LATEST NEWS
  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది. జూమ్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.ఎస్‌ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో... ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలోనే ఉండి ఎన్నికల ప్రచారం తరహాలో పనిచేయాలని స్పష్టం చేశారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని, రేపటి నుంచి ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావద్దని ఆదేశించారు. హైదరాబాద్‌లో కాకుండా నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజల మధ్య పనిచేయాలని సూచించారు. సోమవారం నుంచి ఇన్‌చార్జ్ మంత్రులు జిల్లాల వారీగా ఎస్‌ఐఆర్‌పై సమీక్షలు నిర్వహించాలని, ఎంపీలు కూడా పార్లమెంట్ సమావేశాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం కొనసాగించాలని తెలిపారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  బీఎల్‌ఓల నివేదికల కంటే బీఎల్‌ఏల నివేదికలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీ తరఫున పనిచేస్తున్న బీఎల్‌ఏలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. గాంధీభవన్ బృందం కూడా బీఎల్‌ఏ, బీఎల్‌ఓ నివేదికలను నిరంతరం పరిశీలించాలని ఆదేశించారు. ఈ నెల 30న మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే అత్యుత్తమంగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. Congress SIR Review, CM Revanth Reddy Zoom Meeting, SIR Deadline Extended till August 3 Focus on Ground-Level Campaign, No Visits to Gandhi Bhavan, Stay in Constituencies, Priority to BLA Reports, Gandhi Bhavan  
  తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలను తొలగించి, నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి హైకమాండ్ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ హైదరాబాద్‌ వేదికగా "ఆపరేషన్ సయోధ్య"ను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అభయ్ పాటిల్ తెలంగాణ కమలం పార్టీ అగ్ర నేతలతో వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నారు. హైకమాండ్ నుంచి అందిన ప్రత్యేక ఆదేశాల మేరకు తెలంగాణకు వచ్చిన  పాటిల్, పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన ప్రత్యేకంగా బ్రేక్‌‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు.  ఈ ఉదయపు అల్పాహార సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, నేతల మధ్య సమన్వయం మరియు రాబోయే పొలిటికల్ యాక్షన్ ప్లాన్ గురించి వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. హైకమాండ్ పంపిన ప్రధాన సందేశాన్ని రాష్ట్ర నాయకత్వానికి అభయ్ పాటిల్ ఈ సందర్భంగా స్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క సమావేశంతోనే కాకుండా, గత 24 నుండి 48 గంటలుగా అభయ్ పాటిల్ తెలంగాణ బీజేపీకి చెందిన కీలకమైన ముగ్గురు అగ్ర నేతలతో విడివిడిగా సమావేశమై సుదీర్ఘ మంతనాలు జరిపారు. నిన్ననే ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపీ ఈటల రాజేందర్‌లతో కీలక భేటీలు పూర్తి చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమాయత్తం చేయడం వంటి అంశాలపై వీరి మధ్య లోతైన చర్చ జరిగింది. ఈ ఇద్దరు కీలక నేతలతో భేటీ అనంతరం, అభయ్ పాటిల్ వెంటనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కూడా సమావేశమయ్యారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో జరిగిన భేటీలో అభయ్ పాటిల్ కొన్ని కీలక సూచనలు చేశారు. పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే అధికారిక సమావేశాలు, ప్రజా పోరాట కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, నాయకులంతా సమిష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి బేధాభిప్రాయాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి, ప్రజాక్షేత్రంలో బీజేపీని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే పరమావధిగా పనిచేయాలని హైకమాండ్ ఆదేశాలను నొక్కి చెప్పారు. ఈ వరుస భేటీలు తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. త్వరలోనే తెలంగాణలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల యాక్షన్ ప్లాన్‌పై కూడా ఈ సమావేశంలో లోతుగా విశ్లేషించారు. ప్రతిపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ బూత్ స్థాయి నుంచి ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలనే వ్యూహాలను ఇరు నేతలు పంచుకున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లే అంశాలు ఈ చర్చల్లో ప్రధాన పాత్ర పోషించాయి. ఈ భేటీ అనంతరం కాషాయ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేంద్ర పెద్దల మార్గదర్శకత్వంలో తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని, తద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ అంతర్గత చర్చల ఫలితంగా త్వరలోనే పార్టీ పరంగా మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం కేవలం సాధారణ మర్యాదపూర్వక భేటీగానే బయటకు కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుక మాత్రం గట్టి పొలిటికల్ స్కెచ్‌లు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ త్వరలోనే విసృత స్థాయి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. Telangana BJP, Abhay Patil, Bandi Sanjay, MP Eatala Rajender, Dharmapuri Arvind, BJP Political News, Ramchandra Rao, GHMC elections
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కుతోందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన   అధికారిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన లోకేష్.. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని  డబుల్ ఇంజిన్ సర్కార్  వల్లనే రాష్ట్రానికి మెగా పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన వేగంగా సాధ్యమవుతున్నాయన్నారు.  ఐదేళ్ల  వైసీపీ పాలనలో అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించిన ఆయన  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో  కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అమరావతి పనులను శరవేగంగా పరిగెత్తిస్తున్నదన్నారు. అమరావతిని కేవలం భవనాల నగరంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయి ఎయిర్, రోడ్, రైల్ కనెక్టివిటీ కలిగిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనిఉద్ఘాటించారు. గతంలో భారత  రైల్వే రంగంలో భద్రత, పరిశుభ్రత లోపించేవని, కానీ ప్రధాని మోడీ ముందుచూపు వల్ల దేశంలో వందే భారత్, బుల్లెట్ రైళ్లు, 'కవచ్' ఆటోమేటిక్ ప్రొటెక్షన్ టెక్నాలజీతో కూడిన సరికొత్త రైల్వే విప్లవం నడుస్తోందని లోకేష్ కొనియాడారు. దశాబ్దాల నాటి ఆంధ్రుల కల అయిన విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌ను ప్రధాని మోడీ వెంటనే మంజూరు చేసి కార్యరూపంలోకి తెచ్చారని, ఇందుకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా మాట్లాడిన లోకేష్.. మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర పర్యాటక శాఖ ద్వారా ' ప్రసాద్' పథకం కింద నిధులు రాబట్టేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ చూపారని, ఎంపీ, ఎమ్మెల్యే కలిసి కట్టుగా పని చేస్తే నియోజకవర్గం ఎలా మారుతుందో చెప్పడానికి మంగళగిరి ఒక ఉదాహరణగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తున్నామని  వివరించారు. ఒక రూపాయి ఆదాయానికి ఒక రూపాయి నలభై పైసల ఖర్చు ఉన్నప్పటికీ.. సూపర్ సిక్స్ హామీలైన తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, డీఎస్సీ, మెగా జాబ్ క్యాలెండర్ వంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. గతంలో పెట్టుబడులు లేక ఏపీ తీవ్రంగా నష్టపోయిందనీ..  