అనంత వైసీపీలో మిగిలింది ఒక్క వైసీపీ ఎమ్మెల్యేనే..!

 

వైసీపీ ఎమ్మెల్యేలు ఒకొకరిగా టీడీపీలోకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది ఎమ్మెల్యేలు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై టీడీపీలోకి చేరారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే టీడీపీలోకి చేరుతున్నట్టు తెలుస్తోంది. దీంతో అనంత వైసీపీలో ఇక మిగిలింది ఒక్క ఎమ్మెల్యే అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుండి రెండు నియోజకవర్గాలైన ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డితో పాటు కదిరిలో చాంద్ బాషా నుండి వైసీపీ విజయం సాధించింది. అయితే వీరిద్దరిలో చాంద్ బాషా ఇప్పుడు వైసీపీకి షాక్ ఇవ్వనున్నాడు. టీడీపీ ఆకర్ష్ కు తలొగ్గిన చాంద్ బాషా పార్టీ మారేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరనున్నారు. మరోవైపు చాంద్ బాషాను బుజ్జగించడానికి వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు ప్రయత్నించినా ప్రయత్నాలు ఫలించలేదు. కాగా చాంద్ బాషా 2014 వరకూ టీడీపీలోనే కొనసాగారు. అనంతరం ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మరి ఆ ఒక్క ఎమ్మెల్యే అయినా మిగులుతాడో లేదో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu