Top Stories

political-news-img

శరీరాన్నే కాదు.. బంధాన్ని డిటాక్స్ చేసుకోవడం చాలా ముఖ్యం..!

ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి. కానీ భార్యాభర్తల మధ్య కేవలం గొడవలు మాత్రమే ఎక్కువ ఉండి, ఇద్దరి మధ్య సరైన అవగాహన, పరస్పర గౌరవం వంటివి లేకపోతే.. ఆ బంధం చాలా పెళుసుగా మారిపోయే అవకాశం ఉంటుంది. గొడవలు అలకలు ఇద్దరి మద్య బంధాన్ని ఎంత బలం చేస్తాయో.. అవి ఎక్కువైతే ఇద్దరిని అవే విడదీస్తాయి కూడా. నేటికాలంలో చాలామంది తమ బంధం గురించి ఆలోచించి బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికోసం ఒక మంచి మార్గం ఉంది. అదే రిలేషన్షిప్ డిటాక్స్.. శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడం కోసం చాలా మంది డిటాక్స్ డ్రింకులు తాగుతూ ఉంటారు. దీనివల్ల శరీరంలో విషపదార్థాలు బయటకు వెళ్లిపోయి శరీరం శుభ్రం అవుతుంది. అదేవిధంగా.. రిలేషన్షిప్ ను డిటాక్స్ చేసుకుంటే.. బంధంలో ఉన్న అనవసర గొడవలు, ఇబ్బందులు, అపార్థాలు అన్నీ మంత్రమేసినట్టు మాయమవుతాయి. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. భాగస్వామిని బాధపెట్టకుండా బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే.. భాగస్వామితో మాట్లాడాలి.. రిలేషన్ షిప్ డిటాక్స్ చేయించుకోవాలనుకుంటే, ముందుగా భాగస్వామితో మాట్లాడాలి. ఎందుకు రిలేషన్షిప్ డిటాక్స్ చేయించుకోవాలని అనుకుంటున్నారో వివరించాలి.ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించాలి. సమస్యలకు కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. భాగస్వామి పైవన్నీ అర్థం చేసుకుంటే.. రిలేషన్షిప్ డిటాక్స్ చేయించుకోవడం సులువు అవుతుంది. దృష్టి.. ప్రతి ఒక్కరు తమపై తాము దృష్టి పెట్టాలి. ఇది మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తమపై తాము దృష్టి పెట్టినప్పుడు, తమ బలాలు, బలహీనతలను బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇవి భవిష్యత్తులో సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో సహాయపడతాయి. సమయం.. నేటికాలంలో ప్రతి ఒక్కరు నిరంతరం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడూ ఫోన్‌లో ఉండటం వల్ల తమకు తాము సమయం కేటాయించుకోలేకపోతారు. తమకు తాము సమయం కేటాయించుకోనప్పుడు అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే.. సమయం కేటాయించాలి. ఫోన్ కు దూరంగా ఉండాలి. బందం గురించి ఆలోచించాలి. అలాంటప్పుడు అలోచనలు కూడా సరిగ్గా పనిచేస్తాయి. దూరం.. రిలేషన్షిప్ డిటాక్స్ అంటే.. బంధం నుండి విడిపోవడానికి ప్రయత్నించడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం. బంధంలో గొడవలు, అపార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు.. భాగస్వామికి కొన్నాళ్లు దూరంగా ఉండి అన్నీ ఆలోచించుకోవడం వల్ల అన్ని విషయాలు క్షుణ్ణంగా అర్థం అవుతాయి. అప్పుడు బంధాన్ని నిలబెట్టుకోవడానికి మార్గాలు కనిపిస్తాయి. బంధం ఎంత ముఖ్యమైనదో కూడా అర్థమవుతుంది. *రూపశ్రీ.

Publish Date: Jun 8, 2027 11:12AM

political-news-img

ఇక 50 ఏళ్ల వరకూ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అక్కర్లేదు!