కూటమి ప్రభుత్వం వచ్చాక రాయల్ ఎన్‌ఫీల్డ్, గూగుల్ వంటి గ్లోబల్ సంస్థలతో పాటు ఫైటర్ జెట్ తయారు చేసే  అమ్కా  వంటి భారీ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు క్యూ కడుతున్నాయన్నారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్ర నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం ఉండదని, పొరుగు రాష్ట్రాల యువతే ఏపీ వైపు చూసేలా పారిశ్రామిక విప్లవాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు తాను చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గ అభివృద్ధిని చూసి నేర్చుకునేవాడినని, కానీ ఇప్పుడు కుప్పం నేతలు కూడా మంగళగిరిని చూసి నేర్చుకునే స్థాయికి ఇక్కడి అభివృద్ధిని తీసుకెళ్లామని సగర్వంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో మంగళగిరిని ఐటీ,  పారిశ్రామిక హబ్‌గా మారుస్తామని లోకేష్ స్పష్టం చేశారు. Nara Lokesh Mangalagiri, Amaravati Capital Development, AP Double Engine Government, Andhra Pradesh Mega Investments South Coast Railway Zone Vizag
తెలుగువన్ ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ  హయాంలో రాష్ట్రం నుంచి తరలిపోయిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఇప్పుడు పొరుగు రాష్ట్రాలలో   విజయవంతంగా రాణిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమలు తమంతట తాముగా వెళ్ళిపోలేదని, నాటి ప్రభుత్వ ఒత్తిళ్లు, బెదిరింపులు,  వాటా ఇస్తేనే వ్యాపారం అనే  దౌర్భాగ్య విధానాల వల్లే పారిశ్రామికవేత్తలు దండం పెట్టి మరీ ఏపీని వదిలి పారిపోయారని తెలుగువన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ విశ్లేషకుడు సువేరా అన్నారు. ఇందుకు సంబంధించి ఆయన  సంచలన నిజాలను వెల్లడించారు. తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరరాజా బ్యాటరీస్ గ్లోబల్ కర్మాగారం ప్రారంభోత్సవ నేపథ్యంలో ఏపీ పారిశ్రామిక విధ్వంసంపై ఆయన మాట్లాడారు.  వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన  ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.  ఒక గ్లోబల్ టెక్నాలజీ కలిగిన అమరరాజా సంస్థను బెదిరించడం వల్లే వారు వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తరలించారని, నిన్న దివిటిపల్లిలో జరిగిన కనులపండువ లాంటి ప్రారంభోత్సవమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ఏపీలో ఉపాధి కోల్పోయిన యువత తరపున నారా లోకేష్ క్షమాపణలు చెప్పడం నాటి దుస్థితికి అద్దం పడుతోందన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని పక్కనబెట్టి..  కేవలం తమ సొంత బినామీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే వైఎస్ కుటుంబం మొదటి నుంచి ప్రయత్నించిందని   ధ్వజమెత్తారు. కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టుల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు బలవంతపు ల్యాండ్ పూలింగ్స్, అధికార దుర్వినియోగంతో చెరబట్టారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేసే ఈ చెంబల్ వ్యాలీ బందిపోటు సంస్కృతి వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా దెబ్బతిన్నదని, కేవలం లంపెన్ శక్తులను, అసాంఘిక మూలకాలను ప్రోత్సహిస్తూ వ్యవస్థలను సర్వనాశనం చేశారని సువేరా విశ్లేషించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ పాలన తిరిగి గాడిలో పడుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దశాబ్దాల పారిశ్రామిక అనుభవం, మంత్రి నారా లోకేష్ నిరంతర శ్రమతో మళ్లీ పెట్టుబడులు వరదలా వస్తున్నాయన్న సువేరా.. అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో విదేశీ పెట్టుబడులు వస్తుండటం శుభపరిణామన్నారు. పొరుగు రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటూ ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్ తరాల మనుగడ కోసం ఇలాంటి పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని కథనాన్ని ముగించారు. Why Industries Left Andhra Pradesh,  Suvera Analysis,  TeluguOne,  AmarRaja Batteries,  Chandrababu Naidu Investments AP, AP Past Government Industry Scams
హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో తీవ్ర కలకలం రేగింది. రాజకీయ, మతపరమైన అంశాలపై జరిగిన ఈ లైవ్ డిబేట్‌లో ఒక ప్రతినిధి మరో ప్యానలిస్టుపై భౌతిక దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్‌కు సంబంధించిన వివాదమే చివరకు ఈ ఘర్షణకు దారితీసింది. దీనిపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. మతం పేరుతో జరుగుతున్న రచ్చకు ఇది తాజా ఉదాహరణ అన్నారు. అసలు ఇంతకీ  టీవీ లైవ్ డిబేట్ లో భౌతిక దాడికి దారి తీసిన కారణం ఏంటంటే.. ఇటీవల హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంగా నగరంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. అందులో ఒక కటౌట్‌లో శ్రీమహావిష్ణువు విశ్వరూప ప్రదర్శన చిత్రంలో విష్ణుమూర్తి ముఖ స్థానంలో ప్రధాని మోదీ ముఖాన్ని మార్ఫింగ్ చేసి పెట్టారు. దీనిపై హిందూ ధర్మ ప్రచారకుడు, సామాజిక విశ్లేషకుడు రమణమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దైవ సమానమైన విశ్వరూప స్థానంలో ఒక రాజకీయ నాయకుడి ఫోటో పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన పేర్కొన్నారు. రమణమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలపై డిబేట్‌లో పాల్గొన్న  ధర్మవీర్  సంస్థ ప్రతినిధి కశ్యప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, హిందుత్వ, మోదీ అన్నీ ఒకటేనని, ఇందులో తప్పేముందని ఆయన వాదించారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాడివేడి చర్చ నడిచింది. రమణమూర్తి శాంతంగా సమాధానం ఇస్తున్నప్పటికీ, కశ్యప్ రెడ్డి సహనం కోల్పోయి ఒక్కసారిగా తన చెప్పు తీసుకుని రమణమూర్తిపై దాడికి తెగబడ్డారు. ఈ ఆకస్మిక దాడితో టీవీ స్టూడియోలో ఉన్న యాంకర్లు, ఛానల్ సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే జోక్యం చేసుకుని కశ్యప్ రెడ్డిని పక్కకు లాగి, అక్కడి నుంచి పంపించి వేశారు. అవమానానికి గురైన రమణమూర్తి అనంతరం స్టూడియో వెలుపలికి వచ్చి మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో, అదీ టీవీ చర్చల్లో ఇలాంటి భౌతిక దాడులకు దిగడం అత్యంత హేయమైన చర్యని ఆయన మండిపడ్డారు. రమరమూర్తి వ్యతిరేకించింది హిందుత్వనే కానీ హిందూ మతానని కాదని భరద్వాజ విశ్లేషించారు.  రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ,  చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే  హిందుత్వ  వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే  ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.  సామాజిక మాధ్యమాలు, టీవీ చర్చల్లో ఇటీవల కాలంలో కొందరు నాయకులు, సంస్థల ప్రతినిధుల భాష, ప్రవర్తన పూర్తిగా అదుపు తప్పుతోందని, కేవలం రాజకీయ పార్టీల మెప్పు కోసమో, లేదా ఆర్థిక లబ్ధి కోసమో కొందరు ఇటువంటి వివాదాలను సృష్టిస్తూ సమాజంలో అలజడి రేపుతున్నారని అభిప్రాయపడ్డారు.  ఇలాంటి దాడులు జరిగినప్పుడు సదరు రాజకీయ శ్రేణులు గానీ, అనుబంధ సంస్థలు గానీ మౌనంగా ఉండటం మరిన్ని దాడులకు ఉసిగొల్పినట్లవుతుందని హెచ్చరించారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి అసలు ప్రజా సమస్యలైన నిరుద్యోగం, ఫీజు రీయింబర్స్‌మెంట్, పోలవరం నిధులు, ఆరోగ్యశ్రీ వంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. Kashyap Reddy Attacks Ramana Murthy, TV Debate Slipper Attack Hyderabad,  Modi Vishwaroopam Cutout Controversy, Dharmaveer Kashyap Reddy, Tone News,  Tone News Debate Attack Case
