బీజేపీకి ఎన్నం శ్రీనివాస్ గుడ్ బై

posted on: Nov 23, 2015 10:12AM

 

బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ఇవ్వాళ్ళ బీజేపీని వీడబోతున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణాలోని మహబూబ్ నగర్ నియోజక వర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుండి తనను తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పక్కనపెట్టి పార్టీలో కొత్తగా చేరినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆవేదన వక్తం చేస్తున్నారు. అందుకే అయన గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయినా పార్టీలో ఎవరూ ఆయనను బుజ్జగించలేదు కనీసం పట్టించుకోకపోవడంతో ఇవ్వాళ పార్టీకి రాజీనామా చేయాలనీ నిశ్చయించుకొన్నారు. బీజేపీకి రాజీనామా చేసి తెరాసలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...