గవర్నర్ ని కలిసిన జగన్..బాక్సైట్ తవ్వకాలపై ఫిర్యాదు..

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి..ఆపార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు గవర్నర్ నరసింహన్ కలిశారు. బాక్సైట్ తవ్వకాలు..కాల్ మనీ దందాపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..బాక్సైట్ తవ్వకాలతో గిరిజనులు నష్టపోతారని అన్నారు.అంతేకాదు ప్రభుత్వం కావాలనే ట్రైబుల్ అథారిటీ కమిటీ వేయడంలేదు..ఏడుగురిలో ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టే కమిటీ వేయడం లేదని అన్నారు.బాక్సైట్ తవ్వకాలపై మాట్లాడినందుకు గిరిజన ఎమ్మెల్యేపై కేసు పెట్టారు..వారు పెట్టిన కేసులు చెల్లవు అని మండిపడ్డారు.అంతేకాదు విజయవాడ, గుంటూరును మాఫియాకు అడ్డాగా మార్చారు అని విమర్సించారు.