ఏంటీ...జగన్ దీక్షలు ఫ్యాషన్ షోల్లాగా ఉన్నాయా?


 

 

నిజమే ఇప్పుడు దీక్షలు చేయడం కూడా ఒక ట్రెండ్ లా, ప్యాషన్ లాగా మారిపోయాయి.గతంలో దీక్ష అంటే అదో పెద్ద సంచలన వార్త అయ్యేది,ఇప్పుడు చీటికీమాటికీ, ఎవరుపడితే వాళ్లు...దీక్షలు అంటుంటే...అటు ప్రజలు, ఇటు మీడియా ఇద్దరూ పట్టించుకోవడం మానేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే...దీక్షలను తనకు పేటెంట్ గా మార్చేసుకున్నారేమోనని అనిపిస్తుంది. జలదీక్ష, ఫీజు దీక్ష, రైతుదీక్ష...ఇలా అనేక రకాల దీక్షలు చేసిన జగన్...ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా మరో దీక్షకు పూనుకున్నారు. అయితే జగన్ దీక్షలు...ఫ్యాషన్ షోలను తలపిస్తున్నాయంటూ మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ విచిత్రమైన కామెంట్ చేశారు.జగన్ దీక్షల్లో కసి లేదని, ప్రజలను మభ్యపెట్టడానికే నాటకాలాడుతున్నారని కారెం ఆరోపించారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటే...ఏ పార్టీకి పుట్టగతులుండవంటూ హెచ్చరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu