కేసీఆర్ మొరిగే కుక్క: పొన్నాల

 

 

 

టీ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జోరు పెరుగుతోంది. లేటెస్ట్ గా పొన్నాల కేసీఆర్ని మొరిగే కుక్కతో పోల్చారు. కేసీఆర్ పూటకోమాట మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని పొన్నాల అన్నారు. తెలంగాణకు వాచ్ డాగ్‌లా వుంటానని గతంలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మొరిగే కుక్కలాగా తయారయ్యారని పొన్నాల ఘాటుగా విమర్శించారు. తెలంగాణ కోసం కష్టపడిన వాళ్ళకి కాకుండా తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారని పొన్నాల అన్నారు. టీఆర్ఎస్‌కి ఈ ఎన్నికలలో పది సీట్లు కూడా రావని పొన్నాల జోస్యం చెప్పారు. శనివారం నాడు పొన్నాల కేసీఆర్ని మొరిగే కుక్క అన్నారు. మరి ఆదివారం నాడు కేసీఆర్ పొన్నాలని ఎలా పోలుస్తారో చూడాలి.