Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీఆర్ఎస్ లోకి వైకాపా నేతలు?
posted on: Aug 3, 2014 8:29PM
.jpg)
ఆదివారం టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు ఇంటిలో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల వ్యూహరచన సమావేశంలో వైఎస్ జగన్ కు సన్నిహితులుగా పేరుపడిన నేతలు గట్టు రాంచందర్ రావు, జనక్ ప్రసాద్ లు కనిపించడం రాజకీయ పార్టీలలో కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా కనుమరుగయిన వీరు టీఆర్ఎస్ సమావేశంలో ఉండడం చూస్తే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు వీరు ముగ్గురు పార్టీ మారే అవకాశం ఉందా.లేక వ్యక్తిగత సంబంధాల రీత్యా విందుకు వెళ్లారా అన్నది చర్చనీయాంశమే అయినా, ఎక్కువ అవకాశం వారు టిఆర్ఎస్ కు దగ్గరవడానికే అవకాశం ఉంటుంది. వీరు ముగ్గురు కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ తో ప్రత్యేకంగా భేటీ అవడం సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంటుంది.






