినిమా, ఇటు రాజకీయాల్లో ఈ 'ఫ్లాష్‌బ్యాక్' స్టోరీ ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది.
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. పరిచయం: ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి, కానీ అందరి జీవితాల్లోనూ ప్రేమించిన వారితోనే ప్రయాణం సాధ్యం కాకపోవచ్చు. ఇంటి సభ్యుల ఒత్తిడి వల్లో లేదా ఇతర పరిస్థితుల వల్లో ప్రేమించిన వ్యక్తిని వదిలేసి, వేరొకరిని పెళ్లి చేసుకోవడం అనేది మానసిక సంఘర్షణతో కూడుకున్న విషయం. ఇలాంటి సమయంలో కేవలం మీ బాధనే కాకుండా, మీ జీవితంలోకి కొత్తగా వచ్చే వ్యక్తి జీవితాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ వెబ్‌సైట్ కంటెంట్ ద్వారా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి ఒక స్పష్టమైన మార్గదర్శకాన్ని అందించబోతున్నాం. మనం వాస్తవాన్ని ఎందుకు అంగీకరించాలి? (Why should we accept the reality?) జీవితంలో మార్పులు సహజం. మీరు ఒక బంధం నుండి బయటకు వచ్చి మరొక బంధంలోకి అడుగు పెడుతున్నప్పుడు వాస్తవాన్ని అంగీకరించడం ఎందుకు ముఖ్యమో ఇక్కడ చూడండి: అవతలి వ్యక్తి జీవితం మీ బాధ్యత: మీ జీవితం అనుకున్నట్లు జరగలేదని, మీతో నూతన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి జీవితాన్ని పాడు చేసే హక్కు మీకు లేదు. కొత్త ఆశలు మరియు కలలు: పెళ్లి చేసుకున్న కొత్తలో ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆశలు, అందమైన ప్రపంచాన్ని చూడాలనే కలలు ఉంటాయి. మీ గత బాధతో వారి కలలను చిధ్రం చేయకూడదు. మానసిక ప్రశాంతత: గతాన్ని పట్టుకుని వేలాడటం వల్ల మీకు కానీ, మీ కుటుంబానికి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. నిజాన్ని అంగీకరించినప్పుడే మీరు వర్తమానంలో జీవించగలరు. ముఖ్యంగా చేయకూడని పనులు (What NOT to do?) కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ పొరపాట్లు అస్సలు చేయకండి: నిరాసక్తత చూపడం: భాగస్వామితో మాట్లాడకుండా ఉండటం, కుటుంబ సభ్యులతో కలవకుండా ముభావంగా ఉండటం వల్ల అవతలి వారి జీవితం కూడా నాశనమవుతుంది. మూడ్ స్వింగ్స్‌ను ప్రదర్శించడం: మీ పాత జ్ఞాపకాల వల్ల వచ్చే కోపాన్ని లేదా బాధను మీ భాగస్వామిపై చూపించడం ఎథికల్ గా (నైతికంగా) సరైనది కాదు. అబద్ధాలు చెప్పడం: మీ గత బంధం చాలా బలమైనది అయితే, ఆ విషయాన్ని దాచిపెట్టి మోసం చేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి? (How to handle the situation?) ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి కొన్ని సూచనలు: సమయం తీసుకోండి: పాత బంధం నుండి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాతే పెళ్లికి సిద్ధపడాలి. ఒకవేళ పెళ్లి ఫిక్స్ అయితే, మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకోండి. నిజాయితీగా ఉండండి: ఒకవేళ మీ గతం చాలా లోతైనది అయితే, మీ కాబోయే భాగస్వామికి ఆ విషయం చెప్పి, వారిని ఒప్పించి లేదా వారి అభిప్రాయం తెలుసుకుని ముందుకు వెళ్లడం మంచిది. కొత్త బంధానికి ప్రాధాన్యత ఇవ్వండి: పెళ్లయిన తర్వాత ఇది మీ జీవితం అని గుర్తించి, పాత కథలను పక్కన పెట్టి కొత్త జీవితం అనే సముద్రంలో ప్రయాణించడం ప్రారంభించాలి. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్రశ్న 1: ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక పోతున్నాను, అప్పుడు పెళ్లి చేసుకోవడం సరైనదేనా?  సమాధానం: పాత బంధం నుండి మీరు పూర్తిగా బయటకు రాకుండా పెళ్లి చేసుకోవడం వల్ల మీతో పాటు మీ భాగస్వామి జీవితం కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ముందుగా ఆ ఆలోచనల నుండి బయటపడటానికి సమయం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రశ్న 2: పెళ్లయిన తర్వాత భాగస్వామితో ఎలా ప్రవర్తించాలి?  