Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అర్ధగంట గడువివ్వండి ప్లీజ్
posted on: Jan 27, 2013 10:55AM
.jpg)
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను దిక్కరిస్తూ ముందుకు సాగాలని నిర్ణయించడంతో జంట నగరాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రవేసించబోయిన తెలంగాణా జేయేసీ నేత స్వామీ గౌడ్ ను, తెరాస నేత కే.తారక రామారావును, రాజ్ భవన్ వైపు ర్యాలీగా బయలుదేరిన ఉస్మానియా విద్యార్దులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారి అరెస్టులకు నిరసనగా తెలంగాణా జేయేసీ చైర్ మ్యాన్ ప్రొఫెసర్ కోదండరాం తదితరులు తమ కార్యాలయం బయటనే ధర్నాకు కూర్చొని, మిగిలిన నేతలు మరికొందరు రాగానే ఇందిరా పార్క్ కు ర్యాలీగా బయలుదేరుతామని ప్రకటించడంతో హోం శాఖ అప్రమత్తమయింది. కొద్ది సేపటి క్రితం హోం మంత్రి సబితా ఇంద్ర రెడ్డి స్వయంగా విధాన సభ్యుడు చుక్కా రామయ్యకు ఫోన్ చేసి ఒక అర్ధ గంటలో ప్రభుత్వ నిర్ణయం తెలుపుతామని చెపుతూ అంతవరకు వారిని ఇందిరా పార్క్ వైపు వెళ్ళకుండా ఆపమని సూచించారు.


.jpg)
.jpg)