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం, టాలెంటెడ్ బ్యూటీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ వేడుకను హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టాలీవుడ్ ప్రముఖ సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తన మార్క్ స్పీచ్ మరియు టైమింగ్‌తో ఈవెంట్ మొత్తానికే హైలైట్‌గా నిలిచారు. వేదికపై ఆయన చేసిన హంగామా, పంచిన నవ్వులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈవెంట్‌ను నడిపిస్తున్న ఒక అందమైన యాంకర్‌తో అల్లు అరవింద్ చేసిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ యాంకర్ ఆర్జే చార్మిలా స్టేజ్ మేనేజ్మెంట్ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమం సాగుతున్న క్రమంలో ఆమె అల్లు అరవింద్‌ను ప్రశ్నలతో ఇరుకున పెట్టాలని గట్టిగానే ప్రయత్నించారు. అందులో భాగంగానే ఆమె అరవింద్ గారి వైపు చూస్తూ.. "సార్, ఫస్ట్ లవ్ అనేది తోపా కాదా?" అంటూ ఒక గుక్క తిప్పుకోకుండా సూటిగా ప్రశ్నించారు. ఈ ఊహించని ప్రశ్నకు సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఏమాత్రం తడబడకుండా, తనదైన శైలిలో నవ్వుతూ "ఊరుకోవమ్మా.. ఇప్పుడు అవన్నీ ఎందుకు" అంటూ చాలా చాకచక్యంగా టాపిక్‌ను దాటవేశారు. అయితే ఆ తర్వాత ఆయన మాట్లాడుతుండగా.. "నా యంగ్ ఏజ్‌లో నేను చెన్నైలో ఉన్నాను, అక్కడే చదువుకున్నాను" అని తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్నారు. వెంటనే పక్కనే ఉన్న మరో ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ అందుకుని.. "సార్, లవ్ చేయడానికి వయసుతో పనేంటి సార్!" అంటూ గట్టిగా సెటైర్ వేయడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అయితే ఈ సరదా సంభాషణ ఇక్కడితో ఆగిపోలేదు. యాంకర్ ఆర్జే చార్మిలా చాకచక్యం మరియు ఆమె ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అందానికి ఫిదా అయిన అల్లు అరవింద్ ఆమెకు వేదికపైనే ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆమెను ఎంతగానో అప్రిషియేట్ చేస్తూ.. "చాలా బాగా మాట్లాడుతున్నావ్, మా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రాబోయే నెక్స్ట్ సినిమాలో ఒక మంచి పాత్రలో నటిస్తావా?" అంటూ స్టేజ్ పైనే డైరెక్ట్ ఆఫర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అల్లు అరవింద్ లాంటి ఒక బిగ్ ప్రొడ్యూసర్ నుండి స్వయంగా గీతా ఆర్ట్స్ ఆఫర్ రావడంతో యాంకర్ చార్మిలా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రేజీ మూమెంట్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ వేడుకలో విడుదల చేసిన 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. స్టీవెన్ (కిరణ్ అబ్బవరం) అనే ఒక మధ్యతరగతి యువకుడు ఎలాగైనా ఒక మంచి రైటర్ అవ్వాలనే బలమైన లక్ష్యంతో తన సొంత ఊరు హైదరాబాద్ వదిలి చెన్నై నగరానికి చేరుకుంటాడు. అక్కడ సినీ అవకాశాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూ తన స్నేహితులతో కలిసి ఒక చిన్న రూమ్‌లో ఉంటాడు. ఈ క్రమంలోనే అతడి జీవితంలోకి హీరోయిన్ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ కథ నడిచింది, ఒక సాధారణ రైటర్ చెన్నైలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొని అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమాను ఒక పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించారు. ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడం మరో విశేషం.     Allu Aravind, Geetha Arts, Kiran Abbavaram, Chennai Love Story 
తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డుల గ్రాఫ్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లిన తిరుగులేని ఇండస్ట్రీ హిట్ 'రంగస్థలం' చిత్రం తర్వాత, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మరియు సెన్సేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ఒక సాలిడ్ క్రేజీ అప్‌డేట్ తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇటీవలే తన కెరీర్‌లోనే అత్యంత భారీ సక్సెస్ సాధించిన 'పెద్ది' చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని ఊపుమీద ఉన్నారు. ఇదే తిరుగులేని జోష్‌లో ఆయన దర్శకుడు సుకుమార్‌తో తన 17వ సినిమాని (RC17) పట్టాలెక్కించేందుకు సర్వసిద్ధం చేసుకుంటున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో అటు మెగా అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి మెగా అభిమానులను ఎంతగానో ఖుషీ చేసే ఒక అదిరిపోయే సమాచారం ఏమిటంటే, ఈ చిత్ర ప్రారంభోత్సవానికి మరియు రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్‌కు మేకర్స్ ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే ఈ భారీ సినిమాను అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఎలాంటి ఆలస్యం లేకుండా, ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ చకచకా పూర్తి చేసుకుని, నవంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించడానికి సుకుమార్ ఇప్పటికే ఒక పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇక ఈ సినిమా విడుదలకు సంబంధించి కూడా మేకర్స్ ఒక భారీ స్కెచ్ వేశారు. ఈ క్రేజీ చిత్రాన్ని 2027 చివరి భాగంలో లేదా 2028 మార్చి నెల కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నద్ధమవుతున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి ఇదొక వింటేజ్ పీరియాడిక్ డ్రామా అని, 'pushpa' తరహాలో రెండు భాగాలుగా రాబోతోందని సామాజిక మాధ్యమాల్లో రకరకాల రూమర్లు వినిపించాయి. అయితే ఈ పుకార్లన్నింటికీ పూర్తిగా చెక్ పెడుతూ ఇప్పుడు ఒక అసలైన నిజం బయటకు వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగదు, అలాగే ఈ సినిమాకు రెండు పార్టులు అసలే ఉండవు. ఒకే ఒక్క భాగంలో పక్కా స్టైలిష్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ ఈ చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. మెగా అభిమానులు రామ్‌చరణ్ నుండి ఎలాంటి పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ సీక్వెన్సులు ఆశిస్తారో, అవన్నీ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయట. సాధారణంగానే సుకుమార్ సినిమాల్లో ఉండే మైండ్ బెండింగ్ స్క్రీన్‌ప్లే సర్ప్రైజ్‌లు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో కూడా ప్రేక్షకులు ఊహించని సరికొత్త స్క్రీన్‌ప్లే మ్యాజిక్ ఉంటుంది. ఇక రామ్‌చరణ్ క్యారెక్టరైజేషన్ విషయానికొస్తే, 'రంగస్థలం' లోని చిట్టిబాబు పాత్రలో చరణ్ నటన ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. అలాగే 'పెద్ది' చిత్రంలోనూ ఆయన పడిన కష్టం మరియు చూపించిన వేరియేషన్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే సుకుమార్ తెరకెక్కించబోయే ఈ కొత్త సినిమాలో చరణ్ క్యారెక్టరైజేషన్ ఈ రెండు చిత్రాలలోని పాత్రలను మించేలా, ఆయన పర్‌ఫార్మెన్స్‌కు మరింత వైవిధ్యమైన స్కోప్ ఇచ్చేలా సుకుమార్ డిజైన్ చేశారట. టెక్నికల్‌గా కూడా ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించనున్నారు. ఇందులో భాగంగానే ఒక బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నట్లు టాలీవుడ్‌లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. రామ్‌చరణ్ కెరీర్‌లోనే ఒక మైండ్‌బ్లోయింగ్ ప్రాజెక్ట్‌గా నిలవనున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.  