సమాధానం: మీ భాగస్వామికి కొత్త కలలు ఉంటాయి. వారితో కలిసిమెలిసి ఉండటం, కుటుంబంతో మమేకం అవ్వడం ద్వారా మీ బాధను తగ్గించుకోవచ్చు. మీ లోపల బాధ ఉన్నా, దాన్ని భాగస్వామిపై చూపించకూడదు. ప్రశ్న 3: గత రిలేషన్ షిప్ గురించి భాగస్వామికి చెప్పాలా?  సమాధానం: అది చాలా బలమైన బంధం అయితే ఖచ్చితంగా చెప్పాలి. నిజం దాచి పెళ్లి చేసుకుంటే, రేపు ఏదైనా తెలిసినప్పుడు అది మోసంగా మారుతుంది మరియు బంధం దెబ్బతింటుంది.  జీవితం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. గతాన్ని తలచుకుంటూ కూర్చుంటే మీ వర్తమానం మరియు భవిష్యత్తు రెండూ నాశనమవుతాయి. జరిగిన దాన్ని అంగీకరించి (Accept the reality), మీకు తోడుగా వచ్చిన వ్యక్తికి అన్యాయం జరగకుండా చూసుకోవడమే నిజమైన మానవత్వం. మీ జీవితాన్ని బాధ్యతాయుతంగా మలుచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు జీవితానికి ఉపయోగపడే విషయాల కోసం మా "Naveena Column" యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి..  సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు. మీ ఆరోగ్యాన్ని తిరిగి మీ చేతుల్లోకి తెచ్చుకోవడానికి, ఈ VIDEO మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం హార్మోన్ల ఆరోగ్యంపై ఎందుకు దృష్టి పెట్టాలి? (Why Should We?) మన శరీరంలోని పిట్యూటరీ మరియు హైపోథాలమస్ వంటి గ్రంథులు సరిగ్గా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. గ్లూకోజ్ నియంత్రణ: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే (Hyperglycemia) అది శరీరంలో అనేక అనర్థాలకు దారితీస్తుంది. జీవనశైలి వ్యాధులు: దీర్ఘకాలిక హార్మోన్ల సమస్యలు కేవలం అలసటకే పరిమితం కావు, అవి పెద్ద ఆరోగ్య రుగ్మతలుగా మారుతాయి. సహజమైన శక్తి: హార్మోన్లు సమతుల్యంగా ఉంటే, కృత్రిమ ఉత్ప్రేరకాలు లేకుండానే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఏమి చేయకూడదు? (What Not to Do) మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు హార్మోన్లను దెబ్బతీస్తాయి: జంక్ ఫుడ్ మరియు ఇన్ఫ్లమేటరీ ఫుడ్: ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు జంక్ ఫుడ్ గ్లూకోజ్ స్థాయిలను అస్తవ్యస్తం చేస్తాయి. కెమికల్ కాస్మెటిక్స్: ప్రతిరోజూ అధికంగా మేకప్ వాడటం మంచిది కాదు. వీటిలోని జీనోబయోటిక్స్ (Xenobiotics) మరియు జీనోఈస్ట్రోజెన్స్ (Xenoestrogens) హార్మోన్ల పనితీరును గందరగోళానికి గురిచేస్తాయి. నిద్రను నిర్లక్ష్యం చేయడం: రాత్రిపూట సినిమాలు చూడటం లేదా ఫోన్ చూడటం వల్ల మీ సర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) దెబ్బతింటుంది. వ్యసనాలు: ధూమపానం, మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలు మీ నాడీ వ్యవస్థను దెబ్బతీసి, హార్మోన్ల సమతుల్యతను పాడుచేస్తాయి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? (How to Balance) మీ హార్మోన్లను క్రమబద్ధీకరించడానికి ఈ 5 సూత్రాలను పాటించండి: వ్యాయామమే మందు: "Movement is medicine". ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు జిమ్ లేదా ఏరోబిక్ వ్యాయామాలు చేయండి. గ్లూకోజ్‌ను శరీరం సరిగ్గా వినియోగించుకోవడానికి ఇది అవసరం. ప్రకృతితో అనుసంధానం: ఉదయాన్నే ఎండలో గడపడం మరియు రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోండి. సేంద్రీయ పద్ధతులు: రసాయనాలతో కూడిన క్లీనర్లు మరియు వంటపాత్రలకు బదులుగా ఆర్గానిక్ పద్ధతులకు మారడానికి ప్రయత్నించండి. ఒత్తిడి నిర్వహణ: శ్వాస వ్యాయామాలు (Breathwork), జర్నలింగ్ మరియు ప్రియమైన వారితో సమయం గడపడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వ్యక్తిగత ప్రణాళిక: అందరికీ ఒకే రకమైన వ్యాయామం సరిపోదు. మీ శరీరానికి ఏది సరిపోతుందో (వెయిట్ ట్రైనింగ్ లేదా కార్డియో) నిపుణుల సమక్షంలో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో తెలుసుకోండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: వ్యాయామం వల్ల హార్మోన్లు ఎలా మెరుగుపడతాయి?  