గోడకూలి ఇద్దరు చిన్నారులు...

posted on: Mar 31, 2015 12:17PM

 

గోడకూలి ఇద్దరు చిన్నారులు మరణించారు. హైదరాబాద్ నగరంలోని బోరబండ దేవయ్య బస్తిలో ఈ విషాద ఘటన జరిగింది. సోమవారం అర్ధరాత్రి ఓ ఇంటి గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మరణించగా, వారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగా పనిచేస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన రాజు దేవయ్య బస్తీలోని ఆ ఇంటిలో సోమవారం నాడే అద్దెకి దిగాడు. సోమవారం కురిసిన వర్షానికి బాగా తడిసిన ఇల్లు అర్ధరాత్రి సమయంలో కుప్పకూలింది. మృతి చెందిన చిన్నారులు నవ్య(4), చరణ్‌(2)గా గుర్తించారు. గాయపడిన దంపతుల్లో భర్త కాలు విరిగింది. భార్య ఇంకా అపస్మారక స్థితిలోనే వుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...