Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రజాస్వామ్యమా? రాక్షస పాలనా?
posted on: May 15, 2015 4:46PM

ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం 166 జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విశ్వరూప్ మాట్లాడుతూ భూసేకరణ బిల్లుకు తాము వ్యతిరేకమని, కేంద్ర ప్రభుత్వమే చట్టం చేయని ఆర్డినెన్స్ ను రాష్ట్రంలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. నూతన రాజధాని నిర్మాణం కోసం రైతులే స్వయంగా భూములు ఇస్తున్నారని చెప్పిన రైతులు ఇప్పుడు భూసేకరణ ద్వారా ఎందుకు భూములు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం చేయడానికే ఈ భూసేకరణ జీవో తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ జీవోను అడ్డుపెట్టుకొని రైతుల భూములను ప్రభుత్వం లాక్కుంటుందని, ఇది ప్రజాస్వామ్యమా? రాక్షస పాలనా? అని ప్రశ్నించారు. సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఎంవోయూను ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ బయటపెట్టడం లేదని విశ్వరూప్ విమర్శించారు.