టాలీవుడ్‌లో సరికొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక క్రేజీ అప్‌డేట్ మెగా అభిమానులతో పాటు సామాన్య సినీ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి అచ్చమైన, స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పరిచయం చేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడు మెగా మేనల్లుడు, యువ హీరో సాయి వైష్ణవ్ తేజ్ కోసం ఒక సరికొత్త కథను సిద్ధం చేసినట్లు టాలీవుడ్‌లో బజ్ గట్టిగా వినిపిస్తోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లను రూపొందించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న శ్రీకాంత్ అడ్డాల, ప్రస్తుతం తన కెరీర్‌లో సరికొత్త మార్పుల కోసం చూస్తున్నారు. అందులో భాగంగానే మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయమై, తన మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన వైష్ణవ్ తేజ్‌ను శ్రీకాంత్ అడ్డాల కలవడం, కథా చర్చలు జరపడం ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. యువ హీరో వైష్ణవ్ తేజ్ తన కెరీర్ ఆరంభం నుండి ఒకే తరహా పాత్రలకే పరిమితం కాకుండా, మాస్ మరియు క్లాస్ అంశాలు కలగలిసిన వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అటు శ్రీకాంత్ అడ్డాల కూడా కేవలం సాఫ్ట్ సినిమాలు మాత్రమే కాకుండా, గతంలో ‘నారప్ప’, ‘పెద్ద కాపు’ వంటి విభిన్నమైన రా అండ్ రస్టిక్ చిత్రాలతో తనలోని సరికొత్త యాంగిల్‌ను కూడా ప్రేక్షకులకు చూపించారు. ఇప్పుడు ఈ ఇద్దరి కలయిక గనుక నిజమైతే, అది ఖచ్చితంగా వెండితెరపై ఒక వైవిధ్యమైన మరియు అద్భుతమైన ప్రయోగం అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాంత్ అడ్డాల రాసే స్క్రిప్ట్‌లలో ఉండే సహజత్వం, పాత్రల రూపకల్పనలో ఉండే భావోద్వేగాలు.. వైష్ణవ్ తేజ్ నటనలోని గాఢత మరియు ఈజ్ కలిస్తే ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక సరికొత్త మరియు ఆహ్లాదకరమైన వినోదం దక్కడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ పూర్తిగా మారింది, ముఖ్యంగా యువ హీరోలు రొటీన్ ఫార్ములా సినిమాలకు దూరంగా ఉంటూ వినూత్నమైన మరియు ప్రయోగాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వైష్ణవ్ తేజ్ కూడా అదే బాటలో పయనిస్తూ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సమయంలో శ్రీకాంత్ అడ్డాల లాంటి ఎమోషన్స్ బాగా పండించగల అనుభవజ్ఞుడైన దర్శకుడితో పని చేయడం అనేది అతని కెరీర్‌కు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవ్వడమే కాకుండా, ఒక మంచి మలుపుగా మారే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. శ్రీకాంత్ అడ్డాల సైతం తన పాత శైలి ఫ్యామిలీ డ్రామాలకు భిన్నంగా, ఈ జనరేషన్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఒక పవర్‌ఫుల్ మరియు ఎమోషనల్ కథాంశాన్ని సిద్ధం చేసుకుని వైష్ణవ్ తేజ్‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరి ఆలోచనలు, కథ పట్ల ఉన్న విజన్ పక్కాగా సింక్ అయితే మాత్రం టాలీవుడ్‌లో ఇదొక క్రేజీ పవర్ ఫుల్ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కాంబినేషన్ల గురించి చర్చలు జరగడం చాలా సాధారణమైన విషయమే అయినప్పటికీ, శ్రీకాంత్ అడ్డాల మరియు వైష్ణవ్ తేజ్ భేటీపై జరుగుతున్న ఈ విస్తృత ప్రచారం మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా గనుక పట్టాలెక్కితే, అది వైష్ణవ్ తేజ్ మాస్ అండ్ క్లాస్ ఇమేజ్‌ను ఏ స్థాయికి తీసుకెళ్తుంది? అలాగే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన పాత ఫామ్‌ను పూర్తి స్థాయిలో తిరిగి అందుకుంటారా అనేది చూడాలి. ప్రస్తుతానికి వీరిద్దరి మధ్య కథా చర్చలు కేవలం ప్రాథమిక దశలోనే ఉన్నట్లు సమాచారం. స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా ముగిసిన తర్వాత ఈ క్రేజీ కాంబోపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దర్శకుడు, నిర్మాతల సమన్వయంతో పాటు సరైన హీరోల ఎంపిక అనేది సినిమా విజయంలో 100 శాతం కీలక పాత్ర పోషిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల లాంటి అభిరుచి గల దర్శకుడు, వైష్ణవ్ తేజ్ వంటి యువ ప్రతిభను ఏ విధమైన విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో అని మెగా అభిమానులు ఇప్పటి నుంచే ఎంతో ఆసక్తిగా మరియు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ గనుక అఫీషియల్‌గా అనౌన్స్ అయితే, అది మెగా ఫ్యామిలీ ఖాతాలో మరో సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలను మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వకంగా అభినందించారు. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, అవార్డులను సొంతం చేసుకున్న సినీ ప్రముఖులకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పురస్కారాల పండుగలో తెలుగు సినిమా సత్తా చాటడం పట్ల ఆయన ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేశారు. భారతీయ సినిమా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుని, రాబోయే తరతరాలకు ఒక గొప్ప స్ఫూర్తినివ్వాలని ఈ సందర్భంగా మెగాస్టార్ ఆకాంక్షించారు. ఈ 72వ జాతీయ అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన 'కమిటీ కుర్రోళ్లు' చిత్ర బృందాన్ని చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా ఈ సినిమాను నిర్మించిన తన సోదరుడి కుమార్తె నిహారిక కొణిదెలను చూసి ఎంతో గర్వపడుతున్నానని ఎమోషనల్‌గా పేర్కొన్నారు. ఒక వినూత్నమైన కథతో వచ్చి, మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు అందుకోవడం సాధారణ విషయం కాదని, నిహారిక పట్టుదలకు ఇది నిదర్శనమని కొనియాడారు. ఈ విజయం మెగా కుటుంబంలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోనూ ఒక సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ అవార్డు గెలుచుకున్న క్రేజీ డైరెక్టర్ సుకుమార్‌కు చిరంజీవి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సుకుమార్ రాసుకున్న కథన శైలి, విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయని