పైనుంచి వైఎస్ చూస్తున్నార్ట...
posted on: Sep 1, 2014 12:27PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్నీ తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరలోకం నుంచి చూస్తూనే వున్నారని వైసీపీ నాయకుడు జగన్మోహన్రెడ్డి అంటున్నారు. వైఎస్సార్ మరణించి ఐదేళ్ళు అవుతున్నా, ఇప్పటికీ ప్రతి విషయాన్నీ ఆయన పేరుకు ఆపాదించడం టీడీపీకి మామూలైపోయిందని బాధపడుతున్నారు. అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎన్నికల్లో పట్టుబడిన మద్యం, నమోదు చేసిన కేసులపై టీడీపీ సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ పేరును ప్రస్తావించారు. జగన్ దీనికి తీవ్ర అభ్యంతరం తెలుపుతూ పై విధంగా వ్యాఖ్యానించారు.






