జగన్ కు మరో సాకు దొరికింది

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇంకో సాకు దొరికింది. ఎప్పుడు తెదేపాను విమర్శిద్దామా అని చూసే జగన్ కు మొన్నటి వరకూ నోటుకు ఓటు కేసు గురించి తెగ హంగామా చేసి.. కేసీఆర్ కు మద్దతు పలకడంతో ఆంధ్రా నుండి వ్యతిరేకత రావడంతో అక్కడ తన ఉనికి తగ్గిపోతుందని భయపడి కొంచెం హడావిడి తగ్గించారు. తరువాత ఢిల్లీ ప్రయాణాలు, టూర్ లకు వెళ్లి తిరిగి వచ్చిన జగన్ ఏలా తెదేపా ను విమర్శించాలా అని బాగా ఆలోచించినట్టున్నారు. అందుకే ఇప్పుడు సడెన్ గా ధవళేశ్వరం లో జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుతున్నారు. ధవళేశ్వరం ప్రమాదం జరిగిన కుంటుంబాలను పరామర్శించడానికి ఇప్పటి వరకూ చంద్రబాబు రాలేదని విమర్శించారు. అయినా ఏదో ఒక కారణంగా టీడీపీ ని విమర్శించాలని చూడటమే తప్ప అదే సహాయం జగన్ కూడా చేయోచ్చు కదా. బాధితుల కుంటుంబాలను తను పరామర్శించ వచ్చు కదా అని తెదేపా నేతలు అనుకుంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu