చంద్రబాబు సమావేశం వద్ద విద్యార్దుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్న హోటల్ వద్ద విద్యార్ధులు ఆందోళనకు దిగారు. 13 జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం బాబు ఈ రోజు గేట్ వే హోటల్ లో సదస్సు నిర్వహిస్తున్నారు. అక్కడకు చేరుకున్న విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, దీనిపై సమగ్రంగా చర్చించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో హోటల్ గేట్ ఎదుట బైఠాయించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వీరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.