Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చాపకింద నీరులా పిల్లల్ని కబళించే జబ్బు.. ప్రతి తల్లిదండ్రి తెలుసుకోవాలి!
posted on: May 8, 2023 9:30AM
మానవ ఆరోగ్య ప్రపంచంలో చాలా జబ్బులు ఉన్నాయి. పిల్లల నుండి పెద్దల వరకు ఎన్నో జబ్బులొస్తాయి. ముఖ్యంగా తల్లుల ఆరోగ్యం తగినంత సమర్థవంతంగా లేకపోతే పుట్టే పిల్లలు కూడా అనారోగ్యంతో పుడతారు. ఎవరికీ ఎక్కువగా తెలియని జబ్బు తలసేమియా.. ఇది ఒక జన్యుపరమైన రుగ్మత, దీని కారణంగా రోగి ఎర్ర రక్త కణాలు అంటే RBCలు తగినంత హిమోగ్లోబిన్ను ఉత్పత్తి చేయవు. ఇది రక్తహీనతకు దారితీస్తుంది.
1938లో భారతదేశంలో మొదటి తలసేమియా కేసు నమోదైంది. 1994లో తొలిసారిగా అంతర్జాతీయ తలసేమియా సమాఖ్య మే 8న ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని జరుపుకుంది. అప్పటి నుండి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి యేడూ మే 8 వ తేదీన తలసేమియా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి బాధితులు నిరంతరం పెరుగుతూనే ఉండటం అందరినీ కలవరపెడుతున్న విషయం. బాధితుల సంఖ్య కొన్ని కోట్లలో ఉంది. ఈ వ్యాధి వచ్చినవారు బ్రతకాలంటే ప్రతి రెండు నుండి మూడు వారాలకు రక్తమార్పిడి అవసరం. వ్యాధి మూడు దశలుగా ఉంటుంది...
మొదటి దశ..
మొదటి దశను మైనర్ తలసేమియా అంటారు. ఇందులో ఒక జన్యువు తల్లి నుండి మరొకటి తండ్రి నుండి వస్తుంది. ఒక జన్యువులో తలసేమియా లక్షణాలు ఉన్న వ్యక్తులను క్యారియర్లు అంటారు. ఇందులో వ్యక్తికి తేలికపాటి రక్తహీనత మాత్రమే ఉంటుంది.
రెండవ దశ..
రెండవ దశను ఇంటర్ మీడియా అంటారు. ఇందులో తేలికపాటి నుండి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి.
మూడవ దశ
మూడవ దశను మేజర్ తలసేమియా అంటారు. ఇది తలసేమియా అత్యంత తీవ్రమైన రూపం. ఇది ఒక పిల్లవాడు ప్రతి పేరెంట్ నుండి రెండు జన్యువులను పొందడం ద్వారా వచ్చే సమస్య. తలసేమియా మేజర్ ఉన్న పిల్లవాడు జీవితంలో మొదటి సంవత్సరంలో తీవ్రమైన రక్తహీనత లక్షణాలను ఎదుర్కొంటాడు. ఈ సమస్య ఉన్నవారు జీవించడానికి ఎముక మజ్జ మార్పిడి లేదా సాధారణ రక్త మార్పిడి అవసరం.
తలసేమియా వ్యాధిలో కనిపించే లక్షణాలు..
రక్తహీనత - బలహీనమైన ఎముకలు, ఆలస్యంగా లేదా నెమ్మదిగా శారీరక అభివృద్ధి, శరీరంలో ఐరన్ ఓవర్లోడ్, ఆకలి లేకపోవడం - చర్మం సున్నితంగా మారిపోవడం, విస్తరించిన ప్లీహము లేదా కాలేయం
తలసేమియాకు పరిష్కారాలు..
తరచుగా రక్తమార్పిడి అవసరం. ఈ రోగులలో కొన్నిసార్లు హెపటైటిస్ లేదా హెచ్ఐవి కూడా కనిపిస్తుంది. రక్త మార్పిడి వల్ల కూడా ఇది జరగవచ్చు. తలసేమియా మేజర్తో బాధపడుతున్న పిల్లవాడు 30 కిలోల బరువు ఉంటే, ఆ పిల్లవాడికి రక్తం ఎక్కించడం, ఐరన్ కోసం ఏటా రెండు లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. అంటే ఆ పిల్లాడు 50 ఏళ్లు బతికితే కోటి రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.
పౌష్టికాహారం, వ్యాయామం ద్వారా కొంత వరకు నియంత్రించవచ్చు. అలాగే, నవజాత శిశువుకు , గర్భిణీ తల్లికి క్రమం తప్పకుండా టీకాలు వేయడం కూడా ప్రభావవంతంగా ఉంటుంది.
ఈ వ్యాధికి ఏకైక నివారణ..
చెలేషన్ థెరపీ, ఎముక మజ్జ మార్పిడి ఒక ఎంపిక. ఎముక మజ్జ మార్పిడి ఖరీదైనది. దీని కోసం దాత HLA పొందడం అవసరం. అందుకే చాలా మంది రోగులు రక్తమార్పిడితో బతుకుతున్నారు
ఐరన్ నియంత్రణ చాలా ముఖ్యం. ఐరన్ పెరుగుదల కాలేయం, గుండె పై దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అయితే, ఐరన్ మొత్తాన్ని నియంత్రించడానికి వైద్యులు కొన్ని మందులు ఇస్తారు.
శరీరంలో రక్తం పాత్ర, హిమోగ్లోబిన్ పాత్ర చాలా కీలకమైనది కాబట్టి ఈ జబ్బు మొత్తం శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ముందు జాగ్రత్తలు, అవగాహన చాలా అవసరం.
◆నిశ్శబ్ద.






