అనుమానంతో హత్య చేశాడు

 

అనుమానం పెనుభూతం అంటారు. అలాంటి అనుమానంతో ఓ భర్త భార్యని అతి కిరాతకంగా హత్య చేశాడు. గొల్లపల్లి మండలం గోవిందుపల్లెలో ఈ దారుణమైన ఘటన జరిగింది. మల్లేశం, మమతలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజులనుంచి భార్యపై మల్లేశం అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. మల్లేశం మమతను ఎప్పడూ అనుమానించేవాడని, ఇంగా కట్నం తీసుకురావాలంటూ వేధించేవాడని కుటుంబసభ్యులు తెలిపారు.