దేశంలో వాహన చోదకులకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించనుంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది వాహనదారులకు భారీ ఊరట కల్పించేలా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తున్నది. అదేంటంటే.. ప్రస్తుతం.. ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే.. అది గరిష్టంగా 20 సంవత్సరాల పాటు లేదా సదరు వ్యక్తికి 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగి, లైసెన్స్‌ను ప్రతి ఐదు లేదా పదేళ్లకు ఒకసారి రీన్యూవల్ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికి.. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్రం సరికొత్త యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే డ్రైవింగ్ లైసెన్స్ గడువును ఏకంగా వాహనదారుడికి 50 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు పొడిగించేలా మార్పు తీసుకురావాలని భావిస్తోంది. అంటే మీరు చిన్న వయసులోనే లైసెన్స్ పొందితే, 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఎలాంటి రీన్యూవల్ టెన్షన్స్ లేకుండా నిశ్చింతగా వాహనాలను నడుపుకోవచ్చన్నమాట. ఈ నయా ప్రతిపాదన వెనుక కేవలం గడువు పెంపు మాత్రమే కాదు.. రవాణా శాఖకు సంబంధించిన అనేక సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే బలమైన సంకల్పం కూడా ఉంది. ఇకపై వాహనాల యాజమాన్య బదిలీ ప్రక్రియతో పాటు వివిధ రకాల పర్మిట్ల పునరుద్ధరణ (Permit Renewal) పనులను వంద శాతం ఆన్‌లైన్ విధానంలోనే పూర్తి చేసేలా సరికొత్త వ్యవస్థను డిజైన్ చేస్తున్నారు. దీనివల్ల వాహనదారులు చిన్న చిన్న పనుల కోసం కూడా ప్రాంతీయ రవాణా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

Publish Date: Jun 9, 2026 5:59PM

political-news-img

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయలక్ష్మి ఆత్మహత్య కేసు.. మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన అత్తమామలు

చర్లపల్లి, ఘట్‌కేసర్ రైల్వే మార్గంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా విజయలక్ష్మి అత్తమామలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. మృతురాలి అత్తమామలు భగవంత్ రెడ్డి, సులోచన దంపతులు కమిషన్‌కు ఫిర్యాదు చేస్తూ తమకు, తమ కుమారుడు సురేందర్ రెడ్డికి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 31న తమ కోడలు విజయలక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. తమ కుమారుడు కష్టపడి సంపాదించిన ఆస్తులపై కోడలు తరఫు బంధువుల కన్నుపడిందని ఆరోపించారు. తమ ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు సుమారు రూ.1.5 కోట్ల నగదు, పలు స్థలాలకు సంబంధించిన పత్రాలను కోడలు బంధువులు తీసుకెళ్లారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి గురించి ప్రశ్నించగా ఓ రౌడీషీటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని, డీసీపీని కలిసి వినతి పత్రం అందజేసినా పరిస్థితిలో మార్పు లేదని వృద్ధ దంపతులు తెలిపారు. దీంతో చివరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్లు వెల్లడించారు. తమను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, తమకు తక్షణ రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కమిషన్‌ను కోరారు. ఈ మేరకు వారి ఫిర్యాదును మానవ హక్కుల కమిషన్ స్వీకరించినట్లు సమాచారం.

