దళిత మహిళలపై కారు దూకించిన గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి

posted on: May 13, 2024 2:01PM

గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామంలోని పోలింగ్ స్టేషన్‌ని పరిశీలించేందుకు కిలారు రోశయ్య  వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడేందుకు స్థానిక మహిళలు ప్రయత్నించారు. దాంతో ఆవేశపడిపోయిన రోశయ్య కారుతో మహిళల మీదకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. మహిళల మీద దాడి చేయాలంటూ తన అనుచరులను ఆదేశించారు. దాంతో స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...