ప్రశంసించారు. అలాగే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన వైజ్ఞానిక అద్భుతం 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి గాను ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారానికి ఎంపికైనందుకు యువ దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బృందానికి మెగాస్టార్ తన అభినందనలు అందజేశారు. మరోవైపు, మలయాళీ లెజెండరీ నటుడు, తన ఆప్తమిత్రుడు అయిన మమ్ముట్టిని చిరంజీవి ఆకాశానికెత్తారు. నాలుగోసారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికైన మమ్ముట్టి అసాధారణ విజయాన్ని సాధించారని, ఇది ఒక అద్భుతమైన మైలురాయి అని కొనియాడారు. వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్న 'లక్కీ భాస్కర్' చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా నిలిచిన వెంకీ అట్లూరిని, అలాగే ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన '35' చిత్ర బృందాన్ని అభినందించారు. అదే చిత్రంలో అద్భుత నటన కనబరిచి ఉత్తమ బాలనటుడిగా అవార్డు గెలుచుకున్న అరుణ్ దేవ్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ మెగాస్టార్ పోస్ట్ చేశారు.   chiranjeevi, 72nd national film awards, niharika konidela
సినీ పరిశ్రమలో రాణించాలంటే కేవలం గ్లామర్, టాలెంట్ ఉంటేనే సరిపోదు. వాటన్నింటికీ మించి బాక్సాఫీస్ వద్ద ఒక సరైన వాణిజ్య విజయం అత్యంత కీలకం. కొంతమంది కథానాయికలకు మొదటి సినిమాతోనే రాత్రికి రాత్రే స్టార్‌డమ్ వచ్చేస్తుంది. కానీ మరికొందరు నటీమణులు మాత్రం ఒక మంచి బ్రేక్ కోసం ఎంతో కాలం వేచి చూడాల్సి వస్తుంది. సరిగ్గా ఇలాంటి విలక్షణమైన సినీ ప్రయాణాన్నే ఎదుర్కొంటోంది యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. వరుసగా పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ, సరైన కమర్షియల్ సక్సెస్ మాత్రం ఆమెకు దక్కలేదు. అయితే, తాజాగా విడుదలైన 'లెనిన్' చిత్రం ఆమె కెరీర్‌లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఒక భారీ ఊరటను, తిరుగులేని బ్రేక్‌ను ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ సరసన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ సినిమాతో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే, తన మొదటి చిత్రంతోనే అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు అమోఘమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినప్పటికీ, హీరోయిన్‌గా భాగ్యశ్రీకి మాత్రం పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు, ప్రశంసలు లభించాయి. దీంతో టాలీవుడ్ మేకర్స్ దృష్టి ఆమెపై పడింది. ఆ వెంటనే ఆమెకు 'కింగ్‌డమ్', 'కాంతా', మరియు 'ఆంధ్ర కింగ్ తాలూకా' వంటి విభిన్నమైన మరియు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో వరుసగా అవకాశాలు దక్కాయి. అయితే దురదృష్టవశాత్తూ ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయాయి. సాధారణంగా చిత్ర పరిశ్రమలో బ్యాక్-టు-బ్యాక్ పరాజయాలు వస్తే ఏ హీరోయిన్ కెరీర్ అయినా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుంది. కొత్త అవకాశాలు రావడం దాదాపుగా నిలిచిపోతుంది. కానీ భాగ్యశ్రీ బోర్సే విషయంలో మాత్రం టాలీవుడ్ సమీకరణాలు పూర్తిగా భిన్నంగా మారాయి. వరుసగా 4 సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకూలమైన ఫలితాలను ఇవ్వకపోయినా, తెలుగు ట్రేడ్ వర్గాలు మరియు దర్శకులలో ఆమెపై ఉన్న క్రేజ్ అస్సలు తగ్గలేదు. ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శక నిర్మాతలు ఆమెకు వరుసగా కొత్త అవకాశాలు ఇస్తూనే వచ్చారు. దీనికి ప్రధాన కారణం తెరపై ఆమెకు ఉన్న తిరుగులేని గ్లామర్ అప్పీల్, ఏ పాత్రకైనా ఇట్టే సరిపోయే అద్భుతమైన లుక్స్ మరియు సినిమా సినిమాకూ నటనలో ఆమె చూపిస్తున్న అపరిమితమైన ఇంప్రూవ్‌మెంట్ అని ఇండస్ట్రీ టాక్. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఆమె క్రేజ్ నిలబడటానికి ఇదే కారణం. సరిగ్గా ఇలాంటి తీవ్రమైన ఒడిదుడుకుల సమయంలో విడుదలైన 'లెనిన్' సినిమా భాగ్యశ్రీ బోర్సే సినీ కెరీర్‌లో ఒక మైలురాయిగా, మేజర్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు, చూపించిన నటనకు అటు ప్రేక్షకుల నుండి, ఇటు విమర్శకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. కేవలం థియేటర్లలోనే కాకుండా, ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌ లోనూ భాగ్యశ్రీ పాత్ర మరియు ఆమె పెర్ఫార్మెన్స్ గురించి పెద్ద ఎత్తున పాజిటివ్ చర్చలు నడుస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ కేవలం గ్లామర్ రోల్స్‌కే పరిమితం కాకుండా, బలమైన పాత్రలను కూడా అలవోకగా పండించగల నటి అని పరిశ్రమలో నిరూపితమైంది. రెండేళ్లుగా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూసిన భాగ్యశ్రీ బోర్సేకు 'లెనిన్' అందించిన బూస్ట్ సామాన్యమైనది కాదు. ప్రస్తుతం 'లెనిన్' ఘన విజయంతో టాలీవుడ్‌ లోని యంగ్ హీరోలు, మీడియం రేంజ్ చిత్రాల మేకర్స్ తమ తదుపరి ప్రాజెక్టుల కోసం భాగ్యశ్రీ బోర్సే వైపు మొగ్గు చూపుతున్నారు. ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్‌గా ఎంపిక చేసుకునేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. మరోవైపు, కోలీవుడ్ క్రేజీ స్టార్ శివకార్తికేయన్ సరసన నటిస్తున్న 'సేయోన్' చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే తమిళ చిత్ర పరిశ్రమలోకి కూడా గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. తెలుగు సినిమాలే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేసిన ఈ ముద్దుగుమ్మ, పక్క రాష్ట్రాల నుండి కూడా ఆఫర్లు అందుకోవడంతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదుగుతోంది. వరుస ఫ్లాపులు వచ్చినా వెనకడుగు వేయకుండా నిలబడిన ఈ భామకు 'లెనిన్' తెచ్చిపెట్టిన ఈ కొత్త జోష్, రాబోయే సినిమాలతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.  