Publish Date: Jun 9, 2026 5:35PM

political-news-img

ట్రినిడాడ్ సింహం, హిందూ నాయకుడు.. భదాసే సగన్ మరాజ్

కరీబియన్ దేశం ట్రినిడాడ్‌లో 2022లో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి . ఈ ఘటనతో అక్కడ నివసిస్తున్న హిందూ సంఘాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితి కరేబియన్ దేశాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. వలసవాద ట్రినిడాడ్‌లో హిందువుల అణచివేతను సమర్ధంగా ఎదుర్కొన్ని నిలబడ్డారు భదాసే సగన్ మరాజ్. అణచివేతకు గురవుతున్న హిందూ వలస వాదులకు ఆయన అండగా నిలవడంతో అక్కడి పెత్తందారులు అతనికి భయపడ్డారు. భదాసె పుట్టే నాటికి 1800ల మధ్యలో, బ్రిటిష్ సామ్రాజ్యం బానిసత్వాన్ని రద్దు చేసిన తర్వాత కూడా, కరేబియన్ దేశాల్లోని చక్కెర తోటల కోసం అక్కడకు వలస వచ్చిన వారికి శ్రమశక్తి అవసరమైంది. దాంతో భారతీయులను ముఖ్యంగా ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌గా పిలవబడుతున్న భోజ్పురి మాట్లాడే ప్రాంతాల వారిని అక్కడకి తరలించి పనుల్లో నియమించుకున్నారు. వారిని ఓడల్లోకి ఎక్కించి, వేల మైళ్ల దూరంలోకి తీసుకువెళ్లారు. తరతరాలుగా, ఆ సమాజం ప్రార్థనలు, పండుగలు, కథల మీద ఆధారపడి, కఠినమైన పరిస్థితులలో భాష మరియు ఆచారాల శకలాలను కాపాడుకుంటూ మనుగడ సాగించింది. భదాసే పుట్టేనాటికి, ట్రినిడాడ్లోని హిందూ సమాజం ఒక శతాబ్దపు ఒప్పంద బానిసత్వాన్ని తట్టుకుని నిలబడింది. కానీ అభివృద్ధి చెందలేదు. వారికి పాఠశాలల ప్రవేశం దాదాపుగా లేదు, అర్థవంతమైన చట్టపరమైన రక్షణలు లేవు, రాజకీయ ఉనికి అసలే లేదు. గ్రామ విషాదం నుండి పారిశ్రామిక మేధస్సు వరకు భదాసే 1920 ఫిబ్రవరి 29న ట్రినిడాడ్ చక్కెర పరిశ్రమకు కేంద్రమైన కరోని గ్రామంలో జన్మించారు. అతని తండ్రి, మాథ్యూ మహారాజ్, గ్రామ పెద్ద, కర్రసాములో ఆరితేరినవాడు. అతని అధికారం ఎంత స్పష్టంగా ఉండేదంటే.. స్థానిక నియమాలను సమర్థవంతంగా రూపొందించి, అమలు చేసేవాడు కూడా అతనే. ఆ బలప్రదర్శన అతన్ని కాపాడలేకపోయింది. 1933లో, భదాసేకు కేవలం పదమూడేళ్ల వయసు ఉన్నప్పుడు, అతని తండ్రి ఇంటి వాకిలి కింద ఉయ్యాలలో పడుకుని భగవద్గీత చదువుతుండగా, ఒక ముఠా వచ్చి అతన్ని చంపేసింది. ఆ తర్వాత కొద్దికాలానికే, వారు భదాసే మామను ఒక రాయికి కట్టి, కరోని నదిలో ముంచి హత్య చేశారు. పారిపోవాల్సి రావడంతో, ఆ బాలుడు తన అమ్మమ్మ దగ్గరికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సంవత్సరాలలో, అతను కుస్తీ నేర్చుకుని, ఇరవై ఏళ్ల వయస్సుకే ట్రినిడాడ్లోనే అత్యుత్తమ కుస్తీవీరులలో ఒకడిగా ఎదిగాడు. అతను తన తండ్రి మరణంతో కుంగి పోలేదు. వల్ల కలిగిన దుఃఖంలో మునిగిపోలేదు. ఆ చిన్ననాటి హింసే ఒక చీకటి నేపథ్యంగా మారి, హిందూ కరేబియన్ చరిత్రలోనే ఒక ఇతివృత్తంగా మారింది. 