ఎంతో సంతోషంగా ఉందంటున్న లోకేష్

posted on: Sep 16, 2015 12:29PM

వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ కి రెండో స్థానం దక్కడంపై చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సంతోషం వ్యక్తంచేశారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక తమలో కొత్స ఉత్సాహాన్ని నింపిందని, ఇది కేవలం చంద్రబాబు పనితీరుకు లభించిన గౌరవమని అన్నారు. అలుపెరగకుండా చంద్రబాబు కష్టపడటం వల్లే...ఆంధ్రప్రదేశ్ కు రెండో స్థానం దక్కిందన్న ఆయన, త్వరలో టాప్ ప్లేస్ చేరుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. సొంత రాష్ట్రం నుంచి పూర్తిస్థాయిలో పాలన ప్రారంభమైతే, ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని, త్వరలో అదికూడా జరుగుతుందన్నారు. పైగా ఫోన్ ట్యాపింగ్ లు చేయించుకునే బాధ కూడా తప్పతుందంటూ లోకేష్ సెటైర్లు కూడా వేశారు. మొత్తానికి ప్రపంచ బ్యాంక్ నివేదిక బూస్టింగ్ లాగా పనిచేసి ఇటు చంద్రబాబులోనూ, అటు టీడీపీ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపింది

google-ad-img
    Related Sigment News
    • Loading...