Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రసకందాయంలో కులరాజకీయాలు
posted on: Aug 21, 2012 6:43PM
రాష్ట్రంలో కులరాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. వెనకబడిన వర్గాలమీద పార్టీల నేతలు ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాసినో కూసినో సీట్లు సాధించుకోవడానికి ఇదో స్టంటన్న విషయం అందరికీ తెలిసిందే.. కానీ.. నేతలు విసురుతున్న ఈ పాచిక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తోంది. ఈ విషయంలో అధికారపక్షం, విపక్షం అన్న తేడా లేదు. ఓ పక్షం నేత బీసీలకు పట్టంకడతామని ప్రకటిస్తే, మరో పక్షం నేత కేసుల్లో ఇరుక్కున్న మంత్రులను వెనకబడిన వర్గాల కార్డ్ ని అడ్డం పెట్టి వెనకేసుకొస్తున్నారు. పోటాపోటీగా వెనకబడిన వర్గాల నేతల్ని, ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు అంతా కట్టకట్టుకుని శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. నిజంగా వెనకబడిన వర్గాల మీద అంత ప్రేమే ఉంటే దిగ్గజాల్లాంటి నేతలు పోటీ చేస్తున్న స్థానాలు, పార్టీ అధ్యక్షులకు పెట్టని కోటలుగా ఉన్న స్థానాల్ని స్వచ్ఛందంగా వెనకబడిన వర్గాల అభ్యర్థులకు ఇచ్చేయొచ్చుగా..? ఎక్కడన్నా బావేగానీ వంగతోటకాడమాత్రం కాదన్నట్టుగా.. ఈ విషయం గురించి ఆలోచించాల్సివచ్చేసరికి నేతలకు మాటలు పెగలవు. న్యాయంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం కదా అని కొందరు సమాధానం చెబితే, రాబోయే రోజుల్లో దీనిగురించి ఆలోచిస్తామని మరికొందరు తెలివిగా తప్పించుకుంటారు. జనానికి అన్నీ తెలుసు. ఎవరెలాంటి వాళ్లో తెలుసు.. కానీ.. చివరికి మాత్రం నేతలు విసిరే ఇలాంటి పాచికలకు పడిపోయి చేతిలో ఉన్న “ఓటు” అనే పాశుపతాన్ని చేజేతులా చేజార్చుకుంటున్నామన్న విషయం మాత్రం ఎందుకో తోచడం లేదు. జగమే మాయ.


.png)
.png)


