మంగళగిరి నరసింహస్వామి గాలిగోపురానికి పగుళ్లు

posted on: Aug 9, 2012 11:23AM

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గాలిగోపురం కలిగిన మంగళగిరి నరసింహస్వామి ఆలయగోపుర పగుళ్లు భక్తులను కలవర పెడుతున్నాయి. శ్రీకాళహస్తి గుడి గోపురం పడిపోయినట్లు ఇది కూడా ఎప్పుడు కూలిపోతుందో అని భక్తులు ఆందోళన చెందుతున్నారు. అతి ప్రాచీనమైన ఈ గుడి గాలిగోపురం 11 అంతస్తులను కలిగివుంది. గోపురం పగుళ్లపై నివేదిక సమర్పించడానికి గాను పలుదఫాలగా దీనిపై అనేక కమిటీలను దేవదాయ శాఖ నియమించింది. మొదటిసారిగా 2010 లో దేవాదాయశాఖ ఆద్వర్యంలో కమిటి పరిశీలన జరిపింది. అయితే పురావస్తు శాఖ చొరవతో చెన్నై ఐఐటి నిపుణులు పరిశీలించి గాలిగోపురం పునాదులు లోతుగా లేనందువల్లనే ఇలా జరిగిందని నిర్దారించింది. అత్యాధునిక పద్దతులతో ఆలయ గాలిగోపురం మరమ్మత్తుల చేయవచ్చని తెలిసింది. అత్యంత ప్రజదరణకలిగిన ఈ ఆలయ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. పానకాల స్వామిగా ప్రసిద్దిచెందిన ఈ ఆలయం భక్తులకు కొంగు బంగారంమై పదికాలాల పాటు విలసిల్లాలని భక్తులు కోరుచున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...