Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మైసూరా పై జగన్ స్పందన.. ఆయన్ని చూసి ఆరు నెలలైంది
posted on: Apr 27, 2016 5:23PM

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీ మైసూరా రెడ్డి పార్టీ రాజీనామా చేసిన నేపథ్యంలో స్పందించారు. మైసూరా రెడ్డి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసేదేంటి.. ఆయన ఎప్పటి నుండో పార్టీకి దూరంగా ఉంటున్నారు.. మైసూరా రెడ్డిని చూసి ఆరు నెలలు అవుతోందని విమర్శించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియా సమావేశంతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలపై అరుణ్జైట్లీకి వివరించానని జగన్ అన్నారు. చంద్రబాబు అవినీతిపై అరుణ్ జైట్లీకి వివరించానని ఈ విషయమై చంద్రబాబుపై విచారణ జరిపించాలని విన్నవించానని.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై రాసిన ఓ పుస్తకాన్ని కేంద్రమంత్రి అరుణ్జైట్లీకి అందజేశానని చెప్పారు.






