చంద్రబాబుపై మండిపడుతున్న వైఎస్సార్సీపీ

posted on: Apr 2, 2013 12:23PM

YSRCP Fire On Chandrababu Naidu, YSRCP Leaders Comments On Chandrababu Naidu, YSRCP Leaders Against Chandrababu Comments

 

చంద్రబాబు కాకినాడలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. దీక్ష అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విద్యుత్ వ్యవస్థ నష్టాల బాటలో పయనించడానికి వై.ఎస్. ప్రభుత్వం, రోశయ్య ప్రభుత్వం, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపుకు చంద్రబాబే కారణమని, తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు పాల్గొనివుంటే ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెంపు పాడేది కాదని, పేదలకు అండగా ఉండేందుకే వై.ఎస్. విజయమ్మ దీక్ష చేపట్టారని, రైతులకు నిబంధనలు లేకుండా ఉచిత విద్యుత్ ఇవ్వాలని, విద్యుత్ ఛార్జీల పంపు వెంటనే నిలిపివేయాలని, ప్రభుత్వం ఛార్జీలు తగ్గించేవరకూ తమ దీక్షలు ఆగవని చంద్రబాబుపై మండిపడుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...