సినీ రంగంలో కానీ, టెలివిజన్ పరిశ్రమలో కానీ సెలబ్రిటీల మధ్య ఉండే పవిత్రమైన స్నేహబంధాలను అక్రమ సంబంధాలుగా, రొమాంటిక్ రిలేషన్స్‌గా చిత్రీకరించడం ఈ డిజిటల్ మీడియా మరియు సోషల్ మీడియా యుగంలో నిత్యకృత్యంగా మారిపోయింది. కేవలం వ్యూస్, లైక్స్, మరియు క్లిక్స్ కోసమే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ వస్తున్న కొన్ని వార్తా కథనాలపై తాజాగా ప్రముఖ హిందీ టెలివిజన్ స్టార్ హీరో అర్జున్ బిజ్లానీ అత్యంత తీవ్రంగా స్పందించారు. తన లాంగ్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ నటి మౌనీ రాయ్‌తో తనకు ముడిపెడుతూ వస్తున్న ఎఫైర్ రూమర్లను ఆయన పూర్తిగా బేస్‌లెస్ అని కొట్టిపారేస్తూ మీడియాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘమైన మరియు పవిత్రమైన స్నేహ బంధాన్ని కేవలం రేటింగ్‌ల కోసం తప్పుగా చిత్రీకరించడం ఎంతవరకు న్యాయమని ఆయన సోషల్ మీడియా వేదికగా ఘాటుగా ప్రశ్నించారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై, ముఖ్యంగా వారి స్నేహాలపై ఇష్టానుసారంగా కథనాలు రాసేటప్పుడు మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కనీస అవసరం ఉందని అర్జున్ బిజ్లానీ హితవు పలికారు. బాధ్యతాయుతమైన జర్నలిజం అనేది ప్రజల్లో ఎల్లప్పుడూ నమ్మకాన్ని పెంచుతుందని, కానీ కేవలం క్లిక్‌బైట్ థంబ్‌నైల్స్, సంచలనాల కోసం పెట్టే అబద్ధపు టైటిల్స్ సమాజంలో మీడియాపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా పోగొడుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నిజానిజాలు తెలుసుకోకుండా, కనీసం సదరు వ్యక్తులను సంప్రదించకుండా కేవలం ఊహాగానాలతో తప్పుడు కథనాలను ప్రచురించే ముందు కనీస వాస్తవాలను వెరిఫై చేసుకోవాలని ఆయన మీడియా సంస్థలకు స్పష్టమైన పిలుపునిచ్చారు. రూమర్లపై అర్జున్ బిజ్లానీ ఇంత ఓపెన్‌గా, ధైర్యంగా స్పందించి మీడియాకు చురకలు అంటించిన విధానాన్ని ఆయన అభిమానులు మరియు నెటిజన్లు ఎంతో అభినందిస్తున్నారు. ఈ ఇష్యూపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి కూడా అర్జున్ బిజ్లానీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మనం ఎంత 21వ శతాబ్దంలో ఉన్నామని చెప్పుకుంటున్నా, ఇంకా మన సమాజంలో ఒక స్త్రీ మరియు ఒక పురుషుడి మధ్య ఉండే అత్యంత స్వచ్ఛమైన ఫ్రెండ్‌షిప్‌ను అర్థం చేసుకోలేని సంకుచిత మానసిక స్వభావం కొందరిలో కొనసాగుతుండటం విచారకరమని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఒకరితో ఒకరు ఇండస్ట్రీలో క్లోజ్‌గా ఉన్నంత మాత్రాన, ఈవెంట్లలో నవ్వుతూ మాట్లాడుకున్నంత మాత్రాన వారి మధ్య ఏదో నడుస్తోందన్నట్లుగా అసత్య ప్రచారం చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీల విషయంలో, వారు కెరీర్‌లో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు ఇలాంటి ఆధారం లేని రూమర్లు వారిని మరింత మానసిక క్షోభకు గురిచేస్తాయని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అర్జున్ బిజ్లానీ మరియు మౌనీ రాయ్ ఇద్దరూ బుల్లితెరపై ఎన్నో సూపర్ హిట్ ప్రాజెక్ట్స్‌లో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కెరీర్ ప్రారంభం నుండి ముంబై గ్లామర్ ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్‌గా ఉంటూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నారు. ఒక బలమైన స్నేహ బంధం, అలాగే ఒకరిపై ఒకరికి ఉండే ప్రొఫెషనల్ గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటాయని, వాటిని తప్పుడు కోణంలో చూడటం ఇప్పటికైనా ఆపాలని బాలీవుడ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. అర్జున్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా, క్లిక్స్ కోసం సెలబ్రిటీల ప్రైవసీతో ఆడుకునే కొన్ని వెబ్‌సైట్ల ధోరణిని ఎండగట్టేలా ఉన్నాయి. ఎంతటి సెలబ్రిటీలైనా సరే, వారి ప్రైవసీని మరియు స్నేహాలను గౌరవించాల్సిన కనీస బాధ్యత సమాజానికి ఉంటుంది. ఈ రూమర్లకు అర్జున్ బిజ్లానీ పెట్టిన ఫుల్‌స్టాప్‌తోనైనా ఇలాంటి అసత్య ప్రచారాలు ఆగుతాయని ఆశిద్దాం.  
భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) ప్రకటన వెలువడింది. 2024 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డుల్లో మన తెలుగు సినిమా (టాలీవుడ్) తన సత్తా చాటి, ఏకంగా పలు విభాగాల్లో జాతీయ అవార్డులను కొల్లగొట్టింది.  చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు టాలీవుడ్‌ విజువల్ వండర్స్ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి.  1. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  ప్రభాస్ హీరోగా, నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ విజువల్ వండర్ జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించింది.  ఉత్తమ పాపులర్ చిత్రం (Wholesome Entertainment): ప్రేక్షక ఆదరణ పొందిన ఉత్తమ వినోదాత్మక చిత్రంగా 'కల్కి' జాతీయ అవార్డును గెలుచుకుంది.  ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఈ సినిమాలో అద్భుతమైన సెట్స్, ఫ్యూచరిస్టిక్ ప్రపంచాన్ని సృష్టించినందుకు గానూ నితిన్ జిహానీ చౌదరికి బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు దక్కింది.   2. పుష్ప-2: ది రూల్ (Pushpa 2: The Rule)  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ భారీ యాక్షన్ డ్రామా రెండు ముఖ్యమైన కేటగిరిల్లో అవార్డులు సాధించింది.ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్ (ఒరిజినల్): ఈ చిత్రానికి అద్భుతమైన కథనం అందించినందుకు గానూ దర్శకుడు సుకుమార్ జాతీయ అవార్డును అందుకున్నారు.  ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: చిత్రంలోని పాత్రలకు తగ్గట్టుగా అద్భుతమైన దుస్తులను డిజైన్ చేసినందుకు దీపాలి నూర్, శీతల్ శర్మలకు ఈ పురస్కారం లభించింది.   3. కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)  నిహారిక కొణిదెల నిర్మాణంలో, కొత్త నటీనటులతో వచ్చిన ఈ చిన్న సినిమా జాతీయ స్థాయిలో పెద్ద సెన్సేషన్ సృష్టించింది.  ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: 2024 ఏడాదికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా 'కమిటీ కుర్రోళ్లు' జాతీయ అవార్డుకు ఎంపికైంది.  ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ఈ సినిమాలో నటీనటులకు సహజసిద్ధమైన మేకప్ అందించిన పి. రవికుమార్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్‌గా నిలిచారు.   4. 35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu)  ఆకట్టుకునే భావోద్వేగాలతో, పిల్లల చదువుల నేపథ్యంలో వచ్చిన ఈ అందమైన సినిమాకు రెండు అవార్డులు దక్కాయి.ఉత్తమ బాలల చిత్రం (Best Children's Film): చిన్న కథతోనే పెద్ద సందేశాన్ని ఇచ్చినందుకు ఈ సినిమాకు ఉత్తమ బాలల చిత్రంగా గుర్తింపు దక్కింది.  ఉత్తమ బాల నటుడు: ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ దేవ్ పోతుల జాతీయ ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నారు.   5. లక్కీ భాస్కర్ (Lucky Baskhar) దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ విలక్షణమైన పీరియాడిక్ డ్రామా కూడా జాతీయ అవార్డుల జాబితాలో నిలిచింది.  ఉత్తమ డైలాగ్ రైటర్: ఈ సినిమాకు పదునైన, ఆలోచింపజేసే మాటలు రాసినందుకు గానూ దర్శకుడు వెంకీ అట్లూరి బెస్ట్ డైలాగ్ రైటర్‌గా జాతీయ అవార్డును గెలుచుకున్నారు.   భారీ గ్రాఫిక్స్ చిత్రాల నుంచి మనసును హత్తుకునే చిన్న సినిమాల వరకు అన్ని రకాల జోనర్లలో తెలుగు సాంకేతిక నిపుణులు, దర్శకులు జాతీయ వేదికపై అవార్డుల పంట పండించి తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి చాటిచెప్పారు!