1940ల ప్రారంభంలో, రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని పునర్నిర్మిస్తున్నప్పుడు, భదాసే కరోని నది నుండి ఇసుక తవ్వడం ప్రారంభించి, ఒక ట్రక్కు కొని, ఒక చిన్న రవాణా వ్యాపారాన్ని నిర్మించాడు. వలసరాజ్యమైన ట్రినిడాడ్‌లో వస్తువులు ఎలా రవాణా చేస్తారో, ఒప్పందాలు ఎలా కుదుర్చుకుని డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకున్నాడు. యునైటెడ్ స్టేట్స్ సైన్యం వచ్చి చగురమాస్‌లో ఒక భారీ నావికా స్థావరాన్ని నిర్మించినప్పుడు, కాంట్రాక్టర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అప్పుడే భదాసే సంస్థ ట్రినిడాడ్లోని అతిపెద్ద సంస్థలలో ఒకటిగా ఎదిగింది. యుద్ధం ముగిసి, అమెరికన్లు తమ స్థావరాలను ఖాళీ చేసేటప్పుడు, భూదాసె అక్కడి విశాలమైన భూభాగాలను మరియు భారీ పరిమాణంలో మిగులు సరుకులను ముందు చూపుతో తక్కువ ధరలకే కొనుగోలు చేసి తన వ్యాపారాన్ని విస్తరించి, 30 ఏళ్లకే కోటీశ్వరుడయ్యాడు. 1950వ దశకానికి ముందు, ట్రినిడాడ్లోని హిందూ సమాజం ఒకే ఐక్య కూటమిగా లేదు. ఆ పరిస్థితి వలస రాజ్యానికి బాగా ఉపయోగపడింది. అదే సమయంలో, క్రైస్తవ మిషనరీలు ఆ ద్వీపమంతటా పాఠశాలలను స్థాపించాయి. 1952లో, భదాసే ప్రధాన హిందూ సంస్థలను ఒకే సంస్థగా విలీనం కావడానికి ఒప్పించారు. అదే సనాతన ధర్మ మహా సభ. పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన మహా సభ, ట్రినిడాడ్ హిందువులకు ఒక కేంద్రీకృత మత అధికార సంస్థగా మారింది. భూదాసే దాని మొదటి అధ్యక్షుడిగా ఎన్నికై, మరణించే వరకు ఆ పదవిలో కొనసాగారు. హిందూ సమాజానికి ఇంతకు ముందు ఎన్నడూ లేని ధైర్యం ఇచ్చి, ప్రభుత్వాన్ని కేవలం వేడుకోవడం కాకుండా, చర్చలతో సమస్యలు పరిష్కరించే స్థాయికి తీసుకెళ్లారు. 1952లో మహా సభ తన సొంత పాఠశాలలను నిర్మించి, నిర్వహించడానికి అనుమతి పొందిన తర్వాత, భదాసే దూకుడుగా వ్యవహరించారు. 1952 - 1956 మధ్య, మహా సభ ట్రినిడాడ్ అంతటా ముప్పై ఒక్క ప్రాథమిక పాఠశాలలను నిర్మించింది. వాటిలో చాలా వరకు ఆయన విరాళంగా ఇచ్చిన భూమిలో నిర్మించారు. అందుబాటులో ఉన్న సామాగ్రితోనే ఆ భవనాలు త్వరగా నిర్మించారు. పట్టణ ఉన్నత వర్గాలు, వలస అధికారులు ఆ కట్టడాలను చూసి నవ్వారు. వారు వాటిని "గోశాలలు" అని పిలిచారు. అసలు చదువుకోకపోవడం కంటే గోశాలలో చదువుకోవడం ఒక బిడ్డకు మేలు. ఆ ఒక్క వాక్యమే ఆయన మొత్తం దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఆయన వలసవాదుల దృష్టిని ఆకట్టుకోవడానికి సంస్థలను నిర్మించలేదు. తరతరాలుగా విలువ లేకుండా బతికిన చెరకు పండించే ప్రాంతంలోని పిల్లల కోసం ఆయన వాటిని నిర్మించారు. అలాగే హిందూ వివాహాలకు చట్టపరమైన గుర్తింపును సాధించే ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించి విజయం