మరొకరిని మింగేసిన జగన్ పార్టీ మద్యం

posted on: May 6, 2014 11:52AM

 

ఎన్నికల సందర్భంగా జగన్ పార్టీ విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తోంది. అడిగిన వారికి, అడగని వారికి నోళ్ళు తెరిచి మరీ మద్యం పోసేస్తోంది. అయితే జగన్ పార్టీ పోస్తున్న కల్తీ మద్యం కారణంగా ఇప్పటికి నలుగురు వ్యక్తులు చనిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరో వ్యక్తిని జగన్ పార్టీ మద్యం మింగేసింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గురజాలలో జగన్ పార్టీ పంపిణీ చేసిన మద్యం తాగి సుభానీ అనే వ్యక్తి మరణించాడు. జగన్ పార్టీ పంపిణీ చేసిన మద్యం కారణంగానే సుభానీ మరణం సంభవించిందని గురజాల గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...