లోదుస్తుల్లో బంగారు బిస్కెట్లు...

 

బంగారం స్మగ్లింగ్ చేసేవారి తెలివితేటలు చూసి కస్టమ్స్ అధికారులకే కళ్ళు తిరుగుతున్నాయి. చెన్నై విమానాశ్రయంలో గురువారం నాడు ఏడుగురు మహిళలు బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఏడుగురు మహిళలు బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవడం చైన్నై విమానాశ్రయంలో సంచలనం సృష్టించింది. వీరిలో ఒక మహిళ లో దుస్తులో 14 బంగారం బిస్కెట్లు దొరికాయి. అలాగే ఐదుగురు మహిళల బృందం బంగారు బిస్కెట్లను బిస్కెట్ ప్యాకెట్లలో పెట్టుకుని వస్తూ వుండగా కస్టమ్స్ కళ్ళు పట్టేశాయి. అలాగే సింగపూర్ నుంచి వచ్చిన మహిళ దగ్గర నాలుగు సెల్ ఫోన్స్ వున్నాయి. ఆ నాలుగు సెల్ ఫోన్స్ బ్యాటరీల స్థానంలో బంగారు బిస్కెట్లున్నాయి. మొత్తం ఈ ఏడుగురు మహిళల దగ్గర మూడున్నర కిలోల బంగారం దొరికింది.