సాధించారు. తద్వారా హిందూ కుటుంబ జీవితానికి, క్రైస్తవ వివాహాలతో సమానమైన హోదా ఉండాలని ప్రభుత్వం అంగీకరించేలా ఒత్తిడి చేశారు. తమ వారికి దహన సంస్కారాలు చేయాలనుకున్న అనేక హిందూ కుటుంబాలు, శశ్మాన వాటికలు లేకపోవడంతో చెత్తకుండీల వద్ద ఆ పని చేయవలసి వచ్చేది. భదాసే ఈ అవమానాన్ని కూడా సవాలుగా తీసుకుని విజయం సాధించారు. హిందూ అంత్యక్రియలను కనీస గౌరవంతో చూసేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. శాసనసభలో హిందువులకు గొంతు లేకపోతే, వలస ప్రభుత్వం వారిని ఎప్పటికైనా అణగదొక్కుతుందని, భూదాసే 1950లోనే ట్రినిడాడ్ శాసన మండలిలో స్వతంత్ర అభ్యర్థిగా సీటు గెలుచుకున్నారు. 1953 నాటికిసొంత రాజకీయ పార్టీని స్థాపించి, హిందూ సమాజం, చెరకు కార్మికుల గొంతు మార్మోగేలా చేశారు. 1957 నాటికి, ఆఠయన డెమోక్రటిక్ లేబర్ పార్టీ అనే కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1958 ఫెడరల్ ఎన్నికలలో, ఆ సంకీర్ణ కూటమి అధికార పార్టీని ఆరు సీట్లకు నాలుగు సీట్ల తేడాతో ఓడించడం ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత మైలురాయి. తర్వాత ట్రినిడాడ్ స్వాతంత్ర్యం వైపు సాగుతున్న అత్యంత కీలకమైన సమయంలో భదాసే అనారోగ్యంతో మంచానికే పరిమితమవ్వడం, రాజకీయ శూన్యతను సృష్టించింది. ఆయన పార్టీ చీలిపోయింది. ఆ క్రమంలో యూఎస్, యూకేల్లో చికిత్స పొంది కోలుకున్న భూదాసే హిందూ మహాసభకు, కార్మిక సంఘానికి నాయకత్వం వహించడానికి తిరిగి వచ్చారు. కానీ ఇండో ట్రినిడాడియన్లు స్వతంత్ర్య దేశాన్ని నిర్దేశించే అవకాశం అప్పటికే చేజారింది. భదాసే 21 అక్టోబర్ 1971 అక్టోబర్ 21న 51 ఏళ్ల వయస్సులో మరణించారు. ఆయన కథ జాతీయ అధికారాన్ని చేజిక్కించుకోవడంలో కొద్దిలో విఫలమైన నాయకుడిగా మిగిలింది. అయితే తర్వాతకాలంలో విమర్శకులు ఎగతాళి చేసిన ఆ గోశాల పాఠశాలలు, కరేబియన్‌లో అత్యంత గౌరవనీయమైన సంస్థలుగా మారాయి. ఆయన మరణానంతరం కూడా, ఆయన పోరాటం ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. చాలా సంవత్సరాలుగా, దేశ అత్యున్నత పురస్కారాన్ని ట్రినిటీ క్రాస్ అని పిలిచేవారు, ఈ పేరు క్రైస్తవ ప్రతీకలతో నిండి ఉంది. ఒక హిందూ పండితుడు మతపరమైన కారణాలతో ఆ పురస్కారాన్ని తిరస్కరించినప్పుడు.. ఆ తిరస్కరణ చర్య దేశవ్యాప్త చర్చకు దారితీసింది. దాంతో ఆ పురస్కారానికి ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అని పేరు మార్చారు. 1950లలో భదాసే చేసిన మునుపటి పోరాటాలు ఇప్పటికీ అక్కడి హిందూ సంఘాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త హిందూ మత నాయకుడు అయిన భదాసేను అక్కడి వారు 'బాబా' , 'ట్రినిడాడ్ సింహం' అని పిలిచేవారంటే ఆయన గొప్పదనం అర్థమవుతుంది. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 9, 2026 4:33PM

