సిద్దరామయ్య పై యడ్యూరప్ప ఆగ్రహం..

posted on: Mar 27, 2017 11:01AM


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అనవసర ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. నంజనగూరు నియోజకవర్గంలో బదనవాళు గ్రామంలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌ ప్రసాద్‌కు మద్దతుగా యడ్యూరప్ప ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపైన ఉన్న కేసులను కోర్టులు కొట్టివేసి.. నిర్దోషిని అని కోర్టులు తీర్పులిచ్చినా కూడా సిద్ధరామయ్య తనను జైలుకు పోయివచ్చాడని, కేసులున్నాయని అని బహిరంగ సమావేశాల్లో పదేపదే ఆరోపణలు చేస్తున్నారని.. ఇలాగే మాట్లాడితే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. అంతేకాదు దేశంలోనే ఆయన అత్యంత అవినీతిపరుడైన నాయకుడని వ్యాఖ్యానించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...