వైసీపీ ఎమ్మేల్యేల టీడీపీ ఎంట్రీకి బ్రేక్.. మూఢం, మూహూర్తాలు లేవట..

 

వైసీపీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి ఏపీ అధికారపార్టీ టీడీపీలో చేరుతున్న సంగతి తెలసిందే. అయితే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు ఏదో నామ్ కే వాస్త్ పార్టీ మారడంలేదట. ముహూర్తలు చూసుకొనిమరీ పార్టీ మారుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ చేరిన నేతలు కూడా దాదాపు అలా ముహూర్తాలు చూసుకొని చేరినవారే ఉన్నారంట. తమ తమ పేరు బలాలకు సంబంధించి మంచి మంచి జ్యోతిష పండితులతో సుముహూర్తాలు పెట్టించుకుని సీఎం చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కేస్తున్నారు. అంతేకాదు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నా ఇప్పుడప్పుడే వారు చేరే పరిస్థితి కనిపించడంలేదట. ఎందుకంటే.. ప్రస్తుతం మూఢం అని.. మంచి మూహూర్తాలు లేవనే మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరాలంటే కొంత సమయం ఆగాల్సిందే అని చెబుతున్నారు జ్యోతిష్యులు. మూఢం పూర్తైన వెంటనే వైసీపీకి చెందిన మరికొంత మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కడం ఖాయం అంటున్నారు. మొత్తానికి సినిమా వాళ్లేకాదు రాజకీయ నాయకులు కూడా ముహూర్తాలను, జ్యోతిష్యాలను నమ్మే పరిస్థితి వచ్చింది.