political-news-img

ప్రపంచ ఇంధన మార్కెట్‌లో భారత్ సంచలనం.. రాబోయే దశాబ్దపు వృద్ధిలో సింహభాగం ఇండియాదే!

ప్రపంచ దేశాల్లో పారిశ్రామిక, ఆర్థిక రంగాలు శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో ఇండియా అత్యంత కీలకమైన శక్తిగా అవతరిస్తోంది. వచ్చే దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగే కన్స్యూమర్ ఆయిల్ డిమాండ్‌లో దాదాపు యాభై శాతం వాటాను ఇండియా ఒక్కటే దక్కించుకోనుందని అంతర్జాతీయ ఇంధన నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా పెరుగుతున్న పట్టణీకరణ, వాహనాల వినియోగం, పారిశ్రామిక అవసరాల రీత్యా భారత్‌లో ఇంధన వినియోగం మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. ఈ పరిణామాలు గ్లోబల్ ఎనర్జీ సెక్టార్‌లో సరికొత్త మార్పులకు కారణమవుతున్నాయి. రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థ రోస్‌నెఫ్ట్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ) ఇగోర్ సెచిన్ ఇటీవల జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో భారత ఇంధన మార్కెట్ సామర్థ్యంపై కీలక విశ్లేషణ చేశారు. ఆయన అంచనాల ప్రకారం.. రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా చమురు అవసరాలు పెరగడానికి భారతదేశమే ప్రధాన చోదక శక్తిగా మారనుంది. అలాగే అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) నివేదికలను పరిశీలిస్తే, వచ్చే పదేళ్లలో దేశీయ చమురు వినియోగం దాదాపు 44 శాతం మేర వృద్ధి చెంది, రోజుకు సుమారు 8 మిలియన్ బ్యారెళ్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. రష్యా నుంచి రికార్డు స్థాయి దిగుమతులు.. మారిన వ్యూహాత్మక సమీకరణాలు గడచిన కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో.. ఇండియా తన చమురు దిగుమతుల వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు పశ్చాత్త్య దేశాలు లేదా అరబ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడిన ఇండిమా, ప్రస్తుతం రష్యా నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్‌ను సేకరిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం భారత మొత్తం ముడిచమురు దిగుమతుల్లో రష్యా వాటా రికార్డు స్థాయిలో 38 శాతానికి చేరుకుంది. ప్రారంభంలో తక్కువ ధరలకే లభించిన రష్యన్ చమురు, కాలక్రమేణా రెండు దేశాల మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి దారితీసింది. అయితే.. ఈ వ్యాపార సంబంధంలో చమురుపై చెల్లిస్తున్న ప్రీమియం ధరలు ఏకంగా 425 శాతం మేర పెరగడం గమనార్హం. ఇదివరకు డిస్కౌంట్ ఆయిల్‌గా ఉన్న సరఫరా, ఇప్పుడు ఇరు దేశాల మధ్య ప్రత్యేక మార్కెట్ ధరల పరిధిలోకి వెళ్లినట్లు స్పష్టమవుతోంది. ఇదే సమయంలో సాంప్రదాయకంగా అమెరికా నుండి జరిగే ముడిచమురు దిగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా యూఎస్ ఆయిల్ దిగుమతుల శాతం కనిష్ట స్థాయికి పడిపోవడం అంతర్జాతీయ ఇంధన రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పును సూచిస్తోంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ ఫోరమ్‌లో పుతిన్ మద్దతు.. ఆంక్షల వ్యూహం విఫలం ఇటీవల నిర్వహించిన సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ సార్వభౌమాధికారం, విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. అంతర్జాతీయంగా వివిధ దేశాలు విధిస్తున్న ఆంక్షల బెదిరింపులు భారత ఆర్థిక పురోగతిని ఏమాత్రం అడ్డుకోలేవని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ.. ఎలాంటి బాహ్య ఒత్తిళ్లనైనా తట్టుకుని నిలబడే సామర్థ్యాన్ని చాటుకుందని కొనియాడారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వబోవని, అవి తిరిగి సదరు దేశాలకే నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. రోస్‌నెఫ్ట్ అధినేత ఇగోర్ సెచిన్ సైతం ఇదే సదస్సులో భారత విద్యుత్ రంగాన్ని ప్రస్తావించారు. రాబోయే దశాబ్ద