వైసీపీ నేతల సహకారంతోనే హత్య చేశాం...

 

గుంటూరు జిల్లా మాచవరం మండలం వేమవరం సర్పంచ్ పాశం శ్రీనివాసరావు హత్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేయగా..వారు కీలక విషయాలను వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం... వైసీపీ నేతల ప్రోద్బలంతోనే వారు ఈ హత్యకు పాల్పడ్డారు. స్థానిక ఎంపీటీసీ చంద్రం తమను మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి వద్దకు తీసుకెళ్లాడని చెప్పారు. కృష్ణారెడ్డి సూచనతో వ్రీనివాసరావును హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేశామని తెలిపారు.