ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన భార్య

posted on: Feb 28, 2013 4:38PM

 

 

Wife killed Husband, Wife kills husband, Woman kills husband

 

 

ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చిన దారుణమైన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా పరుచూరు మండలం రాజుగారిపాలెంలో కోటేశ్వర రావు భార్య పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తమ విలాసాలకు తన భర్త అడువస్తున్నాడని చెప్పి అతన్ని చంపి శవాన్నిఇంట్లో పూడ్చి పెట్టింది. కోటేశ్వర రావు ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు పోలీసులను ఆశ్రయించేసరికి అసలు నిజం బయటపడింది. పోలీసులు కోటేశ్వర రావు భార్యను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయట పెట్టింది. తాను ఆ ఉరికి చెందిన వేరే మగాడితో అక్రమసంబంధం పెట్టుకున్నానని, అందుకే తన భర్తను చంపానని చెప్పింది. దీంతో పోలీసులు ఆమెను,ఆమె ప్రియుడి ని అరెస్ట్ చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...