మద్దతివ్వరూ.. ప్లీజ్..

 

ప్రపంచ కప్ క్రికెట్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ స్టేడియంలో జరగనుంది. ఇదిలా ఉండగా న్యూజిలాండ్ కెప్టెన్ మెకలమ్ భారత అభిమానులకు లేఖ రాశారు. భారత క్రికెట్ అభిమానులు నిస్వార్ధంగా మద్ధతు ఇస్తారని అందుకు ధన్యవాదాలని తెలిపారు. ఇప్పుడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో కూడా తమకు మద్ధతు ఇవ్వాలని కోరారు. ఈ మ్యాచ్ లో గెలవటానికి తమకు 50-50 శాతం అవకాశాలు ఉన్నాయని మెకలమ్ అన్నాడు.