యశోచోప్రా కన్నుమూత

posted on: Oct 22, 2012 12:48PM

Yash chopra died, yash chopra dead, yash chopra death, yash chopra dies, yash chopra no more, yash chopra passed away

 

రొమాన్స్ చిత్రాల రారాజు యశ్ చోప్రా కన్నుమూశారు. హిందీ సినిమాల్లో ప్రేమభావాల్ని పండిచడంలో మాస్టల్ అని ఈయనకు పేరుంది. జబ్ తక్ హై జాన్.. యశ్ చివరి చిత్రం.. ఎనభై ఏళ్ల చోప్రా, డెంగీ జ్వరం కారణంగా మరణించారు. ఈ నెల 13న లీలావతి ఆసుపత్రిలో చేరిన ఆయన చివరికంటా మృత్యువుతో పోరాడారు. సోమవారం ఉదయం 9 గంటలనుంచి 12 గంటలవరకూ అంధేరీలో ఉన్న యశ్ రాజ్ ఫిల్మ్ స్టూడియోలో యశ్ చోప్రా మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం ఉంచాలని నిర్ణయించారు. ఇద్దరు కుమారుల్లో ఆదిత్య చోప్రా సినీ దర్శకుడు, ఉదయ్ చోప్రా నటుడు, నిర్మాత. యశో చోప్రాని దాదా సాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. సిల్ సిలా, త్రిశూల్, చాందిని, దిల్ తో పాగల్ హై, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, మొహబ్బతే, వీర్ జారా లాంటి చిత్రాల్లో యశ్ చోప్రా రొమాన్స్ ని పండించిన తీరుని ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని బాలీవుడ్ సినీ ప్రముఖులు అంటున్నారు. 1932 సెప్టేబర్ 27న లాహోర్ లో ఓ పంజాబీ కుటుంబంలో జన్మించారు యశ్ చోప్రా. దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం భారత్ కి వచ్చేసింది. పెద్దన్నయ్య బీఆర్ చోప్రా దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన యశ్.. 1959లో ధూల్ కా పూల్ సినిమాతో దర్శకుడిగా మారారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...