జ: వ్యాయామం చేయడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ సరిగ్గా ఖర్చవుతుంది, దీనివల్ల హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రావు మరియు హార్మోన్లు క్రమబద్ధీకరించబడతాయి. ప్ర: కాస్మెటిక్స్ నిజంగా హార్మోన్లను దెబ్బతీస్తాయా?  జ: అవును, చాలా సౌందర్య సాధనాలలో ఉండే రసాయనాలు ఈస్ట్రోజెన్ లాగా ప్రవర్తించి మెదడులోని గ్రంథులను గందరగోళానికి గురిచేస్తాయి. ప్ర: నైట్ షిఫ్ట్ చేసే వారికి హార్మోన్ల సమస్యలు వస్తాయా?  జ: ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పగలు-రాత్రి చక్రానికి (Circadian Rhythm) విరుద్ధంగా నిద్రపోవడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. హార్మోన్ల సమతుల్యత అనేది ఒక రోజులో వచ్చే మార్పు కాదు, ఇది ఒక జీవనశైలి. ఈ చిన్న చిన్న మార్పులతో మీ జీవితాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు వ్యాయామ చిట్కాల కోసం మా TeluguOne Health ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే (సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)
  పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది.  ఎంత వయసు పెరిగినా తల్లిదండ్రులకు పిల్లల గురించి ఆలోచన ఉంటుంది.  అబ్బాయిల విషయానికి వస్తే..  18 ఏళ్లలోకి వచ్చినప్పుడు వారి జీవితం చాలా కీలకమైన మలుపు తీసుకుంటుంది.  18 ఏళ్లకు మేజర్ గా గుర్తించబడతారు.  చట్ట ప్రకారం పిల్లల నుండి వయోజనులుగా మారుతారు.  అదే విధంగా మానసికంగా కలిగే మార్పులు కూడా వారిని బాధ్యతగా ఉండటంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభావితం చేయడమే కాకుండా.. చాలా వరకు ఇండిపెండెంట్ గా ఉండటానికి కూడా ఇక్కడే కీలక మలుపు వస్తుంది. 18 ఏళ్ల వయసులో పిల్లలకు మార్గదర్శకత్వం చాలా అవసరం అవుతుంది. తల్లిదండ్రులు ఈ వయసు పిల్లలతో ఎంత సున్నితంగా, ఎంత ఆలోచించే విదంగా మాట్లాడగలుగుతారో.. పిల్లలతో విషయాలను షేర్ చేసుకోగలుగుతారో..  పిల్లల జీవితం కూడా అంత సరైన దిశలో నడవడానికి సహాయపడుతుంది.   18 ఏళ్లు నిండిన పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుంటే.. బాధ్యత.. 18 ఏళ్లు రాగానే నువ్వేం పెద్దాడివి కాదు అని తరచుగా తల్లిదండ్రులు అంటూ ఉంటారు. కానీ ఇది తప్పు.. 18 ఏళ్ల వయసు పిల్లలు తమ నిర్ణయాలు తాము తీసుకోవడానికి అవకాశం దొరితే మొదటి దశ.. అయితే  తన నిర్ణయాలకు తానే బాధ్యత వహించాలని వారు తెలుసుకోవాలి. తన ఖర్చులను తాను చూసుకోవడం, , సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం, ఇంటి పనులలో పాలుపంచుకోవడం వంటి చిన్న చిన్న పనులు 18 ఏళ్ల వయసు పిల్లలకు నేర్పిస్తే.. అవి అతన్ని బాధ్యత గల వ్యక్తిని చేస్తాయి. డబ్బు విలువ.. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, తెలివిగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. 18ఏళ్ల వయసులోనే పిల్లలకు స్నేహాలు, బయటటి ఖర్చులు వంటివి చాలా పెరుగుతాయి. నిజం చెప్పాలంటే.. డబ్బు కారణంగా పిల్లలు పాడైపోయే మొదటి దశ ఇదే.. అందుకే పిల్లలకు బడ్జెట్ రూపొందించుకోవడం, అనవసరమైన ఖర్చులను నివారించడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వంటి అలవాట్లు నేర్పించాలి. ఇవి వారిని ఆర్థికంగా బలంగా చేస్తాయి. సరైన స్నేహాలు.. ఈ వయసులో స్నేహాలు, సంబంధాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మంచి స్నేహాలు..  