చంద్రబాబును లేడీ సెంటిమెంట్ తో కొట్టిన రోజా
posted on Sep 22, 2015 6:37PM

ఫైర్ బ్రాండ్ రోజా...మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడింది, ఈసారి లేడీ సెంటిమెంట్ ను ప్రయోగించి సీఎంను కార్నర్ చేసేందుకు ప్రయత్నించింది. మహిళలపై తరుచుగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆమె... చంద్రబాబుకు ఆడపిల్లలు లేనందునే పట్టించుకోవడం లేదని విమర్శించారు, ఆడవాళ్ల విలువ ఏంటో ఆయనకు తెలుసుంటే...నాగార్జున యూనివర్సిటీ విద్యార్ధిని రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిపై సరైన చర్యలు తీసుకునేవారని, రిషితేశ్వరి విషయంలో ప్రభుత్వం సరిగా స్పందించి ఉంటే, ఇప్పుడు విజయవాలో విద్యార్ధిని భానుప్రీతి ఆత్మహత్య చేసుకునేది కాదని రోజా ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడి విషయంలోనూ చంద్రబాబు ఇలాగే ప్రవర్తించారన్న రోజా... చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించారు. కనీసం ఇప్పటికైనా విద్యార్ధినుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు