హైదరాబాద్ లో నేటి నుంచి ఉచిత వైఫై

posted on: Apr 16, 2015 11:14AM

 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఉచిత వైఫై సేవలు అందించడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు ప్రయోగాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో గురువారం ఉదయం నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో వైపై సేవలు అందించామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వైఫై సేవలను అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు తొలి వీడియో(ఫేస్‌టైం) కాల్ చేసి కేటీఆర్ సంభాషించనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్, క్వాడ్‌జెన్ సంస్థలు కలిసి ఈ ఉచిత వైఫై సేవలను అందించనున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...