ఉస్మానియా టు నిమ్స్
posted on: Aug 31, 2013 8:00AM

సమన్యాయం కోసమంటూ జైళ్లో దీక్ష చేపట్టిన జగన్ను అనారొగ్య కారణాలతో ఉస్మానియాకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో కూడా ఎటువంటి వైద్యం తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తున్న జగన్ ఆరోగ్యం మరింత క్షీనించింది. దీంతో జగన్ను శుక్రవారం అర్ధరాత్రి నిమ్స్కు తరలించారు.
వైయస్ఆర్ సిపి నాయకులతో పాటు, విజయమ్మ పలువురు ప్రజాసంఘాల వారు జగన్ను దీక్ష విరమించాల్సిందిగా కోరినా ఆయన మాత్రం దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. నిమ్స్కు తరిలించిన తరువాత కూడా ఆయన ఎటువంటి వైద్యం సహాయం తీసుకోలేదు.







