రాజ్యసభకు విజయసాయిరెడ్డి నామినేషన్..!
posted on: May 26, 2016 10:35AM

ఏపీనుండి రాజ్యసభకు నాలుగు సీట్లుకు భర్తీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సీట్లలో.. టీడీపీకి మూడు సీట్లు దక్కగా.. వైసీపీకి ఒక సీటు దక్కనుంది. దీనిలో భాగంగానే.. వైసీపీ పార్టీ నుండి విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను వెంటబెట్టుకొని అసెంబ్లీలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే విజయసాయిరెడ్డి పేరు దాదాపు ఖరారైన.. అధికారికంగా ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. ప్రకటన చేసిన వెంటనే సాయిరెడ్డి వెంటనే నామినేషన్ దాఖలు చేస్తారు.




.jpg)