కాలంలో ప్రపంచ విద్యుత్ వినియోగ వృద్ధిలో 15 శాతం వాటాను ఇండియా కైవసం చేసుకోనుందని తెలిపారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే భారతదేశ విద్యుత్ డిమాండ్ దాదాపు 80 శాతం వృద్ధి చెంది.. సుమారు 3,000 టెరావాట్-అవర్స్ స్థాయికి చేరుకుంటుందని, ఇది ప్రస్తుత యూరోపియన్ యూనియన్ మొత్తం వినియోగానికి సమానమని వివరించారు. హోర్ముజ్ జలసంధి సంక్షోభం – అంతర్జాతీయ సరఫరా గొలుసుకు ముప్పు ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మార్గంలో ఏ విధమైన అంతరాయం ఏర్పడినా కేవలం చమురు రంగానికే కాకుండా ప్రపంచ ఆహార భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎరువుల ధరలు సుమారు 60 శాతం మేర పెరగడం గమనార్హం. చమురు మరియు ఎరువుల రవాణా నిలిచిపోతే అది ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. ఈ రకమైన అంతర్జాతీయ సరఫరా సమస్యలు తలెత్తినప్పుడు భారత్ వంటి భారీ వినియోగ దేశాలు ప్రత్యామ్నాయ వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతర్జాతీయ రవాణా స్వేచ్ఛా సూత్రాలకు భంగం వాటిల్లితే, రవాణా ఖర్చులు మరియు ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరిగిపోయి, చివరికి ఆ భారం సాధారణ వినియోగదారులపై పడే అవకాశం ఉంది. అందువల్ల వ్యూహాత్మక నిల్వలను (స్ట్రాటజిక్ రిజర్వ్స్) పెంచుకోవడం దేశానికి అత్యంత ఆవశ్యకం. ఆర్థిక వృద్ధి, పర్యావరణ లక్ష్యాల మధ్య సమతుల్యత భారతదేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి రేటుకు అనుగుణంగా ఇంధన అవసరాలు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా పర్యావరణ పరిరక్షణ, నెట్-జీరో (కార్బన్ ఉద్గారాల తగ్గింపు) లక్ష్యాలను చేరుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఒకవైపు అంతర్జాతీయ ఇంధన సంస్థల అంచనాల ప్రకారం చమురు ఆధారిత ఇంధన వినియోగం భారీగా పెరుగుతుండగా, మరోవైపు సంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర, పవన, మరియు గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భారత్ పెట్టుబడులను ముమ్మరం చేస్తోంది. రాబోయే రోజుల్లో సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూనే, పారిశ్రామిక రంగానికి అవసరమైన నిరంతర విద్యుత్ మరియు చమురు సరఫరాను అందించడం భారత ఇంధన విధాన రూపకర్తలకు ఒక పరీక్షగా మారనుంది. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు వల్ల ప్రస్తుతానికి దేశీయ మార్కెట్ స్థిరంగా ఉన్నప్పటికీ, కేవలం ఒకే వనరుపై భారీగా ఆధారపడటం సుదీర్ఘ కాలంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఏదేమైనా, రాబోయే దశాబ్ద కాలంలో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ గమనాన్ని శాసించే ప్రధాన శక్తిగా భారతదేశం నిలవబోతోందనేది జగమెరిగిన సత్యం. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 9, 2026 4:11PM

political-news-img

నాలుగు నామినేషన్లూ సక్రమమే!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం (జూన్ 9) అధికారికంగా పూర్తయింది. ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 18 న జరగబోయే ఈ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరి పత్రాలు చెల్లుబాటు కావడంతో తదుపరి ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున నలుగురు ప్రముఖ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. అదేవిధంగా, కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ కోటా కింద ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ తన నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 4 స్థానాలకు గానూ కూటమి తరఫున ఈ నలుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. దీంతొ ఈ నలుగురు అభ్యర్థుల ఎన్నిక కగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు.

Publish Date: Jun 9, 2026 3:35PM

MOVIE NEWS