ఆక్రమాస్తుల కేసులో జగన్‌కు షాక్

posted on: Aug 13, 2015 6:40PM

 

అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడప జగన్మోహన్ రెడ్డికి మరోసారి షాక్ తగిలింది. జగన్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి జఫ్తు చేసింది. అనంతపురం జిల్లాలో పెన్నా గ్రూపుకు చెందిన 231 ఎకరాల భూమిని.. హైదరాబాదులోని హోటల్‌ను కూడా తాత్కాలికంగా జఫ్తు చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ ఈ కేసులో రూ.7.85 కోట్ల ఆస్తులను జఫ్తు చేసింది. కాగా జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి గతంలోనే ఈడీ ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరగకుండా చూడాలని.. జప్తుకు ఆదేశించిన 250 ఎకరాలపై చర్యలు తీసుకోవాలని ఈడి... రంగారెడ్డి జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులకు దాదాపు నెల రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...