  'తగ్గేదెలే' అనే రీతిలో కాసేపటి క్రితం ప్రకటించిన  72వ నేషనల్ అవార్డ్స్ లో పుష్ప 2  తన సత్తా చాటింది.  పుష్ప: ది రైజ్' మొదటి భాగానికి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గతంలోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సాధించగా, ఇప్పుడు రెండో భాగానికి దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ అవార్డు అందుకోవడం విశేషం.  ఒక కమర్షియల్ మాస్ యాక్షన్ డ్రామాకి జాతీయ స్థాయిలో కథనం యొక్క  నైపుణ్యం గుర్తించబడటం తెలుగు చిత్ర పరిశ్రమకి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పవచ్చు. కేవలం స్క్రీన్‌ప్లే మాత్రమే కాకుండా, 'పుష్ప 2' చిత్రానికి గాను దీపాలీ నూర్ మరియు శీతల్ శర్మలకి  ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా కూడా జాతీయ అవార్డు లభించింది.దీంతో  ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఖాతాలో మొత్తం రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు చేరినట్లయింది. సుకుమార్ ప్రతిభను జాతీయ వేదికపై గుర్తించడంతో తెలుగు ప్రేక్షకులు మరియు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒక సాధారణ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ కథను అంతర్జాతీయ స్థాయి ఎమోషన్స్ మరియు మైండ్ గేమ్స్‌తో నడిపించిన సుకుమార్ రైటింగ్ స్టైల్‌కి  ఈ అవార్డు నిజమైన గుర్తింపు అని ఇండస్ట్రీ వర్గాలు కొనిాడుతున్నాయి. ఈ అవార్డుల వేడుకలో తెలుగు సినిమా సాధించిన విజయాలు ఇక్కడితో ఆగిపోలేదు. పాన్-ఇండియా రేంజ్‌లో రికార్డులు సృష్టించిన విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్తమ వినోదాత్మక చిత్రంగా (Best Popular Film Providing Wholesome Entertainment) నిలిచింది. అంతేకాకుండా నితిన్ జిహానీ చౌదరి బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ఈ చిత్రానికి గాను అవార్డు గెలుచుకున్నారు. మరోవైపు యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'లక్కీ భాస్కర్' సినిమాకి బెస్ట్ స్క్రీన్‌ప్లే డైలాగ్స్ విభాగంలో జాతీయ పురస్కారం దక్కింది. చిన్న చిత్రంగా వచ్చి థియేటర్లలో సంచలనం సృష్టించిన 'కమిటీ కుర్రోళ్లు' చిత్రం బెస్ట్ తెలుగు రీజినల్ ఫిల్మ్‌గా  ఎంపికవడమే కాకుండా, బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ పి. రవికుమార్ విభాగంలోనూ అవార్డును కొల్లగొట్టింది. మొత్తం మీద 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఉత్సవంలో తెలుగు సినిమా కమర్షియల్ వాల్యూస్‌తో పాటు కంటెంట్ పరంగా కూడా తానేంటో నిరూపించుకుంది, అందులో సుకుమార్ సాధించిన స్క్రీన్‌ప్లే అవార్డు టాలీవుడ్ రచనా నైపుణ్యానికి దక్కిన మకుటంగా నిలిచిపోతుంది Also read: నేషనల్ అవార్డ్స్ లో కమిటీ కుర్రోళ్లు సంచలనం.. ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు మరిన్ని.. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారికంగా ఈ అవార్డుల విజేతల జాబితాను వెల్లడించింది. ప్రఖ్యాత మలయాళ దర్శకుడు జయరాజ్ నేతృత్వంలోని 11 మంది సభ్యుల సెంట్రల్ జ్యూరీ దేశవ్యాప్తంగా వచ్చిన వందలాది ఎంట్రీలను నిశితంగా పరిశీలించి ఈ అవార్డులను ఖరారు చేసింది. ఈ ఏడాది అవార్డులలో తెలుగు సినిమా తన సత్తాను చాటుతూ ఏకంగా 7 ప్రధాన అవార్డులను సొంతం చేసుకుని గర్వంగా నిలిచింది. ఈ మహా విజయంలో టాలీవుడ్ లెక్కల మాస్టర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సరికొత్త చరిత్ర లిఖించారు. ప్రపంచవ్యాప్తంగా రికార్డుల వేట సాగించిన ఐకానిక్ చిత్రం 'పుష్ప 2: ది రూల్' (Pushpa 2: The Rule) చిత్రానికి గాను ఆయన ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే (Best Original Screenplay) కేటగిరీలో జాతీయ అవార్డును గెలుచుకున్నారు. సుకుమార్ రాసుకున్న గ్రిప్పింగ్ నరేషన్, అద్భుతమైన క్యారెక్టరైజేషన్లు, మాస్ ఎలిమెంట్స్ జ్యూరీ సభ్యులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. sukumar, allu arjun, pushpa 2
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) ప్రకటన దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. ఈ ఏడాది అవార్డుల్లో అటు బాలీవుడ్ చిత్రాలతో పాటు ఇటు దక్షిణాది సినిమాలు సైతం భారీ స్థాయిలో తమ సత్తా చాటుతూ అవార్డుల పంట పండించుకున్నాయి. ప్రతి ఏటా దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సినీ సాంకేతిక నిపుణులను, నటీనటులను గౌరవించే ఈ వేదికపై ఈ సారి సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాలలో విజేతల ఎంపిక సినీ విశ్లేషకులను సైతం అమితంగా ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన వందలాది చిత్రాలను పరిశీలించిన జ్యూరీ సభ్యులు ఎంతో నిష్పక్షపాతంగా విజేతలను ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ సారి జాతీయ ఉత్తమ నటిగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ యామి గౌతమ్ (Yami Gautam) ఎంపికై సంచలనం సృష్టించారు. కశ్మీర్ నేపథ్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'ఆర్టికల్ 370' (Article 370) సినిమాలో యామి గౌతమ్ కనబరిచిన అద్భుతమైన, భావోద్వేగభరితమైన నటనకు గాను ఈ అత్యున్నత గౌరవం దక్కింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ భార్య అయిన యామి గౌతమ్, ఈ చిత్రంలో ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ పాత్రలో జీవించేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలవడం తన కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోతుందని ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ సారి 72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడి (Best Actor) స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొనగా, జ్యూరీ ఇద్దరు అగ్ర నటులను సంయుక్తంగా విజేతలుగా ఎంపిక చేయడం విశేషం. బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 'చందు ఛాంపియన్' (Chandu Champion) సినిమాలో తన అద్భుత నటనకు గాను తొలిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకున్నారు. ఆయనతో పాటు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) హారర్ థ్రిల్లర్ చిత్రం 'భ్రమయుగం' (Bramayugam) లో ప్రదర్శించిన విలక్షణ నటనకు గాను మరోసారి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై తన సీనియారిటీని చాటుకున్నారు. ఒకే ఏడాది ఇద్దరు విభిన్న తరాల నటులకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం విశేషం.   72nd National Film Awards, National Awards Winners List, Yami Gautam, Mammootty, Kartik Aaryan 
    మేకర్ తో పాటు ప్రతి ఆర్టిస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ స్థాయి అవార్డుని  అందుకోవాలని ఎంతో ఆశపడతాడు. తద్వారా వాళ్ళ సినీ ప్రాభవానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ఆ గుర్తింపుని 'కమిటీ కుర్రోళ్లు' దక్కించుకుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాగా వచ్చి, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న కమిటీ కుర్రోళ్లు ప్రతిష్ఠాత్మక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో 2024 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఎంతోమంది హేమాహేమీల చిత్రాలని దాటుకుని ఈ చిన్న సినిమా అగ్రస్థానంలో నిలవడం టాలీవుడ్‌లో సరికొత్త చరిత్రగా మారింది. గ్రామీణ నేపథ్యం, స్వచ్ఛమైన స్నేహం, భావోద్వేగాలు, మనుషుల మధ్య ఉండే సున్నితమైన సంబంధాలని ఎంతో సహజంగా తెరకెక్కించిన విధానం జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యులని  ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా సాధించిన ఘనత వెనుక ఒక బలమైన కథనం మరియు ఎంతోమంది  శ్రమ దాగి ఉంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించగా, యదు వంశీ  దర్శకుడిగా పరిచయమయ్యాడు.  కేవలం 9 కోట్ల రూపాయల  బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, గతంలో ఆగస్టు 9, 2024న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. థియేట్రికల్ పరంగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 18.5 కోట్ల రూపాయల వసూళ్లని  సాధించడమే కాకుండా, నాన్, థియేట్రికల్ రెవెన్యూ రూపంలో మరో 6 కోట్ల రూపాయలను  రాబట్టింది. ఈ విధంగా మొత్తంగా 24.5 కోట్ల రూపాయల  భారీ కలెక్షన్లతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. Also read: ఒకే ఒక్క హిట్ తో 30 లక్షల నుంచి 3 కోట్ల వరకు! ఏది ఏమైనా  ఒక వైపు భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు పోటీ పడుతున్న తరుణంలో, కొత్త నటీనటులతో, ఎటువంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు దేశంలోనే అత్యున్నత పురస్కారాన్ని కైవసం చేసుకోవడం విశేషం.ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ కోటాలో కూడా కమిటీ కుర్రాళ్ళు నుంచి పి. రవికుమార్ నేషనల్ అవార్డు అందుకోనున్నాడు.  committee kurrollu, 72nd National Film Awards
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
స్మోకింగ్ మానాలంటే చాలా కష్టంగా ఉందా? ఇలా చేస్తే ఈజీగా మానేయవచ్చు..! ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే.. చాలామంది స్మోక్ చేయడం మాత్రం మానరు. స్మోకింగ్ వల్ల ఎవరికి ఎంత సమస్య వచ్చినా దాని విషయంలో చాలా బలహీనంగా ఉంటారు. కానీ స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, ఆస్తమా, క్షయ,  క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది. కేవలం ధూమపానం చేసేవారికే కాకుండా ఆ పొగను ఇతరులు పీల్చడం వల్ల ఇతరులకు కూడా సమస్య వస్తుంది. అయితే స్మోకింగ్ మానాలని మానలేకపోతున్న వారికి కొన్ని మంచి మార్గాలు ఉన్నాయి.  వాటిని పాటిస్తే స్మోకింగ్ మానేయడం చాలా ఈజీ.. ఆ మార్గాలు ఏెంటో తెలుసుకుంటే.. నిర్ణయం, కట్టుబడి ఉండటం.. ధూమపానం మానేయాలని నిర్ణయించుకుంటే మొదట ఎప్పటి నుండి మానేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి.  ఈ నిర్ణయం గురించి  కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా చెప్పాలి,  చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి.  దీని వల్ల ఇతరులకు చెప్పాం కాబట్టి మానెయ్యాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. పైగా ఫలానా రోజు నుండి మానేయాలి అని మనసును కూడా సన్నద్ధం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు,  స్నేహితులు కూడా ప్రో్త్సహించే అవకాశం ఉంటుంది. కొత్త అలవాట్లు.. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం, యోగా లేదా వేగంగా నడవడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. కొత్త అభిరుచిని అలవరచుకోవడం లేదా తమను తాము ఏదో ఒక పనిలో  నిమగ్నం చేసుకోవడం  కూడా ధూమపానం చేయాలనే కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది. వైద్య సహాయం.. స్మోకింగ్ మానేయడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ  ధూమపానం మానుకోలేకపోతే, వైద్యుడిని లేదా స్మోకింగ్మ మానేయడానికి సహాయపడే నిపుణులను సంప్రదించాలి.  అవసరమైతే వారు నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT), మందులు లేదా కౌన్సెలింగ్‌ను సిఫార్సు చేసే అవకాశం  ఉంటుంది.  వైద్యుడిని సంప్రదించకుండా ఎలాంటి మందులను వాడటం అయితే మంచిది కాదు. 4-డి సూత్రం.. "4-డి" సూత్రం అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా పరిగణించబడుతుంది. స్మౌకింగ్ చేయాలనే కోరికలు కలిగినప్పుడు, వెంటనే చేయకూడదు.. కొద్దిసేపు ఆగాలి, ఎందుకంటే అవి సాధారణంగా ఐదు నిమిషాల్లో తగ్గిపోతాయి, లోతైన శ్వాస తీసుకోవాలి, నీరు త్రాగాలి,  అదే ఆలోచనలో ఉండకుండావేరే పనులలో తమను తాము నిమగ్నం చేసుకోవడం లేదా స్నేహితులతో,  కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటి పనుల ద్వారా మైండ్ డైవర్ట్ చేసుకోవాలి.   స్మోకింగ్ మానడానకి  ప్రయత్నం చేసేటప్పుడు మొదట్లో చాలా కష్టంగా అనిపించవచ్చు.  కానీ పైన చెప్పుకున్నట్టు పాటిస్తూ ఉంటే తొందరలోనే స్మోకింగ్ మానేయవచ్చు.                                       *రూపశ్రీ.
వాము, జీలకర్రతో చేసే ఈ చూర్ణం గ్యాస్, అజీర్ణానికి ఎంత ఉపయోగమో తెలుసా.! గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమస్యలను సహజసిద్ధమైన ఆయుర్వేద పద్ధతిలో ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ ఈ వీడియోలో వివరించారు.   ఈ వీడియోలో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద చూర్ణం తయారీ విధానాన్ని చూపించారు. వాము, ధనియాలు, జీలకర్ర, సోంపు, నల్ల ఉప్పు వంటి మన వంటింట్లో ఉండే పదార్థాలతో ఈ చూర్ణాన్ని ఎలా తయారు చేయాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో పూర్తి వివరంగా తెలిపారు. ఈ చూర్ణం జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గ్యాస్ సమస్యను తగ్గించడంలో, కడుపు ఉబ్బరాన్ని నియంత్రించడంలో, అసిడిటీ వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: గ్యాస్, అసిడిటీకి సహజమైన ఆయుర్వేద చిట్కా ఇంట్లోనే చూర్ణం తయారు చేసే విధానం వాము, జీలకర్ర, ధనియాలు, సోంపు ప్రయోజనాలు చూర్ణం తీసుకునే సరైన సమయం, మోతాదు జీర్ణక్రియను మెరుగుపరచే సహజ మార్గాలు మీరు తరచూ గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతుంటే, ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద నిపుణులు అందించిన సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.      
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే సులభమైన యోగా ఆసనాలు మరియు వ్యాయామాలను వివరంగా చూపించారు. ఈ యోగా పద్ధతులను సరైన విధంగా, క్రమం తప్పకుండా చేస్తే మోకాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్ల కదలిక మెరుగుపడుతుంది. మోకాళ్లలో గట్టిదనం తగ్గి, నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇవి ఉపయోగపడవచ్చు. వయస్సుతో వచ్చే మోకాళ్ల సమస్యలు, ఆస్టియోఆర్థ్రైటిస్ ప్రారంభ దశలో ఉన్నవారు లేదా ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసే వారు కూడా ఈ వ్యాయామాల గురించి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: మోకాళ్ల నొప్పికి కారణాలు మోకాళ్ల కండరాలను బలపరిచే యోగా వ్యాయామాలు నొప్పిని తగ్గించే సులభమైన స్ట్రెచింగ్ పద్ధతులు నడవడం, మెట్లు ఎక్కడం సులభం కావడానికి ఉపయోగపడే సూచనలు మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునే యోగా చిట్కాలు గమనిక: మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న వారు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదా శస్త్రచికిత్స అనంతర పరిస్థితి ఉంటే, ఈ వ్యాయామాలను ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి