ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలకు అంకితం: యువీ
posted on Dec 21, 2012 4:12PM
ఇంగ్లాండ్ తో ట్వంటీ20 మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో యువరాజ్ సింగ్ అదరగొట్టాడు. తనకు వచ్చిన 'మాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డు ను ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలకు అకింతం చేశాడు. ఢిల్లీలో మెడికో పై జరిగిన గ్యాంగ్ రేప్ తనను ఎంతో కలచివేసిందని అన్నాడు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని దేవుడుని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు యువీ చెప్పాడు.
CLICK HERE FOR india vs england t20 PHOTOS
యువరాజ్ ఆటపై ధోని ప్రశంసల జల్లు కురిపించారు. ఇంగ్లాండ్ తో ట్వంటీ20 మ్యాచ్ లో యువరాజ్ అద్బుతంగా ఆడాడని అన్నాడు. మ్యాచ్ మొదట్లో ఇంగ్లాండ్ దూకుడు చూసి కొద్దిగా ఆందోళన చెందానని, తమ బౌలర్లు కట్టడి చేయగలిగారని అన్నాడు. మొదట్లో అశ్విన్ బాగా బౌలింగ్ చేశాడని అన్నాడు.తాము తగినన్ని పరుగులు చేయకపోవడమే ఓటమి కారణమని ఇంగ్లాండు కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ అన్నాడు.