Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వరంగల్ లోక్ స్థానం బరిలో కాంగ్రెస్ అభ్యర్దిగా రాజయ్య
posted on: Oct 31, 2015 3:31PM

వరంగల్ ఉపఎన్నిక బరిలో పోటీ చేసే అభ్యర్దిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వరంగల్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ పార్లమెంటు సభ్యుడు రాజయ్యను బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. మొదట ఈ వరంగల్ లోక్ స్థానానికి మాజీ ఎంపీ వివేక్, సర్వే నారాయణ పేర్లు పరిశీలనలో ఉండగా కాంగ్రెస్ మాత్రం ఎక్కువ శాతం వివేక్ నే ఈ బరిలోకి దింపడానికి చూసింది. కానీ వివేక్ మాత్రం దీనికి ముందునుండి సముఖత చూపించలేదు. ఇక సర్వే నారాయణ పేరును కూడా పరిశీలించిన అధిష్టానం ఆఖరికి ఈ స్థానానికి గాను రాజయ్య పేరును ఖరారు చేసింది. కాగా గత ఎన్నికల్లో కడియం శ్రీహరిపై పోటీచేసిన రాజయ్య 3 లక్షల 96 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇదిలా ఉండగా ఈ వరంగల్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీనుండి పసునూరి దయాకర్ బరిలో దిగనున్నారు. ఇక టీడీపీ, బీజేపీ నుండి ఎవరు పోటీ చేస్తారో తెలియాల్సి ఉంది.