నమ్మకమైన వ్యక్తులతో ఎలా ఉండాలో, మంచి స్నేహాలు ఎలా ఉంటాయో.. , చెడు స్నేహాలకు ఎలా దూరంగా ఉండాలో చెబుతూ ఉండాలి.  దీని వల్ల జీవితంలో వారు దెబ్బ తినే చాలా పెద్ద నష్టం నుండి బయటపడవచ్చు. డిజిటల్ జీవితం.. చిన్న పిల్లల్లా వారిని తిట్టి, కొట్టి కంట్రోల్ చేసే వయసు కాదు 18 ఏళ్ల పిల్లలది. అందుకే సోషల్ మీడియా , ఇంటర్నెట్‌ను తెలివిగా, అవగాహనతో ఉపయోగించడం చాలా ముఖ్యం.  అలాగే ఎలాంటి విషయాలను ఇంటర్నెట్ ద్వారా షేర్ చేసుకోవాలి?  ఎలాంటి విషయాలను గోప్యంగా ఉంచాలి? సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావం జీవితం మీద ఎంత వరకు ఉండాలి వంటి విషయాలు వారికి అర్థమయ్యే లాగా వివరించి చెప్పాలి. మోటివేట్.. జీవితంలో ప్రతిఒక్కరూ వైఫల్యాన్ని ఎదుర్కొంటారు. వైఫల్యం అనేది అంతం కాదని, అది నేర్చుకోవడానికి ఒక అవకాశమని వారికి వివరించాలి. ఎందుకంటే వైఫల్యాల కారణంగా తొందర పాటు నిర్ణయాలు తీసుకునే భావేద్వేగం వారిలో ఉంటుంది.  అందుకే ఎప్పుడూ స్పోర్టివ్ గా ఉండమని చెప్పాలి. ఈ ఆలోచన వారికి జీవితంలో ముందుకు  సాగడానికి బలాన్ని ఇస్తుంది.                             *రూపశ్రీ.
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇది గర్భధారణపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ సి. జ్యోతి (Dr. C. Jyothi) గారు ఈ VIDEO లో స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ముఖ్యాంశాలు: PCOD అంటే ఏమిటి?: అండాశయాల్లో నీటి బుడగలు ఎందుకు ఏర్పడతాయి? గుర్తించడం ఎలా?: నెలసరి క్రమం తప్పడం, ముఖంపై మొటిమలు, జుట్టు రాలడం వంటి లక్షణాల విశ్లేషణ. ముఖ్య కారణాలు: హార్మోన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లు మరియు ఒత్తిడి పాత్ర. శాశ్వత పరిష్కారం: ఆహార నియమాలు మరియు వ్యాయామం ద్వారా PCOD ని ఎలా జయించవచ్చు? మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి TeluguOne లోని ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి (సబ్‌స్క్రైబ్ చేయండి!)
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. డబ్బు సంపాదన, కార్పొరేట్ ఒత్తిడి, మరియు మారుతున్న సామాజిక విలువల మధ్య మన వ్యక్తిగత జీవితం చితికిపోతోంది. ఈ VIDEO ద్వారా మీకు సెక్స్ ఆరోగ్యం పట్ల సరైన అవగాహన కల్పించడమే మా లక్ష్యం. మనం ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) సెక్స్ అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, అది మన జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన భాగం. మానసిక ప్రశాంతత: మనం సుఖంగా, ఆనందంగా ఉండాలన్నా, మన మెదడు చురుగ్గా పనిచేయాలన్నా సెక్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన మెదడు: ఇది ప్రాథమిక అవసరాలలో ఒకటి. పశుపక్షాదులు కూడా తమ కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఆనందాన్ని పొందుతాయి, కానీ మనిషి మాత్రమే కంప్యూటర్ల ముందు కూర్చుని ఈ బేసిక్ ఫండమెంటల్స్‌ను మర్చిపోతున్నాడు. సంతానోత్పత్తి: సరైన హార్మోనల్ సెక్రేషన్ (ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్) ఉండటం వల్ల సంతానోత్పత్తి మరియు నెలసరి సక్రమంగా ఉంటాయి. ఏమి చేయకూడదు? (What Not to Do?) చాలా మంది తమకు తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి: ఆఫీస్ టెన్షన్లను ఇంటికి తీసుకురావద్దు: ఆఫీసు ఆలోచనలు ఇంటికి తీసుకురావడం వల్ల భాగస్వామిపై ధ్యాస తగ్గుతుంది, ఇది జడత్వానికి (Inertia) దారితీస్తుంది. సొంత వైద్యం వద్దు: ఎటువంటి అవగాహన లేకుండా పిల్స్ లేదా పీరియడ్స్ ఆపుకోవడానికి టాబ్లెట్లు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు: హార్మోన్ల మార్పుల వల్ల గడ్డం దగ్గర వెంట్రుకలు రావడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి, అంతేకానీ కేవలం బ్యూటీ పార్లర్లకు వెళ్లి తాత్కాలిక పరిష్కారాలు వెతకకూడదు. జనరిక్ మందుల పట్ల అపోహలు: జనరిక్ మందులు తక్కువ నాణ్యత గలవి అని అనుకోవద్దు; అవి కూడా అదే ఫార్ములాతో పనిచేస్తాయి. సమస్యను ఎలా అధిగమించాలి? (How to Improve?) జీవనశైలి మార్పులు: పిజ్జాలు, పాస్తాల వంటి వెస్ట్రన్ ఫుడ్ కంటే మన స్వచ్ఛమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఫోర్ ప్లే (Foreplay) ప్రాముఖ్యత: భాగస్వామితో అనుబంధాన్ని పెంచుకోవడానికి మరియు ప్రేరేపించబడటానికి ఫోర్ ప్లే అనేది చాలా అవసరం. సరైన రోగ నిర్ధారణ: ఏదైనా సమస్య ఉన్నప్పుడు సీనియర్ ఫిజీషియన్‌ను కలిసి కనీసం అరగంట పాటు మీ కేస్ హిస్టరీని వివరించండి. సరైన డయాగ్నోసిస్ ద్వారా ఎటువంటి సుఖవ్యాధినైనా 15-20 రోజుల్లో నయం చేయవచ్చు. డైరీ నిర్వహణ: రోజూ పడుకునే ముందు ఆ రోజు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది ఒక డైరీలో రాసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్ర: సెక్స్ పట్ల కోరికలు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి?  జ: అధిక పని ఒత్తిడి (24 గంటలు పనిచేయడం), హార్మోన్ల అసమతుల్యత, మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మారిన మానసిక స్థితి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్ర: యువతులలో కనిపిస్తున్న హార్మోన్ల సమస్యల లక్షణాలు ఏమిటి?  జ: 18-19 ఏళ్లకే నెలసరి ఆలస్యం కావడం, ముఖంపై (గడ్డం దగ్గర) దట్టమైన వెంట్రుకలు రావడం వంటివి హార్మోన్ల లోపానికి సంకేతాలు. ప్ర: ఎయిడ్స్ (HIV) సోకితే నయం కాదా?  జ: ఒకప్పుడు అది మహమ్మారిగా ఉండేది, కానీ ఇప్పుడు దానికి రెట్రోవర్టెడ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచే మందుల ద్వారా దానిని కూడా నియంత్రించవచ్చు. ప్ర: సహజీవనం (Living Together) సెక్స్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?  జ: సహజీవనం వల్ల ఒకరి పట్ల ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంది. పెళ్లి అనే బంధంలో ఉండే ఆకర్షణ, గౌరవం ఇక్కడ లోపించవచ్చు. డబ్బు వెనకాల పరిగెత్తే క్రమంలో మన శరీరానికి భగవంతుడు ప్రసాదించిన వరాన్ని (సెక్స్ మరియు ప్రేమ) నిర్లక్ష్యం చేయకండి. సమస్య చిన్నదైనా, పెద్దదైనా సరైన నిపుణులను సంప్రదించి సంతోషకరమైన జీవితాన్ని గడపండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు నిపుణుల సలహాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి.. (సబ్స్క్రైబ్ చేసుకోండి)
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో అనేక అపోహలు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్.జి.వి. సత్య (Dr. SGV Satya) గారు ఈ వీడియోలో శాస్త్రీయమైన సమాధానాలు ఇచ్చారు.       ఈ వీడియోలో ముఖ్యంగా చర్చించిన అంశాలు: 👇 అన్నం vs చపాతీ: రెండింటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మరియు గ్లైసీమిక్ ఇండెక్స్ మధ్య తేడాలు. సరైన ఆహార విధానం: షుగర్ ఉన్నవారు అన్నం తినాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యమైన సూచనలు: క్వాంటిటీ (పరిమాణం) మరియు క్వాలిటీ (నాణ్యత) విషయంలో మనం చేసే తప్పులేమిటి? షుగర్ కంట్రోల్ చిట్కాలు: రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే భోజనంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!